పోస్ట్‌లు

జులై 15, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

దుమ్ము రేపుతున్న షియోమి..బిజినెస్‌లో టాప్ ..!

చిత్రం
ప్ర‌పంచాన్ని విస్మ‌యానికి గురి చేసి ..జ‌నాన్ని పూర్తిగా ఎంట‌ర్‌టైన్‌మెంట్ చేస్తూ..గుండెల్లో గుబులు రేపుతూ..లోకాన్ని ఏకం చేసిన ఒకే ఒక్క వ‌స్తువు ఏదైనా ఉందంటే..అది రాకెట్ కాదు..అణుబాంబు కాదు..మిస్సైల్స్ కావు..బుల్లెట్స్ ..ఆయుధాలు కావు..అదేమిటంటే స్మార్ట్ ఫోన్. అదొక్క‌టి మ‌న చేతిలో వుంటే చాలు..ప్ర‌పంచంలో ఎక్క‌డ ఏం జ‌రిగినా స‌రే క్ష‌ణంలో మ‌న చేతుల్లో ఉంటోంది. ఈ క్రెడిట్ అంతా ఐటీ రంగానిదేన‌ని చెప్పుకోవాల్సి ఉంటుంది. రోజుకో కొత్త ప్రాడ‌క్ట్ ఆక‌ర్షిస్తోంది. న్యూ డిజైన్స్..డిఫ‌రెంట్ లుక్స్‌తో ఆక‌ట్టుకుంటున్నాయి మొబైల్స్. వీటిలో ఎన్నో కంపెనీలు రంగంలోకి దిగాయి. ఇప్ప‌టికీ ప్ర‌పంచాన్ని ప్ర‌భావితం చేస్తున్న మొబైల్స్‌ల‌లో యాపిల్ కంపెనీవే. త‌ర్వాత శాంసంగ్, ఒన్ ప్ల‌స్, త‌దిత‌ర కంపెనీల‌కు చెందిన ప్రొడ‌క్ట్స్ గ‌తంలో డామినేట్ చేశాయి. ఆ త‌ర్వాత మార్కెట్ రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. లోక‌ల్ మేడ్ మొబైల్స్‌కు విప‌రీత‌మైన డిమాండ్ వ‌చ్చింది. త‌క్కువ ధ‌ర‌లు..ఎక్కువ ఫీచ‌ర్స్ వుండే వాటికే ఇండియ‌న్స్ మొగ్గు చూప‌డంతో అన్ని కంపెనీలు వాటి మార్కెట్ పెంచుకునేందుకు నానా తంటాలు ప‌డ్డాయి. త‌ప్ప‌ని ప‌రిస్థిత...

దాతృత్వ‌మా వ‌ర్ధిల్లు..మాన‌వ‌త్వ‌మా ప‌రిఢ‌విల్లు ..!

చిత్రం
ఎన్ని కోట్లుంటే ఏం లాభం..ఎన్ని ఆస్తులంటే ఏం చేసుకోవాలి. పుట్టిన‌ప్పుడు ఏమీ తీసుకు రాలేక పోయాం..పోతున్న‌ప్పుడు ఏమీ తీసుకెళ్ల‌లేం..ఉన్న‌దంతా ఇక్క‌డే ..జ‌గ‌మంతా మ‌న‌ది అనుకున్నా..ఏదీ మ‌న ద‌రికి చేర‌దు..ఆస్తులు, అంత‌స్తులు..బంధువులు..నా అనుకున్న వారెవ్వ‌రు తోడుండ‌రు..మిగిలేది..వెంట వ‌చ్చేది మాత్రం మ‌నం చేసిన ప‌నులు..ఆదుకున్న వైన‌మే గుర్తుండి పోతుంది. అంద‌రూ మ‌నుషులుగా పుడుతూనే ..చ‌నిపోయారు. కొంద‌రు మాత్రం ..అంద‌రిలాగా ఈ భూమి మీద‌కు వ‌చ్చారు. కానీ మ‌హానుభావులుగా మిగిలి పోయారు. అందుకే వారు చ‌రిత్ర‌లో లిఖించ బ‌డ్డారు. కొంద‌రు కొంత కాలం వ‌ర‌కే ఉండిపోతే..మ‌రికొంద‌రు ప్ర‌పంచాన్ని ఇంకా త‌మ చేత‌ల‌తో..త‌మ వ్య‌క్తిత్వంతో ప్ర‌భావితం చేస్తూనే వున్నారు. వారిలో చేగువేరా..కార్ల్ మార్క్స్..లాంటి వారు ఎంద‌రో. కోట్లాది రూపాయ‌ల ఆస్తులు సంపాదించినా చివ‌ర‌కు ఒక్క పైసా కూడా త‌మ వ‌ద్ద ఉంచుకోకుండా స‌మాజం కోసం దానం చేసిన వారెంద‌రో ఈ ప్ర‌పంచంలో వేల‌ల్లో ఉన్నారు. సాయం చేయాల‌న్న త‌ప‌న‌, ఆదుకోవాల‌న్న కోరిక ఒక‌రు చెబితేనో..లేక బోధిస్తేనో రాదు. వారిలో ఆ భావ‌న క‌ల‌గాలి అంతే. ప్ర‌పంచంలోనే ఇండియ‌న్ ఇన...

తెప్ప‌రిల్లిన తెలంగాణ - జాడ‌లేని వాన‌లు..అంతులేని క‌ష్టాలు

చిత్రం
కోరి తెచ్చుకున్న తెలంగాణ‌లో నీళ్లు లేవు..నిధులు లేవు..నియామ‌కాలు అస‌లే లేవు. బంగారు తెలంగాణ మాటేమిటో కానీ ..ఉన్న తెలంగాణ ఆగ‌మాగ‌మై పోయింది. వాన‌లు లేక ..వ‌రుణ దేవుడు క‌రుణించ‌క ..పొలాలు నెర్రెలు బారిన‌వి..పంట‌లు ఎండిపోతున్న‌వి. ఏకంగా 433 మండ‌లాలు దుర్భిక్ష ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాయ‌ని సాక్షాత్తు తెలంగాణ వ్య‌వ‌సాయ శాఖ కేంద్ర స‌ర్కార్‌కు నివేదించింది. ఇక రాబోయే కాలం గ‌డ్డు పరిస్థితే. త‌లుచుకుంటేనే వెన్నులో వ‌ణుకు పుడుతోంది. ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషించాల్సిన స‌ర్కార్ నివేదిక‌ల‌ను రూపొందించ‌డంలో నిమ‌గ్న‌మైంది. వ్య‌వ‌సాయ యూనివ‌ర్శిటీ ఎందుకుందో దాని వ‌ల్ల ఎవ‌రికి మేలు జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. వేలాది మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు. ఇంత వ‌ర‌కు ప‌రిహారం ద‌క్కిన పాపాన పోలేదు. వాన జాడ‌లు లేక పోవ‌డంతో అన్న‌దాత‌లు ఆకాశం కేసి చూస్తున్నారు. బ‌తుకు దెరువు లేక వ‌ల‌స బాట ప‌డుతున్నారు. జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం అక్ర‌మార్కుల‌కు వ‌రంగా మారింది. ప్ర‌ధాన పంట‌ల‌ను వేయొద్ద‌ని, ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌ను సాగు చేసేలా రైతుల‌ను ప్రోత్స‌హించాల‌ని వ్య‌వ‌సాయ శాఖ కార్య‌ద‌ర్శి జి...