పోస్ట్‌లు

ఏప్రిల్ 2, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఫైనాన్షియ‌ల్ రంగంలో దివ్య సంచ‌ల‌నం..!

చిత్రం
నిన్న‌టి దాకా ప్ర‌పంచం వైపు మ‌నం చూస్తే..ఇపుడు లోకమంతా భార‌త‌దేశం వైపు చూస్తోంది. టెక్నాల‌జీ, మేనేజ్‌మెంట్, ఆధ్యాత్మిక , వ్యాపార త‌దిత‌ర రంగాల‌లో ఇండియ‌న్స్ త‌మ స‌త్తా చూపిస్తున్నారు. అంతులేని విజ్ఞానాన్ని స్వంతం చేసుకుని..అద్భుత‌మైన ఫ‌లితాలు సాధిస్తున్నారు. సమాజాన్ని శాసిస్తున్న ఐటీ రంగంలో మ‌నోళ్లే టాప్. టాప్ టెన్ దిగ్గ‌జ సంస్థ‌ల‌లో కీల‌క‌మైన ప‌ద‌వుల్లో, విభాగాల్లో ఇండియ‌న్సే బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌డం మ‌న వారి క్రియేటివిటికీ అద్దం ప‌డుతోంది. త‌మిళ‌నాడ‌కు చెందిన సుంద‌ర్ పిచ్చ‌య్ గూగుల్ సిఇఓగా స‌క్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నారు. పురుషుల‌తో ధీటుగా మ‌హిళ‌లు త‌మ శ‌క్తి సామ‌ర్థ్యాల‌కు ప‌దును పెడుతూ ప్ర‌పంచ‌పు ప్ర‌తిభావంతుల స‌ర‌స‌న నిల‌బ‌డుతున్నారు. జ‌గ‌మెరిగిన ఫోర్బ్స్ వెల్ల‌డించిన ప్ర‌భావశీలుర జాబితాలో మ‌నోళ్లు కూడా చోటు ద‌క్కించుకుంటున్నారు. ఇదంతా కొన్నేళ్లుగా భార‌తీయులు త‌మ‌ను తాము నిరూపించుకునేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన సంస్థ‌లు , ఐటీ దిగ్గ‌జాలు ఇండియా వైపు అడుగులు వేస్తున్నాయి. టాలెంట్‌తో పాటు క‌మిట్‌మెంట్ క‌లిగిన వీరి వైపే మొగ్గు చూపుతున్నా...

బోల్తా ప‌డిన బెంగ‌ళూరు..రాజ‌స్థాన్ రాయ‌ల్ విక్ట‌రీ

చిత్రం
సమ‌య స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రిస్తే..క‌లిసి క‌ట్టుగా పోరాడితే..ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు నిర్ణ‌యాలు తీసుకుంటే అద్భుత‌మైన విజ‌యాల‌ను చేజిక్కించుకోవ‌చ్చు అనేది రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు చేసి చూపించింది. ఇలాంటి అరుదైన స‌న్నివేశాలు చాలా త‌క్కువ‌గా వ‌స్తాయి. ఐపీఎల్ టోర్నీలో అనుకోని గెలుపులు ఆయా జ‌ట్ల‌ను వ‌రిస్తున్నాయి. క‌ళ్లు చెదిరే షాట్లు..దిమ్మ తిరిగే వికెట్లు..ఫీల్డింగ్‌లో ఊహించ‌ని చిత్ర‌విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. వేలం పాట‌ల్లో కోట్లు పోసి చేజిక్కించుకున్న ఆట‌గాళ్లు కొంద‌రు రాణిస్తే మ‌రికొంద‌రు నిరాశ ప‌రిచారు. ఇంకా జ‌ర‌గాల్సిన మ్యాచ్‌లు చాలా వున్నాయి. ఎవ‌రు టాప్ ఫైవ్‌లోకి వ‌స్తార‌నేది అభిమానుల‌ను ఉత్కంఠ‌కు గురి చేస్తోంది. ఇండియ‌న్ క్రికెట్ జ‌ట్టుకు ఎన‌లేని విజ‌యాల‌ను అందించిన కెప్టెన్‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న విరాట్ కొహ్లి ఈ టోర్నీలో ఫ్యాన్స్‌ను నిరాశ ప‌రిచారు. ఆయ‌న లీడ్ చేస్తున్న బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ జ‌ట్టు వ‌రుస‌గా ఈ టోర్నీలో నాలుగో ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. ఇది మ‌రింత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. అస‌లు అంచ‌నాల‌కు అంద‌ని రీతిలో అజింక్యా ర‌హానే నాయ‌క‌త్వ...

