పోస్ట్‌లు

ఆగస్టు 8, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

జాక్ పాట్ కొట్టేసిన శ్రీనివాస ఫార్మ్స్

చిత్రం
తెలంగాణ రాష్ట్రంలో కోళ్ల పరిశ్రమ మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది . కోళ్ల పరిశ్రమదారులకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తూ ఉండడమే కాకుండా మరిన్ని ప్రోత్సాహకాలు కల్పిస్తోంది. దీంతో రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో కొంత వ్యాపారం మందగించిన గత కొంత కాలం నుంచి ఈ పరిశ్రమ గాడిన పడింది . ఇప్పటికే ఎందరో కోళ్లు, గుడ్లు, దాణా , ప్రాసెస్సింగ్ కు సంబంధించిన రంగాలలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారవేత్తలు , కంపెనీలు ముందుకు వస్తున్నాయి . ఈ రంగంలో చాలా కంపెనీలు కోట్లాది రూపాయల లాభాలు ఆర్జిస్తున్నారు . ఇదే రంగంపై ఆధారపడి బతుకుతున్న వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. ప్రతి రోజు వేలాది వాహనాలు కోళ్లు , గుడ్లు, దాణా ను సరఫరా చేస్తున్నాయి. హైదరాబాద్ , మెదక్ , జహీరాబాద్ , కరీం నగర్ , మహబూబ్ నగర్ , జడ్చర్ల , అడ్డాకుల , కొత్తూరు , ఆంగల్ , కడ్తాల్ , ఇలా చాలా ప్రాంతాలలో ఈ పరిశ్రమ జోరుగా సాగుతోంది . బ్యాంక్ లు కూడా వీటి ఏర్పాటు కోసం డబ్బులు రుణాలుగా ఇస్తున్నాయి . ఇవే కాకుండా ఆయా కంపెనీలు కూడా షేర్ బేసిస్ మీద రుణంగా ఇస్తున్నాయి . ఇటీవల రాష్ట్ర సర్కార్ గురుకులాలు, హాస్టల్స్ , కేజీబీవీ స్కూల్స్ ను ఏర్పాటు చేయడంతో ...

చెప్పవే చిరుగాలి ..చల్లగా ఎద గిల్లి ..!

చిత్రం
దేశం హైదరాబాద్ నగరం వైపు చూస్తోంది. అవకాశాలతో పాటు  బతికేందుకు కావాల్సినవన్నీ అత్యంత చౌక ధరల్లో లభిస్తుండటంతో , రవాణా పరంగా అనుకూలంగా ఉండటం , రియల్ ఎస్టేట్ పరంగా తక్కువ ధరల్లో అందుబాటులో లభించడంతో జనం , వ్యాపారులు దీనికే ఓటు వేస్తున్నారు. వీరితో పాటు వ్యాపారస్తులు , కంపెనీలు, బిజినెస్ పీపుల్స్ , రియల్ ఎస్టేట్ దారులు కూడా ఇక్కడికే పరుగులు పెడుతున్నారు . కొత్త ప్రభుత్వం కొలువు తీరడం , కంపెనీదారులకు , వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు భాగ్యనగరం స్వర్గధామంగా మారింది. దీంతో కొత్తగా కంపెనీలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఐటీ హబ్ గా ఈ నగరం పేరు పొందింది. మరో వైపు కార్ల కంపెనీలు , టెలికాం , ఆటోమొబైల్స్ , లాజిస్టిక్ తదితర రంగాలకు చెందినవి కొలువుదీరాయి. ఇక పొద్దున్న లేచినప్పటి నుండి తిరిగి ఉదయం లేచే దాకా గాలి లేకుండా ..పీల్చుకోకుండా ఉండలేని పరిస్థితి . మాల్స్కు వెళ్లినా , కంపెనీలకు వెళ్లినా ఏసీలు , ఫ్యాన్లు ఉండాల్సిందే . ఇక అపార్ట్ మెంట్లు , ఇండ్లు అయితే చెప్పాల్సిన పనిలేదు . తిండి లేకుండా ఉండగలరేమో కానీ ఫ్యాన్లు లేకుండా ఉండలేరు . హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ వస్తువులు , ఫ్యాన్...

