పోస్ట్‌లు

మే 11, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఇండియాలో టాప్ స్టార్ట‌ప్స్ ఇవే

చిత్రం
ప్ర‌పంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ రంగంలో చోటు చేసుకున్న మార్పుల‌కు అనుగుణంగా ఇండియా మారుతోంది. త‌న స్వ‌రూపాన్ని మార్చేసుకుంటోంది. ఇండియాకు చెందిన ఔత్సాహికులు , ఆంట్ర‌ప్రెన్యూర్స్ ఎక్క‌డ‌లేనంత మంది పుట్టుకొచ్చారు. కొత్త ఆలోచ‌న‌ల‌కు రెక్క‌లు తొడుగుతున్నారు. త‌మ‌ను తాము ప్రూవ్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. న్యూ థాట్స్..నూ లుక్స్‌..న్యూ డిజైన్స్‌తో తెగ ఆక‌ట్టుకుంటున్నారు. వ్యాపారంలో డ‌బ్బులు ముఖ్యం కాద‌ని..కాస్తంత తెలివి వుంటే చాలు..కాస్తంత న‌డుం వంచి క‌ష్ట‌ప‌డితే..నాణ్య‌వంత‌మైన స‌ర్వీసులు అందజేయ‌గ‌లిగితే కోట్లు వెన‌కేసుకోవ‌చ్చు. తాము ఎదుగుతూ..తాము బ‌తుకుతూ తమ లాంటి వారికి..త‌మ తోటి వారికి లైఫ్ ఇవ్వొచ్చు. ఇటీవ‌ల యువ‌తీ యువ‌కుల్లో ఒక్క‌టే క‌నిపిస్తోంది. తామేమిటో నిరూపించుకునే అవ‌కాశం తాము స్థాపించిన లేదా ప్రారంభించిన దానితోనే సాధ్య‌మ‌వుతుంద‌ని న‌మ్ముతున్నారు. ఇంకొక‌రి ద‌గ్గ‌ర ప‌ని చేసేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేదు. స్వంతంగా ఏదైనా తామే స్టార్ట్ చేయాల‌ని త‌పిస్తున్నారు. ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ట్రైన‌ర్స్‌తో , అనుభ‌వ‌జ్ఞుల‌తో, మెంటార్స్‌తో ఇలా ఆయా రం...

ఐపీఎల్ మ్యాచ్ స‌రే..టికెట్ల మాటేమిటి..? ఫ‌్యాన్స్ సంగ‌తేంటి..?

చిత్రం
నిన్న‌టి దాకా ఎన్నిక‌ల వేడి తెలంగాణ‌ను రాజేస్తే..ఇపుడు దాని కేపిటిల్ సిటీ హైద‌రాబాద్‌ను ఐపీఎల్ ఫీవ‌ర్ అంటుకుంది. ఎక్క‌డ చూసినా..ఎవ్వ‌రి నోట విన్నా ఫైన‌ల్ మ్యాచ్ గురించే చ‌ర్చంతా..ర‌చ్చంతా. ఇసుక వేస్తే రాల‌నంత జ‌నం మ్యాచ్ జ‌రిగే మైదానం వెలుప‌ల నిలుచుకున్నారు. అదేదో మ‌హేష్, ప‌వ‌న్ సినిమాల టికెట్ల కోసం క్యూలో నిల్చున్న‌ట్లు ఫైన‌ల్ పోరు చూసేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. బంగారు తెలంగాణ స‌ర్కార్ చేతులెత్తేసింది. హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ ఉందో లేదో ఎవ‌రికీ తెలియ‌దు. ఎన్నిక‌ల‌ప్పుడు హ‌డావుడి ..ఆ త‌ర్వాత ష‌రా మామూలే. టికెట్లు దొర‌క‌క యువ‌తీ యువ‌కులు ల‌బోదిబోమంటున్నారు. సెమీ ఫైన‌ల్ ఫోరుకు ఏపీలోని విశాఖ ఆతిథ్యం ఇస్తే..ఇపుడు ఫైన‌ల్ మ్యాచ్ మ‌న వంతు వ‌చ్చింది. దీనిని ఆస‌రాగా తీసుకున్న మ‌ధ్య ద‌ళారీలు వంద‌ల్లో ఉన్న టికెట్ల‌ను వేలాది రూపాయ‌ల‌కు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జ‌రుగుతున్నా ప్ర‌భుత్వం , క్రీడాశాఖ , సంస్థ చూసీ చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. దీనిని నియంత్రించాల్సిన బీసీసీఐ త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇంత‌వ‌ర‌కు పూర్తి స్థాయిలో తెలంగాణ క్రికెట్...

