పోస్ట్‌లు

నవంబర్ 21, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

జార్జి రెడ్డి జీవితం ఎందరికో ఆదర్శం

చిత్రం
జార్జిరెడ్డి నేటి తరానికి ఆదర్శమని, ఆయన సినిమాను అడ్డుకుంటే సహించేది లేదని అభిమానులు హెచ్చరిస్తున్నారు. కొన్ని అరాచక శక్తులు సినిమాను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని, దాన్ని విరమించు కోవాలన్నారు. లేని పక్షంలో ఊరుకోబోమని హెచ్చరించింది ఇండియన్‌ నేషనల్‌ యువజన పార్టీ. ఇదిలా ఉండగా చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్న జార్జిరెడ్డి జీవితం, నేటి యువతకు స్ఫూర్తి దాయకమని జార్జిరెడ్డి చిత్ర దర్శకుడు జీవన్‌రెడ్డి అన్నారు. సినిమా విడుదల సందర్భంగా నారాయణగూడలోని క్రైస్తవ స్మశాన వాటికలో జార్జిరెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. నీతి, నిజాయితీ గల జార్జి రెడ్డి రేపు మళ్లీ పుట్టబోతున్నాడని, ఆయన జీవితం అందరికి ఆదర్శ ప్రాయంగా ఉంటుందన్నారు. జార్జి రెడ్డి చిత్రం విడుదల తర్వాతే ఎవరికైనా తాను సమాధానం చెబుతానని దర్శకుడు స్పష్టం చేశారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించలేదని, ఆయన నీతి, నిజాయితీ, నాయకత్వ లక్షణాలు తనను ఎంతో ఆకట్టు కున్నాయని, రెండేళ్ల పాటు జార్జిరెడ్డి జీవితాన్ని అధ్యయనం చేశాక సినిమాగా చేశామని చెప్పారు. 25 ఏళ్లకే ఓ విద్యార్థి నాయకుడిగా ఎదిగి న...

స్పందించని సీఎం..ఆందోళనలో కార్మిక లోకం

చిత్రం
ఆర్టీసీ సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. హైకోర్టు సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటించ లేదు. సీఎం కేసీఆర్‌ నిర్ణయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తమకు అనుకూలంగా సీఎం నిర్ణయం తీసుకుంటారా, లేక ప్రభుత్వ నిర్ణయానికే కట్టుబడి ఉంటారా అనేది ఆసక్తి కరంగా మారింది. రెండు నెలలుగా వేతనాలు లేకుండా సమ్మెలో కొన సాగుతున్న కార్మికులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని జేఏసీ ప్రతిపాదించింది. దీంతో విధుల్లో చేరతామంటూ రాష్ట్రంలోని వివిధ డిపోలకు కార్మికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అన్ని చోట్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఎవరినీ విధుల్లోకి తీసుకోవద్దని, విధుల్లో చేరేందుకు సిద్ధమంటూ లేఖలు ఇచ్చినా కూడా తీసుకోవద్దని డిపో మ...

నిత్యానంద కోసం ఖాకీల వేట

చిత్రం
పలు లైంగిక ఆరోపణలు ఎదుర్కుంటున్న, వివాదాస్పద స్వామీజీగా పేరొందిన బిడిది ధ్యాన పీఠాధిపతి నిత్యానంద  ఆచూకీ లభించడం లేదు. ఆయనను పట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ముందస్తుగానే అరెస్టు చేస్తారనే విషయం తెలుసుకున్న నిత్యానంద ఆశ్రమంలో లేకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. నిత్యానందకు లెక్కలేనంత మంది భక్తులు ఉన్నారు. ఆయన ప్రధాన ఆశ్రమం బెంగళూర్ లోని బిడిదిలో ఉంది. ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నాయి. నిత్యానంద జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అయినా ఇంకా ఆరోపణలు వెంటాడుతూనే ఉన్నాయి.  లైంగిక వేధింపులు, పలు వివాదాస్పద కేసులు ఎదుర్కొంటున్న నిత్యానంద ఏడాదిన్నరగా బిడది ధ్యాన పీఠానికి రావడం లేదు. స్వామీజీ కోసం ధ్యాన పీఠంలో వాకబు చేయగా ఆయన ఉత్తర భారత పర్యటనలో ఉన్నట్లు చెబుతున్నారు. గుజరాత్‌లోనూ నిత్యానందకు మఠం ఉండడంతో అక్కడకి వెళ్లి ఉండ వచ్చునని భావిస్తున్నారు. నకిలీ పాస్‌పోర్టు ఉపయోగించి నిత్యానంద ఆస్ట్రేలియా దగ్గర్లోని ద్వీపానికి వెళ్లినట్లు వార్తలొచ్చాయి. కాగా అహ్మదాబాద్‌లోని నిత్యానంద ఆశ్రమంలో నిర్భంధించిన తన ఇరువురు కుమార్తెలను విడిపించాలని ఓ తల్లిదండ్రులు గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించిన ...

