పోస్ట్‌లు

జనవరి 24, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

అడ‌వి కోసం అతివ‌ల ఉద్య‌మం..దిగొచ్చిన ఒడిస్సా ప్ర‌భుత్వం ..!

చిత్రం
వాళ్ల ద‌గ్గ‌ర ఆయుధాలు లేవు..మందీ మార్బ‌లం లేదు. బ‌తికేందుకు ఏ ఆధారం లేదు..ఓట్లేసి గెలిపించిన ప్ర‌భుత్వం అండ‌గా నిల‌వాల్సింది పోయి లిక్క‌ర్ ఫ్యాక్ట‌రీకి ప‌చ్చ జెండా ఊపింది. భూములు లాక్కోవాల‌ని చూసింది. జిల్లా అధికార యంత్రాంగం వారిపై పోలీసుల‌ను ఉసిగొల్పింది. ఇంత జ‌రిగినా వారు చెక్కు చెద‌ర‌లేదు. కొన్నేళ్లుగా ..త‌ర‌త‌రాలుగా త‌మ‌కు కూడు పెడుతున్న ఈ చెట్ల‌ను..అడ‌విని విడిచి వెళ్ల‌మంటూ భీష్మించుకు కూర్చున్నారు. మా ప్రాణాలు తీసుకోండంటూ వారు చెట్ల‌ను హ‌త్తుకున్నారు. కోర్టును ఆశ్ర‌యించినా అన్యాయ‌మే మిగిలింది. ఆ అతివ‌ల‌..అడ‌వి బిడ్డ‌ల ఆత్మ‌విశ్వాసం ముందు స‌ర్కార్ త‌లొంచింది. ఇదంతా నిన్నే జ‌రిగిన క‌న్నీటి క‌థ‌..అంతులేని వ్య‌ధ‌.  సుంద‌ర్ లాల్ బ‌హుగుణ గుర్తున్నారా..చిప్కో ఉద్య‌మానికి ఆద్యుడు.  ప్ర‌పంచం మెచ్చిన సామాజిక‌..ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌. చివ‌రి వ‌ర‌కు అడ‌వుల‌ను కాపాడుకోవాలంటూ జీవితాన్ని అంకితం చేసిన వ్య‌క్తి. ఈ అడ‌విబిడ్డ‌లు చేసిన సాహ‌సం మ‌రోసారి ఆయ‌న‌ను త‌లుచుకునేలా చేశాయి. ఇక క‌థ‌లోకి వెళితే. ఒడిసా రాష్ట్రంలోని దెంక‌నాల్ జిల్లా బ‌ల‌రాంపూర్ గ్రామస్తులు అడ‌విపైనే ఆధార‌ప‌డి బ‌తుకుత...

కాసులు కురిపిస్తున్న కామెడీ

చిత్రం
కామెడీ లేకుంటే లైఫ్‌కు కిక్కంటూ ఉండ‌దు. క‌న్నీళ్ల‌ను గుండె వెన‌కాల దాచుకుని ఎంతో మందిని ఎంట‌ర్ టైన్ చేసే క‌మెడియ‌న్లు ఎంద‌రో . చాలా మందికి హాస్యం అంటేనే సినిమాలు గుర్తుకు వ‌స్తాయి. తెర కంటే ముందు వీధుల్లో, ర‌చ్చ‌క‌ట్ట‌ల వ‌ద్ద నాట‌కాలు వేసే వాళ్లు త‌మ నైపుణ్యంతో జ‌నాన్ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తూ వ‌చ్చారు. కామెడీ అన్న‌ది ఆరోగ్య‌క‌రంగా ఉండాలి. అదిప్పుడు వెకిలిత‌నం ముసుగు వేసుకుంది. ఎదుటివాళ్ల‌ను ఇబ్బంది పెట్టేలా, వారి ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తినేలా కామెడీ రాజ్య‌మేలుతోంది. త‌మిళ‌నాడులో వ‌డివేలు, తెలుగులో బ్ర‌హ్మానందం, బాలీవుడ్‌లో చాలా మంది క‌మెడియ‌న్లు త‌మ హ‌వా కొన‌సాగిస్తున్నారు. రాను రాను వారిని కాద‌ని మ‌రికొంద‌రు సినిమా రంగంలోకి వ‌చ్చారు. త‌మ క్రియేటివిటితో ఆక‌ట్టుకుంటున్నారు.  జీవితాన్ని ప్ర‌జెంటేష‌న్ చేయ‌డంలో కామెడి  కీల‌క పాత్ర పోషిస్తుంది. సినిమా అయితే ప్ర‌త్యేక‌మైన పాత్ర వుండాలి. వారి కోసం కొత్త‌గా క్రియేట్ చేయాలి. ఇదంతా స్క్రిప్ట్ ర‌చ‌యితలు చూసుకుంటారు. ప్ర‌తి మూవీలో కామెడీ లేకుండా, క‌మెడియ‌న్ లేకుండా రిలీజ్ కావ‌డం లేదు. అంటే అంత‌గా పాపుల‌ర్ అయ్యింద‌న్న‌మాట‌. సిన...

