పోస్ట్‌లు

జనవరి 5, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

ఫాల్కే అవార్డుకు కృష్ణ అర్హుడు

చిత్రం
తెలుగు సినీవాలీలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. మెగా స్టార్ చిరంజీవి, ప్రిన్స్ మహేష్ బాబు, లేడీ అమితాబ్ విజయశాంతి ఒకే వేదికపై నిలిచిన సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేష్, రష్మిక నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాల్ బహదూర్ స్టేడియం లో జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ చిత్రాన్ని ఐదు నెలల్లో షూటింగ్‌ పూర్తి చేసి, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి నన్ను పిలవగానే ఆశ్చర్యం వేసింది..షాక్‌ తిన్నాను..ఆనందం వేసింది. ప్రతి హీరో, ప్రతి డైరెక్టర్‌ ఇంత స్పీడ్‌గా, క్వాలిటీగా సినిమాలు చేస్తే ఇండస్ట్రీకి ఇంత కంటే ఇంకేం కావాలి..అందరూ ఇలాగే చేయాలి..అప్పుడే ఈ పరిశ్రమ పదికాలాల పాటు పచ్చగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ ఉపాధి ఉంటుంది.. థియేటర్స్‌ కళకళ లాడుతుంటాయి అని చిరంజీవి అన్నారు. ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్ర చేశారు. దిల్‌ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మించారు. అందరి అభిమానుల మధ్య ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం కావాలి.. ఇదే నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నా.. ఈరోజు నిరూపించినందుకు మహేష్ ను అభినందిస...

టాటా తీరుపై మిస్త్రీ ఆగ్రహం

చిత్రం
టాటా సంస్థలు తనపట్ల అనుసరిస్తున్న తీరుపై మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మిస్త్రీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టాటా సన్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా తన నియామకాన్ని పునరుద్ధరిస్తూ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ తీసుకున్న నిర్ణయం, తనను చట్ట విరుద్ధంగా తొలగించిన విధానంతో పాటు, తనను రతన్‌ టాటా ఇతర ట్రస్టీలు అణిచివేతకు గురిచేసిన తీరును గుర్తించిందని సైరస్‌ మిస్త్రీ వ్యాఖ్యానించారు. ఎన్‌క్లాట్‌ ఉత్తర్వులు తనకు అనుకూలంగా వచ్చినప్పటికీ టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ సహా, టీసీఎస్‌, టాటా టెలీసర్వీసెస్‌, టాటా ఇండస్ర్టీస్‌లో డైరెక్టర్‌ పదవుల కోసం పాకులాడటం లేదని స్పష్టం చేశారు. మరోవైపు సైరస్‌ మిస్త్రీని టాటా సన్స్‌ చీఫ్‌గా పునరుద్ధరిస్తూ ఎన్‌క్లాట్‌ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ టాటా గ్రూప్‌ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎన్‌క్లాట్‌ ఉత్తర్వులు టాటా గ్రూపు కంపెనీల్లో కార్పొరేట్‌ గవర్నెన్స్‌తో పాటు సంస్థలో దశాబ్ధాల తరబడి నెలకొన్న విధానాలను దెబ్బతీసేలా ఉన్నాయని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో సంస్థ పేర్కొంది. ఎన్‌సీఎల్‌టీ తీర్పును సవాల్‌ చేస్తూ మధ్యంతర స్టే ఇవ్వాల...

కీప్ ఇట్ అప్ మలినేని

చిత్రం
టాలెంట్ కలిగిన వాళ్ళను అభినందించడంలో తమిళ డైరెక్టర్ల తర్వాతే. అక్కడ పేరొందిన నటులు కూడా దర్శకులను ప్రశంసలతో ముంచెత్తడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ మంచి సంప్రదాయం మాత్రం టాలీవుడ్ లో అగు పించదు. ఇదిలా ఉండగా పాన్ ఇండియా డైరెక్టర్ మురుగదాస్ మాత్రం ఎలాంటి భేషజాలకు పోకుండా వెన్నుతట్టి ప్రోత్సహించడం చేస్తూ వస్తున్నారు. సందేశంతో కూడిన కమర్షియల్‌ చిత్రాలను తెర కెక్కించడంలో ఆయన దిట్ట. తాజాగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా మురుగదాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం దర్బార్‌. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. చాలా కాలం తర్వాత రజనీ పోలీస్‌ గెటప్‌లో అభిమానులను కనువిందు చేయనున్నాడు. ఇక చిత్ర ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రజనీ, దర్బార్‌ టీంతో పాటు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అయితే ప్రమోషనల్‌ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లోనే ఉన్న డైరెక్టర్‌ ఏఆర్‌ మురగదాస్‌..రవితేజ తాజా చిత్రం క్రాక్‌ సెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన విషయాలను తెలుసుకున్న మురుగదాస్‌ అనంతరం డైరెక్టర్‌ గోపిచంద్‌ మ...