మేడిన్‌ ఆంధ్రా..కియా ఆగయా..!

చిత్రం
ఎప్పుడప్పుడా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న వాహనదారుల అభిమానులకు తీపి కబురు అందింది. ఇప్పటికే కార్ల వినియోగంలో ఎన్నో కంపెనీలు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్ రంగంలో ఇండియాకు చెందిన మారుతి సుజుకీనే టాప్ రేంజ్ లో ఉంటూ వస్తోంది . మరో దేశీయ కంపెనీ టాటా మోటార్స్ కూడా తన వాటాను అంతకంతకు పెంచుకుంటూ వస్తోంది . వాహనదారుల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త డిజైన్లు , కలర్స్ , ఫెసిలిటీస్ తో కార్లను రూపొందిస్తున్నాయి ఆయా కార్ల తయారీదారులు ..కంపెనీలు. మారుతీ , టాటా , హ్యుందాయి , హోండా , మహీంద్రా , ఫోర్డ్ , నిస్సాన్ , తదితర కంపెనీలకు చెందిన కార్లు దేశంలో హల్ చల్ చేస్తున్నాయి . వీటితో పాటు మరో విదేశీ కంపెనీ వచ్చి చేరింది అదే ..కియా కార్ల కంపెనీ . సదరు కంపెనీ ఏపీ లోని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసింది . దాదాపు రెండు ఏళ్ళు అవుతోంది స్టార్ట్ చేసి . ఇప్పుడు శరవేగంగా కార్లు తయారవుతున్నాయి.. ఓ రకంగా ఏపీ ఆటోమొబైల్‌ రంగంలో నవశకం ఆరంభమైంది. ఆంధ్రా తయారీ కియా కారు లాంఛనంగా మార్కెట్‌లోకి విడుదలైంది. సెల్టాస్‌ మోడల్‌ వాహనాన్ని  కియా సంస్థ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో కియా సంస్థ ప్రతినిధులతో పాటు రాష్ట్ర ఆర్థిక...

తెలంగాణ అడ్డా ఇక బీఆర్‌కే భవన్

చిత్రం
అనుకున్నదే అయ్యింది. ఇక సచివాలయం ఓ కలగా మిగిలి పోనున్నది. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తో నేటి నుంచి అన్ని శాఖల కార్యకలాపాలన్నీ సచివాలయం నుండి కాకుండా బీఆర్‌కే భవన్ నుంచే ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న దానిని మార్చడంతో వివిధ పనుల నిమిత్తం వచ్చేవారికి ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉన్నది. మొత్తం మీద సర్కార్ కూల్చి వేత్త దిశగా ప్రయత్నాలు ప్రారంభించేందుకు డిసైడ్ అయ్యింది. ఓ వైపు మేధావులు , ప్రజాస్వామిక వాదులు , ప్రజా ప్రతినిధులు , విపక్షాలు అభ్యంతరం చెప్పినా సర్కార్ వినిపించుకోలేదు . కోర్ట్ కూడా ఇంకా అనుమతి ఇవ్వలేదు. అయినా ప్రభుత్వం తాను కోరుకున్న కొత్త సచివాలయం నిర్మాణం నేపథ్యంలో  బూర్గుల రామకృష్ణారావు  భవన్‌లో  కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. సచివాలయంలోని ప్రధాన శాఖలు ఇక్కడి నుంచే విధులు నిర్వర్తించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఈ  భవన్‌ నుండి  కార్యకలాపాలను చేపట్టనున్నారు. సామగ్రి తరలింపు పూర్తయిన తర్వాత ఉద్యోగులు విధుల్లో చేరతారు. తరలింపు దృష్ట్యా ప్రస్తుత సచివాలయంలోని కార్యకలాపాలు  నిలిచి ప...