ఎన్ఐటి వ‌రంగ‌ల్‌కు ఎక్క‌డ‌లేనంత డిమాండ్

చిత్రం
ఏ ముహూర్తాన నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ సంస్థ‌ను వ‌రంగ‌ల్‌లో స్థాపించారో కానీ ప్ర‌పంచంలో పేరొందిన దిగ్గ‌జ కంపెనీల‌న్నీ ఇటు వైపు చూస్తున్నాయి. సుశిక్షుతులైన అధ్యాప‌కులు..ప్ర‌శాంతమైన వాతావ‌ర‌ణం. దేశం గ‌ర్వించేలా స్టూడెంట్స్‌ను భావి భార‌త టెక్కీలుగా తీర్చిదిద్ద‌డంలో అన్ని సంస్థ‌ల కంటే ఎన్ఐటీ వ‌రంగ‌ల్ ముందంజ‌లో ఉంటోంది. విద్యార్థుల‌కు కావాల్సిన స‌దుపాయాల‌ను క‌ల్పిస్తోంది. చ‌దువుకునేలా ప్రోత్స‌హిస్తోంది. ప‌రిశోధ‌న‌లు చేసేలా తీర్చిదిద్దుతోంది. ప్ర‌పంచంలో ఎక్క‌డికి వెళ్లినా ఆ ప‌రిస్థితుల‌ను త‌ట్టుకునేలా..ఏ ప్రాబ్లం వ‌చ్చినా..ఏ ప్రాజెక్టు అంద‌జేసినా దానిని ప‌రిష్క‌రించేలా..పూర్తి చేసేలా త‌ర్ఫీదు ఇస్తున్నారు. అందుకే ఈ ఇనిస్టిట్యూట్‌లో సీటు రావాలంటే చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. ల‌క్ష‌లాది విద్యార్థులు దేశ వ్యాప్తంగా ప్ర‌తి ఏటా నిర్వ‌హించే జేఇఇ మెయిన్స్ కు ప్రిపేర్ అవుతారు. ఈ ప‌రీక్ష‌ను రెండు ద‌ఫాలుగా నిర్వ‌హిస్తారు. మెయిన్స్‌లో అర్హ‌త సాధిస్తేనే అడ్వాన్స్ కు ఎంట‌ర్ అవుతారు. లేక‌పోతే ప్రిలిమిన‌రీలోనే తొల‌గి పోవాల్సి వ‌స్తుంది. నిద్రహారాలు మాని పోటీ ప‌డి ఈ ప‌రీక్ష‌కు ప్రిపేర...

బైక్‌లకు పెరిగిన క్రేజ్..కార్ల‌పై త‌గ్గిన మోజు..!

చిత్రం
ప్ర‌పంచ మంత‌టా లెక్క‌లేన‌న్ని కార్లు..మోడ‌ల్స్ త‌యార‌వుతుంటే..కోట్లాది రూపాయ‌లు చేతులు మారుతుంటే..ఇండియాలో మాత్రం కార్ల అమ్మ‌కాలు న‌త్త‌న‌డ‌క‌న సాగుతున్నాయి. అదే స‌మ‌యంలో బైక్‌ల కొనుగోలుకు విప‌రీత‌మైన డిమాండ్ ఏర్ప‌డింది. ఎక్కువ‌గా యువ‌తీ యువ‌కులు వీటినే ప్రిఫ‌ర్ చేస్తున్నారు. కార్ల త‌యారీదారులు..కంపెనీలు ఇపుడు మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల‌ను టార్గెట్ చేసుకున్నాయి. త‌క్కువ ధ‌ర‌ల్లో ఎక్కువ సౌక‌ర్య‌వంతంగా ఉండేలా త‌యారు చేస్తున్నాయి. అప్ప‌ట్లో టాటా కంపెనీ విడుద‌ల చేసిన నానో కారు దేశ‌మంత‌టా సంచ‌ల‌నం సృష్టించింది. కేవ‌లం ల‌క్ష రూపాయ‌ల‌కే కారు అంద‌జేస్తామ‌ని చేసిన ప్ర‌క‌ట‌న వ్యాపార వ‌ర్గాల్లో ముఖ్యంగా ఆటోమొబైల్ రంగాన్ని కుదిపేసింది. రిలీజ్ అయ్యాక అది జ‌నాన్ని ఆక‌ట్టు కోలేక పోయింది. ఇంజ‌న్ వెనుక వైపు ఉండ‌డం. మ‌రీ చిన్న‌దిగా..ఆటోను పోలి ఉండ‌డంతో ఇండియ‌న్స్ ఇముడ లేక పోయారు. కొన్ని కార్లు ఉన్న‌ట్టుండి ఆగి పోవ‌డం, సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపించ‌లేదు. దీంతో నానో కార్ల త‌యారీని తాము నిలిపి వేస్తున్న‌ట్లు టాటా సంస్థ‌లు ప్ర‌క‌టించాయి. మార్కెట్‌లో హోండ...

