పోస్ట్‌లు

జులై 22, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ప‌క్కా లోక‌ల్..భారీగా రిక్రూట్‌మెంట్..ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం..!

చిత్రం
సందింటి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత భారీ నిర్ణ‌యానికి శ్రీ‌కారం చుట్టారు. దేశంలో ఏ సీఎం తీసుకోని నిర్ణ‌యాన్ని ఆయ‌న ప్ర‌క‌టించారు. త‌మ రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ల‌క్ష‌లాది మంది నిరుద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పారు. ఏకంగా ఒక‌టి కాదు వంద‌లు కాదు..4 ల‌క్ష‌ల పోస్టుల‌ను త్వ‌ర‌లోనే భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు సీఎం వెల్ల‌డించారు. ఇందులో 75 శాతం స్థానికుల‌కే ఉద్యోగాలు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. ప‌రిశ్ర‌మ‌ల్లో కూడా వారికే ప్రాధాన్య‌త ఇస్తామ‌న్నారు. బీసీలు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీల‌కు ప‌ద‌వులతో పాటు పనుల్లో 50 శాతం కోటాను అమ‌లు చేస్తామ‌న్నారు. వీటిలో స‌గానికి పైగా మ‌హిళ‌లే ఉంటార‌న్నారు. కౌలు దారు ఇక సాగుదారుగా మార్చేస్తామ‌ని, శాశ్వ‌త బిసి క‌మిష‌న్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. విధాన‌స‌భ‌లో ఆరు ప్ర‌ధానమైన బిల్లులు పాస్ చేశారు. ఈ మేర‌కు ఏపీలో నామినేటెడ్ ప‌ద‌వులు, నామినేష‌న్ ప‌నుల్లో ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్లు, మొత్తం మీద మ‌హిళ‌ల‌కు మ‌రో 50 శాతం రిజ‌ర్వేష‌న్లు వ‌ర్తింప చేసే నాలుగు వేర్వేరు బిల్ల...

క‌న్న‌డ నాట క‌థ మారింది..ఉత్కంఠ‌నే మిగిలింది..!

చిత్రం
దేశం ఓ వైపు చంద్రయాన్ -2 స‌క్సెస్‌తో సంబురాల్లో మునిగి పోతే..క‌ర్నాట‌క‌లో రాజ‌కీయం మ‌రింత హీటెక్కింది. రోజు రోజుకు ట్విస్టులు..వ్యూహాలు..ప్ర‌తివ్యూహాలు..ఎత్తులు..పై ఎత్తులు..రాజీనామాలు..డ్రామాలు..నిర‌స‌న‌లు..ఒక‌రిపై మ‌రొక‌రు దుమ్మెత్తి పోసుకోవ‌డాలు..ఆరోప‌ణ‌లు..విమ‌ర్శ‌లు..వెర‌సి ఆద్యంతమూ వేడిని పుట్టిస్తూ..ఏం జ‌రుగుతుందోన‌నే ఆందోళ‌న క‌లిగించే రీతిలో సంకీర్ణ అధికార ప‌క్షం..విప‌క్షం వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చాయి. దీంతో బంతి ఓ వైపు క‌ర్నాట‌క గ‌వ‌ర్న‌ర్ కోర్టులో చేరితో మ‌రో బంతి స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం కోర్టులోకి చేరింది. గ‌త కొన్ని రోజులుగా ఎడ‌తెగ‌ని ఉత్కంఠ‌ను రేపుతున్న క‌న్న‌డ రాజ‌కీయం మాత్రం దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తీసిన సినిమాల‌ను త‌ల‌పింప చేస్తున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్‌ల ఆధ్వ‌ర్యంలో సంకీర్ణ ప్ర‌భుత్వం నుంచి కొంద‌రు ఎమ్మెల్యేలు రాజీనామా స‌మ‌ర్పించ‌డంతో మొద‌లైన ఈ రాజ‌కీయ ఆట ..చివ‌ర‌కు ఎవ‌రు ఉంటారు..ఎవ‌రికి ప‌వ‌ర్ ద‌క్కుతుంద‌నే టెన్ష‌న్‌కు గురి చేశాయి. రెబల్స్ ముంబ‌యిలోని హోట‌ల్‌లో బ‌స చేయ‌డం, త‌మ రాజీనామాల‌ను ఆమోదించ‌డం లేదంటూ సుప్రీంకోర్టు మెట్లు ఎక్క‌డం, దీనిపై త‌మ‌కు ఎలా...

ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ - హీనా సింధు రికార్డు బ్రేక్

చిత్రం
శాస్త్ర‌, సాంకేతిక రంగంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను క‌లిగి ఉన్న ఇస్రో సైంటిస్టులు చంద్రుని వ‌ద్ద‌కు చంద్ర‌యాన్-2 ను విజ‌య‌వంతంగా పంపించ‌డంతో దేశ‌మంత‌టా సంతోషం వ్య‌క్త‌మ‌వుతున్న త‌రుణంలో..ఉన్నట్టుండి మ‌రో రికార్డును స్వంతం చేసుకుంది ఇండియా. అదేమిటంటే ప్ర‌పంచంలోనే పిస్ట‌ల్ షూట‌ర్స్ పోటీల్లో ఏకంగా మ‌న ఇండియాకు చెందిన హీనా సింధు టాప్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచి చ‌రిత్ర‌ను తిర‌గ రాసింది. దీంతో భార‌త జాతి యావ‌త్తు సైంటిస్టుల‌కు , మొక్క‌వోని ఆత్మ‌విశ్వాసంతో ప‌ట్టుద‌ల‌తో దేశం పేరు నిల‌బెట్టిన హీనా సింధుతో పాటు ప‌రుగు పందెంలో చిరుత‌పులిలా గోల్డ్ మెడ‌ల్ సాధించిన 19 ఏళ్ల సింధుల‌కు జేజేలు ప‌లికింది. భార‌త రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింది, దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, సోనియా, రాహుల్‌, ప్రియాంక‌, త‌దిత‌రులు ఎంద‌రో ప్రశంస‌లు కురిపిస్తున్నారు. పిస్ట‌ల్ షూట‌ర్స్ అనేది చాలా క‌ష్ట‌మైన ఆట‌. దీనిపై ఎక్కువ‌గా గురి పెట్టాల్సి ఉంటుంది. కానీ వీట‌న్నింటిని త‌ట్టుకుని ముందుకు దూసుకు వెళ్లింది మ‌న హీనా సింధు. బిడీఎస్ చ‌దివిన ఈమె ఎన్నో క‌ష్టాల‌ను అనుభ‌వించింది. పంజాబ్ రాష్ట...