నిన్న సెక్స్ వ‌ర్క‌ర్లు..నేడు బ‌తుకులో విజేత‌లు

చిత్రం
స‌మాజం వాళ్ల‌ను మ‌నుషులుగా చూడాలంటే ఒప్పుకోదు. తాము త‌ప్పు చేసినా ప‌ర్వాలేదు..కానీ ఎదుటి వాళ్లను ఆశించ‌డం..అవ‌కాశం చిక్కితే లోబ‌ర్చు కోవ‌డం..కోరుకోవ‌డం ష‌రా మామూలే. దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చినా..ఇంకా వేశ్యా వృత్తి కొన‌సాగుతూనే వుంది. తెలిసో తెలియ‌కో ఈ రొంపిలోకి వ‌చ్చిన వారు..ఆర్థిక‌ప‌ర‌మైన ఇబ్బందులు ఉండ‌డం, వారిని వ్యాపార వ‌స్తువులుగా చూడ‌డంతో ఇది మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా విరాజిల్లుతోంది. కామాటిపుర‌, రెడ్‌లైట్ ఏరియా లాంటి న‌గ‌రాలు వీరికి కేంద్రాలు. ఇదో ప‌రిశ్ర‌మ లాగా త‌యారైంది. వీరిని అడ్డం పెట్టుకుని, వీరి ర‌క్త‌మాంసాల‌తో ఫ‌క్తు వ్యాపారం చేస్తూ బ్రోక‌ర్లు, ద‌గుల్భాజీలు ల‌క్ష‌లు పోగేసుకుంటున్నారు. వారి శ‌రీరాల‌తో ఆటాడుకుంటున్నారు. వారికి బ‌తుకు లేకుండా చేస్తున్నారు. ఒక్క‌సారి వీరిపై ఆ ముద్ర ప‌డితే చాలు స‌మాజం ఒప్పుకోదు.  విప‌త్క‌ర‌మైన‌..అత్యంత దుర్భ‌ర‌మైన ప‌రిస్థితుల‌కు లోనై దిక్కుతోచ‌ని స్థితిలో శ‌రీరాల‌ను అమ్ముకుంటున్న వీరికి ఓ మ‌న‌సుంద‌ని ..వారికి ఓ జీవితం ఉంటుంద‌ని ఆశించ‌డం అత్యాశే అవుతుంది. సెక్స్ వ‌ర్క‌ర్లు గా ఇప్ప‌టికే ప‌నిచేస్తున్నారు. అలాంటి వారిలో కొంద‌రు మాత్రం...

ఆకుప‌చ్చ‌ని గాయం ఫిదా..!

చిత్రం
రంగుల లోకంలో వున్న‌ట్టుండి ఆశ‌ల్ని మోసుకొచ్చింది ఈ పైర‌గాలి. ఇన్నేళ్లు ఎక్క‌డున్న‌దో..ఏం చేసిందో తెలీదు. కానీ వున్న‌ట్టుండి న‌దిలా ప్ర‌వ‌హిస్తూనే లేలేత హృద‌యాల‌ను అల్లుకు పోయింది. ఎగిసిప‌డే అల‌ల్లా ..ఉల్లాసంగా..ఉత్సాహంగా తాకేసింది. ఆనాటి ప్రేమ కు స‌జీవ‌మైన‌  తార్కాణంగా నిలిచే భాగ్‌మ‌తిని త‌లుచుకునేలా చేసింది ఈ బొమ్మ‌రిల్లు. అచ్చంగా ..స్వ‌చ్ఛంగా ..మ‌న‌సు మురిపెంగా చేసేసింది ఈ కుంద‌నాల‌బొమ్మ‌..అందాల ..ప‌ద‌హార‌ణాల ముద్దుగుమ్మ‌. సాయి ప‌ల్ల‌వి కంటే భానుమ‌తి పేరే బావుంది. తెగ న‌చ్చేసింది.సినిమా చూస్తే అంతా గుర్తుంటుంది.  కానీ ఏం మాయ చేసేసిందో కానీ అంతా ఆమే. అంత‌టా భానుమ‌తినే. ఎంత ముద్దుగున్న‌ది. అప్పుడే జొన్న కంకుల్లా..ప‌చ్చ ప‌చ్చ‌ని నారు మ‌డుళ్లా..గంతులేసే లేగ‌దూడ‌ల్లా ..స‌ర్రుమంటూ కాటేసింది..కళ్ల‌తోనే కాదు మాట‌ల‌తో మంత్ర‌ముగ్ధుల‌ను చేసేసింది. అమెరికా మోజులో..ఇంగ్లీష్  ద‌రిద్ర‌పు ధ్యాస‌లో ప‌డిపోయిన వాళ్ల‌కు చెంప‌పెట్టు ఫిదా. అమాయ‌క‌త్వం అంటే ఏమిటో..స్వ‌చ్ఛంగా ..అర‌మ‌రిక‌లు లేకుండా మాట్లాడుకుంటే .. ఎంత హాయిగా వుంటుందో చూస్తే తెలుస్తుంది.. ఇంట్లో మ‌న‌మ్మాయే..ఈ అమ్మాయి. నీకే...

