పోస్ట్‌లు

సెప్టెంబర్ 22, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

సమున్నత భారతం..విస్తు పోయిన ప్రపంచం..!

చిత్రం
నరేంద్ర దామోదర దాస్ మోదీ పేరు మరోసారి ప్రపంచమంతటా మార్మోగి పోయింది. సమున్నత భారతావని తల ఎత్తుకునేలా భారత ప్రధానికి అపూర్వమైన రీతిలో స్వాగతం లభించింది. హ్యూస్టన్‌ వేదికగా జరిగిన కార్యక్రమంలో మోదీతో పాటు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పాల్గొన్నారు. దాదాపు 50 వేల మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు. మొదటి నుంచి సభ ముగిసే దాకా చప్పట్లతో దద్దరిల్లి పోయింది. ఇండియన్స్ ఉత్సాహాన్ని చూసిన అమెరికా ప్రెసిడెంట్ చెప్పలేని సంతోషానికి లోనయ్యారు. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలు ఒకే వేదికపైకి రావడం అపూర్వమనే చెప్పు కోవాలి. సమస్త మానవాళికి పెను ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదం అంతు చూసేందుకు ఇరు దేశాలు కలిసి కట్టుగా పోరాడుతాయని స్పష్టం చేశారు. మోదీ ప్రసంగిస్తున్నంత సేపు సభికులు హర్షద్వానాలు చేస్తూనే ఉన్నారు. అడుగడుగునా మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి భావోద్వేగంతో ప్రసంగించారు. మీరందరినీ ఇలా కలుసు కోవడం ఆనందంగా ఉన్నది. హౌడీ మోదీ అంటూ మీరు కార్యక్రమం ఏర్పాటు చేశారు. కానీ నేను ఒక్కడినే ఏమీ చేయలేను. 130 కోట్ల ప్రజలు ఆదేశాల మేరకు నడుచుకునే అత్యంత సామాన్యుడిని. మీరు నన...

ఆదిత్య అదుర్స్ .. ఓయో సూపర్

చిత్రం
రితీష్ అగర్వాల్ ఏ ముహూర్తంలో ఓయోను స్టార్ట్ చేశాడో కానీ పట్టిందల్లా బంగారమే అవుతోంది. ప్రపంచ ఆతిథ్య రంగాన్ని ఓయో శాసిస్తోంది. అమెరికా, చైనా, ఇలా ప్రతి దేశంలో ఓయో తన హవాను కొనసాగిస్తోంది. రూములు అద్దెకు ఇవ్వడంతో ప్రారంభమైన ఈ కంపెనీ ఇప్పుడు డాలర్లను కొల్లగొడుతోంది. ఇండియాతో ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వే చైనాలో సైతం రితీష్ అగర్వాల్ సక్సెస్ అయ్యాడు. ఇండియాకు ఉన్న పవర్ ఏమిటో చెప్పాడు. అంతేనా దిగ్గజ హోటల్స్ కు ముచ్చెమటలు పట్టిస్తూ రోజుకో నిర్ణయంతో తన ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటూ వెళుతున్నాడు. ప్రపంచంలోనే ఆతిథ్య రంగంలో 30 శాతానికి పైగా ఓయో వాటాను పెంచుకునేలా చేశాడు. కాలేజీ మానేసిన ఈ కుర్రాడు. హోటల్స్ లో బుకింగ్ కోసం 2012 లో ఓ వెబ్ సైట్ తాయారు చేశాడు. 2013 లో థాయి ఇంటర్నేషనల్ ఫెలోషిప్ సాధించాడు. ఇండియా నుంచి ఫెలోషిప్ అందుకున్న మొదటి వ్యక్తి ఇతడే. వెబ్సైట్ పేరును ఓరావెల్ గా మార్పు చేశాడు. పేరు పలకడం ఇబ్బందిగా ఉంటుందని అనుకున్న రితేష్ దానిని ఓయో గా మార్చేశాడు. ఆనాడు చిన్న గదిలో స్టార్ట్  అయిన ఈ స్టార్ట్ అప్ ఇప్పుడు వేలాది కోట్ల రూపాయలను సాధించే కంపెనీగా ఎదిగింది. 2014 లో ఓయోకు పెట్టుబడుల...

