చుక్కలు చూపించిన విండీస్ - చెమటోడ్చిన శ్రీలంక - వారెవ్వా పూరన్ ..!

వెస్టిండీస్ జట్టు తానేమిటో మరోసారి రుచి చూపించింది లంకేయులకు. పూరన్ పూనకం వచ్చినట్టు ఆడాడు. గెలుపు అంచుల దాకా తీసుకెళ్లాడు. ఒకానొక దశలో లంక ఓడిపోతుందనిపించింది. అడ్డుగోడలా ఫెర్నాండ్ నిలబడక పోతే ఆ జట్టు ఆశలు గల్లంతయ్వేవి. ఇప్పటికే ఏడు మ్యాచ్ల్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి ..ప్రపంచకప్ టోర్నమెంట్ ను దాదాపు నిష్క్రమించిన విండీస్ జట్టు ఆఖరు మ్యాచ్ శ్రీలంకతో తలపడాల్సి వచ్చింది. ఎలాగైనా లంకపై గెలిచి పోయిన పరువును నిలబెట్టు కోవాలనే కసితో విండీస్ ఆటగాళ్లు కసితో ఆడారు. దుమ్ము రేపారు. లంకేయులకు దడ పుట్టించాడు ఒకే ఒక్కడు పూరన్. మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక జట్టు 339 పరుగులు చేసింది. ఈ టార్గెట్ను ఛేదించేందుకు రంగంలోకి దిగిన విండీస్ జట్టు ..199 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈజీగా గెలుస్తుందనుకున్న లంక జట్టు చెమటోడ్చాల్సి వచ్చింది. ఈ స్థితిలో బ్యాటింగ్కు వచ్చిన అసాధారణమైన రీతిలో నికోలాస్ పూరన్ వస్తూనే దాడి చేయడం ప్రారంభించాడు. 103 బంతులు ఆడి 11 ఫోర్లు 4 సిక్సర్లతో 118 పరుగులు చేశాడు. విండీస్ ను గెలిపించినంత పని చేశాడు. కీలక దశ...