మోదీతో లంక మైత్రీ బంధం

చిత్రం
దౌత్య సంబంధాలు మెరుగు పరుచు కోవడంలో నరేంద్ర మోదీ తర్వాతే ఎవ్వరైనా. ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీలంక ప్రధాన మంత్రి రాజపక్స కొడుకు, ఎంపీ నమల్ రాజపక్స కామెంట్స్ తో స్పష్టమైంది. ఇతర దేశాలతో స్నేహాన్ని కొనసాగించే అలవాటు ఎక్కువగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కు ఉందని కొనియాడారు ఈ యువ ఎంపీ. సరిహద్దు దేశాలతో సఖ్యతగా మెలిగేందుకు ఏమాత్రం వెనుకాడబోరన్న విషయం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. శ్రీలంక తాజా అధ్యక్ష ఎన్నికల్లో గోటబయ రాజపక్స గెలుపొందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తన సోదరుడు మహిందా రాజపక్సను ప్రధానిగా ఆయన ఎంపిక చేశారు. మహిందాకు చైనాతో సత్సంబంధాలే ఉన్నాయి. ఆయన హయాంలో రక్షణ మంత్రిగా పనిచేసిన ప్రస్తుత అధ్యక్షుడు గోటబయ ఎల్టీటీఈ ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణిచి వేయడం, భారత్‌కు కనీసం సమాచారం ఇవ్వకుండానే చైనాకు చెందిన జలాంతర్గాముల్ని హిందూ సముద్ర జలాల్లోకి అనుమతినివ్వడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గోటబయ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అంశం ప్రస్తుతం చర్చ నీయాంశంగా మారింది. అంతేగాక ఇటీవలి ఎన్నికల్లో శ్రీలంకలో మైనార్టీలుగా...

ప్రగ్యా ఎంపికపై కాంగ్రెస్ ఫైర్

చిత్రం
రక్షణ రంగంపై ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్‌లో వివాదాస్పద భోపాల్‌ ఎంపీ ప్రగ్యాసింగ్‌ ఠాకూర్‌ను సభ్యురాలిగా చేర్చడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం​ వ్యక్తం చేసింది. ఉగ్రవాద కేసులో నిందితురాలు, మహాత్మాగాంధీని చంపిన నాథురాం గాడ్సే ఆరాధకురాలైన ప్రగ్యా సింగ్‌ను డిఫెన్స్‌ పార్లమెంటురీ ప్యానెల్‌లో చేర్చడం ద్వారా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు దేశాన్ని అవమానించిందని కాంగ్రెస్‌ విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టింది. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో రక్షణ రంగంపై ఏర్పాటైన పార్లమెంటరీ కన్సల్టేటివ్‌ కమిటీలో మొత్తం 21  మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటీలో మహారాష్ట్ర మాలెగావ్‌ పేలుళ్ల కేసు నిందితురాలైన బీజేపీ ఎంపీ ప్రగ్యాసింగ్‌ కూడా సభ్యురాలుగా ఉన్నారు. ఈ చర్యను తప్పుబడుతూ కాంగ్రెస్‌ పార్టీ ట్విటర్‌లో విమర్శలు గుప్పించింది. డిఫెన్స్‌ పార్లమెంటరీ ప్యానెల్‌లో సభ్యురాలిగా ప్రగ్యా సింగ్‌ను బీజేపీ సర్కార్‌ నామినేట్‌ చేయడం దేశ భద్రతా బలగాలను, దేశ పౌరులను అవమానించడమే అని ట్వీట్‌ చేసింది. సచ్ఛీలత, నిజాయితీ గల నేతలను నియమించడానికి బదులు ఇలాంటి వారిని నియమించడం విడ్డూరమని ఎద్దేవ...

