పోస్ట్‌లు

జులై 6, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

మిస్ట‌ర్ కూల్‌కు 38 ఏళ్లు - ధోనీ ఇలాగే వ‌ర్ధిల్లు..!

చిత్రం
ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్ర‌లో మిస్ట‌ర్ కూల్ క్రికెట‌ర్‌గా పేరు సంపాదించుకున్న ఇండియ‌న్ క్రికెట‌ర్ , మాజీ భార‌త క్రికెట్ జ‌ట్టు ర‌థ‌సార‌థి మ‌హేంద్ర సింగ్ ధోనీకి ఇపుడు 38 ఏళ్లు నిండాయి. భార‌త్‌కు క‌పిల్‌దేవ్ సారథ్యం త‌ర్వాత ధోనీ నేతృత్వంలో ఇండియాకు ప్ర‌పంచ క‌ప్ ద‌క్కింది. ఆయ‌న ఇప్పుడు మ‌రో ప్ర‌పంచ క‌ప్ టోర్నీలో ఆడుతున్నాడు. ఇదే ఆఖ‌రు టోర్నీ కావ‌చ్చు త‌న కెరీర్‌లో. అటు బ్యాటింగ్ లో ఇటు కీపింగ్‌లో త‌న‌కంటూ ఓ బ్రాండ్ ఇమేజ్‌ను స్వంతం చేసుకున్న ఈ ఆట‌గాడు ఎప్పుడూ సంయ‌మ‌నం కోల్పోలేదు. కూల్‌గా, ప్ర‌శాంతంగా ఎలాంటి వ‌త్తిళ్ల‌లోనైనా స‌రే జ‌ట్టును విజ‌య తీరాలకు చేర్చ‌డంలో ధోనీని మించిన నాయ‌కుడు లేడు..ఆట‌గాళ్లు ద‌రిదాపుల్లో లేరంటే అతిశ‌యోక్తి కాదేమో. 1981 జూలై 7న ఒక‌ప్ప‌టి బీహార్ రాష్ట్రం..ఇపుడు ఝార్ఖండ్ స్టేట్‌లో ఉన్న రాంచీలో జ‌న్మించారు. ఆయ‌న‌కు మిస్ట‌ర్ కూల్‌గా, మ‌హిగా, తాలా పేర్లున్నాయి. ఎడ‌మ చేతి బ్యాట్స్ మెన్ గా  స‌క్సెస్ అయ్యారు. అలాగే కీప‌ర్‌గా కూడా రాణించారు. 2005 డిసెంబ‌ర్ 2న శ్రీ‌లంక‌తో టెస్ట్ మ్యాచ్ ఆరంగ్రేటం చేశాడు. 2004 డిసెంబ‌ర్ 23న బంగ్లాతో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో ఎంట‌ర్ అయ్యా...

యాడ్స్ గురూ..కోట్లే కోట్లు బాస్..!

