పోస్ట్‌లు

జులై 4, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

వ్య‌వ‌సాయానికి కేంద్రం సాయం

చిత్రం
రెండు నెల‌లు గ‌డిచినా వ‌రుణ దేవుడు క‌రుణించ‌డం లేదు. ఒక్క ముంబ‌యిని మాత్ర‌మే క‌రుణించ‌గా మిగ‌తా ప్రాంతాల్లో ఒక్క నీటి చుక్క ప‌డ‌లేదు. భూముల‌ను న‌మ్ముకుని వాన‌ల కోసం ఎదురు చూస్తున్న కోట్లాది రైతుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. క‌నీసం తాగేందుకు సైతం నీరు దొర‌క‌ని ప‌రిస్థితి దాపురించింది. ఓ వైపు ఎక్కువ శాతం నీళ్లు స‌ముద్రం పాల‌వుతున్నా వాటిని ఒడిసి ప‌ట్టుకునే సాంకేతిక నైపుణ్యాన్ని ఇన్నేళ్ల‌యినా ఏ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన పాపాన పోలేదు. చెరువులు, కుంట‌లు బోసిపోయిన‌వి. వాన‌మ్మ జాడ లేదు. గ‌త ఏడాది కొంత మేర‌కు రుతు ప‌వ‌నాలు ముందుగానే వీచినా కాస్తో కూస్తో తాగు, సాగు నీటికి ఇబ్బంది లేకుండా పోయింది. కానీ ఈసారి పూర్తిగా ప‌రిస్థితి అందుకు భిన్నంగా వుంది. క‌నీసం ఒక్క టీఎంసీ నీళ్లు కూడా ఆయా ప్రాజెక్టుల్లోకి రాలేదు. ఇక సాగు మాట దేవుడెరుగు..తాగేందుకు ఎట్లా అన్న‌ది జ‌నాన్ని తొలుస్తున్న‌ది. రోజు రోజుకు జ‌నాభా పెరుగుతూ పోతుండ‌గా దానిని కంట్రోల్ చేయ‌లేక ప్రభుత్వం నానా తంటాలు ప‌డుతున్న‌ది. అక్క‌డ‌క్క‌డ చెదురు మ‌దురుగా కురిసిన తొల‌క‌రి వ‌ర్షాల‌కు రైతులు గ‌త్యంత‌రం లేక పొలాల‌ను దుక్కి దున్ని చ‌దును చేసి ప...

కాంగ్రెస్‌కు కాయ‌క‌ల్ప చికిత్స - ప్ర‌త్యక్ష పోరుకు రాహుల్ సిద్ధం

చిత్రం
ప‌రిణ‌తి చెందిన నాయ‌కుడిగా రాహుల్ గాంధీ త‌న‌ను తాను మ‌లుచుకున్నారు. హుందాగా పార్టీలో ఏం జ‌రుగుతుందో పూస‌గుచ్చిన‌ట్టు చెప్పారు. వ‌య‌సు మ‌ళ్లిన వారు ప‌ద‌వుల‌ను, అధికారాన్ని అంటిపెట్టుకుని వుంటే పార్టీ మ‌నుగడ ఎలా సాధ్య‌మ‌వుతుంద‌ని రాహుల్‌జీ ప్ర‌శ్నించారు. దేశాన్ని సంస్క‌రించ‌డం కంటే పార్టీని ప్ర‌క్షాళ‌న చేయ‌డ‌మే ముఖ్య‌మని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీనే పార్టీకి అధ్య‌క్షుడిగా వుండాల‌ని ఒత్తిళ్లు పెరిగినా ఆయ‌న స‌సేమిరా ఒప్పుకోలేదు. కింది స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి దాకా ఘ‌న‌మైన పార్టీ కేడ‌ర్ క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ ఎందుకు ప‌వ‌ర్‌లోకి రాలేక పోయామ‌ని , ప్ర‌తి ఒక్క‌రు పున‌రాలోచించు కోవాల‌ని సూచించారు. పార్టీ అంటే స‌మూహం, ఏ ఒక్క‌రితోనో అది న‌డ‌వ‌దు. వంద‌లాది చేతులు క‌లిస్తేనే అనుకున్న‌ది సాధించ‌గ‌లం. పార్టీని న‌డిపించ‌డం కంటే ముందు మ‌నం ఎక్క‌డ దారి త‌ప్పామో స‌మీక్షించు కోవాలి. అందుకు ప్ర‌త్యామ్నాయ మార్గాలు ఏవైనా ఉన్నాయా అనేది ఆలోచించు కోవాలి. పొద్ద‌స్త‌మానం ప్ర‌తిప‌క్షాల‌నో లేక వ్య‌క్తుల‌నో టార్గెట్ చేస్తూ కాలం గ‌డ‌ప‌డం మ‌న‌కు అలవాటుగా మారి పోయింది. అధికారంలో ఉన్న పార్టీ...