లక్షల పెట్టుబడి కోట్లల్లో రాబడి

చిత్రం
సినిమా అన్నది అదో జూదం లాంటిదేనన్న నానుడి తప్పు అని నిరూపించింది ఓ చిన్న సినిమా. చాప కింద నీరులా అది సాధించిన సక్సెస్..ఇదే రంగంలో కొన్నేళ్లుగా గెలుపు కోసం ఎదురు చూస్తున్న వేలాది మందికి కనువిప్పు కావాలి. సంజనా రెడ్డి ఈ పేరు ఎక్కువగా ఎప్పుడూ ఎక్కడా వినిపించలేదు. కానీ ఒకే ఒక్క సినిమా ఆమెను సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ జాబితాలో చేరేలా చేసింది. ఆమె దర్శకత్వం వహించిన సినిమా రాజు గాడు. రాజ్ తరుణ్, అమైరా దస్తూర్, రాజేంద్ర ప్రసాద్ తారాగణంతో ఈ మూవీని రిలీజ్ చేశారు. సుంకర రామబ్రహ్మం నిర్మించారు. గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఇందులోని ఒకే ఒక్క పాట మోస్ట్ పాపులర్ సాంగ్ గా ఆల్ టైమ్ సాంగ్స్ లలో టాప్ రేంజ్ లో నిలిచింది. ఆ పాటను రామజోగయ్య శాంత్రి రాస్తే హేమచంద్ర పాడారు. చాలా ఈజీగా లలితమైన పదాలను ఇందులో వాడారు. అంతే అలవోకగా ఆలపించారు సింగర్. రబ్బరు బుగ్గల రామ్ చిలక రయ్యంటూ కాదనకా అంటూ సాగిన ఈ సాంగ్ ను ఏకంగా 5 లక్షల మంది చూశారు. ట్యూన్ క్యాచీగా ఆకట్టుకునేలా ఉండటంతో పాటు యూత్ ను బాగా కనెక్ట్ అయ్యేలా తీయడంతో మరింత పాపులర్ అయ్యింది. ఒక రకంగా చెప్పాలంటే ఇదో సంచలన విజయమని చెప్పాలి. నిర్మాత సంజనా...

సక్సెస్ దేముంది బాస్ .. ఓటమి ఇచ్చే కిక్కేవేరు

చిత్రం
అపజయం, ఓటమి, అవమానం ఇవ్వన్నీ బతుకులో మామూలే. ఫెయిల్యూర్ అన్నది ఓ ప్రయాణం మాత్రమే. అది నేర్పే పాఠం ఇంకెవ్వరూ నేర్పించలేరు. విజయంలో అందరూ దగ్గరవుతారు. కానీ అపజయం మనల్ని వరించినప్పుడు ఏ ఒక్కరూ మనతో ఉండరు. ఆ దరిదాపుల్లో చూద్దామన్నా కనిపించరు. లోకం నువ్వు ఎన్ని మెట్లు ఎక్కి వచ్చావని చూడదు. ఎంత మందిని దాటుకుని గెలుపు వాకిళ్ళల్లో తోరణాలు కట్టావన్నదే చూస్తుంది. అప్పుడే నీకు లోకం సలాము చేస్తుంది. చరిత్ర అంటే విజేతల చరిత్ర కాదు. అది కోట్లాది జనం బలిదానాల, ఆత్మ త్యాగాల సమ్మేళనమే చరిత్ర. ప్రతి పేజీలో రక్తపు మరకలు లేకుండా హిస్టరీ ఉన్నదా. నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం అని అనలేదా..గొంతు చించుకు అరవలేదా మహాకవి శ్రీ శ్రీ. సక్సెస్ సమాజంలో ఓ గుర్తింపును, ఇమేజ్ ను ఇస్తుంది. కానీ సముద్రమంత జీవితాన్ని ఈదాలంటే మాత్రం ఓటమి మనల్ని పలకరించాల్సిందే. అందుకే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ చోట అంటాడు..ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అని. చూస్తే చిన్న పదాలు. కానీ కొన్ని తరాలకు సరిపడా కిక్కు వుంది ఇందులో. అది కొందరికే సాధ్యం. ఈ జర్నీ ఎప్పుడూ ఉండేదే..కానీ కలుస్తాం..విడిపోతాం. మ...