రుణం కాకూడ‌దు భారం

చిత్రం
అప్పు ఆనందంతో ప్రారంభ‌మై దుఖఃంతో అంత‌మ‌వుతుంద‌న్న ఓ ఆర్థిక‌వేత్త మాట‌లు  అక్ష‌రాల వాస్త‌వాన్ని త‌ల‌పింప చేస్తున్నాయి. ప్ర‌పంచీక‌ర‌ణ పుణ్య‌మా అంటూ లెక్క‌లేన‌న్ని అవ‌కాశాలు త‌లుపు త‌ట్టాయి. దీంతో దేశాల మ‌ధ్యన అంత‌రాలు తొల‌గి పోయాయి. వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది. మార్కెట్ రంగం క‌ళ‌క‌ళ లాడుతోంది. రియ‌ల్ ఎస్టేట్ రంగం ఇపుడిపుడే కుదురుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. స‌ర‌ళీకృత ఆర్థిక విధానాల కార‌ణంగా కొత్త బ్యాంకులు ఏర్పాట‌య్యాయి. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌కు ధీటుగా ప్రైవేట్ బ్యాంకులు వినియోగ‌దారుల‌కు సేవ‌లందిస్తున్నాయి. ఆక‌ర్షణీయ‌మైన ప‌థ‌కాలతో ఆక‌ట్టుకుంటున్నాయి. త‌క్కువ వ‌డ్డీ అంటూ జ‌నాన్ని బురిడీ కొట్టిస్తున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా బ్యాంకుల్లో ఉన్న కొంత వెస‌లుబాటును ఆస‌రాగా చేసుకున్న కొంద‌రు బ‌డా బాబులు మ‌నీ ల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డుతున్నారు. గ‌త కొన్నేళ్లుగా వేలాది మంది ఆర్థిక నేర‌గాళ్లు బ్యాంకుల‌ను లూటీ చేశారు. జ‌నం సొమ్మును అప్ప‌నంగా మింగేశారు. ఇదంతా ఓ ఎత్త‌యితే పాల‌కులు త‌మ ప‌వ‌ర్‌ను అడ్డం పెట్టుకుని బ్యాంకుల‌ను టార్గెట్ చేశారు. దొంగ ప‌త్రాలు సృష్టించి లెక్క‌లేన‌న్ని రుణాలు పొందారు...

బంగారుకొండ..విజ‌య దేవ‌ర‌కొండ ..!

చిత్రం
నాట‌కంలో ఎవ‌రి పాత్ర ఏమిటో అలా వ‌చ్చి ఇలా వెళ్లి పోతుంది. కానీ సినిమా అలా కాదు. అదో క‌ల‌ల ఖార్ఖానా. వేలాది మంది ఒక్క‌సారైనా త‌మ బొమ్మ చూసుకోవాల‌ని అనుకుంటారు. ఇంకొంద‌రు ఒక్క ఛాన్స్ ఎప్పుడు వ‌స్తుందా అనుకుంటూ లైఫ్‌ను కోల్పోయిన వాళ్లున్నారు. చెన్నై..ముంబ‌యి..క‌ర్ణాట‌క‌.. హైద‌రాబాద్‌..ఇలా అన్ని న‌గ‌రాలు సినిమా జ‌పం చేస్తున్నాయి. ఇదో మాయాజాలం. కోట్లాది రూపాయ‌లు ఇక్క‌డ చేతులు మారుతుంటాయి. అగ్రిమెంట్లు..సంత‌కాలు..జిగేల్ మ‌నిపించే తార‌లు..త‌ళుక్కులు..ఛ‌మ‌క్కులు ..కొంద‌రు ఉన్న‌ట్టుండి స్టార్లుగా మారిపోతే..ఇంకొంద‌రు స్టార్ చ‌ట్రంలో ఇముడ‌లేక బ‌య‌ట‌కు రాలేక జీవిస్తున్నారు.  టాలీవుడ్ డిఫ‌రెంట్‌. ఇక్క‌డ టాలెంట్ ఉన్న వాళ్ల‌కు కొదువ లేదు. ప్ర‌తిభ‌కు హ‌ద్దే లేదు. కానీ సిఫార‌సులు..పైర‌వీలకు ఇక్క‌డ ప్ర‌యారిటీ ఉంటుంది. వార‌స‌త్వ ముద్రైనా ఉండాలి..లేక‌పోతే నెట్టుకు రావ‌డం క‌ష్టం. ఇలా వ‌చ్చి అలా వెళ్లి పోవాల్సిందే. థియేట‌ర్లు కొంద‌రి చేతుల్లోనే..సినిమాలు ఎన్నో ..ఆడేవి కొన్నే. ఆడించేవి ఎన్నో. ఇక తార‌ల గురించి చెప్పాల్సి వ‌స్తే..టాలెంట్ కంటే అందానికే ప్రాముఖ్యం. హీరోనే అన్నీ. డైరెక్ట‌ర్ లు ఇ...

సామాన్యుడు కాద‌ప్పా..గోవింద‌ప్ప

చిత్రం
ఎవ‌రీ గోవింద‌ప్ప‌. దేశం గ‌ర్వించ‌ద‌గిన మ‌హోన్న‌త మాన‌వుడు. ల‌క్ష‌లాది మందికి చూపును ప్ర‌సాదించిన కంటి వైద్యుడు. ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌..అద్భుత‌మైన సౌక‌ర్యాల‌తో ఐ హాస్పిట‌ల్‌ను నిర్వ‌హిస్తున్న డాక్ట‌ర్‌. ఆయ‌న అందించిన నిస్వార్థ‌మైన సేవ‌ల‌ను గుర్తించిన కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌శ్రీ అవార్డుతో స‌త్క‌రించింది. ఈ వైద్యుడి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. టెక్నాల‌జీ పెరిగింది కాద‌న‌లేం. వైద్య‌రంగంలో పెను మార్పులు వ‌చ్చినవి. కానీ రోగాన్ని గుర్తించి..బాధితుల‌కు భ‌రోసా ఇచ్చే వైద్యులే లేకుండా పోయారని ఆవేద‌న వ్య‌క్తం చేస్తారు గోవింద‌ప్ప‌. ఒక సామాన్య‌మైన కుటుంబంలో పుట్టిన ఈ డాక్ట‌ర్ భారీ ఐ ఆస్ప‌త్రిని ఎలా క‌ట్టారో తెలుసుకుంటే ఆశ్చ‌ర్యం అనిపిస్తుంది.  త‌మిళ‌నాడులోని వ‌డ‌మాల‌పురం గ్రామంలో జ‌న్మించారు. కుటుంబంలోని ఐదు మందిలో ఆయ‌న కూడా ఒక‌రు. మారుమూల ప‌ల్లె ఇది. సౌక‌ర్యాల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న త‌రుణంలో ..త‌న కుటంబానికి చెందిన ముగ్గురు వైద్యం అంద‌క మృతి చెందారు. ఈ సంఘ‌ట‌న గోవింద‌ప్ప‌ను క‌దిలించింది. అష్ట‌కష్టాలు ప‌డి చ‌దివారు. డాక్ట‌ర్ అయ్యాడు. ఆప్త‌మాల‌జీలో ఎంఎస్ చేశారు. మ‌ద్రాస్ లోన...