మాట‌లే క‌దా మ‌న‌సు దోచేది..మాట‌లే క‌దా గుండెల్ని మీటేది..త్రివిక్రం పంచ్‌లు..!

చిత్రం
తెలుగు సినిమా రంగంలో త‌న‌కంటూ ఓ స్టార్ డ‌మ్‌ను ఏర్పాటు చేసుకున్న ఒకే ఒక్క ద‌ర్శ‌కుడు త్రివిక్రం శ్రీ‌నివాస్. ర‌చ‌యితగా ప్ర‌స్థానం ప్రారంభించి దిగ్గ‌జ డైరెక్ట‌ర్‌గా ఎదిగిన ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. మ‌న‌సు బావో లేన‌ప్పుడు..గుండె మండుతున్న‌ప్పుడు..బ‌తుకు దుర్భ‌రమ‌ని అనిపించిన‌ప్పుడు..ఆయ‌న రాసిన మాట‌లు ..డైలాగ్స్ కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తాయి. వాట‌న్నింటిని ఏరికోర్చి ఇక్క‌డ మీకోసం.నాకోసం కూడా..త్రివిక్రం క‌లం ఇంకా రాటు దేలాలి. మ‌రికొన్ని మాట‌ల‌తో మంట‌లు రేపాలి. హృద‌యాలు తేలిక అయ్యేలా చేయాలి. సినీవాలిని ప‌రిపుష్టం చేయాలి. 1) సినిమా ఎందుకు గొప్పది అంటే,మందు కొట్టి పడిపోడం కంటే,డ్రగ్స్ లో మునిగి తేలడం కంటే,రోడ్డు చివర కూర్చుని అమ్మాయిలని ఏడిపించడం కంటే, థియేటర్ లో కూర్చుని ఒక హీరోని చూసిఇన్‌స్పైర్ అవ్వడం మంచిది. కచ్చితంగా మంచిది. 2) నాన్న కృతజ్ఞత కొరుకోడు ,, బ్రతికినంత కాలం నాన్నని ఒక జ్ఞాపకంలా గుర్తుంచుకుందాం ! 3) రావణుడికి పది తలకాయలు ఉండొచ్చు , వాడి కోటకు లంకిణి కాపలా ఉండొచ్చు , అశోక వనానికి అడ్రస్ తెలియకపోవచ్చు కానీ అవన్నీ దాటడానికి ఒక ఆంజనేయుడు ఎప్పుడైనా రావచ్చ...

నింగికేగిన చంద్ర‌యాన్-2 ..సైంటిస్టులకు స‌లాం..!

చిత్రం
శాస్త్ర‌, సాంకేతిక రంగంలో నూత‌న అధ్యాయం మొద‌లైంది. భార‌తదేశ సైంటిస్టులు మ‌రో ఘ‌న‌త‌ను సాధించారు. ఇప్ప‌టికే శాటిలైట్ వ్య‌వ‌స్థ‌లో ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న వీరు ..త‌మ ప్ర‌తిభా పాట‌వాల‌కు మ‌రింత ప‌దును పెట్టి..స‌క్సెస్ అయ్యారు. లేట్ అయినా లేటెస్ట్‌గా కేవ‌లం ఒకే ఒక్క నిమిషంలో చంద్రయాన్ -2ను విజ‌య‌వంతంగా ప్ర‌యోగించారు. ప్ర‌పంచం విస్తుపోయేలా సాధించారు. త‌మ‌కు ఎదురు లేదంటూ చాటి చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో నెల‌వై వున్న స‌తీష్ ధావ‌న్ అంత‌రిక్ష ప‌రిశోధ‌న కేంద్రంలోని రెండ‌వ లాంఛింగ్ స్టేష‌న్ నుంచి దీనిని స‌క్సెస్‌ఫుల్‌గా ప్ర‌యోగించారు. ఎప్పుడెప్పుడా అని జాతి యావ‌త్తు ఎదురు చూసిన క్ష‌ణాలు వాస్త‌వ‌మ‌య్యేలా చేశారు మ‌న సైంటిస్టులు. సార్ నుంచి జిఎస్ఎల్‌వి మార్క్ 3ఎం1 రాకెట్ ద్వారా చంద్ర‌యాన్ -2 రివ్వుమంటూ నింగిలోని చంద‌మామ‌ను ప‌ల‌క‌రించేందుకు దూసుకెళ్లింది. సాంకేతిక లోపం త‌లెత్త‌డంతో కొన్ని రోజులు ఆల‌స్యమైంది. నిమిషం అటు ఇటు కాకుండా క‌రెక్టు టైంకు దీనిని ప్ర‌యోగించ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వంద‌లాది మంది సైంటిస్టులు, ప్రొఫెష‌న‌ల్స్, వివిధ రంగాల‌కు చెందిన ప‌ర్స‌నా...