పోస్ట్‌లు

జనవరి 1, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

మెట్రోకు జైకొట్టిన జనం

చిత్రం
హైదరాబాద్ ఐటీ హబ్ గా మారాక నగరవాసులు, యూత్ జోష్ మీదుంది. ఎక్కడ పడితే అక్కడ మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది. అంతే కాదు ఎన్ని సీసీ కెమెరాలు అమర్చినా జరిగే దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం సిటీ వాసులంతా ఆర్టీసీ కంటే మెట్రో సర్వీసెస్ బెటర్ అంటున్నారు. రికార్డు స్థాయిలో ఇందులోనే జనం జర్నీ చేస్తున్నారు. దీంతో ఎక్కడ లేని ఆదాయాన్ని మూటగట్టుకుంటోంది మెట్రో. కొత్త ఏడాదికి మెట్రో సరికొత్త రికార్డుతో వెల్ కమ్ చెప్పింది. ఈ ఒక్క రోజులోనే దాదాపు 4.60 లక్షల మంది ట్రైన్ జర్నీ చేశారు. ఇప్పటి వరకు ఇదే రికార్డ్. సెలబ్రేషన్స్​ నేపథ్యంలో ట్రైన్స్​ టైమింగ్ పెంచడం, మద్యం లిమిట్‌గా తాగిన వాళ్లకూ అనుమతి ఇవ్వడం మెట్రోకు కలిసొచ్చింది. అర్ధరాత్రి దాటాక ఒంటి గంట వరకు పొడిగించిన టైమింగ్స్‌తో ఒక్క రోజులో లక్షల మంది మెట్రోజర్నీ చేసినట్లు అధికారులు ప్రకటించారు. హైదరాబాద్‌ మెట్రోకు ఇది మరో మైలురాయి. గతంలో 4.10 లక్షల నుంచి 4.20 లక్షల మంది వరకు గరిష్ఠంగా ప్రయాణించిన రోజులు ఉన్నాయి.​ సెలబ్రేషన్స్ సందర్భంగా రైళ్ల టైమింగ్స్‌ను పొడిగించారు. లిమిటెడ్‌‌గా మద్యం తాగిన వారిని ప్రయాణించేందుకు అనుమతించడంతో నగర వాసులు ఎక్కు...

ఇక ఆఫ్ లైన్లోనే మొబైల్స్

చిత్రం
ఆఫ్ లైన్ లో వ్యాపారం తగ్గుతోంది. అన్ని కంపెనీలు ఆన్ లైన్ జపం చేస్తున్నాయి. దీంతో లక్షలాది రూపాయలు పెట్టుబడి పట్టిన రిటైలర్లు, వ్యాపారులకు తీరని నష్టం జరుగుతోంది. ఇటీవల ఈ కామర్స్ వ్యాపారం ఎన్నడూ లేని రీతిలో కోట్ల రూపాయల్లోకి చేరింది. ప్రతి ఒకరు ఆన్ లైన్ లోనే కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో వ్యాపారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చైనా దిగ్గజ మొబైల్ కంపెనీ వివో ఇక నుంచి ఆన్ లైన్ లో మొబైల్స్, యాక్ససరీస్ ను అమ్మబోమని తేల్చి చెప్పింది. ఈ మేరకు వివో కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ ద్వారా ప్రత్యేక ఆఫర్లతో దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగ దారులను ఆకట్టుకున్న వివో ఇండియా తాజాగా షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్‌ ఎక్స్‌క్లూజివ్ సేల్స్‌ అందుబాటులో వుండవని తేల్చి చెప్పింది. రిటైలర్స్‌కు మేలు చేయాలన్న సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. అయితే తమ ఉత్పత్తులను దాదాపు అవే ధరలకు మిగతా చానళ్ల ద్వారా తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచుతామని వివో ఇండియా సీఈవో జెరోమ్ చెన్ వెల్లడించారు. దీంతో వివోకు సంబంధించిన ఉత్పత్తులన్నీ స్టాండర్ట్ రేట్స్‌కే లభిస్తాయన్నారు. అ...

