పోస్ట్‌లు

మే 19, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

బంగారు కొండ ..మ‌న దేవ‌ర‌కొండ - మోస్ట్ డిజైర‌బుల్ మెన్

చిత్రం
తెలంగాణ వెలిగి పోతోంది. నియాన్ లైట్ల మ‌ధ్య‌న చార్మినార్ మెరిసి పోతోంది. వ‌జ్రాలు, వైఢూర్యాలు అమ్మిన భాగ్య‌న‌గ‌రం త‌న‌ను తాను గొప్ప‌నైన న‌గ‌రంగా భాసిల్లుతోంది. త్యాగాలకు, బ‌లిదానాల‌కు , పోరాటాల‌కు , ఉద్య‌మాల‌కు , ఐటీ హ‌బ్‌కు కేరాఫ్‌గా మారిన హైద‌రాబాద్ త‌న బ్రాండ్‌ను అంత‌కంత‌కూ పెంచుకుంటూ పోతోంది. నిన్న‌టి దాకా తెలుగు సినిమా కొంద‌రి చేతుల్లోనే..ఇపుడు అది అంద‌రిది. టాలెంట్ ఎక్క‌డుంటే అక్క‌డికి ప‌రుగులు తీస్తోంది ప‌రిశ్ర‌మ‌. కేవ‌లం కొన్ని సినిమాల్లోనే న‌టించి..త‌న డిఫ‌రెంట్ మేన‌రిజంతో ఆక‌ట్టుకుంటూ ..త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును..బ్రాండ్ ను స్వంతం చేసుకున్న ఘ‌న‌త ఒక్క విజ‌య్ దేవ‌ర‌కొండ‌కే ద‌క్కింది. ఇపుడు తెలంగాణ అత‌డిని చూసి గ‌ర్వ‌ప‌డుతున్న‌ది. ఒకే ఒక్క సినిమా అత‌డిలోని ప్ర‌తిభ‌ను..హీరోయిజాన్ని ప్ర‌ద‌ర్శించేలా చేసింది. అర్జున్ రెడ్డి సినిమా తెలుగు సినిమా ఇండ‌స్ట్రీని షేక్ చేసింది. విజ‌య్ దేవ‌ర‌కొండ కాస్తా అర్జున్ రెడ్డిగా మారి పోయాడు. అంతలా యూత్ తో క‌నెక్ట్ అయ్యాడు. అత‌డి రేంజ్ అగ్ర హీరోల స‌ర‌స‌న చేరింది. ఇటీవ‌ల మ‌హేష్ బాబు త‌న మ‌హ‌ర్షి సినిమా రిలీజ్ ఫంక్ష‌న్ కు ప్...

అడిగో ప్రోత్సాహం - జెట్‌కు పూర్వ వైభ‌వం

చిత్రం
ఇండియ‌న్ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌ల‌లో విశిష్ట సేవ‌లందిస్తూ త‌క్కువ కాలంలోనే ఎక్కువ ప్రాచుర్యం పొందిన జెట్ ఎయిర్ వేస్ అనుకోని రీతిలో సంక్షోభంలోకి కూరుకు పోయింది. దాదాపు 8 వేల 500 కోట్ల‌కు పైగా ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెల్లించాల్సి ఉంది జెట్ ఎయిర్ వేస్ యాజ‌మాన్యం. సంస్థ అప్పుల్లో కూరుకు పోయింద‌ని, ఇక మూసి వేయ‌డ‌మే మేలంటూ యాజ‌మాన్యం చ‌ల్ల‌గా చెప్పింది. దీంతో వేలాది మంది సంస్థ ఉద్యోగులు రోడ్డెక్కారు. కేంద్ర ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే త‌మ‌ను ఆదుకోవాల‌ని, త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరారు. ఎన్నిక‌ల స‌మయంలో ప్ర‌స్తుత స‌ర్కార్‌కు ఇది త‌ల‌నొప్పిగా మారింది. మ‌రో వైపు ప్ర‌భుత్వ సంస్థ ఎయిర్ ఇండియా కూడా సేమ్ టు సేమ్ రేపో మాపో లాకౌట్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. సేవ‌ల‌లో ముందంజ‌లో ఉన్న ఈ రెండు విమానాశ్ర‌యాలు తీర్చ‌లేని అప్పుల్లో కూరుకు పోయాయి. బ‌య‌ట‌కు రాలేక ల‌బోదిబోమంటున్నాయి. జెట్ ఎయిర్ వేస్ ను టేకోవ‌ర్ చేసేందుకు ప‌లు సంస్థ‌లు ముందుకు వ‌చ్చినా..ఏ ఒక్క సంస్థ ఇప్ప‌టి వ‌ర‌కు ఇదమిద్దంగా పూర్తి నిర్ణ‌యానికి రాలేక పోతున్నాయి. ఎస్‌బిఐ చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ ర‌జ‌నీష్ కుమార్ దిద్దుబాటు చ‌ర్య‌లు ప...

