పోస్ట్‌లు

సెప్టెంబర్ 9, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

కిరాణా దుకాణాలపై కన్నేసిన ఫ్లిప్ కార్ట్

చిత్రం
భారతీయ ఆర్ధిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నా ఇండియాలో మాత్రం ఈ కామర్స్ బిజినెస్ మాత్రం దూసుకు వెళుతోంది. ఇటు ఆఫ్ లైన్ లోను ..అటు ఆన్ లైన్ లో వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఇప్పటికే అమెజాన్, స్నాప్ డీల్ , ఫ్లిప్ కార్ట్ కంపెనీలు ఈ కామర్స్ రంగంలో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నాయి. కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నాయి. ఈ మూడు కంపెనీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఫ్లిప్ కార్ట్ , స్నాప్ డీల్ దేశీయ కంపెనీలు కాగా అమెజాన్ మాత్రం అమెరికా దేశానికి చెందింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ఇండియాపై కన్నేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా కొనుగోలు చేస్తున్న కంట్రీగా భారత దేశం ఉండడంతో అన్ని కంపెనీలు ఇటు వైపు చూస్తున్నాయి. ఇక ఇప్పటికే ఇండియన్ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపిస్తూ రోజు రోజుకు సరి కొత్త నిర్ణయాలతో ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది రిలయన్స్ కంపెనీ. తాజాగా డిజిటల్ , ఈ కామర్స్ బిజినెస్ రంగంలోకి ఎంటర్ అవుతున్నట్లు కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఆయిల్, టెలికాం, జ్యుయెలరీ , టాయిస్ , ఫ్యాషన్ , దుస్తుల రంగాలలోకి ప్రవేశించింది. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా ...

కృష్ణమ్మ ప్రవాహం..గోదారి ఉగ్రరూపం

చిత్రం
ఎగువన కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ఆల్మట్టి , నారాయణపూర్ నుంచి నీటిని వదులుతున్నారు. దీంతో జూరాల నిండు కుండను తలపిస్తోంది. వరద ఉదృతి పెరుగుతుండడంతో దిగువన ఉన్న శ్రీశైలానికి నీటిని వదిలారు అధికారులు. వరద పోటెత్తడంతో శ్రీశైలం గేట్ల పైనుంచి నీరు పారుతోంది. కర్ణాటకలోని ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండి పోయాయి. పెద్ద ఎత్తున నీరు చేరుకోవడంతో జూరాల లోని 22 గేట్లను పూర్తిగా ఎట్టి వేశారు. కృష్ణా నీరు చేరడంతో శ్రీశైలంకు భారీగా చేరుకుంటోంది నీరు. అక్కడి నుంచి దిగువన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు వదులుతున్నారు. అయితే ఆరు క్రస్ట్ గేట్లపై నుంచి నీరు పారుతుండడంతో చుట్టుపక్కన ఉన్న గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాగు చేసుకున్న పంట పొలాలు నీట మునిగాయి. జూరాలతో పాటు సుంకేశుల ప్రాజెక్టు నుంచి కూడా శ్రీశైలంకు నీరు చేరుతోంది. మరో వైపు గోదావరి ఉగ్ర రూపం దాల్చుతోంది. దిగువన ఉన్న లంక గ్రామాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తుడడంతో అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ ...

దూసుకుపోతున్న బిగ్ బాస్..దుమ్ము రేపుతున్న నాగార్జున

చిత్రం
తెలుగు బుల్లితెరపై స్టార్ మా టీవీ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ ప్రోగ్రాం దుమ్ము రేపుతోంది. రేటింగ్స్ లో దూసుకు వెళుతోంది. ప్రారంభం కంటే ముందే ఈ ప్రాయోజిత కార్యక్రమంపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చోటు చేసుకున్నాయి. జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. వీటన్నిటి మధ్య బిగ్ బాస్ స్టార్ట్ అయ్యింది. స్టార్ యాజమాన్యం ఊహించని రీతిలో మిగతా వినోదపు ఛానల్స్ ను దాటుకుని టాప్ రేటింగ్స్ లో దూసుకు పోయింది. దీంతో భారీ ఆదాయం సమకూరుతోంది స్టార్ మా టీవీకి. బిగ్ బాస్ రోజు రోజుకు భిన్నంగా వెళుతోంది. అత్యంత జనాదరణ ఉంటోంది దీనికి. ఈ ప్రోగ్రాం మూడోది. మొదటి సారిగా బిగ్ బాస్ ను జూనియర్ ఎన్ఠీఆర్ స్టార్ట్ చేశారు. రెండో సారి నటుడు నాని చేస్తే..ముచ్చటగా మూడో సారి అక్కినేని నాగార్జునను స్టార్ మా టీవీ ప్రత్యేకంగా ఎంచుకుంది. ఇప్పటికే తెలుగు సినిమా రంగంలో ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉన్నది. వేలాది మంది అభిమానులను ఆయన కలిగి ఉన్నారు. దీంతో స్టార్ గ్రూప్ మిగతా నటులకంటే ఉమెన్స్ ఎక్కువగా ఇష్టపడే నాగార్జున వైపే మొగ్గు చూపింది. అంతకు ముందు ఇదే నాగార్జున ఇదే టీవీలో మీలో కోటీశ్వరుడు ఎవరు అనే కార్యక్రమానిక...