అంద‌రి దృష్టి అయోధ్య పైనే

చిత్రం
మ‌ళ్లీ అయోధ్య వార్త‌ల్లోకి వ‌చ్చింది. ప్ర‌తి ఎన్నిక‌ల సంద‌ర్భంలో అయోధ్య పేరు త‌రుచుగా వినిపిస్తూనే వుంటుంది. బీజేపీకి దాని అనుబంధ సంస్థ‌లైన విశ్వ హిందూ ప‌రిష‌త్‌, రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌, భ‌జ‌రంగ్ ద‌ళ్ లాంటి సంస్థ‌లకు అదో ఆయుధం. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌లు అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ దాని మిత్ర‌ప‌క్షాల‌కు అగ్నిప‌రీక్షలా మారాయి. అయోధ్య‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన ధ‌ర్మ స‌భ‌కు ర‌మార‌మి 3 ల‌క్ష‌ల మందికి పైగా సాధువులు, హిందూ ప‌రివారం హాజ‌రైంది. ఎటు చూసినా అయోధ్య కాషాయంతో క‌ళ‌క‌ళ‌లాడింది. దేశంలో  ఎన్నో న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు, ప్రాంతాలున్నా అయోధ్య మాత్రం అందుకు మిన‌హాయింపు ఇవ్వాల్సిందే. ఎందుకంటే కొన్నేళ్లుగా ఈ న‌గ‌రం ప్ర‌పంచపు దృష్టిని త‌న వైపున‌కు తిప్పుకుంది. ఇక్క‌డ రామ‌మందిరం..మసీదు వివాదం ముసురుకుని ఉంది.  దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చి 70 ఏళ్ల‌కు పైగా గ‌డిచినా ఇంకా అయోధ్య రావ‌ణ‌కాష్టంలా ర‌గులుతూనే వున్న‌ది. ఈ స్థ‌లం మాదంటే మాదంటూ హిందూ..ముస్లింలు లెక్క‌లేన‌న్ని ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. నిర‌స‌న వ్య‌క్తం చేశారు. విన‌య్ క‌టియార్‌, ముర‌ళీ మ‌నోహ‌...

రియ‌ల్ ఎస్టేట్‌లో రారాజులు

చిత్రం
ఓ వైపు నోట్ల ర‌ద్దు..మోడీ తీసుకున్న నిర్ణ‌యం దెబ్బ‌కు ఇండియ‌న్ మార్కెట్ ఇంకా కోలుకోలేదు. ఎన్ని సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టినా ..ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టినా ఇంకా కొలిక్కి రాలేదు. ఒడిదుడుల‌కు లోన‌వుతూనే వున్న‌ది. అన్నింటికి జీఎస్‌టీ జ‌పం చేయ‌డంతో మార్కెట్ రంగంలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి. రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి వ‌చ్చిన దాంట్లో కొంత డ‌బ్బును దాచుకున్న బ్యాంకులు ఇపుడు ఖాళీ అవుతున్నాయి. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని ఏర్పాటైన ఎనీ టైం మిష‌న్లు అంటే ఏటీఎంలు ఖాళీగా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఓ ర‌కంగా ఇది సంధికాలం అనే చెప్పాలి. జ‌నం త‌మ డ‌బ్బుల కోసం రోడ్ల మీద‌కు వ‌చ్చారు. ప‌స్తులున్నారు. ప‌డ‌రాని పాట్లు ప‌డ్డారు. క‌ష్ట‌ప‌డ్డ డ‌బ్బులు ఉంటాయో ఊడిపోతాయో తెలీదు. బ్యాంకింగ్ రంగాన్ని నియంత్రించే ఆర్ బీ ఐ ఉందో లేదోన‌న్న అనుమానం కొంత ప‌రిజ్ఞానం క‌లిగిన వాళ్ల‌ను ఆలోచ‌న‌ల్లో ప‌డేశాయి.  ఐటీ, ఆయిల్ , స్టీల్, లాజిస్టిక్ రంగాలు కొంత ప‌ర్వాలేద‌నిపించినా ఆ మ‌ధ్య రియ‌ల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్ర‌భావం చూపింది మోడీ తీసుకున్న నిర్ణ‌యం. మాజీ గ‌వ‌ర్న‌ర్లు వృద్ధి రేటు విష‌యంలో చేసిన వ్య...

నెట్టింట్లో ముఖపత్రానిదే హవా..!