పిల్ల‌ల పాలిట దేవుడు ఈ క‌లెక్ట‌ర్

చిత్రం
మ‌న‌సుంటే మార్గాలు ఎన్నో. కావాల్సింద‌ల్లా సంక‌ల్పం. మ‌నుషుల ప‌ట్ల కాసింత అభిమానం. చాలా మంది క‌లెక్ట‌ర్లు అధికార ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శిస్తారు. ఇంకొంద‌రైతే దైవాంశ సంభూతులుగా భావిస్తారు. కానీ క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చి..జాతీయ స్థాయిలో సివిల్ స‌ర్వీసెస్ కు ఎంపికైన వారిలో ఎలాంటి డాబూ..ద‌ర్పం ఉండ‌దు. సింపుల్ గా వుంటారు..ప్ర‌జ‌ల‌ను ప్రేమిస్తారు. వారి కోసం ఏమైనా చేయాల‌ని త‌ప‌న‌తో ఉంటారు. అలాంటి వారిలో కోవే ఒక‌రు. ఈ క‌లెక్ట‌ర్ ఏకంగా జ‌నంతో క‌లిసి కొన్నేళ్లుగా అప‌రిష్కృతంగా ఉన్న రోడ్డుకు మోక్షం క‌ల్పించారు. ప్ర‌పంచం ఈ క‌లెక్ట‌ర్ చేసిన ప్ర‌య‌త్నాన్ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తింది. కొంద‌రు అధికారులు జ‌నంతో, అధికారుల‌తో మాట్లాడేందుకు సైతం ఇష్ట‌ప‌డరు. కానీ వ‌రంగ‌ల్ జిల్లా అర్భ‌న్ క‌లెక్ట‌ర్ ప్ర‌శాంత్ జీవ‌న్ పాటిల్ భిన్నంగా ఆలోచించారు. కొత్త ఐడియాకు శ్రీ‌కారం చుట్టారు. రాష్ట్రం మొత్తం ఆశ్చ‌ర్య పోయేలా ..మిగ‌తా జిల్లాల క‌లెక్ట‌ర్లు నివ్వెర పోయేలా చేశారు. కార్పొరేట్ కాలేజీలు, స్కూల్స్ పిల్ల‌ల‌తో క‌లెక్ట‌ర్లు ఫోటోలు దిగుతున్నారు. ఎక్క‌డ‌లేని ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఒక ర‌కంగా స‌మాజానికి ఆద‌ర్శంగా ఉం...

కారుదే జోరు - విప‌క్షాలు బేజారు - మ‌గోడు కేసీఆర్

చిత్రం
తెలంగాణ రాష్ట్ర స‌మితి వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, నూత‌న రాష్ట్ర ప‌రిపాల‌నాద‌క్షుడు , గులాబీ బాస్ కల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌రోసారి వార్త‌లో నిలిచారు. ఇటు రాష్ట్రంలోను అటు దేశంలోను ఆయ‌న పేరు మార్మోగుతోంది. తెలుగుదేశం పార్టీలో సుద‌ర్ఘీమైన నాయ‌కుడిగా ఆయ‌న త‌న ప్ర‌స్థానాన్ని కొన‌సాగించారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబుతో విభేదించి డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. వ‌ట్టి పోయిన తెలంగాణ విముక్తి కోసం టీఆర్ ఎస్ ను స్థాపించారు. ప్రొఫెస‌ర్ దివంగ‌త కొత్త‌ప‌ల్లి జ‌యశంక‌ర్ ఆచారి మార్గ‌నిర్దేశ‌నంలో ప్ర‌పంచం నివ్వెర పోయేలా తెలంగాణ ఉద్య‌మాన్ని సంబండ కులాలు, కోట్లాది ప్ర‌జ‌ల స‌హ‌కారంతో పోరాటం చేశారు. ఉద్య‌మానికి ఊపిరి పోశారు. చివ‌ర‌కు తానే ప్రాణం తీసుకునేందుకు న‌డుం బిగించారు. ఆయ‌న ఒక్క‌డుగా మొద‌లై అడుగులు వేస్తే కోట్లాది అడుగులు లోకం ద‌ద్ద‌రిల్లేలా కేంద్రం దిగివ‌చ్చేలా చేసింది. ఎన్నో నిర్బంధాలు, అవ‌మానాలు, కేసులు, ఆత్మ‌హ‌త్య‌లు, విద్యార్థుల‌పై లాఠీఛార్జీలు, స‌క‌ల జ‌నుల స‌మ్మెలు ఇలా ప్ర‌తి చోటా ప్ర‌తి నోటా దేశమంత‌టా తెలంగాణ పేరు వినిపించేలా చేయ‌డంలో కేసీఆర్ స‌క్సెస్ అయ్యారు. మొండిత‌...