నమ్రత ఫొటోస్..హల్ చల్

చిత్రం
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమాపై అభిమానులు, చిత్ర యూనిట్ భారీ అంచనాలే పెట్టుకుంది. ఈ మూవీలో చాలాకాలం తర్వాత లేడీ అమితాబ్ గా పేరున్న విజయశాంతి నటిస్తుండటం విశేషం. ఇదే సమయంలో మహేశ్‌ బాబు సతీమణి, నటి, నిర్మాత నమ్రతా శిరోద్కర్‌ తన ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్ట్‌ నెటిజన్లను తెగ ఆకట్టు కుంటోంది. అంతే కాకుండా ఆ ఫోటో సోషల్‌ మీడియాల్‌ వైరల్‌ అవుతోంది. ఫోటోతో పాటు తన మనసులోని ఆంతరంగిక భావాలను జోడించి ఓ సందేశాన్ని సైతం పోస్ట్‌ చేశారు. నమ్రత పోస్ట్‌ చేసిన ఆ ఉద్వేగ భరిత పోస్ట్‌ అందరి హృదయాలను హత్తు కుంటోంది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే కృష్ణ, మహేశ్‌, గౌతమ్‌లు ఒకే విధంగా, ఒకే రకమైన క్యాస్టూమ్స్‌ అందంగా అంతకు మించి హుందాగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో చూపరుల మది దోచేస్తోంది. ఈ ఫోటోతో పాటు వీరే నా సూపర్‌ హీరోలు. వీరే నా బలం. ఈ ముగ్గురితో నా జీవితం సంపూర్ణమైంది. నా మీద ఈ ముగ్గురు చూపిస్తున్న ప్రేమ, గౌరవాలకు నేను కృతజ్ఞురాలిని. ఇప్పటికీ ఈ ముగ్గురు నాకెన్నో కొత్త విషయాలు నేర్పిస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ, నమ్రతా మనసు దోచుకునేలా మెసేజ్‌ పోస్ట్‌ చేశార...

సినీవాలిలో మెరిసిన రత్నాలు

చిత్రం
తెలుగు సినీ రంగం చాలా చిత్రమైనది. గతేడాది చాలా సినిమాలు వచ్చాయి. కానీ కొన్ని మాత్రమే సక్సెస్ ను మూటగట్టుకున్నాయి. ఊహించని రీతిలో చిన్న సినిమాలు బిగ్ స్టార్స్ కు ధీటుగా కలెక్షన్స్ వసూలు చేసి విస్తు పోయేలా చేశాయి. ఇదే సమయంలో కొత్తగా నటీ నటులు, సినీ టెక్నీషియన్స్ తమ టాలెంట్ తో ఆకట్టుకున్నారు. అందరి కంటే ఎక్కువగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందారు. కేరాఫ్ కంచరపాలెం సినిమా సినీ విమర్శకులను సైతం మెప్పించింది. చిన్న టౌన్స్ లలో కూడా ఈ సినిమా బాగా ఆడింది. ఈ మూవీలో మొత్తం స్థానికులే నటించడం విశేషం. అలాగే ఎక్కువగా మరిచి పోలేని నటిగా మనసు దోచుకున్నది మాత్రం అనన్యనే అని చెప్పక తప్పదు. మల్లేషం సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇది ఓ యువకుడి కన్నీయి కథ. సునయన, ఊర్వశి కలిసి అనసూయ, సులోచనగా ఓ బేబీ సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఫలక్నుమా దాస్ సినిమాలో సైదులు పాత్రలో తరుణ్ భాస్కర్ దుమ్ము రేపారు. తన తెలంగాణ స్లాంగ్ తో ఆకట్టుకున్నారు. అన్వేష్ మైఖేల్ , జగదీశ్ ప్రతాప్ లు సైతం మల్లేషం మూవీలో నటించారు. ఇక మరో సినిమా విప్లవ వీరుడు, లక్షలాది మందిని ప్రభావితం చేసిన యోధుడు జార్జి రెడ్డి పై తీసిన సినిమ...