పోస్ట్‌లు

మే 7, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ప‌సిడి కోసం అతివ‌ల ఆరాటం..జోరు మీదున్న బంగారం

చిత్రం
ఇండియ‌న్ మార్కెట్ టోట‌ల్లీ డిఫ‌రెంట్. ఇక్క‌డ న‌మ్మ‌కాల‌కు ప్ర‌యారిటీ ఎక్కువ‌. మ‌హిళ‌లు ఉప‌వాస‌మైనా ఉంటారేమో కానీ బంగారం క‌నిపిస్తే చాలు కొన‌కుండా ఉండ‌లేరు. అంతలా ప‌సిడి వారి కుటుంబంలో భాగ‌మై పోయింది. క‌నీసం గ్రామ బంగార‌మైనా స‌రే అక్ష‌య తృతీయ రోజు కొనుగోలు చేసేందుకు క్యూ క‌డ‌తారు. నిన్నటి దాకా ఖాళీగా ఉన్న ప‌సిడి దుకాణాలు ఇపుడు క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. భారీ ఎత్తున మ‌హిళ‌లు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు వ‌స్తున్నారు. దీంతో హైద‌రాబాద్, త‌దిత‌ర న‌గ‌రాల్లో గోల్డ్ షాపులు జిగేల్ మంటున్నాయి. 25 శాతం అమ్మ‌కాలు పెరిగాయి. అక్ష‌య తృతీయ పుణ్యమా అంటూ న‌గ‌ల వ్యాపారుల‌కు పంట పండుతోంది. ఎక్కువ‌గా పసిడి కొనుగోలు చేయ‌డంతో వీరికి బాగానే క‌లిసొచ్చింది. ప్ర‌ధాన న‌గ‌రాల్లోని న‌గ‌ల దుకాణాల్లో కొనుగోలుదారుల సంద‌డి క‌నిపించింది. గ‌త ఏడాదితో పోలిస్తే అమ్మ‌కాలు భారీగా పెరిగాయి. మ‌రికొన్ని దుకాణాల్లో 40 శాతానికి పైగా అమ్మ‌కాలు జ‌ర‌గ‌డం చాలా మంది వ్యాపార‌స్తుల‌ను పున‌రాలోచ‌న‌లో ప‌డేసింది. గ‌త రెండు నెల‌ల కాలం నుండి బంగారం ధ‌ర‌ల్లో మార్పు లేక పోవ‌డం..రేటు స్థిరంగా ఉండ‌డం వ‌ల్ల కొనుగోలుదారులు ప‌సిడిని తీసుకు...

కోటి మంది మెచ్చిన పైసాలో

చిత్రం
టెక్నాల‌జీ మారింది. జ‌నం అభిరుచుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అవ‌స‌రాలు పెరిగాయి. అవ‌కాశాలు స‌న్న‌గిల్లాయి. ఈ స‌మ‌యంలో ఏదైనా డ‌బ్బులు కావాల్సి వ‌స్తే. ఎవ‌రిస్తారు అని ఎదురు చూసే రోజులు పోయాయి. ఎంచ‌క్కా మీ ట్రాక్ రికార్డు ..మీ సిబిల్ స్కోర్ బాగుంటే చాలు..బ్యాంకులే అక్క‌ర్లేదు..ఎన్నో డిజిట‌ల్ ఫైనాన్షియ‌ల్ కంపెనీలు ఇన్‌స్టంట్ క్యాష్‌ను మీ అకౌంట్లోకి నేరుగా జ‌మ చేస్తున్నాయి. క్యాష్ ఫ్లో అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉన్న‌ది. డిజిట‌ల్ టెక్నాల‌జీ పుణ్య‌మా అంటూ ఇపుడు రుణం పొందడం క‌ష్టం కాదు..చాలా సుల‌భం. కావాల్సింద‌ల్లా క్ర‌మం త‌ప్ప‌కుండా క‌ట్ట‌గ‌లిగితే చాలు ..మీకు తోచిన రీతిలో ..మీరు ఎంచుకున్న వాయిదాల ప‌ద్ధ‌తిలోనే డ‌బ్బులు తీసేసుకోవ‌చ్చు. ఈజీ లోన్స్ పేరుతో ఎన్నో ఎన్ ఎఫ్ బిసి లిస్టెడ్ కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. ఇంట‌ర్నెట్‌లో లోన్స్ ఇస్తామంటూ ఆఫ‌ర్లు కూడా ప్ర‌క‌టించేస్తున్నాయి. బ్యాంకుల‌కు వెళ్లాల్సిన ప‌నిలేదు. ఎవ‌రినీ దేబ‌రించాల్సిన అవ‌స‌రం లేదు. బ్రోక‌ర్ల ఇబ్బంది అంటూ ఉండ‌దు. నేరుగా మీరు..కంపెనీ మాత్ర‌మే ఉంటుంది. కావాల్సింద‌ల్లా మీకు మొబైల్ నంబ‌ర్ క‌లిగి ఉండ‌డం, దాని ద్వారానే పై...