నటాషాతో పాండ్యా ఫిక్స్

చిత్రం
గత కొంత కాలంగా చెట్టా పట్టా లేసుకుని తిరుగుతున్న టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ముంబైలో స్థిరపడ్డ సెర్బియా నటి నటాషా స్టాన్‌ కోవిచ్‌ల జంట త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కానుంది. దీనిలో భాగంగా వీరిద్దరి నిశ్చితార్థ వేడుక ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా జరిగింది. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో స్పీడ్‌ బోట్‌లో విహరిస్తూ వీరిద్దరు తమ నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. నా మెరుపు తీగతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాను అని హార్దిక్‌ పాండ్యా తెలిపాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో నటాషాతో నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలు పోస్ట్‌ చేశాడు. కాగా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే వీరు నిశ్చితార్థం చేసుకోవడంతో ఇది ఫ్యాన్స్‌తో పాటు క్రికెటర్లను సైతం కాస్త ఆశ్చర్యం కల్గించింది. హార్దిక్‌, నటాషాల నిశ్చితార్థం జరగడంతో పలువురు క్రికెటర్లు విషెస్‌ తెలియ జేశారు. టీమిండియా కెప్టెన్‌ కోహ్లి వాటే సర్‌ప్రైజ్‌ హార్దిక్‌ అంటూ అభినందనలు తెలిపాడు. కంగ్రాట్స్‌ హార్దిక్‌. వాటే ప్లెజెంట్‌ సర్‌ప్రైజ్‌. మీ భవిష్యత్తు మరింత బాగుండాలి అంటూ విష్‌ చేశాడు. ఇక టీమిండియా ఓపెనర్‌, హ...

అబ్బా..ట్రాయ్ దెబ్బ

చిత్రం
తమ చేతుల్లో ఉన్నారు కదా అని అడ్డగోలుగా యూజర్ చార్జీలు పెంచుకుంటూ వెళుతున్న కేబుల్ ఆపరేటర్స్ కు ట్రాయ్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇప్పటికే చార్జీల మోతతో ఇబ్బందులు పడుతున్న కేబుల్ వినియోగదారులకు శుభవార్త. త్వరలో కేబుల్ బిల్లులు తగ్గనున్నాయి. ఈ మేరకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా కస్టమర్ల ప్రయోజనాలు కాపాడే దిశగా ట్రాయ్‌ కేబుల్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ నిబంధనలకు కొత్త సవరణలు చేసింది. దీనికి సంబంధించి ఎంఎస్‌వోలకు ట్రాయ్‌ కొత్త గైడ్‌లైన్స్‌‌ను కూడా విడుదల చేసింది. తద్వారా కేబుల్‌ టీవీ ఆపరేటర్లకు భారీ షాకిచ్చింది.బ్రాడ్కాస్టర్లు విధించే చానల్ గరిష్ఠ ధరను 19 నుంచి12కు తగ్గించింది. అలాగే నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు ను 130 గా నిర్ణయించింది. ఈ నిబంధనలు మార్చి1 నుంచి అమల్లోకి వస్తాయి. అంతేకాదు ఈ కొత్త  నిబంధనలను ఈ  నెలాఖరు నాటికి వెబ్‌సైట్‌లో ఉంచాలని కూడా ఎంఎస్‌వోలను ఆదేశించింది. తాజా సవరణలో భాగంగా అన్ని ఫ్రీ ఛానళ్లకు వసూలు చేసే ఫీజును ట్రాయ్‌ 140కి పరిమితం చేసింది. ఒక ఇంట్లో ఒకటి కన్నా ఎక్కువ టీవీలుంటే వాటికి ఎన్‌సీఎఫ్‌లో 40 శాతం చొప్పున అదనంగా వసూలు చేసు కోవచ్చని తెలిపింది. దీన్ని ...