అంపశయ్యపై బీఎస్ఎన్ఎల్..ఉద్యోగులకు ఉద్వాసన..?

చిత్రం
భారతదేశంలో అతిపెద్ద వాటా కలిగి, ఎన్నో ఏళ్లుగా విశిష్టమైన సేవలు అందించిన  భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌  ఇప్పుడు మోడీ దెబ్బకు విలవిలా లాడి పోతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ సంస్థ అంపశయ్యపై ఉన్నది. కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతోంది. ఇప్పటికే మోయలేని భారంగా ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ ఉన్నతాధికారుల నిర్వాకం, మిగతా ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడ లేక పోవడం ప్రధాన కారణం. దేశంలో ఏ సంస్థకూ లేనంత నెట్ వర్క్ బీఎ్‌సఎన్‌ఎల్‌ కు ఉన్నది. లక్షకు పైగా ఉద్యోగులు, సిబ్బంది పని చేస్తున్నారు. ఇప్పటికే సంస్థలో 50 శాతానికి పైగా ఆదాయం జీతాలకే పోతోందని ప్రభుత్వం అంటోంది. దేశ వ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. దీంతో నివారణ చర్యలు చేపట్టాలని కేంద్ర సర్కార్ సంబంధిత శాఖా మంత్రిని ఆదేశించింది. ప్రస్తుతం బీఎ్‌సఎన్‌ఎల్‌ లో స్వచ్చంద పదవీ విరమణ చేసేలా ఉద్యోగులను ఇంటికి పంపిస్తే కొంత మేరకు బతికి బట్ట కడుతుందని భావిస్తోంది. ఇప్పటికే సంస్థకు ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి భారీ ఎత్తున వేతనాలు చెల్లిస్తున్నారు. ఇది కూడా భారంగా మారింది. ఇదిలా ఉండగా ప్రైవేట్ టెలికాం ఆపర...

వరల్డ్ కప్ గెలవక పోయినా కోచ్ కు బంపర్ ఆఫర్

చిత్రం
అధికారం మన చేతుల్లో వుంటే చాలు ఏమైనా చెయ్యొచ్చు. ఎంతైనా బలగం ఉన్నోడు కదా. అందుకే అందరినీ కాదని టీమిండియా జట్టుకు కోచ్ గా ఎంపికయ్యాడు. వడ్డించే వాడు మనోడైతే ఇంకేం వద్దన్నా కాసులు వాలి పోతాయి. ఇదే అదృష్టం అంటే. మొదటి నుంచి భారత దేశంలో ప్రభుత్వానికి లేనంతటి పవర్ ఒకే ఒక్క సంస్థకు ఉంది. అదే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఎప్పుడైతే మాజీ క్రికెట్ సారధి కపిల్ దేవ్ విండీస్ ను ఫైనల్ లో ఓడించి ప్రపంచ కప్పు ఎగరేసుకు వచ్చాడో, అప్పటి నుంచి క్రికెట్ ఇండియాను ఊపేస్తోంది. శాసిస్తోంది. అంతేనా సర్కార్ ను తన దరిదాపుల్లోకి కూడా రానీయడం లేదు. మొదటి నుంచి ఇండియన్ క్రికెట్ లో ముంబై ఆటగాళ్లదే ఆధిపత్యం. దీనిని కపిల్ దేవ్, హైదరాబాద్ ఆటగాడు అజహరుద్దీన్ బ్రేక్ చేశారు. వారికి చెక్ పెట్టాడు అజ్జూ భాయి. ఆయన హయాంలోనే ఇండియాలోని ఇతర ప్రాంతాలకు చెందిన క్రికెటర్లు ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. దేశ ప్రధానమంత్రికి కూడా దక్కని ప్రచారం, హోదా , గౌరవం , బ్రాండ్ ఇమేజ్ అంతా క్రికెటర్లకు ఉంటోంది. ఇది నమ్మశక్యం కాని వాస్తవం. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన, భారీ ఆదాయం కలిగిన సంస్థగా బీసీసీఐ చరిత్ర సృష్టించింది. ఆటగాళ్లు ఒ...