ఎగ్జిట్ పోల్స్‌లో మోదీకే ప్ర‌యారిటీ

చిత్రం
అంచ‌నాలు తారు మారు కాబోతున్నాయి. దేశ వ్యాప్తంగా లోక్‌స‌భ ఎన్నిక‌ల‌తో పాటు నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. దీంతో ఇండియాలో న్యూస్ ఛాన‌ల్స్, స‌ర్వే సంస్థ‌లు ప్రీ పోల్ స‌ర్వేల ఫ‌లితాలు ప్ర‌క‌టించాయి. కొన్ని ఛాన‌ల్స్ హంగ్ దిశ‌గా సూచిస్తే..చాలా వ‌ర‌కు ఛాన‌ల్స్ బీజేపీకి ఎడ్జ్ ఉంటుంద‌ని పేర్కొన్నాయి. ఏడు ద‌శ‌ల్లో జ‌రిగిన పోలింగ్‌లో ప్ర‌జా తీర్పు ఈ వీఎంల‌లో నిక్షిప్త‌మైంది. ఇక ఫ‌లితాలు వెల్ల‌డించేందుకు కొన్ని గంట‌లు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. ప్ర‌సిద్ధ స‌ర్వే సంస్థ‌లు ప్ర‌జా నాడిపై త‌మ త‌మ అంచ‌నాల‌తో కూడిన స‌ర్వేల‌ను బ‌య‌ట పెట్టాయి. త‌మిళ‌నాడులోని వేలూరు లోక్‌స‌భ స్థానం మిన‌హా 541 స్థానాలతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్, సిక్కిం రాష్ట్రాల‌లో అసెంబ్లీ ఫ‌లితాలు రానున్నాయి. ఏపీలో గ‌తంలో చంద్ర‌బాబు మోదీతో జ‌త క‌ట్టారు. ఆ త‌ర్వాత తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో క‌లిసి ప్ర‌యాణం చేశారు. క‌మ‌లానికి క‌టీఫ్ చెప్పారు. రాహుల్ గాంధీతో క‌ర‌చాల‌నం చేశారు. మోదీకి వ్య‌తిర‌కంగా బీజేపీయేత‌ర పార్టీల‌ను ఒకే వేదిక‌పైకి తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించారు. క‌ర్ణాట‌క‌లో మాజీ...

ఏపీలో సైకిల్ జోరు ..టీఎస్‌లో గులాబీ ప‌రుగు - ల‌గ‌డ‌పాటి జోష్యం

చిత్రం
ఎన్నిక‌ల స‌ర్వేల ఫ‌లితాల‌లో కాస్తంత న‌మ్మ‌కాన్ని కలిగి వున్న మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ అంచ‌నాలు తెలంగాణ‌లో ఇటీవ‌ల జ‌రిగిన తాజా ఎన్నిక‌ల్లో అంచ‌నాలు త‌ప్పాయి. దీంతో ఆయ‌న త‌న విశ్వ‌స‌నీయ‌త‌ను కోల్పోయారు. త‌ర్వాత మాట మార్చారు. మ‌రోసారి దేశ వ్యాప్తంగా జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌లతో పాటు తెలంగాణ‌, ఏపీల‌లో ఏ పార్టీకి ఎంపీ సీట్లు వ‌స్తాయో అంచ‌నా వేశారు. అంతేకాక జాతీయ స్థాయి ఛాన‌ల్స్ వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తే..ఒక్క ల‌గ‌డ‌పాటి స‌ర్వే మాత్రం సైకిల్ జోరు మీదుంద‌ని తేల్చి చెప్పారు. జ‌గ‌న్ వైసీపీ పార్టీకి 70 నుంచి 72 సీట్లకే ప‌రిమిత‌మై పోతుంద‌ని పేర్కొన్నారు. తిరుప‌తి శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి సాక్షిగా ల‌గ‌డ‌పాటి త‌న అంచ‌నాల‌ను ..ముంద‌స్తు ఫ‌లితాల‌ను వెల్ల‌డించారు. ఇక తెలంగాణ‌లో ఎంపీ సీట్ల‌లో 13 నుంచి 14 వ‌స్తాయ‌ని తెలిపారు. ఈ ఎన్నిక‌ల్లో ఏపీ ఓట‌ర్లు సైకిల్ , తెలంగాణ ఓట‌ర్లు కారు ఎక్కార‌ని స్ప‌ష్టం చేశారు. అంకెల‌తో కూడిన ఎగ్జిట్ పోల్స్‌ను ప్ర‌క‌టించారు. ఈసారి త్రిముఖ పోరు జ‌రిగినా ప్ర‌జ‌లు ఒకే వైపు మొగ్గార‌ని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి 100 స్థానాల‌కు ప‌ది అటో ఇట...