పోస్ట్‌లు

సెప్టెంబర్ 24, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

బ్లూ స్మార్ట్ లో దీపికా పదుకొనే పెట్టుబడి

చిత్రం
ఇండియాను స్టార్ట్ అప్స్ ఏలుతున్నాయి. భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. డిఫరెంట్ ఐడియాస్ తో అంకురాలను ఏర్పాటు చేసే వారికి కంపెనీలు, బ్యాంకులే కాదు క్రీడా, సినిమా రంగాలకు చెందిన వారు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. తాజాగా ఎలక్ట్రిక్ ట్యాక్సీ స్టార్ట్ అప్ బ్లూ స్మార్ట్ లో ప్రముఖ నటి దీపికా పదుకొనే మూడు మిలియన్స్ ను పెట్టుబడిగా పెట్టింది. ఈ కంపెనీ ఢిల్లీ , ముంబై, హైదరాబాద్ లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇండియాలోనే అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటిగా దీపికకు పేరుంది. కాగా ఇప్పటి దాకా డ్రమ్స్ ఫుడ్ , బెల్లట్రిక్స్ ఎయిరోస్పెస్, మైంత్ర స్టార్ట్ అప్ లలో ఆమె పెట్టుబడులు పెట్టారు. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలన్న సామెతను ఈ ముద్దుగుమ్మ ఆచరిస్తోంది. సినిమా రంగం అన్నది జూదం లాంటిది. ఎప్పుడు స్టార్ డం ఉంటుందో తెలియదు. అందుకే సంపాదించిన డబ్బులను ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేస్తే మరింత లాభాలు పొందవచ్చని దీపికా పదుకొనే ఆశ. ఆమె ఇన్వెస్ట్ చేసిన ప్రతి స్టార్ట్ అప్ సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. కాగా ఇప్పటికే బ్లూ స్మార్ట్ వ్యాపారం కూడా గాడిలో పడింది. తమ వ్యాపారాన్ని మరింత గా విస్తరించేందుకు...

అత్యంత గౌరవ ప్రదమైన కంపెనీలు మనవే

చిత్రం
అమెరికాకు చెందిన ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలో అత్యంత గౌరవ ప్రదమైన కంపెనీల జాబితాను వెల్లడించింది. ఇందులో మన భారత్ కు చెందిన కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. గతంలో లిస్టులో వెనుకబడిన ఇండియన్ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ ముచ్చటగా మూడో స్థానంలో నిలిచింది. తన సత్తాను చాటింది. అంతే కాకుండా ఈసారి ప్రకటించిన జాబితాలో 16 భారతీయ కంపెనీలకు చోటు దక్కడం విశేషం. గత ఏడాది 2018 లో ఇన్ఫోసిస్ ప్లేస్ 31 ఉండగా.. ఈసారి 3 లో నిలిచి విస్తు పోయేలా చేసింది. ఫోర్బ్స్ మొత్తం 250 కంపెనీలతో జాబితా రూపొందించింది. టీసీఎస్ , టాటా మోటార్స్, హెచ్ డి ఎఫ్ సి సహా ఇతర కంపెనీలు గతంలో కంటే మరింత మెరుగైన రాంక్ లు పొందాయి. ఉన్న వాటిలో టాటా గ్రూప్ కంపెనీస్ కు చెందినవి మూడు కంపెనీలకు చోటు దక్కింది. వరల్డ్ వైడ్ గా చూస్తే సాంకేతికంగా సేవలు అందిస్తున్న వీసా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే కంపెనీ మూడో ప్లేస్ లో ఉండగా ఈసారి ఏకంగా ప్రథమ స్థానానికి ఎగబాకింది. మరో వైపు కిందటి ఏడాదిలో మొదట ఉన్న అమెరికాకు చెందిన వాల్ డిస్ని కంపెనీ ఏకంగా ఏడో ప్లేస్ కు పడి పోయింది. ఇక ఇండియాకు సంబంధించి ఇన్ఫోసిస్ కంపెనీతో పాటు టాటా మోటార్స్ ...

అమితాబ్ కు అరుదైన గౌరవం..అత్యున్నత పురస్కారం..!

