పోస్ట్‌లు

ఆగస్టు 11, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఉత్కంఠ రేపుతున్న బిగ్ బాస్ .. అయ్యో తమన్నా అవుట్

చిత్రం
బుల్లితెర రంగంలో బిగ్ బాస్ ప్రోగ్రాం సంచలనం సృష్టిస్తోంది . అంచనాలకు మించి రేటింగ్ లోను దూసుకెళుతోంది. మొదటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారినప్పటికీ ఈ రియాల్టీ షో మాత్రం మా స్టార్ టీవీ యాజమాన్యం కు ఇటు నిర్వాహకులకు అనుకోని రీతిలో స్పందన లభిస్తోంది . దీంతో ఇప్పటికే భారీ ఎత్తున కొనుగోలు చేసిన స్టార్ టీవీకి ఈ ఒక్క షో ద్వారానే ఇరు రాష్ట్రాలలో టీవీ పేరు మార్మ్రోగి పోతోంది . ఊహించని రీతిలో ట్విస్ట్ లు , ఆటలు, ప్రశ్నలు , ఇలా ప్రతి సన్నివేశంలోనూ బిగ్ బాస్ అంచనాలకు అందకుండా పోతోంది .ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటోంది . సరిగ్గా రాత్రికి ప్రసారమవుతున్న ఈ ప్రోగ్రాం దెబ్బకు మిగతా ఛానల్స్ వినోదం కలిగించేలా కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు .  భారీ ఎత్తున బిగ్ బాస్ ను చూస్తుండడం తో యాజమాన్యానికి కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది. ప్రకటనల పరంగా కూడా వర్కవుట్ అవుతోంది . సెలెబ్రెటీలు , హీరోలు , యాంకర్లు , సింగర్స్ , సినిమా కు చెందిన పాపులర్ పెర్సనాలిటీస్ తో ప్రతి రోజు ఆకట్టుకునేలా తీర్చి దిద్దారు నిర్వాహకులు . ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం బంపర్ గా సక్సెస్ అయ్యింది ...

వికసిస్తున్న కమలం ..క్యూ కట్టిన నేతలు

చిత్రం
బీజేపీ అనూహ్యంగా చాప కింద నీరులా భారత దేశంలో పుంజుకుంటోంది. తాజాగా దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ థంపింగ్ మెజారిటీ సాధించి కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో నరేంద్ర మోదీ ..అమిత్ షా లు ఇద్దరు బీజేపీకి ఆయువుపట్టులా ఉన్నారు. వీరు ఏది అనుకుంటే దానిని అమలు చేస్తున్నారు . వీరికి అటు ఆర్.ఎస్సెస్ , భజరంగ్ దళ్ , వీహెచ్ పి లు వెన్ను దన్నుగా నిలుస్తున్నాయి . మరో వైపు మహారాష్ట్రలో శివశేన తో పొత్తు పెట్టుకున్నప్పటికీ బీజేపీ నే హవా కొనసాగిస్తోంది. ఇప్పుడు మోదీ , షా ల గాలి వీస్తోంది . ఇండియా అంతటా కాషాయ జెండా ఎగుర వేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు వీరిద్దరూ . ఆ దిశలోనే పావులు కదుపుతూ ..వ్యూహాలకు పదును పెడుతూ విపక్షాలకు చెక్ పెడుతున్నారు . తమకు , తమ పార్టీకి అడ్డు అంటూ లేకుండా చేస్తున్నారు. పక్కాగా స్కెచ్ ను మోదీ వేస్తే దానిని షా అమలు చేస్తున్నాడు . ఇదే సమయంలో సౌత్ లో నిన్నటి దాకా కాంగ్రెస్ , జేడీఎస్ లు సంకీర్ణ సర్కార్ ను కర్ణాటకలో ఏర్పాటు చేసిన సర్కార్ ను కూలదోశారు . అన్ని అన్ని రాష్ట్రాలలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఏ ఒక ప్రాంతీయ పార...