ఒకే జాతి ..ఒకే నీతి ..ఒకే మతం ..ఒకే దేశం ..ఓ మహాత్మా..!నరేంద్ర మోదీజీ

చిత్రం
ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలిచిన జమ్మూ, కశ్మీర్ , లడఖ్ ప్రాంతాలు స్వేచ్ఛగా విహరించవచ్చు. ఇక ఎలాంటి వేధింఫులు ..కేసులు ..అంటూ ఉండవు. సమున్నత భారతంలో మీరూ ఈరోజు నుండి భాగస్వాములే. ఇక నుంచి ఒకే జాతి ..ఒకే మతం ..ఒకే భాష ..ఒకే దేశం ఉండాలని నేను కలకన్నాను. నాతో పాటే కోట్లాది మంది భారతీయులు కలలు కన్నారు. ఈ భూభాగాన్ని అడ్డం పెట్టుకుని దాయాది దేశంతో పాటు ఈ దేశంలోని వేర్పాటువాదులు , ప్రతీకూల శక్తులు, ప్రగతి నిరోధకులు అడ్డంకులు సృష్టించారు. వారి కుట్రలు , స్వలాభం , రాజకీయ లబ్ది కోసం ఇప్పటి దాకా 45 వేల మంది చనిపోయారు. వారి ఆత్మలు ఇప్పుడు ప్రశాంతంగా ఉండేందుకే నేను ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నా. ఇక నుండి మీరు ఎవ్వరికీ తలవంచు కోవాల్సిన పనిలేదు. చనిపోతామన్న భయం లేదు .  త్వరలోనే అంతా సర్దుకుంటుంది. మీ రంతా బాగుండాలని నేను కోరుకుంటున్నా . అందుకే జమ్మూ , కశ్మీర్ , లడఖ్ లను విభజించడం జరిగింది . దీనిని మీరు సహృదయంతో అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. ప్రపంచంలో మనం ఎందులోనూ తీసిపోమని మన దేశ జవానులు నిరూపించారు . తీవ్రవాదం , ఉగ్రవాదం ఇంకెంత మాత్రం ఉండేందుకు వీలు లేదు . అందుకే ప్రాణాలు అర్పించేందుకైన...

బ్రేకింగ్ ది సైలెన్స్ - మానసిక ఆరోగ్యానికి మెరుగైన చికిత్స

చిత్రం
ఇండియాలో రోజు రోజుకు జనాభా ఆక్టోపస్ లాగా పెరిగి పోతుంటే మరో వైపు మానసికంగా మరింత దిగజారుతూ ..ఆరోగ్య పరంగా తీవ్ర ఇబ్బందులు పడుతూ .. వైద్యుల కోసం పరుగులు తీస్తున్నారు. మెంటల్ హెల్త్ విషయంలో తమ మీద తమకు పట్టు కోల్పోవడం జరుగుతోంది . ఈ విషయంలో ఎక్కువగా మహిళలు, యువతులు , బాలికలు , చిన్నారులు బాధితులుగా ఉంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచానా ప్రకారం ఇండియాలో రాబోయే 2030 లోపు కోతికి పైగా చేరుకుంటారని హెచ్చరించింది. ఇందు కోసం దేశ వ్యాప్తంగా రోగుల కోసం మానసిక పరమైన స్వంత చేకూర్చే క్లినిక్ లు ఏర్పాటు చేయాలని సూచించింది.  ఇప్పటికే మెంటల్ హెల్త్ పరంగా మెరుగైన చికిత్సను అందిస్తున్న వారిలో ఎందరో కృషి చేస్తున్నారు . ఇంకొందరు బాధితులకు చికిత్స, సేవలు అందించేందు కోసం ఏకంగా స్టార్ట్ అప్ లు ఏర్పాటు చేసారు . ఇందు కోసం బ్రేకింగ్ సైలెన్స్ పేరుతో దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాయి అంకురాలు. ఇండియాలోని ప్రతి పది మందిలో ఒకరు లేదా ఇద్దరు మెంటల్ హెల్త్ పరంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. బాధితుల చికిత్స కోసం దాదాపు ట్రిలియన్ డాలర్స్ ఖర్చు అవుతుందని అంచనా. శిప్రా దావర్, జో అగర్వాల్ , అనురీత్ , ఆరుషి సేథీ , ర...