ఇక బందరుకు కొత్త కళ

చిత్రం
బందరు ఏపీకి కేరాఫ్ గా మారనుంది. వ్యాపార, వాణిజ్య పరంగా కొత్త రూపు సంతరించు కోనున్నది. ఫిషింగ్‌ హార్బర్‌కు మహర్దశ పట్టనుంది. గత కొన్నేళ్లుగా అలంకార ప్రాయంగా మారిన హార్బర్‌ అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించింది. హార్బర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి 280 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేసింది. సముద్ర ముఖ ద్వారం వద్ద తరచూ ఇసుక మేటలు వేస్తుండటంతో అన్ని వేళల్లో మర పడవలు వేటకు వెళ్లే అవకాశాలు ఉండటం లేదు. కేవలం సముద్రానికి పోటు వచ్చిన సమయంలోనే వేటకు వెళ్లే వీలు ఉండటంతో నిర్వాహకులు తీవ్రంగా నష్ట పోతున్నారు. ఒకసారి మర పడవ ఒడ్డుకు వస్తే మళ్లీ సముద్రానికి పోటు వచ్చినప్పుడు మాత్రమే వేటకు వెళ్లే అవకాశం ఉంటోంది. ఇలా పోటు వచ్చినప్పుడే సముద్రంలోకి వెళ్లాలంటే కనీసం 12 గంటల పాటు నిర్వాహకులు ఒడ్డున నిరీక్షించాల్సి వస్తోంది. పదేళ్ల క్రితం గిలకలదిండిలో 4.70 కోట్లతో నిర్మించిన హార్బర్‌తో నిర్వాహకులకు పెద్దగా లబ్ధి చేకూరడం లేదు. గతంలో సముద్ర ముఖ ద్వారం వద్ద ఇసుక మేటల తొలగింపునకు పూర్తి స్థాయి చర్యలు తీసుకోలేదు. ఇసుక మే...

స్వేచ్ఛ కోసం నిరసన గళం

చిత్రం
హాంకాంగ్ నిరసనకారులతో అట్టుడికి పోయింది. గత కొంత కాలం నుంచి పెద్ద ఎత్తున చైనాకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు, యువత ఉద్యమిస్తున్నారు. నిరసన ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నారు. ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులు నూతన సంవత్సరం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్య ఆందోళనలను ఉధృతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. గత ఏడు నెలలుగా లక్షలాది హాంకాంగ్‌ వాసులు ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆందోళనలు చేస్తున్నారు. న్యూ ఇయర్ ను పురస్కరించుకుని చేపట్టిన ర్యాలీలో లక్షలాది మంది ఆందోళనకారులు పాల్గొన్నారు. వారి ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పెప్పర్‌ స్ప్రే, టియర్‌ గ్యాస్, వాటర్‌ కెనాన్‌లను ఆందోళనకారులపై ప్రయోగించారు. ప్రతిగా పోలీసులపై పెట్రోల్‌ బాంబులను ఆందోళనకారులు విసిరారు. వీధుల్లోని చైనా అనుకూల వ్యాపార సముదాయాలను ధ్వంసం చేశారు. కాగా, 100 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తమపై చైనా పెత్తనం ఎందుకంటూ ఇక్కడి జనం నిలదీస్తున్నారు. దీని వెనుక అమెరికా కుట్ర ఉందంటూ చైనా ఆరోపిస్తోంది. ఆ మేరకు అనుమానం వ్యక్తం చేస్తోంది కూడా. ఇదిలా ఉండగా హాంగ్ కాంగ్ సిటీ వరల్డ్ లో పేరొందిన నగరం. వ్యాపార...

జ్వాల వైరల్..ఫోటోలు హల్ చల్

చిత్రం
బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల ఆట పరంగా కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులర్ అవుతోంది. ఎప్పటికప్పుడు తన  ఫొటోస్ తో ఫ్యాన్స్ కు మరింత వేడి పుట్టిస్తోంది. తాజాగా ఈ ప్లేయర్ గుత్తా జ్వాల షేర్‌ చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. న్యూ ఇయర్‌ సందర్భంగా విషెస్‌ తెలుపుతూ తమిళ హీరో విష్ణు విశాల్‌తో కలిసి దిగిన ఫోటోలను గుత్తా జ్వాల తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేశారు. అయితే ఇప్పటి వరకు షేర్‌ చేసిన ఫోటోల్లో వీరిద్దరి మధ్య కాస్త గ్యాప్‌ ఉండేది.. కానీ తాజా ఫోటోల్లో ఆ చిన్న కాస్తంత గ్యాప్‌ కూడా కనిపిండం లేదు. అంతే కాకుండా గుత్తా జ్వాలకు ఏకంగా విశాల్‌ ముద్దు పెడుతున్న ఫోటో కూడా ఉండటం విశేషం. ఇక వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని గుసగుసలు పెట్టిన నెటిజన్లు.. తాజా ఫోటోలతో పక్కా కన్ఫర్మ్‌ అయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. విష్ణు విశాల్‌ తన భార్య రజనీతో విడిపోవడానికి గుత్తా జ్వాలనే కారణమని ఓ నెటిజన్‌ విమర్శించాడు. అయితే ఈ జంట ఎంతో క్యూట్‌ అండ్‌ హాట్‌గా ఉందంటూ మరి కొంత మంది కామెంట్‌ చేస్తున్నారు. వేరు వేరుగా విడిపోయి ఒకటి అవుతున్న జంట అంటూ మరో నెటిజన్‌ సర...