చిత్రం
ఐడియాలు ఎన్నో..కానీ వ‌ర్క‌వుట్ అయితే ..కోట్లు వెనకేసు కోవ‌చ్చు. ఇదంతా ఆయా ఛాన‌ల్స్, రేడియోలు, మీడియా, ప్ర‌చుర‌ణ రంగంలో నిరంత‌రం మ‌న‌ల్ని ప్ర‌భావితం చేసేవి ప్ర‌క‌ట‌న‌లే. కొన్ని జింగిల్స్ కూడా ప్రాముఖ్యం వ‌హిస్తాయి. జ‌స్ట్..అర సెకండ్ నుంచి 2 నిమిషాల వ్య‌వ‌ధిలో వ‌చ్చి పోయే ఈ యాడ్స్ సృష్టించే సునామీ అంతా ఇంతా కాదు. లెక్క‌లేనంత ..లెక్కించ‌లేనంత‌. కోట్ల‌ను దాటి డాల‌ర్ల‌ను కొల్ల‌గొడుతున్నాయి మ‌న యాడ్స్. ఏ టీవీ ఆన్ చేసినా..ఏ యూట్యూబ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్‌ల‌ను ట‌చ్ చేస్తే చాలు ..వంద‌లాది యాడ్స్ వ‌స్తూనే వుంటాయి. ప్ర‌తి సినిమాకు ముందు ట్రైల‌ర్ ఎలాంటిదో..ప్ర‌తి ప్రొడ‌క్ట్ కు మార్కెట్ కావాలంటే అర్థ‌వంతమైన ..ఆలోచ‌న‌ల‌ను రేకెత్తించి..కొనుగోలుదారుల మ‌న‌సు దోచుకునేలా ..హ‌త్తుకునేలా త‌యారు చేయాలంటే ..గంట‌ల త‌ర‌బ‌డి చెబితే వినే ప‌రిస్థితుల్లో లేరు జ‌నం. ఏ వ్యాపారానికైనా ..ఏ వ‌స్తువుకైనా ..ఏ కంపెనీకైనా..క‌స్ట‌మ‌ర్లే కీల‌కం..వారే దేవుళ్లు. ఆయా దేశాల్లోని ప్ర‌భుత్వాలు కూడా తాము చేసిన అభివృద్ధిని ప్ర‌క‌ట‌న‌ల ద్వారా తెలియ చేస్తుంటారు. ఇపుడు రేడియోలు కూడా విరివిగా ఉండ‌డంతో యాడ్స్ గంప గుత్త‌గా వ‌చ్...

ఫుడ్ ప్రాస‌సింగ్ వెంఛ‌ర్స్‌కు ఎంటిఆర్ భారీ ఆఫ‌ర్

చిత్రం
దేశంలో ఏ మూలకు వెళ్లినా ..గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా ..ఏ కిరాణా కొట్టు ముందు వాలిపోయినా ..మ‌న‌కు క‌నిపించేది ..ఆహార ఉత్ప‌త్తుల విష‌యంలో ఎంటిఆర్ గుర్తు. ఇంత‌గా పాపుల‌ర్ అయిన ఈ ఇమేజ్..బెంగ‌ళూరు కేంద్రంగా ప‌నిచేస్తున్న కంపెనీది. ప్ర‌తి కుటుంబంలో నిత్యం ..నిరంత‌రం వాడే వంట దినుసుల‌ను ఈ కంపెనీ స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు నాణ్య‌మైన రీతిలో విక్ర‌యిస్తోంది. దీని వ్యాపారం ఏటా కోట్ల‌కు చేరుకుంది. దేశీయంగానే కాకుండా విదేశాల్లో ఎంటిఆర్ కంపెనీకి స్టోర్లున్నాయి. ఎగుమ‌తి ప‌రంగా డాల‌ర్ల పంట పండుతోంది. ఆహార రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువ‌గా మందులు లేని పంట‌లు, ప‌ప్పులు, దినుసుల‌కే ఎక్కువ‌గా ప్ర‌యారిటీ ఇస్తున్నారు కొనుగోలుదారులు. దీనిని గ‌మ‌నించిన కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సైతం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల‌కు భారీ ఎత్తున ప్యాకేజీలు, రుణాలు, స‌బ్సిడీలు ప్ర‌క‌టించాయి. ఈ మేర‌కు ఆహార రంగంలో టాప్ రేంజ్‌లో కొన‌సాగుతున్న ఎంటిఆర్ కంపెనీ ..ఫుడ్ ప్రాసెసింగ్ వెంఛ‌ర్స్‌ను ప్రోత్స‌హించేందుకు గాను అంకుర సంస్థ‌లు ఏర్పాటు చేసేందుకు ..50 కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌త్యేక నిధి కింద జ‌మ చేసింది. ఈ మేర‌కు కంప...