విశ్వనాథా విజయీ భవ..కుచేలుడి ఇంటికి శ్రీకృష్ణుడు..!

చిత్రం
ఎవరూ ఊహించని సన్నివేశం అది. తెలంగాణ చరిత్రలో అరుదైన సందర్భం అది. ఎంతైనా కేసీఆర్ అంటేనే సంచలనాలకు మారు పేరు. ఆయన మదిలో ఏముందో ఎవరికీ అర్థం కాదు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో పక్కన ఉన్న వారికి కూడా తెలియదు. వాహనం ఎక్కే దాకా ఎవరి దగ్గరికి వెళుతున్నారో అంతు పట్టదు. ఒక్క ఇంటెలిజెన్సీ విభాగానికి, రాష్ట్ర డీజీపీ కి తప్ప. నిన్నటి దాకా తెలుగు సినిమా రంగంలో అత్యధిక శాతం పొరుగు రాష్ట్రానికి చెందిన వారే అధికంగా ఉన్నారు. ఉద్యమ సమయంలో కొన్ని గ్యాప్ ఏర్పడింది. దానిని రాష్ట్రం ఏర్పాటు అయ్యాక తొలగించే ప్రయత్నం చేశారు సీఎం కేసీఆర్. సినీ పెద్దలు కలలో కూడా అనుకోని రీతిలో ముఖ్యమంత్రి ఏకంగా భారత దేశం గర్వించే దర్శకులలో దిగ్గజ దర్శకుడిగా పేరొందిన కాశీనాథుని విశ్వనాధ్ ఇంటికి స్వయంగా వెళ్లారు . ఈ సందర్బంగా  గంటకు పైగా ఆయనతో ముచ్చటించారు. స్వతహాగా సీఎం సాహితీ పిపాసి , ఆయనకు కళలన్నా , సాహిత్యం అన్నా యెనలేని అభిమానం . ఆయన అనుభవం కలిగిన రాజకీయ నాయకుడే కాదు అద్భుతమైన రచయిత, కవి. సినిమాలన్నా , పాటలన్నా కేసీఆర్ కు పిచ్చి . విశ్వనాధ్ తో పాటు ఆయన సతీమణి కి స్వయంగా శాలువాలు కప్పారు , దుస్తులు అందజేశారు . ...

కోహ్లీ, శ్రేయస్ కమాల్..విండీస్ ఢమాల్

చిత్రం
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ , శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ప్రదర్శించడంతో అవలీలగా విండీస్ జట్టుపై రెండో వన్డే లో 59 పరుగుల తేడాతో గెలిచింది . పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ లో జరిగిన ఈ మ్యాచ్ లో మొదటగా ఇండియా బ్యాటింగ్ చేసింది. కోహ్లీ 125 బంతుల్లో 125 పరుగులు చేశాడు . భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్ లో చెలరేగడంతో విండీస్ తలవంచక తప్పలేదు . వర్షం కారణంగా మ్యాచ్‌ను 46 ఓవర్లకు కుదించారు. 270 పరుగుల టార్గెట్ ముందుంచారు. ఓపెనర్ లూయిస్ ఒక్కడే పోరాడినా ఫలితం లేక పోయింది . కేవలం 42 ఓవర్లలోనే కథ ముగిసింది . 80 బంతులు ఎదుర్కొన్న లూయిస్ 65 పరుగులు చేస్తే , పూరన్ 42 పరుగులు కొట్టినా లాభం లేక పోయింది . ఇండియన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇండియాకు గెలుపు లభించింది. షమీ, కుల్దీప్ ఇద్దరు మెరుగైన బౌలింగ్ ఆట తీరుతో ఆకట్టుకున్నారు. మరో వైపు భారత ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ 68 బంతులు ఎదుర్కొని 71 పరుగులు సాధించాడు. మూడు వన్డేలలో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్ కు కూడా వాన అడ్డంకిగా నిలిచింది . అందుకే అంపైర్లు ఓవర్లను, పరుగులను కుదించారు. దీంతో ఈ ఒక్క విజయంతో భారత...