ఎండ‌లే ఎండ‌లు ..జ‌నం గ‌గ్గోలు

చిత్రం
ఎన్న‌డూ లేనంత‌గా ఈసారి ఎండలు దంచి కొడుతుండ‌డంతో జ‌నం బ‌య‌టకు రావాలంటే జంకుతున్నారు. వృద్ధులు , చిన్నారులు, మ‌హిళ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామాన్యుల ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా త‌యారైంది. తాగేందుకు నీళ్లంద‌ని దుస్థితి నెల‌కొంది. జ‌లాశయాలు అన్నీ ఎండి పోయాయి. ప్ర‌ధాన కాలువ‌ల్లో నీళ్లు లేవు. ఇట‌వ‌లే ముఖ్య‌మంత్రి క‌ర్ణాట‌క ప్ర‌భుత్వంతో మాట్లాడి నారాయ‌ణ‌పూర్ నుండి నీళ్లు విడుద‌ల చేయించారు. అవి జూరాల‌కు రావ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది. తాగేందుకు నీళ్లంద‌క ప్ర‌జ‌లు త‌ల్ల‌డిల్లి పోతున్నారు. సాగు నీటికి దిక్కే లేకుండా పోయింది. వ్య‌వ‌సాయం పూర్తిగా ఎండ‌ల దెబ్బ‌కు ఉత్ప‌త్తి గ‌ణ‌నీయంగా ప‌డి పోయింది. రైతులు పొలాల ద‌గ్గ‌ర‌కు వెళ్లాలంటే జంకుతున్నారు. ఒక‌ప్పుడు 20 డిగ్రీలున్న ఎండ శాతం ఇపుడు 41 శాతానికి చేరుకుంది. ఉద‌యం 7 గంట‌ల‌కే ఎండ‌లు స్టార్ట్ అవుతున్నాయి. కేపిటల్ సిటీ హైద‌రాబాద్ నిప్పుల కొలిమిని త‌ల‌పింప చేస్తోంది. తెలంగాణ అంత‌టా ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అవుతోంది. బ‌స్సులు, రైళ్ల‌లో ప్ర‌యాణం చేయాలంటే ప్ర‌జ‌లు భ‌య‌భ్రాంతుల‌కు లోన‌వుతున్నారు. ఫ‌ణి తుపాను త‌ర్వాత ఉష్ణోగ్ర‌త‌లు ...