చిత్రం
దేనిలోనైనా నంబర్ వన్ లో వుండాలంటే చాలా సాధన చేయాలి . ఎంతో కష్టపడాలి . ప్రత్యర్థుల పోటీని తట్టుకుని నిలబడాలి . ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాలి. ఇది ప్రతి రంగానికి వర్తిస్తుంది . నెట్ పుణ్యమా అంటూ సోషల్ మీడియా తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది . కోట్లాది రూపాయల బిజినెస్ మారుతోంది. కలల బేహారులకు స్వర్గధామంగా విరాజిల్లుతోంది. ఇక్కడ కులమతాలు లేవు ..ఒక్కటే పోటీ. ఎవరికి వాళ్ళే రాజులు ..రారాజులు ..నిమిషానికో ఫార్మాట్ మారుతోంది . ఎప్ప్పుడు ఏది వర్కౌట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. దీనిని తట్టుకుని నిలబడాలంటే ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పోవటమే. ఇదే తరహా ఫార్ములాను ఫాలో అవుతున్నాయి ఈ సంస్థలు. ఇక ముఖ పత్రం ఎందుకు ముందు వరుసలో ఉంటోందో ఎవరూ చెప్పలేని స్థితి . దీనిపై ఓ లుక్ వేయాలంటే కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనల్ని మెస్మరైజ్ చేయక మానవు. ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఇప్పటికీ ఫేస్ బుక్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటోంది. ఓ వైపు మిగతా సంస్థలు తమ తమ టెక్నాలజీ పరంగా ఎన్ని మార్పులు చేర్పులు చేస్తున్నా ముఖ పత్రం మాత్రం ముందంజలోనే సాగుతోంది....

కోట్లు కుమ్మ‌రిస్తున్న ఇన్‌షార్ట్స్

చిత్రం
స్మార్ట్ ఫోన్ల పుణ్య‌మా అంటూ ఒక్క రోజులోనే క‌రోడ్‌ప‌తిలుగా తెర మీద‌కు వ‌స్తున్నారు. టెక్నాల‌జీని అందిపుచ్చుకోవ‌డం..వ‌ర‌ల్డ్ వేవ్స్ ను గుర్తించ‌డం త‌క్కువ టైంలో యాప్‌ను త‌యారు చేయ‌డం ..మ‌రిన్ని సౌక‌ర్యాలు పొందు ప‌ర్చ‌డంతో వేల‌ల్లో..ల‌క్ష‌ల్లో డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ప్రింట్‌, మీడియా, సోష‌ల్ మీడియా , డిజిట‌ల్ మీడియా రంగాలు ఎన్న‌డూ లేనంత‌గా ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. ఢిల్లీ ఐఐటీలో చ‌దువుకుంటున్న ముగ్గురికి వ‌చ్చిన ఐడియాతో రూపొందించిన యాప్ కోట ్ల రూపాయ‌లు కుమ్మ‌రిస్తోంది. కేవ‌లం 60 ప‌దాల‌తో కూడిన వార్త‌ల‌ను అప్ప‌టిక‌ప్పుడు ఈ యాప్ ద్వారా అప్‌డేట్ చేయ‌డంతో ఊహించ‌ని రీతిలో ప్ర‌పంచ వ్యాప్తంగా పాపుల‌ర్ అయింది. ఇన్‌షార్ట్స్ ..ఈ న్యూస్ యాప్ లో హాట్ హాట్ టాపిక్స్ తో పాటు స‌క్సెస్ స్టోరీస్ ఇందులో పొందు ప‌రిచారు. అజ‌హ‌ర్‌, దీపిట్‌, అనునే క‌లిసి యాప్ క్రియేట్ చేశారు. ఈ యాప్ పేరుతో ఫేస్‌బుక్‌లో పేజీ క్రియేట్ చేశారు. ఇన్‌టైంలోనే ల‌క్ష‌లాది మంది దీనిని లైక్ చేయ‌డం..డౌన్లోడ్ చేసుకోవ‌డం తో కాసులే కాసులు. మేం ఈ స‌మాజాన్ని ఎలాగూ మార్చ‌లేం అంటారు అజహ‌ర్‌. జ‌స్ట్‌..ఉన్న‌ది ఉన్న‌ట్లు వార్త‌ల‌ను, స్టోరీస్...

అతిర‌థుల చూపు తెలంగాణ వైపు

చిత్రం
దేశ‌మంతా ఒక వైపు..తెలంగాణ ఒక్క‌టి ఒక వైపు అన్న చందంగా రాజ‌కీయాలు మారిపోతున్నాయి. తెలంగాణ‌తో పాటు మ‌రికొన్ని రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ ప్ర‌ధానంగా అన్ని పార్టీలు ఈ ప్రాంతంపైనే క‌న్నేశాయి. ఉద్య‌మాల‌కు, పోరాటాల‌కు , ఆందోళ‌న‌ల‌కు కేరాఫ్‌గా మారిన తెలంగాణ ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. కొత్త రాష్ట్రం ఏర్పాటై నాలుగున్న‌ర ఏళ్లు గ‌డిచాయి. అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ ఉన్న‌ట్టుండి తొమ్మిది నెల‌ల ముందుగానే ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు  చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో ఎన్నిక‌ల ప్ర‌క్రియ అనివార్య‌మైంది. నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయ‌డం..డెడ్ లైన్ విధించ‌డం జ‌రిగింది. డిసెంబ‌ర్ 7న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మొత్తం 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌లు జ‌రిపేందుకు ఎన్నిక‌ల క‌మిష‌న్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్ర‌త్యేకించి వృద్ధులు, పిల్ల‌లు క‌లిగిన త‌ల్లులు, వృద్ధులు, దివ్యాంగుల‌కు సౌక‌ర్యాల‌ను క‌ల్పించేలా ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎన్నిక‌ల అధికారులు ద‌గ్గ‌రుండి చూస్తున్నారు. మ‌రోసారి అధికారంలోకి రావాల‌నే ప‌ట్టుద‌ల‌తో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు. ఇప్ప‌టికే సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు...

ఆకుప‌చ్చ‌ని ప‌ల్లె -తురుత్తిక్క‌ర..!