చిత్రం
భారత దేశంలో గొప్ప నటుడిగా పేరున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అత్యున్నతమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ను ప్రకటించింది. సినీ ప్రస్థానంలో దీనిని గొప్పగా భావిస్తారు. అమితాబ్ బచ్చన్ ను ఏకగ్రీవంగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్విట్టర్ లో వెల్లడించారు. నటుడిగా, ప్రయోక్తగా, గాయకుడిగా, నిర్మాతగా అమితాబ్ బచ్చన్ ఎక్కని మెట్లు లేవు. ఒకప్పుడు నటనకు పనికి రావంటూ హేళనకు, అవమానాలకు గురైన ఈ అరుదైన వ్యక్తి ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎల్లప్పటికిని గుర్తుంచుకునేలా తనను తాను నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు.  ఎక్కడైతే తనను వద్దన్నారో వాళ్ళే తనతో సినిమాలు తీసే స్థాయికి చేరుకున్నారు. ఏ గొంతు పూర్తిగా పనికే రాదని హేళన చేసిన వాళ్ళు సిగ్గు పడేలా అదే గొంతుతో అలవోకగా, అత్యంత గాంభీర్యంతో కవితలు చదువుతూ ఉంటే కోట్లాది మంది ఫిదా అయి పోయారు. ఆయన నటించిన సినిమాలన్నీ అద్భుతమైన విజయాలు నమోదు చేసుకున్నాయి. బిగ్ బి గా పేరున్న అమితాబ్ చేయని పాత్ర అంటూ లేదు. ఏది ఇచ్చినా దానికి న్యాయం చేశారు. తాజాగా తెలుగులో చిరంజీవితో కలిసి సైరా సినిమాలో కూడా నటించారు. అమ...

ఐటీ హబ్ లో స్టార్ట్ అప్స్ హవా..!

చిత్రం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్ లో ఇన్నోవేటివ్ హబ్ గా ఇప్పటికే పేరొందిన సైబరాబాద్ పలు స్టార్ట్ అప్ లకు వేదికవుతోంది. సరికొత్త ఐడియాస్ , డిఫ్ఫరెంట్ వే లో ఇప్పటికే వందలాదిగా ప్రారంభమయ్యాయి. ఇందులో ఎక్కువగా సక్సెస్ అయితే, మరికొన్ని మధ్యలో ఉన్నాయి. టెక్నాలజీ, హెల్త్, ఇన్నోవేషన్, ఈ కామర్స్, టెలికాం, డిజిటల్ టెక్నాలజీ, ట్రావెల్ టూరిజం తదితర వాటిపై అంకుర సంస్థలు హైదరాబాద్ లో ఏర్పాటు అయ్యాయి. చిన్న గదుల్లో స్టార్ట్ అయిన ఈ స్టార్ట్ అప్స్ ఇప్పుడు కొన్ని వందలాది మందికి ఉపాధి కల్పించే కంపెనీలుగా మారాయి. ఇక్కడ ఏర్పాటైన ప్రభుత్వం మరింత తోడ్పాటు అందిస్తోంది. కొత్త ఐడియాస్ ను ప్రోత్సహించేందుకు గాను ఏకంగా ఐటీ హబ్ ను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా దిగ్గజ కంపెనీల అవసరాలకు అనుగుణంగా కోర్సులు, ట్రైనింగ్ ఇస్తోంది. మెంటార్స్, ట్రైనర్స్, వెంచర్ కేపిటల్ , ఇన్వెస్ట్ మెంట్స్ , కంపెనీస్ సపోర్ట్ అందజేసేలా నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా స్టార్ట్ అప్ ఫండ్ ను ఐటి హబ్ లో ఇటీవలే ఏర్పాటు చేసింది. కొన్ని బడా కంపెనీలు ఎదుగుతున్న అంకుర సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. తాజాగా...

