పోస్ట్‌లు

ఫిబ్రవరి 28, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్ర‌పంచ చైత‌న్య‌పు గొంతుక‌..ప్ర‌జా యుద్ధ నౌక - బాబ్ మార్లే ..!

చిత్రం
యుద్ధాన్ని నిర‌సించినవాడు..ప్ర‌జ‌ల‌ను ప్రేమించిన వాడు. గుండెల్లో చైత‌న్య దీప్తుల‌ను వెలిగించిన మ‌హోన్న‌త మాన‌వుడు. బ‌తికింది కొన్నేళ్ల‌యినా కొన్ని త‌రాల పాటు వెంటాడేలా త‌న గాత్రాన్ని జ‌నం కోసం అంకితం చేసిన ధీరోదాత్తుడు బాబ్ మార్లే. మోస్ట్ ఫేవ‌ర‌బుల్ సింగ‌ర్‌గా ..సెర్చ్ ఇంజ‌న్ దిగ్గ‌జం గూగుల్‌లో కోట్లాది ప్ర‌జ‌లు వెతుకుతున్న సాంస్కృతిక యోధుడిగా ఆయ‌న గుర్తుండి పోతాడు. అత‌డి క‌ళ్ల‌ల్లో వేగం..అత‌డి చూపుల్లో ఆర్ద్ర‌త‌..అత‌డి గొంతులో మార్మిక‌త ..అత‌డి న‌డ‌త‌లోని మాన‌వ‌త క‌లిస్తే అత‌డే బాబ్ . ప్ర‌పంచాన్ని త‌న పాట‌ల‌తో ఊపేసిన మొన‌గాడు. శాంతి కోసం పాట‌లు క‌ట్టాడు. ప్ర‌జ‌ల వైపు నిల‌బ‌డ్డాడు. హింస‌కు వ్య‌తిరేకంగా ఎన్నో గీతాలు రాసి ఆలాపించాడు. ఏకంగా తానే ఓ పాట‌ల సైన్యాన్ని త‌యారు చేశాడు. పుట్టుక‌తో జ‌మైక‌న్ అయిన బాబ్..ఇపుడు పాట‌ల పాల‌పుంత‌. చ‌నిపోయి ..భౌతికంగా మ‌న మ‌ధ్య లేక పోవ‌చ్చు గాక‌..కానీ ఆయ‌న సృజియించిన గాత్ర‌పు మాధుర్యం ఇంకా..ఇంకా మోగుతూనే ఉన్న‌ది. రాజ్య హింస‌కు పాల్ప‌డే పాల‌కుల నుండి మార్కెట్ , కార్పొరేట్ శ‌క్తుల కుయుక్తులు, మోసాల‌కు పాల్ప‌డే వారి వెన్నులో తూటాలై పేలుతూనే ఉన్నాయి. చ‌ర...

!..రాచాల నుంచి రాజ‌ధాని దాకా ..!..శీన‌న్న ప్ర‌స్థానం ..!

చిత్రం
పాల‌మూరు జిల్లాలోని రాచాల ప‌ల్లె ఇవాళ గ‌ర్వ ప‌డుతున్న‌ది. ఇదే ప‌ల్లెకు చెందిన వి.శ్రీ‌నివాస్ గౌడ్ ..గ్రూప్ -1 అధికారిగా..ఉద్య‌మ సంఘాల అధినేత‌గా, గౌర‌వ అధ్య‌క్షుడిగా..తెలంగాణ ఉద్య‌మ నేత‌గా ..ఎమ్మెల్యేగా ప్రారంభ‌మైన ప్ర‌స్థానం అమాత్యునిగా ఎదిగేలా చేసింది. ఇదంతా ఒక్క‌రోజులో సాధ్య‌మైనది కాదు. ఎన్నో ఏళ్లుగా క‌ష్ట‌ప‌డి ఒక్కో మెట్టు ఎక్కుతూ..ఉన్న‌త స్థానాన్ని అధిరోహించారు. విద్యావంతుడిగా, మేధావిగా, ఉన్న‌తాధికారిగా , రాజ‌కీయ నేత‌గా ప‌రిణ‌తి సాధించిన గౌడ్ అంచెలంచెలుగా త‌న‌కంటూ ఓ బ్రాండ్ ఇమేజ్‌ను స్వంతం చేసుకున్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ప్ర‌త్యేక రాష్ట్రం కోసం జ‌రిగిన అలుపెరుగ‌ని పోరాటంలో, ఉద్య‌మంలో ఆయ‌న చురుకుగా పాల్గొన్నారు. ఉద్యోగుల‌ను కూడ‌గ‌ట్ట‌డంలో ఆయ‌న కీల‌క భూమిక పోషించారు. 14 ఏళ్లుగా జ‌రిగిన అలుపెరుగ‌ని పోరాటంలో గులాబీ బాస్ కేసీఆర్ వెన్నంటే వున్నారు. మొద‌టిసారి ఏర్ప‌డిన కొత్త రాష్ట్రంలో గౌడ్ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టారు. రెండోసారి జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో అత్య‌ధిక మెజారిటీ సాధించి ర...