చిత్రం
ఈ భువిపై వెల‌సిన సుంద‌రవ‌నంగా ఓ ప‌ల్లె రూపుదిద్దుకుంది. ఎక్క‌డ చూసినా ప‌చ్చ‌ద‌నం..పుష్క‌లంగా నీళ్లు..క‌నిపించ‌ని చెత్తా చెదారం..విశాల‌మైన రోడ్లు..అంద‌మైన భ‌వ‌నాలు. అవినీతి, అక్ర‌మాల‌కు తావులేని పార‌ద‌ర్శ‌క‌మైన పాల‌న‌కు కేరాఫ్‌గా విరాజిల్లుతోంది తురుత్తిక్క‌ర‌. ఆకుప‌చ్చ‌ని ప‌ల్లెగా పేరు తెచ్చుకుంది..ఈ గ్రామం. ఇండియాలోని కేర‌ళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లాలో ఉంది. ఆ రాష్ట్రం ఇటీవ‌లే ప‌చ్చ‌ద‌నం..ప్ర‌కృతికి ప్ర‌తిరూపంగా నిలిచిన ఈ ప‌ల్లెను పూర్తి ప ‌చ్చ‌ద‌నంతో కూడిన గ్రామంగా ప్ర‌క‌టించింది. పుర‌స్కారం అంద‌జేసింది. ఈ ఊరు నిండా ప‌చ్చ‌ద‌నం అలుముకుంది. దీనికి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. విశిష్ట‌మైన దేవాల‌యాలు ఇక్క‌డ కొలువై వున్నాయి. గ్రీన్ విలేజ్ గా పేర్కొన‌డంతో దేశం మొత్తం ఈ ప‌ల్లె వైపు చూస్తోంది. హ‌రిత కేర‌ళం మిష‌న్ వైస్ ఛైర్మ‌న్..చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీస‌ర్‌గా ఉన్న టి.ఎన్‌.సీమ తురుత్తిక్క‌ర సాధించిన ఘ‌న విజ‌యాన్ని..ప‌చ్చ‌ద‌నాన్ని మెచ్చుకున్నారు. ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. గ్రామ పంచాయ‌తీ చేసిన ఈ ప్ర‌య‌త్నం రాష్ట్రంలోని గ్రామాల‌కు ఆద‌ర్శం కావాల‌ని అభిల‌షించారు. కేర‌ళ ప్ర‌భుత్వం ప‌ర్యాట‌క రంగానికి అధి...

స్వ‌ర్గ‌ధామం ..శృంగేరి పీఠం

చిత్రం
ఎక్క‌డ ప్ర‌శాంతత ల‌భిస్తుందో..ఎక్క‌డ మ‌న‌సు స్వేచ్ఛా వాయుల‌ను పీలుస్తుందో..ఎక్క‌డ ప్ర‌కృతి ప‌చ్చ‌ద‌నం ప‌రుచుకుని పురివిప్పి నాట్యం చేస్తుందో ..అక్క‌డ అంత‌రాలు లేని ఆనంద‌మేదో మ‌న‌ల్ని చుట్టేస్తుంది. కాలం ప‌రుగులు తీస్తుంటే బ‌తుకు గురువై బోధిస్తుంది..ప‌క్క‌దారులు ప‌ట్ట‌కుండా ఆత్మ హెచ్చ‌రిస్తుంది. స‌నాత‌న ధ‌ర్మం పుణ్య‌మా అంటూ భార‌తీయ సంస్కృతి కొన్ని త‌రాలుగా ఈ దేశంలో విరాజిల్లుతూ వ‌స్తోంది. ధ‌ర్మం నాలుగు పాదాల‌లో న‌డిచేలా..మ‌నుషుల్లో ఆత్మ జ్యోతుల‌ను వెలిగించేందుకు ఎంద‌రో మ‌హానుభావులు ఈ నేల‌పై న‌డ‌యాడారు. జీవితాల‌ను త్యాగం చేశారు. అకుంఠిత దీక్షా ద‌క్ష‌త‌ను ప్ర‌ద‌ర్శించారు. వారి బోధ‌న‌ల‌తో స‌మాజాన్ని ప్ర‌భావితం చేయ‌డ‌మే కాకుండా త‌రాల‌కు స‌రిప‌డా విలువ‌ల‌ను వ‌దిలేసి వెళ్లి పోయారు.  జీవిత‌మంటే కాసులు కొల్ల‌గొట్ట‌డం కాదు. ఆస్తులు సంపాదించు కోవ‌డం కాదు. ఆత్మ నిగ్ర‌హంతో ప‌ది మందికి సాయం చేయ‌డం. ప‌దుగురిలో మంచి వారుగా మెల‌గ‌టం. సృష్టిలోని ప్ర‌తి ప్రాణిలో దైవాన్ని చూడ‌టం. ప్ర‌తి ఒక్క‌రితో స‌ఖ్య‌త క‌లిగి ఉండ‌టం. యోగులు, బాబాలు, గురువులు,  పీఠాధిప‌తులు ఎవ‌రికి తోచిన రీతిలో వారు భ‌క్...