అంత‌టా ఐపీఎల్ ఫీవ‌ర్ - బంతి గెలిచేనా..బ్యాట్ నిలిచేనా - గెలిచేది క్రికెట్టే

చిత్రం
ల‌లిత్ మోదీ, జ‌గ‌న్మోహ‌న్ దాల్మియా వీరిద్ద‌రూ లేక‌పోతే క్రికెట్‌కు ఇంత‌టి మ‌జా వ‌చ్చి వుండేది కాదేమో. ఒక‌రేమో భౌతికంగా మ‌న మ‌ధ్య లేరు. ఇంకొక‌రు అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ విదేశాల్లో త‌ల‌దాచుకున్నారు. ప్ర‌పంచ క్రికెట్ కౌన్సిల్‌ను శాసిస్తున్న దేశం ఏదైనా ఉందంటే అది ఒక్క ఇండియానే. ప్ర‌భుత్వాలతో ప‌నిలేదు..పాల‌కుల‌ను కేర్ చేయ‌రు. ఎవ‌రినీ ద‌గ్గ‌ర‌కు రానీయ‌రు..ఇది భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డుపై ఉన్న అప‌వాదు. వీట‌న్నింటిని ప‌క్క‌న పెడితే ..ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్న వంత‌మైన దేవాల‌యాల్లో శ్రీ వేంక‌టేశ్వ‌రుడు..అలివేలు మంగ‌మ్మ చ‌రిత్ర సృష్టిస్తే..భారీ ఆదాయాన్ని మూట‌గ‌ట్టుకుని ..బిలియ‌న్ డాల‌ర్ల‌ను దాటి ట్రిలియ‌న్ డాల‌ర్ల‌ను దాటేసిన క‌థ బీసీసీఐది. క‌నీసం ఒక్క‌సారి ఛాన్స్ కోసం ఎంద‌రో పొలిటిక‌ల్ స్టార్స్, ఆట‌గాళ్లు, సెల‌బ్రెటీలు, బిజినెస్ ప‌ర్స‌నాలిటీస్, టైకూన్స్, వివిధ కంపెనీల దిగ్గ‌జాలు, అధిప‌తులు పోటీ ప‌డ్డారు. ప‌డుతూనే ఉన్నారు. కానీ ఏ ఒక్క‌రు దాని ప‌రిధిలోకి వెళ్ల‌లేక పోతున్నారు. అంత‌టి దుర్భేద్య‌మైన ఏర్పాట్లు చేసేసుకుంది క్రికెట్ బోర్డు. అది స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌లిగిన సంస్థ‌. ...

ప‌వ‌ర్ పాలిటిక్స్‌లో శ్ర‌వ‌ణానందం..!