మధురమైన రాత్రులు .. మెత్తనైన వేక్ ఫిట్ పరుపులు

చిత్రం
అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అని పాడుకోవాలన్నా, మనసైన వాళ్ళతో ప్రేమానుభూతులను నెమరు వేసు కోవాలన్నా, రొమాంటిక్ ఫీలింగ్స్ రావాలన్నా, కోరుకున్న కలలు మరింత రిచ్ గా ఉండాలన్నా ఎవ్వరూ లేని, నిశ్శబ్డం అల్లుకున్న ఓ గది ఉండాల్సిందే. అందులో ఆలోచనలు చెదిరి పోకుండా వుండాలంటే మెత్తనైన పరుపులు ఉండాల్సిందే. పడుకుంటే చాలు బాడీ మొత్తం అలసట లేకుండా అయి పోవాలి. అలాంటి పరుపులు, దుప్పట్లు, కుషన్స్, పిల్లోస్ కావాల్సిందే. వీటికి ఉన్నంత డిమాండ్ ఇంకే ఉత్పత్తులకు లేదంటే నమ్మలేం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో పెను మార్పులు చోటు చేసు పోవడం వరల్డ్ వైడ్ గా లెక్కలేనన్ని అవకాశాలు రావడంతో మన వాళ్ళు యువతీ యువకులు, పెద్దలు లక్షాధికారులు అయిపోతున్నారు. దీంతో వాళ్ళ కోరికలు, అభిరుచుల్లో చెప్పలేనంత మార్పులు చోటు చేసుకుంటున్నాయి. స్వంత ఇల్లు, విల్లాస్, ఫ్లాట్స్ అన్నీ తమకు అనుగుణంగా ఉండేలా ఇంటీరియర్ డెకొరేషన్స్ మరింత ఆకర్షణీయంగా ఉండేలా చూసుకుంటున్నారు. అన్నిటికంటే ఎక్కువగా స్లీపింగ్ ఉత్పత్తులకు ఎనలేని డిమాండ్ ఉంటోంది ఇండియన్ మార్కెట్ లో. స్లీప్ వెల్ లాంటి కంపెనీలు మార్కెట్ ను శాసిస్తున్నాయి. కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్న...

ఆస్కార్ బరిలో గల్లీ బాయ్ - జయహో జోయా అక్తర్

చిత్రం
ప్రపంచంలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కోరుకునే కల ఆస్కార్. ఒక్కసారి వస్తే చాలు ప్రపంచమంతటా గుర్తింపు లభిస్తుంది. ఓ అరుదైన ఇమేజ్ తో పాటు బ్రాండ్ ఏర్పడుతుంది. అలాంటి ఆస్కార్ సినీ అవార్డుల కోసం మన దేశం నుంచి గల్లీ బాయ్ సినిమా ఎంపికైంది. 26 మంది కలిగిన ఫిలిం జ్యురీ పలు సినిమాలను పరిశీలించింది. చివరకు రణ్ వీర్ , ఆలియా భట్ కలిసి నటించిన గల్లీ బాయ్ నామినేట్ అయ్యింది. ఈ మూవీని జోయా అక్తర్ తీశారు. ఓ గల్లీలో ఉన్న కుర్రాడు తన సంగీతం, పాటలతో ప్రపంచ విజేతగా ఎలా నిలిచాడో అన్నదే ఈ సినిమా కథ. రితేష్ సిద్వానీ , జోయా అక్తర్ , ఫర్హాన్ అక్తర్ లు నిర్మించారు. మొత్తం సినిమాకు 84 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సినిమా విడుదలయ్యాక దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఏకంగా 238 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియన్ సినిమాలో ఓ మహిళ తీసిన ఈ మూవీ వసూళ్ళలో రికార్డ్ సృష్టించింది. విజయ్ మయూర దీనికి కథను సమకూర్చాడు. రణ్వీర్ ,ఆలియా తో పాటు సిద్దాంత్ చతుర్వేది అద్భుతంగా నటించారు..మెప్పించారు. సినిమాటోగ్రఫీ జె ఓజా అందించారు. ఎక్సెల్ ఎంటర్ టైన్మెంట్ , టైగర్ బేబీ ప్రొడక్షన్స్ ద్వారా గల్లీ బాయ్ ని రిలీజ్ చేసింది. ఏయే ఫిల...