ఈటల మౌనం..రసమయి స్వరం..నాయని ఆగ్రహం

చిత్రం
మంత్రివర్గ విస్తరణ తెలంగాణ రాష్ట్ర సమితిలో అసంతృప్తిని రాజేసింది. రెండవ సారి తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది మందితోనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు. పార్టీ అంటేనే కెసిఆర్ ..కేసీఆర్ అంటేనే పార్టీ అనే స్థాయికి తీసుకు వెళ్లారు. ఏ ఒక్కరు ఆయనకు ఎదురు చెప్పలేని, ప్రశ్నించలేని పరిస్థితి. మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ట్రబుల్ షూటర్ గా పేరొందిన అల్లుడు తన్నీరు హరీష్ రావు తో పాటు కొడుకు కేటీఆర్ కు కేబినెట్లో చోటు దక్కింది. రెండో సారి మంత్రివర్గ విస్తరణలో వీరిద్దరికీ చోటు దక్కలేదు. హరీష్ ను పక్కన పెట్టారనే వార్తలు గుప్పుమన్నాయి. హరీష్ కూడా ఎక్కడా కనిపించలేదు. తన నియోజకవర్గానికే పరిమితమై పోగా, కొడుకుకు మాత్రం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. ఇదే సమయంలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో పాటు విపక్షాలు సైతం హరీష్ రావు నును పక్కన పెట్టడంపై పలు విమర్శలు సైతం చేశారు. దీంతో మెలమెల్లగా ఆ అపవాదును తొలగించేందుకు కేసీఆర్ ఇతర పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను తమ పార్టీలోకి తీసుకున్నారు. దీంతో ఏ సమయంల...

వరల్డ్ స్కిల్స్ పోటీల్లో విజేత శ్వేత

చిత్రం
నిన్న హిమ దాస్, పీవీ సింధు, మానసి జోషి, మను, భావన , మేరీకోమ్ లాంటి మహిళా క్రీడాకారులు ఇండియాకు తమ ప్రతిభా పాటవాలతో విజేతలుగా నిలిచి పేరు తీసుకు వచ్చారు. బంగారు పతకాలను గెలిచి ప్రపంచాన్ని విస్తు పోయేలా చేశారు. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన వరల్డ్ స్కిల్స్ ఇంటర్నేషనల్ పోటీల్లో ఇండియాకు చెందిన శ్వేత రతన్ పురా డిజైనింగ్ విభాగంలో ప్రపంచ విజేతగా నిలిచారు. చరిత్ర సృష్టించారు. గత కొన్ని ఏళ్లుగా ప్రతి ఏటా వివిధ అంశాలలో ప్రతిభా పాటవాలకు సంబంధించి పోటీలను నిర్వహిస్తున్నారు. ఈసారి 2019 కు సంబంధింది రష్యాలోని కజాన్ లో కాంపిటీషన్స్ చేపట్టారు. గ్రాఫిక్ డిజైనింగ్ విభాగంలో అద్భుతమైన రీతిలో ఇండియాకు చెందిన శ్వేత ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతే కాకుండా వివిధ దేశాల నుంచి వచ్చిన వందలాది మందిని దాటుకుని గెలుపొందారు. ఇండియా వరకు వస్తే ఈ వరల్డ్ స్కిల్స్ పోటీల్లో మొత్తం 19 పతకాలు మన వాళ్లకు దక్కాయి. ఇందులో శ్వేత మాత్రం బంగారు పతకాన్ని సాధించింది. ఇప్పటి వరకు 1350 మందికి పైగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. 63 దేశాలకు చెందిన వారు ఇందులో పార్టిసిపేట్ చేశారు. కాగా సాధించిన వాటితో ఓవర్ ఆల్ గా భారత దేశం టీమ్ 13 వ స్...