చిత్రం
తుచ్చు ప‌ట్టిన రాజ‌కీయాల్లో ఆయ‌నో రాకెట్‌లా ముందుకు వ‌చ్చారు. తెలంగాణ ప్రాంతంలో ఎన్న‌ద‌గిన ..ప‌రిణితి చెందిన రాజ‌కీయ వేత్త‌ల‌లో..మేధావుల‌లో..విశ్లేష‌కుల‌లో ప‌ట్టుమ‌ని ప‌ది మందిని ఎంపిక చేస్తే ..అందులో దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ ముందు వ‌రుస‌లో నిలుస్తారు. అంతలా ఆయ‌న వినుతికెక్కారు. కొన్నేళ్లుగా..త‌ర‌త‌రాలుగా మోసానికి..దోపిడీకి గురైన మ‌ట్టిత‌న‌పు ఆన‌వాళ్లు క‌లిగిన ..క‌ర‌వుకు ఆల‌వాల‌మైన న‌ల్ల‌గొండ జిల్లా నుంచి వ‌చ్చారు. విశ్వ‌బ్రాహ్మ‌ణ కులం నుంచి వ‌చ్చిన ఆయ‌న ఎన్నో క‌ష్టాలు అనుభ‌వించారు. కానీ విద్యాధికుడిగా..మేధావిగా..తెలంగాణ ప్రాంతాన్ని .దాని అస్తిత్వాన్ని అర్థం చేసుకున్న నాయ‌కుడిగా అంచెలంచెలుగా ఎదిగారు. ఓ ఐటీ కంపెనీకి బాధ్యులుగా ఉన్నారు. స‌మాజాన్ని ప్ర‌భావితం చేసే ప్ర‌తి అంశం ప‌ట్ల దాసోజు స్పందించారు. స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం జ‌రిగిన పోరాటంలో , ఉద్య‌మంలో నిజాయితీగా పాల్గొన్నారు. నిబ‌ద్ధ‌త క‌లిగిన కార్య‌క‌ర్త‌గా, వ్య‌క్తిగా త‌న వంతు బాధ్య‌త‌ను నిర్వ‌హించారు.తెలంగాణ‌కు జ‌రిగిన అన్యాయం గురించి కేసీఆర్, జ‌య‌శంక‌ర్ లాంటి వాళ్లు జ‌నాన్ని జాగృతం చేస్తే..శ్ర‌వ‌...

ర‌విప్ర‌కాశ్ ఎందుకిలా..?

చిత్రం
తెలుగు మీడియా రంగంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను ఆపాదించుకుని..ఓ బ్రాండ్‌గా ఎదిగిన ర‌వి ప్ర‌కాశ్ జ‌ర్న‌లిస్టుగా సుప‌రిచితులే. ప్రింట్ అనే స‌రిక‌ల్లా రామోజీరావు ఎలా గుర్తుండి పోతారో..మీడియా అనే స‌రిక‌ల్లా ర‌వి అలాగే గుర్తుండి పోతారు. చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో బ‌షీర్ బాగ్ సంఘ‌ట‌న అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. రైతుల‌పై కాల్పులు..దానిని ప్ర‌జెంటేష‌న్ చేసిన తీరు తెలుగువారిని ఆశ్చ‌ర్య పోయేలా చేసింది. ఆ త‌ర్వాత ఓ మిస్సైల్‌లా దూసుకు వ‌చ్చాడు. అంత‌కు ముందు సుప్ర‌భాతంలో ప‌నిచేసిన‌ట్టు గుర్తు. వెలిజాల శ్రీ‌నివాస్ రెడ్డి, ర‌విప్ర‌కాశ్ ఇద్ద‌రూ ఒక టేబుల్ ద‌గ్గ‌ర కూర్చుంటే..నేను శైలేష్ రెడ్డి మ‌రో టేబుల్ వైపు కూర్చున్నాం. ఆ స‌మ‌యంలో టీవీ9 ఛాన‌ల్ గురించి చ‌ర్చ జ‌రుగుతోంది. తెలుగు రాష్ట్రంలో అదో సంచ‌ల‌నం. 24 గంట‌ల న్యూస్ ఛాన‌ల్‌ను ఎవ‌రు చూస్తారులే అనుకున్నారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌తో పాటు పాత్రికేయులు, మీడియా ప్ర‌ముఖులు, బ్రాడ్ కాస్ట్ జ‌ర్న‌లిస్టులు, ఫ్రీలాన్స‌ర్స్ కూడా. కానీ అక్క‌డే తానేమిటో రుజువు చేసుకున్నాడు. వ్య‌క్తిగ‌తంగా విభేదించినా ..జ‌ర్న‌లిస్టుగా ర‌వి సాధించిన స‌క్స...