క‌ల‌లు ఫ‌లించేనా..పెద్ద‌న్న క‌రుణించేనా

చిత్రం
ప్ర‌తి ఇండియ‌న్ తీర‌ని క‌ల అమెరికా. డాల‌ర్ డ్రీమ‌ర్స్ రోజు రోజుకు పెరిగాయి. ప్ర‌పంచీక‌ర‌ణ పుణ్య‌మా అంటూ లెక్క‌లేన‌న్ని అవ‌కాశాలు ప్ర‌పంచ వ్యాప్తంగా పెరిగాయి. ఐటీ వెలిగిపోతోంది. దీంతో ల‌క్ష‌లాది కొలువుల‌కు మార్గం ఏర్ప‌డింది. యుఎస్ ఏతో పాటు ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌, న్యూజిలాండ్‌, ద‌క్షిణాఫ్రికా , శ్రీ‌లంక త‌దిత‌ర కంట్రీస్ అన్నీ ద్వారాలు తెరిచాయి. ప్ర‌తి రోజు వంద‌లాది మంది యుఎస్ వైపు ప్ర‌యాణం చేస్తున్నారు. ఇన్మ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ రంగంలో ఊహించ‌ని రీతిలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఐటీ రంగానికి ప్ర‌త్యేకంగా శాఖ‌ల‌ను కేటాయించి..ఆంట్ర‌ప్రెన్యూర్‌లు గా..వ్యాపార వేత్త‌లుగా  కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వెన్నుద‌న్నుగా నిలిచాయి. .వ్యాపార‌, వాణిజ్య రంగాల‌లో త‌మ‌దైన ముద్ర వేసేందుకు ఉత్సుక‌త చూపిస్తున్నారు.  భార‌త దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇండియాలో ఎక్క‌డికి వెళ్లినా..ప్ర‌పంచంలో ఏ దేశాన్ని ప‌ర్య‌టించినా అక్క‌డంతా ఐటీ జ‌పం చేశారు. సోష‌ల్ మీడియా, డిజిట‌లైజేష‌న్‌, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌, డిమానిట‌రైజేష‌న్ గురించి చెబుతూ వ‌చ్చారు. భార‌త్ అంటే 110 కోట్ల మంది జ‌నమే కాదు భిన్న సంస్కృతుల స‌మ్...

అన్నార్థుల పాలిట ఆరాధ్య దైవం -పిల్ల‌ల నేస్తం రోటీ బ్యాంక్

చిత్రం
జ‌నానికి పోలీసులంటేనే భయం..కోపం. క‌ఠినంగా ఉంటార‌ని, అక్ర‌మంగా కేసులు బ‌నాయిస్తార‌ని..అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వేధింపుల‌కు పాల్ప‌డుతున్నార‌నే అభిప్రాయం జ‌నాల్లో ఉంది. దేశంలో ఎక్క‌డికి వెళ్లినా ఇదే ఒపినియ‌న్‌. ఖాకీల్లో కూడా కారుణ్యం క‌లిగిన వారుంటారు. వారిలో మాన‌వ‌త్వం ఉంటుంద‌ని నిరూపిస్తున్నారు. తాము కూడా మ‌నుషులేనంటూ చాటి చెబుతున్నారు. ప్ర‌పంచ ద‌యాగుణం క‌లిగిన దినోత్స‌వం రోజున ఓ వ్య‌క్తి ముంబ‌యి న‌గ‌రంలో నిరాద‌ర‌ణ‌కు గురైన 20 వేల మంది అనాధ పిల్ల‌ల‌కు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. అత‌నే మ‌హారాష్ట్రకు చెందిన మాజీ డీజీపీ డి.శివ‌నంద‌న్‌. చాలా మంది ప‌వ‌ర్‌ను ఎంజాయ్ చేస్తారు. అధికార ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శిస్తారు. కానీ శివ‌నంద‌న్ విధుల్లోను..రిటైర్ అయ్యాక త‌న‌లోని సేవా గుణాన్ని మాత్రం వ‌దులు కోలేదు.  మాన‌వ‌త్వం క‌లిగి ఉండ‌డం పుట్టుక‌తో వ‌స్తుంది. అది ఒక‌రు నేర్పితే రాదు. ఈ దేశంలో లెక్క‌లేనంత మంది ఉగ్ర‌వాదుల‌తో నిండి పోయింది. వారు చేస్తున్న ఆగ‌డాల దెబ్బ‌కు ట‌న్నుల కొద్దీ ఆహారం వృధా అవుతోంది. ఈ దేశంలో 20 కోట్ల మంది ప్ర‌తి రోజు అన్నం కోసం అర్రులు చాస్తున్నారు. ఆక‌లి చావుల‌కు గు...

యంగ్ క్రికెట‌ర్స్ కు అత‌డే దిక్సూచి

చిత్రం
అండ‌ర్ -19 జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌కు చేరుకుంది. కోట్లాది క్రిక‌ట్ అభిమానులు ఊపిరి బిగ‌ప‌ట్టి చూస్తున్నారు. క్రికెట్ కామెంటేట‌ర్స్ మాత్రం ఇండియాదే క‌ప్ అంటూ స్ప‌ష్టం చేస్తున్నారు. ఓ వైపు క్రికెట‌ర్లు..ఇంకో వైపు అభిమానులు..మ‌రో వైపు భార‌త దేశ అధ్య‌క్షుడు, ప్ర‌ధాని..త‌దిత‌రులంతా ఈ ఆట‌పైనే దృష్టి సారించారు. ఇంత ఉద్విగ్న‌త చోటు చేసుకున్నా ఒక‌రు మాత్రం మౌనంగా..ఏమీ తెలియ‌న‌ట్టు..త‌న‌కేమీ ప‌ట్టన‌ట్టు లాన్స్‌లో ఉండి పోయారు. ముఖంలో కానీ ఎలాంటి  భావోద్వేగాల‌ను క‌నిపించ‌నీయ‌కుండా ఉన్న ఆ క్రికెట్ దిగ్గ‌జం ..ది వాల్ గా పేరు పొందిన రాహుల్ ద్రవిడ్‌. బ్యాట్స్‌మెన్‌గా..ఫీల్డ‌ర్‌గా..వికెట్ కీప‌ర్‌గా..కెప్టెన్‌గా..కోచ్‌గా ..మెంటార్‌గా..ప‌లు ఫార్మాట్‌ల‌లో రాణించిన ఈ క్రికెట్ ఆట‌గాడి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. దాయాది పాకిస్తాన్ టీం త‌మ‌కూ ద్రావిడ్ లాంటి ఆట‌గాడు అయివుంటే బావుండేద‌ని చెప్పారంటే ఆయ‌న‌కున్న క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవ‌చ్చు. మోస్ట్ డిపెండ‌బుల్ క్రికెట‌ర్‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌న‌కు పేరుంది. క్రికెట్ రంగం నుండి తాను వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్పుడు అభిమానులు ఒక్క‌సారిగ...