లంకేయుల‌పై ఇండియా ఘ‌న విజ‌యం - సెమీస్‌లో కివీస్‌తో ఢీ

చిత్రం
రోహిత్ శ‌ర్మ శ‌త‌కాల మోత‌తో ఇండియాకు అరుదైన విజ‌యం ద‌క్కింది ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్‌లో. ఏకంగా ఈ టోర్నీలో 5 సెంచరీలు సాధించిన క్రికెట‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు ఈ ఆట‌గాడు. క‌ళాత్మ‌క‌మైన బ్యాటింగ్‌తో లంక‌తో జ‌రిగిన ప్ర‌తిష్టాత్మ‌క మ్యాచ్‌లో భార‌త్‌కు సునాయ‌సంగా విక్ట‌రీ సాధించి పెట్టాడు. రోహిత్‌కు తోడు కెఎల్ రాహుల్ సైతం తానేమీ తీసిపోనంటూ లంకేయుల‌తో చెడుగుడు ఆడాడు. ఏకంగా సెంచ‌రీ సాధించాడు. గ‌తంలో వ‌ర‌ల్డ్ క‌ప్‌లో శ్రీ‌లంక‌కు చెందిన సంగ‌క్క‌ర సాధించిన 4 సెంచ‌రీల రికార్డును బ్రేక్ చేశాడు రోహిత్ శ‌ర్మ‌. 265 ప‌రుగుల నిర్దేశించిన ల‌క్ష్యాన్ని అల‌వోక‌గా, ఆడుతూ పాడుతూ ఛేదించారు. టార్గెట్ ఛేదించే క్ర‌మంలో బ‌రిలోకి దిగిన రోహిత్  94 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు 2 సిక్స‌ర్ల సాయంతో 103 ప‌రుగులు చేస్తే, రాహుల్ 118 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు ఒక భారీ సిక్స‌ర్ తో 111 ప‌రుగులు సాధించాడు. వీరిద్ద‌రు క‌లిసి భారీ భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేశారు. దీంతో ఇండియా శ్రీ‌లంక‌పై 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. మ‌రో 39 బంతులు ఉండ‌గానే ఈ విక్ట‌రీ ఇండియాకు ద‌క్కింది. అంత‌కు ముందు బ్యాటింగ్ కు దిగిన శ్రీ‌లంక జ...

బండ్ల‌కు నో గిరాకీ - నేల చూపులు చూస్తున్న కంపెనీలు

చిత్రం
దేశీయ ఆటోమొబైల్ రంగం ఎన్న‌డూ లేనంత పోటీని ఎదుర్కొంటోంది. విదేశీ మార్కెట్ ప‌రంగా చూస్తే ఫోర్ వీల‌ర్స్ భారీ స్థాయిలో అమ్ముడు పోతుంటే, ఇండియాలో మాత్రం అమ్మ‌కాలు భారీగా త‌గ్గి పోయాయి. దీంతో ఆయా కార్ల కంపెనీలు నేల చూపులు చూస్తున్నాయి. గ‌త ఏడాది అమ్మ‌కాల్లో టాప్ వ‌న్‌లో నిలిచిన మారుతీ, సుజుకీ కంపెనీ ఇపుడు గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. ఇక హ్యూందాయి, హోండా, టాటా, ఫోర్డ్, త‌దిత‌ర కంపెనీల కార్లు కూడా అమ్ముడు పోవ‌డం లేదు. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు కొద్ది మేర పెంచ‌డంతో వినియోగ‌దారుల‌పై మ‌రింత భారం ప‌డ‌నుంది. వాహ‌నాల నిర్వ‌హ‌ణ రోజు రోజుకు భారంగా ప‌రిణ‌మించడంతో ఎక్కువ‌గా జ‌నం త‌మ అవ‌స‌రాల కోసం స్వంత వాహ‌నాల కంటే, అద్దె వాహ‌నాల‌కు ప్ర‌యారిటీ ఇస్తున్నారు. దీంతో అద్దె ట్యాక్సీలకు విప‌రీత‌మైన గిరాకీ ఏర్ప‌డింది. ఇప్ప‌టికే ఓలా, ఊబ‌ర్, త‌దిత‌ర కంపెనీలు త‌మ వ్యాపారాన్ని విస్త‌రించాయి. జ‌ర్నీ మేడ్ ఈజీ అంటూ ..స‌ర్వీసెస్ అంద‌జేస్తున్నాయి. ఇండియాలో బిగ్గెస్ట్ డిమాండ్ ఉన్న కంపెనీగా పేరొందిన మారుతీకి ఈ ఏడాది ఏమంత అచ్చిరాలేదు. గ‌త జూన్ నెల‌లోను ...