అస్తమించని కళారవి కాళన్న

చిత్రం
అక్షర రూపం దాల్చిన సిరా చుక్క లక్ష మెదళ్ళకు చికిత్స..పుట్టుక నీది ..చావు నీది..బతుకంతా దేశానిది..అంటూ జీవితాంతం విలువలకు కట్టుబడిన మహోన్నత మానవుడు కాళోజి నారాయణరావు. కవిగా, రచయితగా, పోరాట యోధుడిగా చివరి వరకు నిలబడ్డారు. తాను కొంత కాలం పాటు ఇక్కడికి అతిథిగా ఉండేందుకే వచ్చానని అన్నారు. స్వల్పమైన అక్షరాలతో అద్భుతమైన కవిత్వాన్ని రాశాడు. ఆశువుగా చెబుతూ వుంటే అనుచరులు రాసుకుంటూ భద్రం చేశారు.. నిజమైన ప్రజా కవి కాళోజి. అవార్డు ఇస్తామని అంటే నాకెందుకు అంటూ తిరస్కరించారు. రాజ్యంతో ఎన్నడూ రాజీ పడలేదు. ఆయన కవిత్వం విశ్వజనీనమైనది. నిత్యం పోరాటమే ఊపిరిగా చేసుకుని రచనలు చేశారు. నైజాంకు వ్యతిరేకంగా,  పౌర హక్కుల కోసం నిలబడిన నిజమైన కవి. కాళోజి జీవితమే కవిత్వం. ప్రతి సంఘటన ఆయన రచనల్లో కనిపిస్తుంది. ఆయన నిజమైన తెలంగాణ గాంధీ. సింప్లిసిటీకి ప్రతీకగా నిలిచారు. తెలంగాణ బతుకు ప్రయాణంలో మరిచి పోలేని మహోన్నతమైన కవి కాళోజి. అనువాదాలతో ఆకట్టుకున్నారు. 78 ఏళ్ళు బతికినా రాసుకుంటూనే పోయారు. సామాన్యుల నుంచి పండితుల దాకా అర్థమయ్యేలా కాళోజి రాసినట్లుగా ఇంకే కవి , రచయిత రాలేదు. అందుకే కాళోజి ప్రజా కవి. ఆయన జీవి...

ఊరించి..ఊసూరు మనిపించిన బడ్జెట్..?

చిత్రం
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణాలో కొలువు తీరిన ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ ఊరించి..ఉసూరుమనిపించింది. కొత్త పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన, విద్య, ఆరోగ్యం, సంక్షేమం, మహిళాభివృద్ది, తదితర రంగాలపై పూర్తి స్థాయిలో కేటాయింపులు చేపట్టలేదంటూ విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఆర్ధిక లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆర్ధిక క్రమశిక్షణ లేక పోవడం కూడా ప్రధాన కారణం. మొత్తం బడ్జెట్ ప్రవేశ పెట్టడంతోనే కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. వాస్తవిక దృక్పథంతో ఈసారి బడ్జెట్‌ను రూపొందించామని, రాష్ట్ర బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా నెలకొన్న తీవ్ర ఆర్థిక మాంద్యం ప్రభావం పడిందని సీఎం వివరించారు. కేంద్ర ఆయుష్మాన్ కంటే ఆరోగ్యశ్రీ బెటర్ అన్నారు. ఇందు కోసం 1,336 కోట్లు కేటాయించామని, దీని వల్ల 85 లక్షల 34  వేల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన  450 కోట్లను కేంద్రం ఇవ్వలేదని సీఎం ఆరోపించారు. రెవెన్యూ డివిజన్లు, మండలాలు, మున్సిపాలిటీలను పెంచామన్నారు. వాటికి నిధులు కేటాయించినట్లు తెలిపారు. శాంతి భద్రత భేషుగ్గా ఉందన్నారు. త...

నిరాశ పరిచిన తెలంగాణ వార్షిక బడ్జెట్ - ప్రవేశ పెట్టిన సీఎం కేసీఆర్ - ఆర్ధిక మాంద్యం..బీజేపీ సర్కార్ పాపమే

చిత్రం
ఎంతో ఉత్కంఠకు గురి చేసిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ జనాన్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. దేశంలో ఆర్ధిక సంక్షోభం కొనసాగుతూ ఉన్నదని, దాని ప్రభావం మన రాష్ట్రంపై పడిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 2019 -2020 సంవత్సరానికి గాను ముఖ్యమంత్రి శాసనసభలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధి రేటు తగ్గిన కారణంగా కేటాయింపులలో మార్పులు చేయడం జరిగిందన్నారు. ఎప్పటి లాగే పెన్షన్స్, రైతు బంధు పథకం, ప్రాజెక్టులు చేపడతామని వెల్లడించారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ప్రస్తుతం బాగా లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం లేదన్నారు. విద్య, వైద్యం , తదితర రంగాలను కొనసాగిస్తామన్నారు. ఆటోమొబైల్, తదితర రంగాలు మూసి వేసే పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. 24 వేల కోట్ల నిధుల లోటు ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రతిపాదిత ఖర్చు కింద 1,46,492 రూపాయల కోట్లు గా తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. రెవెన్యూ వ్యయం లక్షా 11 వేల కోట్లు , మూల ధనం విషయానికి...