సంక్షోభంలో ఎయిరిండియా - కొత్త స‌ర్కార్‌పైనే కోటి ఆశ‌లు

చిత్రం
ఎన్నో ఏళ్లుగా విమాన‌యాన రంగంలో విశిష్ట సేవ‌లందిస్తున్న ఎయిరిండియా సంక్షోభం దిశ‌గా సాగుతోంది. 50 వేల కోట్ల‌కు పైగా అప్పులు మిగిలాయి. వీటిని తీర్చేందుకు నానా తంటాలు ప‌డుతోంది. రుణాల వాయిదాలు తీర్చేందుకు డ‌బ్బులు లేని ప‌రిస్థితి నెల‌కొంది. కేంద్రంలో కొలువు తీరే కొత్త ప్ర‌భుత్వ‌మే దీనిని ప‌రిష్క‌రించాలి. అంత వ‌ర‌కు ఆగాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. చాలా విమానాలు ఎగ‌ర‌కుండానే ఉండి పోయాయి. పాత వాటికి మ‌ర‌మ్మ‌తులు చేయాలంటే క‌నీసం ఎయిరిండియాకు త‌క్ష‌ణ‌మే 1500 కోట్ల‌పైనే కావాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే జెట్ ఎయిర్ వేస్ పీక‌ల‌లోతు క‌ష్టాల్లో ఉండి పోయింది. ఈ సంస్థ కార్య‌క‌లాపాలు పూర్తిగా నిలిచి పోయాయి. వేలాది మంది సిబ్బంది, ఉద్యోగులు రోడ్డు పాల‌య్యారు. దీనిని కొనుగోలు చేసేందుకు టాటా అధినేత ర‌త‌న్ టాటా ముందుకు వ‌చ్చినా..ఎందుక‌నో వెనక్కి త‌గ్గారు. ప్ర‌భుత్వ ఆధీనంలో ఎంతో స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తున్న ఎయిరిండియా కోట్లాది రూపాయ‌ల అప్పుల్లోకి చేరింది. రోజుకో గండాన్ని ఎదుర్కొంటోంది ఎయిరిండియా. అప్పుల పాలైన ఈ సంస్థకు ప్ర‌భుత్వ‌మే అడ‌పా ద‌డ‌పా డ‌బ్బులు స‌ర్దుతోంది. ఈసారి ముంద‌స్తు ఎన్నిక‌లు రావ‌డంతో...

క‌థ కంచికి..చెన్నై ఇంటికి ..ఐపీఎల్ ఫైన‌ల్లో ముంబ‌యి

చిత్రం
నిన్న‌టి దాకా ఐపీఎల్ -12 టోర్న‌మెంట్‌లో హాట్ ఫెవ‌రేట్‌గా ఉన్న ఎంఎస్ ధోనీ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది ముంబ‌యి ఇండియ‌న్స్ . ఈ టోర్నీలో అటు బౌలింగ్‌లోను ఇటు బ్యాటింగ్‌లోను ..అన్ని ఫార్మాట్‌ల‌లో రాణిస్తూ అప్ర‌హ‌తిహ‌తంగా విజ‌యాలు సాధిస్తూ రికార్డులు బ్రేక్ చేసిన చెన్నైకి కోలుకోలేని షాక్ ఇచ్చింది ముంబ‌యి. అనూహ్యంగా ఈ జ‌ట్టు చెన్నైకి చుక్క‌లు చూపించింది. చెన్నైలోని స్వంత గ‌డ్డ‌పై చెపాక్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్ ఆద్యంత‌మూ నువ్వా నేనా అన్న రీతిలో సాగింది ఈ మ్యాచ్. ఐపీఎల్ 12వ సీజ‌న్ తొలి క్వాలిఫ‌య‌ర్ మ్యాచ్ సంద‌ర్భంగా ముంబయి ఇండియ‌న్స్ చెన్నైపై ఘ‌న విజ‌యం సాధించింది. అభిమానుల ఆశ‌ల‌ను నీరు గారుస్తూ అన్ని రంగాల‌లో రాణించిన ముంబ‌యి అద్భుత‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించింది. ఫైన‌ల్‌కు చేరింది. గెలుపే ల‌క్ష్యంగా ముంబ‌యి ప‌ట్టుద‌ల‌తో ఆడింది. మొద‌ట బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్లు ముగిసే స‌రికి నాలుగు వికెట్లు కోల్పోయి 131 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన ముంబ‌యి జ‌ట్టు నాలుగు వికెట్లు కోల్పోయి ...

