అయోమయం..గందరగోళం

తెలంగాణాలో రాత్రి రోడ్డు రవాణా సంస్థ భవితవ్యం ఇప్పుడు అంధకారంలోకి నెట్టి వేయబడింది. అటు కూడఁరంలోని బీజేపీ సర్కారుతో పాటు సీఎం కేసీఆర్ ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేసే పనిలో పడ్డారు. కోట్లాది ఆస్తులు కలిగిన ఆర్టీసీని గంపగుత్తగా అమ్మేసేందుకు పావులు కదిపారు. ఇప్పటికే ప్రైవేట్ బస్సులు దొడ్డి దారిన ఏర్పాటు అయ్యాయి. ఇదిలా ఉండగా ఆర్టీసీ బస్సుల స్థాయిలోనే సేవలందిస్తున్న అద్దె బస్సుల భవితవ్యం గందర గోళంలో పడింది. ప్రభుత్వం 5,100 బస్సులను ఆర్టీసీ నుంచి మినహాయించి అంత మేర రూట్లను ప్రైవేటీకరించాలని నిర్ణయించడమే దీనికి కారణం. ఆర్టీసీకి సొంత బస్సులు సగం ఉండ నుండగా మిగతావి ప్రైవేటు పర్మిట్లతో నడిచే బస్సులు ఉంటాయని సీఎం ఇప్పటికే తేల్చి చెప్పడం, దీనికి హైకోర్టు అడ్డు చెప్పక పోవటంతో ఈ ప్రక్రియ అమలు దాదాపు ఖాయమైంది. అయితే ప్రైవేటీకరించే కోటా పరిధి లోకే అద్దె బస్సులు వస్తాయని గతంలోనే సీఎం స్పష్టం చేసిన నేపథ్యంలో అద్దె బస్సుల విధానమే రద్దవుతుందన్న ప్రచారం ఆర్టీసీలో మొదలైంది. అద్దె బస్సుల యజమానులనూ ప్రైవేటు పర్మిట్ బస్సుల పరిధిలోకి తెస్తారని చర్చ జోరుగా సాగుతోంది. ఆర్టీసీ తమతో పదేళ్ల ఒప్పందం కుదుర్...