పోస్టర్స్ సూపర్బ్..ఫ్యాన్స్ జోష్

చిత్రం
సినీ అభిమానులకు ఈ న్యూ ఇయర్ మరింత జోష్ తెస్తోంది. ఎందుకంటే పలు సినీ స్టార్స్ నటించిన కొత్త సినిమాలు ఈ సంక్రాంతి పండుగ వేళ అలరించనున్నాయి. ఇప్పటికే ఆయా సినిమాలకు సంబంధించి ట్రైలర్స్, సాంగ్స్ విడుదలయ్యాయి. మిలియన్ వ్యూస్ వచ్చాయి. రికార్డుల మోత మోగిస్తున్నాయి. ప్రిన్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ, సాయి ధర్మ తేజ్ , తదితరులు నటించిన మూవీస్ రిలీజ్ కోసం రెడీ అవుతున్నాయి. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న ఆలా వైకుంఠపురం లో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. కొత్త ఏడాది వచ్చింది. వస్తూ వస్తూ సినిమాల కొత్త పోస్టర్లను, కొత్త చిత్రాల ప్రకటనలను మోసుకొచ్చింది. తెలుగు సినిమాకు కొత్త శోభను అలంకరించి ప్రేక్షకులకు అదిరి పోయే కిక్కు ఇచ్చింది. రజనీకాంత్‌ దర్బార్‌ 9న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకుడు. ఆర్మీ మేజర్‌ అజయ్‌ కృష్ణగా మహేశ్‌బాబు నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం11న విడుదల కానుంది. హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందిన తాజా చిత్రం అల..వైకుంఠపురములో..12న ప్రేక్షకుల ముందుకు రాన...

గుడ్ న్యూస్ అదుర్స్

చిత్రం
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మరో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆయన తాజాగా నటించి రిలీజ్ చేసిన గుడ్ న్యూస్ సినిమా అనుకోని రీతిలో వసూళ్లను సాధిస్తోంది. అంతే కాదు బంపర్ హిట్ టాక్ ఇప్పటికే ఈ సినిమా పేరు తెచ్చుకుంది. ఇదే సమయంలో సినిమా సక్సెస్ తో చిత్ర యూనిట్, తారాగణం కూడా హ్యాపీగా ఫీలవుతోంది. ఈ సినిమా ఇటు విమర్శకులు, అటు ప్రేక్షకుల ప్రశంసలు పొందుతూ కళ్లు చెదిరే రీతిలో వసూళ్లు రాబడుతోంది. ఒక వైపు పౌరసత్వ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నప్పటికీ.. ఆ ప్రభావం అంతగా గుడ్‌న్యూస్‌ పై లేదని బాక్సాఫీస్‌ లెక్కలు చాటుతున్నాయి. వీక్‌ డేస్‌లో నిలకడగా వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా ఏకంగా 16 కోట్లు వసూలు చేసింది. దీంతో ఐదు రోజుల్లో ఈ సినిమా వసూళ్లు 100 కోట్లకు చేరుకున్నాయి. కొత్త సంవత్సరంలో సైతం భారీ వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. ఇప్పటికే వంద కోట్లను దాటినా ఈ మూవీ ఇంకెన్ని డబ్బులు రాబడుతుందో చెప్పలేమంటున్నారు సినీ వర్గాలు. అద్భుతమైన కంటెంట్‌, వినూత్నమైన కథనంతో వచ్చిన ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టు కుంటోంది. గత శుక్రవారం 17.56 కోట్లు, శనివారం 21.78 కోట్లు, ఆదివారం 25.65 కోట్లు...