జాక్ పాట్ ద‌క్కించుకున్న ఓలా

చిత్రం
క్యాబ్స్ రంగంలో ఓలా టాప్ పొజిష‌న్‌లో ఉంది. ఇంకేం ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆస‌క్తి చూపిస్తున్నాయి. 3 డిసెంబ‌ర్ 2010లో భ‌విష్ అగ‌ర్వాల్ , అంకిత్ భాటి ఓలా కంపెనీని స్థాపించారు. అప్ప‌టి నుంచి నేటి దాకా ఓలా త‌న బ్రాండ్‌ను విస్త‌రించుకుంటూ వెళుతోంది. వ్యాపార ప‌రంగా సుస్థిర స్థానాన్ని స్వంతం చేసుకుంది. బెంగ‌ళూరు కేంద్రంగా స్టార్ట్ చేసిన స్టార్ట‌ప్ ఇవాళ కోట్ల‌ను కొల్ల‌గొడుతోంది. వెహికిల్ ఫ‌ర్ హైర్ పేరుతో మొద‌ట ప్రారంభ‌మైన ఓలా కంపెనీ ఎన్నో క‌ష్టాల‌ను చ‌విచూసింది. 6,000 వేల మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. 758 కోట్ల రూపాయ‌ల ఆదాయాన్ని గ‌డించింది. ఫుడ్ పాండా ఇండియా, ఓలా ఎల‌క్ట్రిక్ మొబిలిటి ఓలాలో భాగంగా ఉన్నాయి. ఆన్‌లైన్ ట్రాన్స్ పోర్టేష‌న్ నెట్ వ‌ర్క్ కంపెనీని డెవ‌ల‌ప్ చేసింది ఏఎన్ ఐ టెక్నాల‌జీస్ ప్రైవేట్ లిమిటెడ్. మే 2019 వ‌ర‌కు చూస్తే ..ఓలా విలువ ఇపుడు 6.2 బిలియ‌న్ డాల‌ర్లు. ఓలాలో సాఫ్ట్ బ్యాంక్ భారీగా పెట్టుబ‌డులు పెట్టింది. ముంబైలో ప్రారంభ‌మై బెంగ‌ళూరు కేంద్రంగా ఓలా ప‌నిచేస్తోంది. 10, 00, 000 ల‌క్ష‌ల వాహ‌నాలు ఈ సంస్థ పేరుతో దేశంలోని ప్ర‌ధాన ర‌హ‌దారుల‌పై న‌డుస్త...

ఐటీలో బ్లాక్ చెయిన్ దే జోష్

చిత్రం
టెక్నాల‌జీ ప‌రంగా ఎన్నో మార్పులు మ‌రెన్నో చేర్పులు. రోజుకో ప్లాట్ ఫాం త‌యార‌వుతోంది. ఇంటెర్నెట్ ఆధారిత రంగాల‌లో ఐటీ కీల‌క భూమిక‌ను పోషిస్తోంది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్, ఆటోమేష‌న్, రోబో టెక్నాల‌జీతో పాటు బ్లాక్ చెయిన్ టెక్నాల‌జీ ఇపుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఈ టెక్నాల‌జీ సాయంతో ఏమైనా చేయొచ్చు. దీంతో దీనికి విప‌రీత‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. బ్లాక్ చెయిన్ టెక్నాల‌జీలో అనుభ‌వం పొందిన ఎక్స్‌ప‌ర్ట్స్‌కు, సాఫ్ట్ వేర్ రంగానికి చెందిన వారికి ఎన‌లేని డిమాండ్ ఉంటోంది. వివిధ రంగాల‌కు చెందిన కంపెనీలు ముఖ్యంగా ఈ కామ‌ర్స్ దిగ్గ‌జాల‌కు ఈ టెక్నాల‌జీ ఎంత‌గానో ఉప‌యోగ ప‌డుతోంది. ఫైనాన్షియ‌ల్ గా త‌క్కువ ఖ‌ర్చు, ఎక్కువ ఉప‌యోగం క‌లుగుతోంది. స‌ప్లై చెయిన్ మేనేజ్‌మెంట్ సిస్టం ద్వారా ప్రాసెసింగ్ అన్న‌ది వేగంగా జ‌రుగుతుంది. బ్లాక్ చెయిన్ డెవ‌ల‌ప్‌మెంట్ కంపెనీ డేటా బేస్ మీద ప‌నిచేస్తోంది. దీనిని వాడ‌డం వ‌ల్ల ఒక చోటు నుంచి మ‌రో చోటుకు వ‌స్తువుల‌ను చేర‌వేయ‌డం సుల‌భ‌మ‌వుతుంది. కాస్ట్ క‌టింగ్, టైమ్ మేనేజ్‌మెంట్, ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ అన్న‌ది ఇందులో భాగంగా ఉంటోంది. బ్లాక్ చెయిన్ టెక్నాల‌జీని ఉప‌యోగించ‌...