అరుదైన నటీమణి జమున

చిత్రం
పాత తరం నటీమణుల్లో సత్యభామ పాత్ర గురించి మాట్లాడు కోవాల్సి వస్తే మొదటగా గుర్తుకు వచ్చే పేరు జమున. ఏళ్ళు గడిచినా ఆమె అలాగే ఉన్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన తెలుగు మహాసభల్లో పాల్గొన్నారు. సేవలు బాగున్నాయంటూ కితాబిచ్చారు. కర్ణాటకలోని హంపిలో జన్మించారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. నటిగా ఆమె పరిణితి చెందిన పాత్రలు ఎంచుకున్నారు. దానికి ప్రాణం పోశారు. తెలుగు స్వంత భాష కాకపోయినా ఇక్కడే పుట్టి ..ఇక్కడే పెరిగారు . తెలుగు చలనచిత్ర రంగంలో అరుదైన నాయకిగా పేరు సంపాదించుకున్నారు. ఆమె అసలు పేరు జనాబాయి . తర్వాత జామునగా మార్చారు . బాల్యం మొత్తం గుంటూరు జిల్లా దుగ్గిరాలలో జరిగింది .    మరో పేరొందిన నటుడు జగ్గయ్యది కూడా అదే గ్రామం కావడంతో కొత్త పరిచయం కలిగింది. మొదటి నుంచి ఎలాంటి బెరుకు అన్నది లేక పోవడంతో ..బడిలో చదివే కాలంలోనే నాటకాల పట్ల మక్కువ పెంచుకుంది . ఇదే సమయంలో తెనాలి సమీపంలోని మండూరు గ్రామంలో 'ఖిల్జీ రాజ్య పతనం ' అనే నాటిక ప్రదర్శన కోసం ప్రత్యేకంగా జగ్గయ్య జమునను ఎంపిక చేసుకుని తీసుకు వెళ్ళాడు. ఇదే నాటికలో మరో ప్రముఖ నటుడు గుమ్మడి కూడా నటించాడు. నాటకాలలో ఆమె ప్రతిభ నలుమూలలకూ పాకడంతో ...

కథ మారింది ..సీన్ రివర్స్ అయ్యింది

చిత్రం
నిన్నటి దాకా అమెరికా పాట పాడిన దాయాది పాకిస్థాన్ కు దిమ్మ తిరిగేలా కోలుకోలేని షాక్ ఇచ్చింది పెద్దన్న పాత్ర పోషిస్తున్న యూస్. ఓ వైపు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ , మరో వైపు చిలుక పలుకులు పలుకుతున్న పాక్ చేస్తున్నది తప్పేనని స్పష్టం చేసింది . దేశంలో ఉగ్రవాద మూకలు పెట్రేగి పోతుంటే , తీవ్రవాదులు విధ్వంసాలకు పాల్పడుతుంటే ఏం చేస్తున్నారంటూ చీవాట్లు పెట్టింది . పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల అమెరికాలో పర్యటించారు . ఆ దేశ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తో సమావేశమయ్యారు. ఈ సుదీర్ఘమైన భేటీలో కీలక చర్చలు జరిగాయి . ఇప్పుదు పాక్ తీవ్ర ఆర్ధిక సంక్షోభం తో కొట్టు మిట్టాడుతోంది .  ఈ సమయంలో ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే తమ దేశంలో 40 వేల మందికి పైగా తీవ్రవాదులు ఉన్నారని, వారిని గతంలో దేశాన్ని ఏలి పాలకులు పెంచి పోషించారంటూ సంచల వ్యాఖ్యలు చేశారు. దీంతో విస్తు పోవడం ట్రంప్ వంతయ్యింది. అక్కడ కూడా కాశ్మీర్ అంశం గురించి ఇమ్రాన్ ఇండియాపై విషం కక్కారు. ఈ సమయంలో భారత్ తో స్నేహ పూర్వకంగా ఉండాలని యుఎస్ సూచించింది . మరో వైపు అమెరికా , చైనా దేశాలకు పాకిస్తాన్ కావాలి. కానీ ఇండియాను యుఎస్ వదు...