పిక్చర్స్ హల్ చల్ ..రేణూ వైరల్

చిత్రం
రేణూ అంటే ఎవ్వరూ గుర్తు పట్టరు. కానీ రేణూ దేశాయ్ అంటే మాత్రం ఠక్కున గుర్తు పడతారు. ఆమె ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ఒకప్పటి సతీమణి. వ్యక్తిగత కారణాల రీత్యా వీరిద్దరూ విడి పోయారు. రేణూ దేశాయ్ భావుకురాలు, ఫోటోగ్రాఫర్, కవయిత్రి కూడా. అంతే కాకుండా ఆమె సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. తన అభిప్రాయాలను, రచనలను, ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు. దీంతో మోస్ట్ పాపులర్ పర్సన్ గా ఉన్నారు. ఇటీవలే ఆమె కొత్తగా మరో వ్యక్తిని పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ అంశం గూర్చి పవన్ కళ్యాణ్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. పవన్‌ నుంచి విడి పోయాక రేణూ దేశాయ్‌ పిల్లలతో కలిసి పూణెలో నివాసం ఉంటున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణూ.. తన పిల్లలకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచు కుంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఆద్య తన తండ్రి పవన్‌ కల్యాణ్‌తో కలిసి దిగిన ఫొటోను రేణూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. దానికి ఫాదర్‌ అండ్‌ డాటర్‌, డాటర్స్‌ లవ్‌ అని కాప్షన్స్‌ కూడా జత చేశారు. అద్భుతంగా, చాలా అందంగా పిల్లలు తల్లి దండ్రుల నుంచి పోలికలు పొందుతారు. ఆద్య కొన్నిసార్లు నాలానే కనిపిస్తుంది.. కానీ చాలా సార్లు వా...

నెల్లై కన్నన్‌ అరెస్ట్

చిత్రం
ఈ దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోంది. ఇప్పటికే ప్రభుత్వాన్ని, పార్టీని ప్రశ్నించిన వాళ్లపై కేసులు నమోదయ్యాయి. పౌరులు తమ అభిప్రాయాలను వెల్లడించడం ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం. ప్రస్తుతం ఈ దేశంలో మాట్లాడటం కూడా నేరమై పోయింది. తాజాగా తమిళనాడుకు చెందిన ప్రముఖ రచయిత నెల్లై కన్నన్ అరెస్ట్ అయ్యారు. పౌర నిరసనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలకు వ్యతిరేకంగా కన్నన్ మాటల తూటాలు పెచారు. వీరి వాళ్ళ దేశంలో అల్లకల్లోలం రేగుతుందంటూ ఆరోపించారు. ఆయన చేసిన కామెంట్స్ పెను  వివాదానికి దారి తీశాయి. ఆయన్ను అరెస్టు చేయాలని పట్టుబడుతూ, మెరీనా తీరంలోని గాంధీ విగ్రహం వద్ద బీజేపీ రాష్ట్ర నేతలు బైఠాయించడం ఉత్కంఠకు దారి తీసింది. ఈ నేపథ్యంలో నెల్లై కన్నన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మోదీ, షాలను దూషించినందుకు అతన్ని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. కన్నన్‌పై ఐపీసీ సెక్షన్‌ 504, 505(1), 505(2) వివిధ సెక్షన్ల్‌ కింద కేసులు నమోదయ్యాయి. కాగా పౌరహక్కు చట్టం సవరణను ఖండిస్తూ తమిళనాడు వ్యాప్తంగా విపక్షాలు పెద్ద ఎత్తున  నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీ సందర్భంగా మోదీ, షాను దూ...

ఆశాజనకంగా జీఎస్టీ వసూళ్లు

చిత్రం
ఓ వైపు ఆర్ధిక మాంద్యం దేశాన్ని కుంగదీస్తుంటే మరో వైపు వస్తు సేవల పన్ను వసూళ్లు లక్ష్యానికి మించి పోవడం అటు ఆర్థికరంగ నిపుణులను, ఇటు మార్కెట్ వర్గాలు విస్తు పోయేలా చేశాయి. ఇది కొత్త ఏడాదిలో శుభ పరిణామంగా భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్థిక రంగం పూర్తిగా దివాళా అంచున నిలబడింది. ఇదే విషయం గురించి ప్రపంచ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఐఎంఎఫ్ హెచ్చరించింది కూడా. అయినా భారత ప్రభుత్వం లో ఇసుమంత చలనం కనిపించలేదు. నిరుద్యోగిత పెరగడం, ఉత్పాదకత తగ్గడం, ఆర్థిక వృద్ధి రేటు అనూహ్యంగా దిగజారడం కూడా ఫైనాన్షియల్ సెక్టార్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే అనుకోని రీతిలో వస్తు, సేవల పన్ను  వసూళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో నెలలో 1 లక్ష కోట్ల మైలు రాయిని దాటాయి. డిసెంబర్‌లో . 1,03,184 కోట్ల మేర జీఎస్‌టీ వసూళ్లు నమోదయ్యాయి. అంత క్రితం నవంబర్‌ నెలలో ఈ వసూళ్లు 1,03,492 కోట్లు. గతేడాది జూలైలో 1.02 లక్షల కోట్లు నమోదు కాగా, 2018 డిసెంబర్‌లో 94,726 కోట్లు వసూలయ్యాయి.  నిబంధనలను పాటించే విధానం, వినియోగం మెరుగు పడుతున్నా ..యనడానికి తాజా గణాంకాలు నిదర్శనమని అధికార వర్గాలు తెలిపాయి. 2018 డిస...