లండ‌న్‌లో ఓలా ప‌రుగులు

చిత్రం
ఇండియాలో ఇప్ప‌టికే త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పాటు చేసుకున్న ఓలా కంపెనీ త‌న సేవ‌ల‌ను ఇత‌ర దేశాల‌కు విస్త‌రించింది. టెక్నాల‌జీ సాయంతో ఎక్క‌డి నుంచి ఎక్క‌డికైనా ప్ర‌యాణం చేసేందుకు వీలు క‌లుగుతుంది. దీంతో వెహికిల్స్ కోసం ఎదురు చూడాల్సిన ప‌నిలేదు. జ‌స్ట్ ఓలా యాప్‌ను స్మార్ట్ ఫోన్ల‌లో డౌన్లోడ్ చేసుకుంటే చాలు. మీరుంటున్న స్థానం నుంచి గ‌మ్య స్థానం వెళ్లేంత దాకా సుర‌క్షితంగా న‌గ‌రంలో ఎక్క‌డికైనా జ‌ర్నీ చేసేందుకు వీలు క‌ల్పిస్తుంది. రెంట్ , క‌మీష‌న్ ఆధారంగా వీటిని న‌డుపుతారు. ఓలా మొద‌ట‌గా స్టార్ట‌ప్‌గా ప్రారంభ‌మైంది. ఆ త‌ర్వాత కోట్లాది రూపాయ‌లు వివిధ కంపెనీలు ఈ కంపెనీలో పెట్టుబడిగా పెట్టాయి. జ‌నాభా పెర‌గ‌డం, అవ‌స‌రాలు ఎక్కువ కావ‌డం, జ‌ర్నీ అన్న‌ది ముఖ్యంగా ఉండ‌డంతో వెహికిల్స్ భారీగా అవ‌స‌ర‌మ‌వుతున్నాయి. దీంతో ప్ర‌తి ఒక్క‌రు ఓలా, ఊబ‌ర్‌, త‌దిత‌ర సంస్థ‌లను ఉప‌యోగించుకుంటున్నారు. తాజాగా ఓలా కంపెనీ లండ‌న్‌లో ప్ర‌వేశించింది. అక్క‌డ వెహికిల్స్ న‌డిపించాలంటే గ్రీన్ లైట్ ఉండాల్సిందే. ఇందు కోసం యుకెలో తాము టాక్సీలు న‌డిపేందుకు 2018 ఆగ‌స్టులో ద‌ర‌ఖాస్తు చేసుకుంది ఓలా. సౌత్ వేల్స్  సిటీలో మొద‌ట‌గా ఈ ...

అంకురాల‌కు ఆస‌రా..కేంద్ర స‌ర్కార్ భ‌రోసా..!