హెచ్‌సీఏలో కొత్త ట్విస్ట్..గడ్డం వివేక్ కు షాక్ ..అజ్జూ బాయ్ కే ఛాన్స్.!

చిత్రం
తెలంగాణలోని హైదరాబాద్ క్రికెట్ అసోషియన్ కు ఎక్కడలేని డిమాండ్ ఉంది. దీనిపై జరిగిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ పదవి కోసం ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. కోర్టు మెట్లు ఎక్కారు. ప్రపంచంలోనే మణికట్టు మాంత్రికుడిగా, బ్యాట్సమెన్ గా ఇప్పటికే పేరు పొందిన మాజీ సారథి మహమ్మద్ అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడి పదవిని చేజిక్కించుకోలేక పోయారు. అజ్జూ బాయ్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఓడిపోయి తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నారు. మొత్తం మీద ఒక పత్రిక, న్యూస్ ఛానల్ తో పాటు విబోర్డ్ , విశాఖ కంపెనీలకు వివేక్ చైర్మన్ గా ఉన్నారు. మొదట్లో కాంగ్రెస్ లో ఉన్నారు. టీఆరెఎస్ లో చేరారు. తిరిగి ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఒక బిజినెస్ మెన్ గా ఉన్న వివేక్ ఎలా ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ చేస్తారంటూ అజ్జూ బాయ్ తో పాటు ఇతర క్రికెటర్స్ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా మరోసారి హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన మాజీ ఎంపీ గడ్డం వివేక్‌కు చుక్కెదురైంది. మాజీ అధ్యక్షుడు వివేక్‌ వేసిన నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధి...

మోస్ట్ పాపులర్ యాడ్స్ ఇవే

చిత్రం
వినోద రంగం ఇండియాను ఊపేస్తోంది. ఆయా కంపెనీలన్నీ తమ ఉత్పత్తులను పరిచయం చేసేందుకు ఎక్కువగా పత్రికలు, టీవీలు, డిజిటల్, సోషల్ మీడియాలలో ప్రకటనలు ఇస్తూ ఆదాయాన్ని పెంచుకునే పనిలో పడ్డాయి. యాడ్స్ క్రియేషన్ అన్నది క్రియేటివిటీతో కూడుకున్నది. టెలీకాస్ట్ అయ్యే ప్రతి ప్రోగ్రాం, సీరియల్స్, సినిమాలకు ముందు కొద్దీ నిమిషాల పాటు యాడ్స్ వస్తుంటాయి. వీటి ఆధారంగా వినియోగదారులు లేదా కొనుగోలుదారులు ఇంప్రెస్స్ అవుతారు. ఏవి కొనాలో  ఏవి కొనుగోలు చేయకూడదో డెసిషన్ తీసుకుంటారు. ఏ రంగమైనా సరే ప్రతి కంపెనీ స్వంతంగా భారీ ఎత్తున కేవలం ప్రకటనలు తయారు చేసేందుకు లక్షల్లో ఖర్చు చేస్తోంది. దీనికి ప్రత్యేకించి యాడ్ ఏజెన్సీలతో పాటు కొంతమంది సినీ డైరెక్టర్స్ కూడా వీటిని తయారు చేస్తారు. తెర మీద మనం మెస్మరైజ్ అయ్యేలా చేస్తారు. ఇదంతా బుర్ర బద్దలు కొట్టుకుంటే కానీ గొప్ప ఐడియాస్ పుట్టుకు రావు. రిలయన్స్ కంపెనీ అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ధీరుభాయి అంబానీ నేతృత్వంలోని ఈ కంపెనీ ఇప్పుడు భారతీయ ఆర్థిక రంగాన్ని శాసించే స్థాయికి చేరుకుంది. ఇదే కంపెనీ అప్పట్లో దుస్తుల కంపెనీని స్టార్ట్ చేసింది. అదే విమల్. అప్పటికే ఇండియాలో రేమ...