ఈ ఐఏఎస్ పిల్ల‌ల పాలిట దేవ‌త ..!

చిత్రం
ఈ దేశంలో సివిల్ స‌ర్వెంట్స్ కు ఎన‌లేని క్రేజ్‌. క‌లెక్ట‌ర్‌, ఎస్పీ ప‌ద‌వుల‌కున్నంత క్రేజ్ ఏ రంగానికీ లేదు. వీరిలో చాలా మంది అధికార ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శిస్తే ..ఇంకొంద‌రు మాత్రం ప్ర‌జా సేవ‌లో నిమ‌గ్న‌మ‌య్యారు. ఓ వైపు వృత్తి ధ‌ర్మాన్ని పాటిస్తూనే మ‌రో వైపు పేద‌ల కోసం శ్ర‌మిస్తున్నారు. అలాంటి వారిలో ఈ ఐపీఎస్‌, ఐఏఎస్ అధికారిణి గ‌రిమా సింగ్ వెరీ వెరీ స్సెష‌ల్‌. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన గ‌రిమాకు పిల్ల‌లంటే ప్రేమ‌. 2015లో యుపీఎస్‌సీ నిర్వ‌హించిన ఎక ్జాంలో ఆల్ ఇండియాలో 55 వ ర్యాంకును సాధించారు ఆమె. మొద‌ట్లో ఎస్పీ కేడ‌ర్‌కు ఎంపిక‌య్యారు. విధుల్లో ఉంటూనే మ‌రోసారి ప‌రీక్ష రాసి ఐఏఎస్‌కు ఎంపిక‌య్యారు. పోలీసు ఆఫీస‌ర్‌గా ప‌నిచేస్తున్న స‌మ‌యంలో ఎన్నో సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు గ‌రిమా. మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ఆమె గుర్తించారు. వారి కోసం ప్ర‌త్యేకంగా 1090 టోల్ ఫ్రీ నెంబ‌ర్‌ను ఏర్పాటు చేశారు. ఎవ‌రైనా ..ఎప్పుడైనా..ఎక్క‌డి నుంచైనా త‌మ స‌మ‌స్య‌ను ఈ నెంబ‌ర్‌కు చెప్పుకోవ‌చ్చు. త‌క్ష‌ణ‌మే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భించేలా ఆమె కృషి చేశారు. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన మోహ‌న్‌లాల్...

నిన్న దిన‌స‌రి కూలీ..నేడు ఐపీఎల్ క్రికెట‌ర్

చిత్రం
ఇండియ‌న్ ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇదో హాట్ టాపిక్‌. దేశ స‌రిహ‌ద్దులో ఎప్పుడూ తూటాల మోత‌తో ద‌ద్ద‌రిల్లే జ‌మ్మూ కాశ్మీర్ స్టేట్ నుండి ఓ కుర్రాడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు అత‌డే మంజూర్ ధార్‌. ఈ ఆట‌గాడికి ఎవ్వ‌రి స‌పోర్ట్ లేదు. బాండీపారా జిల్లాకు చెందిన ఈ కుర్రాడు..ఐపీఎల్ వేలం పాట‌ల్లో చోటు ద‌క్కించుకున్నాడు. పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ -9 జ‌ట్టు ధార్‌ను 20 ల‌క్ష‌ల‌కు వేలం పాట‌లో ద‌క్కించుకుంది. సైనికుల‌కు..ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య నిరంత‌రం యుద్ధం న‌డిచే ఈ స్టేట్ నుండి ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వ‌హించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇండియా అంటేనే క్రికెట్‌. క్రికెట్ అంటేనే భార‌త్ అనే స్థాయికి చేరుకుంది ఈ ఆట‌. పుట్టింది ఇంగ్లండ్‌లో అయిన‌ప్ప‌టికీ ఇపుడ‌ది ప్ర‌పంచాన్ని శాసిస్తోంది. వ‌ర‌ల్డ్ మార్కెట్‌ను షేక్ చేసే స్థాయికి చేరుకుంది. బిగ్ షాట్స్‌, బిజినెస్ టైకూన్స్‌, ఫేమ‌స్ ప‌ర్స‌నాలిటీస్‌, బ‌డాబాబులు, కంపెనీలు, అఫీసియ‌ల్స్‌, ఎన్ ఆర్ ఐలు ..ఇలా చెప్పుకుంటూ పోతే అంతా క్రికెట్ జ‌పం చేస్తున్నారు. కోట్లాది రూపాయ‌లు కుమ్మ‌రిస్తున్నారు. ఐపీఎల్ ఆట కోలుకోలేని ఫీవ‌ర్‌ను క‌లుగ చేస్తోంది. అభిమానులు ఊగి పోతున్నారు. ఔత్సాహికులు ...