ఐటీసీ గ్రూప్ ఛైర్మ‌న్ క‌న్నుమూత

చిత్రం
ప్ర‌పంచంలోనే అత్యంత న‌మ్మ‌క‌మైన కంపెనీగా పేరొందిన ఐటీసీ గ్రూప్ కంపెనీల‌కు దీర్ఘ‌కాలం పాటు ఛైర్మ‌న్‌గా ఉన్న వై.సి. దేవేశ్వ‌ర్ క‌న్నుమూశారు. ఆయ‌న‌కు 72 ఏళ్ల వ‌య‌సు. 2011లో భార‌త ప్ర‌భుత్వం అంద‌జేసే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప‌ద్మ భూష‌ణ్ అవార్డును ఆయ‌న అందుకున్నారు. విశిష్ట‌మైన నాయ‌క‌త్వం..నిబ‌ద్ధ‌త క‌లిగిన వ్య‌క్తిగా ఆయ‌న ఎదిగారు. ఇండియాలో ఎక్కువ కాలం కంపెనీల‌కు ఛైర్మ‌న్‌గా ప‌ని చేయ‌డంతో చ‌రిత్ర సృష్టించారు. 1996లో ఐటీసీ కంపెనీ తీవ్ర సంక్షోభంలో ఉన్న స‌మ‌యంలో దేవేశ్వ‌ర్ ఛైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు తీసుకున్నారు. ఇక అప్ప‌టి నుంచి నేడు త‌నువు చాలించేంత దాకా ఆయ‌న ఎక్కువ కాలం స‌మ‌ర్థ‌వంతంగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. స్టేక్ హోల్డ‌ర్స్, డైరెక్ట‌ర్లు కంపెనీని వీడారు. అయినా దేవేశ్వ‌ర్ వెనుతిరిగి చూడ‌లేదు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కంపెనీని లాభాల బాట ప‌ట్టించేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నం చేశాడు. కంపెనీకి జ‌వ‌స‌త్వాలు క‌లిగిస్తూ అభివృద్ధిలోకి తీసుకు వ‌చ్చారు. కంపెనీ బాధ్య‌త‌లు చేప‌ట్టాక‌..రెండేళ్లు దాటిన త‌ర్వాత ఐటీసీని ప‌రుగులు పెట్టించారు. ఉద్యోగులు, సిబ్బందిలో న‌మ్మ‌కాన్ని పెంచారు. వారికి ...

అంద‌రి చూపు మోదీ వైపు

చిత్రం
గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా భార‌త‌దేశంలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుందో ఏ సంస్థా స‌రైన అంచ‌నాకు రాలేక పోతున్నాయి. మారుతున్న స‌మీక‌ర‌ణ‌లు , తీసుకున్న నిర్ణ‌యాలు ఒకింత ఆశ్చ‌ర్యం క‌లిగించినా మోదీ స‌ర్కార్ వైపు సామాన్యులు చూస్తున్నార‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. కొన్ని వ‌ర్గాలు, సంస్థ‌లు, కార్పొరేట్ కంపెనీలు త‌మ గుప్పిట్లో వుంచుకునేందుకు శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. దేశమంత‌టా ఒక ఎత్త‌యితే..మోదీ ఒక్క‌రే ఒక్క‌డుగా ఈ ఎన్నిక‌ల్లో ఒంట‌రి పోరాటం సాగిస్తున్నారు. ప్రాంతీయ పార్టీల పేరుతో చంద్ర‌బాబు నాయుడు, కేసీఆర్ లు కూట‌ములు క‌ట్టినా ఫ‌లితం లేకుండా పోతోంది. ముంద‌స్తు స‌ర్వేలు ఎంత‌గా హంగ్ ఏర్ప‌డుతుంద‌ని మొత్తుకుంటున్నా ఫ‌లితాలు మాత్రం దిమ్మ తిరిగేలా ఉండ‌బోతున్నాయ‌నేది క‌ర‌డు క‌ట్టిన ..నిఖార్స‌యిన జ‌ర్న‌లిస్టుల అంచ‌నా. నోట్ల ర‌ద్దు, నిరుద్యోగం, ఉపాధి అవ‌కాశాలు లేక పోవ‌డం, కొత్త ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు కాక పోవ‌డం ఇవేవీ మోదీ ప్ర‌భుత్వాన్ని నీరుగార్చ‌లేక పోతున్నాయి. బీజేపీ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం కానీ, నాయ‌కుడు కానీ ముందుకు రాలేక పో...