దిగ్గజ మొబైల్స్ కంపెనీల మధ్య పెరిగిన పోటీ

చిత్రం
ఇండియన్ మార్కెట్ ను చైనా స్మార్ట్ ఫోన్స్ డామినేట్ చేస్తున్నాయి. ఓ వైపు అమెరికా కంపెనీ యాపిల్ , శాంసంగ్ , వన్ ప్లస్ కంపెనీల మొబైల్స్ ఇప్పటికే ఉన్నాయి. మరో వైపు ఇండియాలో బిగ్ డిమాండ్ ఉండడంతో అన్ని మొబైల్స్ కంపెనీలన్నీ ఇండియా జపం చేస్తున్నాయి. గత కొంత కాలంగా ఎన్ని కొత్త మోడల్స్ మార్కెట్ లోకి వచ్చినా చైనా మొబైల్స్ కు పోటీ ఇవ్వలేక పోతున్నాయి. ధరల్లో భారీ తేడాలు ఉండడం, సేమ్ టూ సేమ్ ఫీచర్స్ ఉండడంతో చైనా మొబైల్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇదే కంట్రీకి చెందిన వివో, ఒప్పో, షావోమి , జేడీటీఈ, టీసీఎల్, అల్కా టెల్ , హువాయి , కూల్ పాడ్ కంపెనీల స్మార్ట్ ఫోన్స్ పోటాపోటీగా అమ్ముడు పోతున్నాయి. ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ లో భారీ ఆఫర్లు, బిగ్ డిస్కౌంట్స్ తో కస్టమర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో దిగ్గజ కంపెనీల మొబైల్స్ అమ్మకాలు పూర్తిగా తగ్గు ముఖం పట్టాయి. ఒకప్పుడు యాపిల్ ఫోన్స్ మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయంటే చాలు జనం క్యూ కట్టే వారు. కానీ ఆ సీన్ కనిపించడం లేదు. యాపిల్ కు శాంసంగ్ పోటీ ఉన్నప్పటికీ చైనా మొబైల్స్ సూపర్ గా అమ్ముడవుతున్నాయి. ఇక ఒక్కో కంపెనీ ఒక్కో స్ట్రాటజీతో ముందుకు...

యప్ టీవీకి బంపర్ ఆఫర్

చిత్రం
ఒకప్పుడు వార్తలు వినాలన్నా, చూడాలన్నా చాలా ఇబ్బందులు ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బందులంటూ ఏమీ లేవు. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడుకలోకి వచ్చిందో ఇక ప్రపంచ స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ఇంటర్నెట్ దెబ్బకు లోకం చిన్నదై పోయింది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ భారీ ఎత్తున తమ సేవలను దేశమంతటా విస్తరించడంతో కోట్లాది మంది నెట్ తో కనెక్ట్ అవుతున్నారు. న్యూస్, ఎంటర్ టైన్మెంట్ రంగాలు రాకెట్ కంటే వేగంగా దూసుకు వెళుతున్నాయి. వినోద రంగం మాత్రం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇక భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రపంచంలోనే అత్యంత అత్యధిక ఆదాయం కలిగిన క్రికెట్ సంస్థగా పేరు తెచ్చుకున్నది. ఇప్పటికే దాని టెలికాస్ట్ హక్కులను స్టార్ టీవీ సీయివో ఉదయ్ శంకర్ వేలం పాటలో భారీ ఆఫర్ ఇచ్చి చేజిక్కించుకున్నాడు. భారతీయ క్రీడా రంగంలో ఇది ఓ రికార్డుగా నమోదు అయ్యింది. 1647 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు. ఇంతకు ముందెన్నడూ ఇంత పెద్ద మొత్తంలో ఓ టీవీ యాజమాన్యం భారీ ఎత్తున వేలం పాడింది లేదు. ఉదయ్ శంకర్ ముందు చూపుతో తీసుకున్న ఈ డెసిషన్ ..స్టార్ టీవీకి ఎనలేని ఆదాయం సమకూరుతోంది. తాజగా ఆసియా వార్తలను ముందుంచడంలో ప...