ధరల మోత జనానికి వాత

చిత్రం
కొత్త సంవత్సరం వేడుకల్లో మునిగి పోయిన జనానికి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే రవాణా రంగానికి చెందిన ఆర్టీసీ బస్సుల చార్జీలను ఇష్టానుసారం పెంచింది. మరో వైపు ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణీకులను తమ తమ గమ్య స్థానాలకు చేరవేసే రైల్వే శాఖ తానేమీ తక్కువ కాదంటూ కొత్త ఏడాదిలో కోలుకోలేని ఝలక్ ఇచ్చింది ప్రయాణీకులకు. భారీగా పెంచింది. ఇదిలా ఉండగా విమాన ఇంధనం ధరలతో పాటు, వంట గ్యాస్‌కు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు రేట్లను సవరించాయి. దీంతో ఢిల్లీలో ఏటీఎఫ్‌ కిలో లీటర్‌ ధర1,637 పెరిగి 64,324 అయింది. నెల వ్యవధిలో ఏటీఎఫ్‌ ధరలను పెంచడం ఇది రెండోసారి. డిసెంబర్‌ 1న కూడా కిలోలీటర్‌పై రూ.14 వరకు పెరిగింది. తాజా సవరణతో ఏటీఎఫ్‌ ధరలు 2019 జూన్‌ తర్వాత గరిష్ట స్థాయికి చేరాయి. తీవ్ర పోటీ వాతావరణం, టికెట్‌ చార్జీల పెంపు విషయంలో పరిమితులతో నష్టాలను చవి చూస్తున్న ఎయిర్‌లైన్స్‌ కంపెనీలకు ఇంధన ధరల పెరుగుదల మరింత ప్రతికూలం కానుంది. ప్రతి రోజు ప్రజలు గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ ధర కూడా పెంచింది. సబ్సిడీ ల...

కొత్తగా కొలువు తీరేదెవ్వరో

చిత్రం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం రెండుగా చీలి పోయాక ఉన్న అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయింది. ఒకానొక దశలో బలమైన కేడర్ కలిగిన పార్టీకి దిశా నిర్దేశం చేసే నాయకత్వం లేక పోవడం పార్టీకి శాపంగా మారింది. కాంగ్రెస్ లో అందరూ లీడర్లే, ప్రజల సమస్యల కంటే పదవుల కోసం కొట్లాడటం తోనే సరిపోయింది. తెలంగాణాలో గత కొన్నేళ్లుగా పార్టీ మరింత దిగజారింది. ఏ కోశానా అధికార టిఆర్ఎస్ పార్టీకి పోటీ ఇవ్వలేక చతికిల పడిపోయింది. ఇదిలా ఉండగా తెలంగాణాలో పార్టీని మరింత బలోపేతం చేసే ఆలోచనలో పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టింది. తాజాగా టీపీసీసీ ప్రెసిడెంట్, ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అదేమిటంటే తాను ఇక పార్టీ ప్రెసిడెంట్ పదవి నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో పదవి కోసం ఆశావహుల సంఖ్య పెరిగింది. హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల ప్రజలకు, నల్లగొండ పార్లమెంటు పరిధిలోని ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేందుకు గాను తాను టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి మున్సిపల్‌ ఎన్నికల తర్వాత తప్పుకుంటానని ప్రస్తుత చీఫ్‌ ఉత్తమ్‌ స్వయంగా వెల్లడించారు. ఇక ఆయన వారసుడు ఎవ...