చిత్రం
ప్ర‌పంచం స్టార్ట‌ప్‌ల వైపు చూస్తోంది. అంకురాల‌కు వెన్నుద‌న్నుగా నిలుస్తున్నాయి. ఆలోచ‌న‌ల‌కు రెక్క‌లు తొడిగి..అంకురాలుగా మారేలా చేసేందుకు ప‌లు కంపెనీలు, సంస్థ‌లు, వ్యాపార వేత్త‌లు, బిజినెస్ టైకూన్స్ , ఆయా ప్ర‌భుత్వాలు పెట్టుబ‌డులు పెట్ట‌డంతో, మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేస్తున్నాయి. ఇండియాలో తాజాగా స్టార్ట‌ప్‌ల హ‌వా కొన‌సాగుతోంది. ఓలా, ఊబ‌ర్, ఫోన్ పే, స్విగ్గీ , ఎనీ టైం లోన్ లాంటివి ఎన్నో స‌క్సెస్ బాట‌లో న‌డుస్తున్నాయి. ఎక్కువ‌గా బెంగ‌ళూరులో అంకురాలు ఏర్పాట‌య్యాయి. ఐటీ, లాజిస్టిక్, హెల్త్, ట్రావెల్ టూరిజం , ఎడ్యూకేష‌న్, ఏవియేష‌న్, త‌దిత‌ర రంగాల‌లో స్టార్ట‌ప్‌లు పుట్టుకొచ్చాయి. వేలాది మందికి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉపాధి కూడా దొరుకుతోంది. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం మేకిన్ ఇండియా ప్రోగ్రాంను తీసుకు వ‌చ్చింది. స్టార్ట‌ప్‌ల‌ను ప్రోత్స‌హించేందుకు గాను మోడీ స‌ర్కార్ ప్ర‌త్యేకంగా అంకురాల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌త్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా స్టార్ట‌ప్స్ ఏర్పాటు చేసేందుకు వీలుగా కేంద్ర బ‌డ్జెట్‌లో ప్ర‌భుత్వం ప‌లు ప్రతిపాద‌న‌లు చేసింది. ప్ర‌స్తుతం స్టార్ట‌ప్స్ కు ఏంజెల...

క‌ర్నాట‌కం ర‌స‌వ‌త్త‌రం - అమెరికాలో కుమార - రంగంలోకి దిగిన డీకే

చిత్రం
మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది క‌ర్ణాట‌క క‌థ. ఎప్పుడు వుంటుందో ఎప్పుడు ఊడి పోతుందో తెలియ‌ని ప‌రిస్థితిని ఎదుర్కొంటున్న సంకీర్ణ స‌ర్కార్‌కు ఎమ్మెల్యేలు కొంద‌రు క‌మ‌లం వైపు చూసేందుకు ట్రై చేయ‌డంతో పాలిటిక్స్ ఒక్క‌సారిగా వేడెక్కాయి. వ్య‌క్తిగ‌త ప‌నుల నిమిత్తం ముఖ్య‌మంత్రి కుమార స్వామి అమెరికాకు వెళ్లారు. ఇదే అస‌లైన స‌మ‌యంగా భావించిన కొంద‌రు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో సంక్షోభం తారా స్థాయికి చేరుకుంది. ఏకంగా ఎనిమిది మంది ప్ర‌జాప్ర‌తినిధులు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నార‌న్న స‌మాచారంతో అధికార కాంగ్రెస్ - జేడీఎస్ కూట‌మిలో క‌ల‌క‌లం రేగింది. సౌమ్యా రెడ్డి, బీసీ పాటిల్ స‌హా సంకీర్ణ స‌ర్కార్‌లో అసంతృప్తిగా ఉన్న 8 మంది నేత‌లు రాజీనామా స‌మ‌ర్పించేందుకు అసెంబ్లీ స్పీక‌ర్ ర‌మేష్ కుమార్‌ను క‌ల‌వ‌నున్న‌ట్లు వార్త‌లు గుప్పుమ‌న్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూట‌ర్‌గా పేరొందిన్న మంత్రి డీకే శివ‌కుమార్ హుటాహుటిన త‌న నియోజ‌క‌వ‌ర్గం నుంచి బెంగ‌ళూరుకు బ‌య‌లు దేరారు. పీసీసీ చీఫ్ దినేష్ గుండూరావు విదేశాల్లో  ఉండ‌గా ..వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్...