జేఏసీ నిర్ణయం..కార్మికుల ఆగ్రహం

చిత్రం
నిన్నటి దాకా హీరోగా వెలుగొందిన ఆర్టీసీ జేఏసీ  కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎక్కువ రోజులు సమ్మె చేసిన చరిత్ర కార్మికులది. ప్రభుత్వంతో ఎలాంటి హామీలు లేకుండానే అర్ధాంతరంగా సమ్మెను విరమిస్తున్నట్లు జేఏసీ ఎలా ప్రకటిస్తుందని పలువురు కార్మికులు ప్రశ్నిస్తున్నారు. సమ్మె విరమణ విషయంలో కార్మిక సంఘాల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్టు కనిపిస్తోంది. షరతులు లేకుండా విధుల్లోకి తీసుకుంటే, సమ్మె విరమించేందుకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, జేఏసీ ప్రకటనపై టీజేఎంయూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమించినా, జేఏసీ-1 సమ్మె విరమించేది లేదని టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి హనుమంతు తెలిపారు. సమ్మెలో ఇప్పటి వరకు 29 మంది ఆర్టీసీ కార్మికులు మరణించారని చెప్పారు. మరణించిన కుటుంబాలను ఎవరూ ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు సమ్మెలో భాగంగా రాష్ట్రంలోని పలు డిపోల పరిధిలో కార్మికులపై కేసులు కూడా నమోదయ్యాయని, వాటిపై ఏం మాట్లాడకుండా సమ్మె విరమిస్తున్నామని జేఏసీ చెప్పడం కార్మికులను మోసం చేయడమేనని మండి పడ్...

స్త్రీల పాలిట దేవత డాక్టర్ శిల్పి రెడ్డి

చిత్రం
ఈ కాలంలో ఆరోగ్యం, వైద్యం అన్నది ప్రతి ఒక్కరికి అవసరంగా మారింది. ఈ తరుణంలో కుటుంబంలో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని, ఎన్నో శారీరక, మానసిక వత్తిళ్ళను తట్టుకుని నెట్టుకొస్తున్న మహిళలకు తన వైద్య చికిత్సలతో స్వాంతన చేకూరుస్తున్నారు డాక్టర్ శిల్పి రెడ్డి. హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రముఖమైన డాక్టర్లలో ఆమె కూడా ఒకరు. మహిళలు నిత్యం ఎదుర్కునే సమస్యలకు ఆమె మెరుగైన, మేలైన వైద్యాన్ని అందజేస్తున్నారు. వారిలో మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపుతున్నారు. ప్రత్యేకించి డాక్టర్ గా ఎన్నో ప్రత్యేకతలు, అపారమైన అనుభవం కలిగిన శిల్పి రెడ్డి స్త్రీ వైద్య నిపుణురాలిగా రాణించారు. అంతే కాకుండా వైద్య పరంగా ఎన్నో మార్పులు తీసుకు వచ్చేలా కృషి చేశారు. ఈ సిటీలో మోస్ట్ వాంటెడ్ డాక్టర్ గా వినుతికెక్కారు. సీనియర్ కన్సల్టెంట్ గా పలు పేరొందిన ఆసుపత్రుల్లో సేవలు అందించారు. ఉన్నతమైన పదవులు చేపట్టారు. ప్రస్తుతం డాక్టర్ శిల్పి రెడ్డి కిమ్స్ హాస్పిటల్ లో కీలకమైన గైనకాలజి విభాగానికి హెచ్ఓడిగా ఉన్నారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేర్, మినిమల్ ఇన్వాసివ్ సర్జన్ గా సేవలు అందజేస్తున్నారు. గర్భిణీలకు ఆమె అందిస్తున్న వైద్యం ఓ వరంగా మారింది. ...