బ్యాంకుల విలీనం స‌రే..డిఫాల్ట‌ర్ల సంగ‌తేంటి..?

దేశంలో అతి పెద్ద రంగ బ్యాంకింగ్ సంస్థ‌గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్ప‌టికే త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. విజ‌యా , దేనా బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో విలీనం కావ‌డంతో మ‌రో అతి పెద్ద బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌గా మారింది. రిజ‌ర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ దేశానికి ..అన్ని బ్యాంకుల‌కు క‌స్టోడియ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తోంది. కోట్లాది రూపాయ‌లు జ‌మ చేయ‌డం, లావాదేవీల నిర్వ‌హ‌ణ‌..ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్ష‌ణ‌..ఆర్థిక నేరాలు సంభ‌వించ‌కుండా చూడ‌టం..క‌స్ట‌మ‌ర్లు లేదా ఖాతాదారుల‌కు అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు ఆర్బీఐ క‌ఠిన‌త‌ర‌మైన నియ‌మ నిబంధ‌న‌లు ఏర్పాటు చేసింది. వ్యాపార‌, వాణిజ్య అవ‌స‌రాలే కాకుండా వ్యాపారాలు చేప‌ట్టేందుకు , ప‌రిశ్ర‌మ‌లు స్థాపించేందుకు బ్యాంకులు చేదోడు వాదోడుగా ఉన్నాయి. స్వాతంత్ర్యం వ‌చ్చిన నాటి నుండి నేటి వ‌ర‌కు బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌పై కోట్లాది మంది ప్ర‌జ‌లు అపార‌మైన న‌మ్మ‌కం క‌లిగి ఉన్నారు. దేశ వ్యాప్తంగా వేలాది శాఖ‌ల‌ను క‌లిగి ఉన్నాయి. ఇతోధికంగా ప్ర‌జ‌ల‌కు సేవ‌లందిస్తున్నాయి. అత్య‌ధికంగా ప్ర‌భుత్వ శాఖ‌ల లావాదేవీల‌న్నీ ..వ్య‌వ‌హారాల‌న్నీ ఎస్‌బిఐ ద్వారా జ‌రుగుతున్నాయి. కోట...

సంక్షేమ ప‌థ‌కాల జ‌పం..ఉద్యోగాల ఊసెత్త‌ని వైనం

దేశ‌మంత‌టా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల సంగ్రామం మ‌రింత వేడెక్కింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ..ఆయా రాష్ట్రాల‌లో పాల‌న సాగిస్తున్న ప్ర‌భుత్వాల‌న్నీ సంక్షేమ ప‌థ‌కాల జ‌పం చేస్తున్నాయి. ప్ర‌తి ఏటా ప్ర‌జ‌లు ప‌న్నుల రూపేణా చెల్లించిన డ‌బ్బుల‌న్నీ ఈ ప‌థ‌కాల అమ‌లుకే ఖ‌ర్చ‌యి పోతున్నాయి. కోట్లాది మంది వీటి మీదే ఆధార‌ప‌డి బ‌తుకుతున్నారు. స్వాతంత్రం వ‌చ్చి 70 సంవ‌త్స‌రాలు గ‌డిచినా నేటికీ అత్య‌ధిక శాతం ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాలు ఇచ్చే స‌బ్సిడీలు, పెన్ష‌న్లు, ఇత‌ర సౌక‌ర్యాల కోసం వేచి చూస్తున్నారు. మానవ హ‌క్కుల ఉల్లంఘ‌న నిరాటంకంగా కొన‌సాగుతోంది. ఆర్థిక భ‌ద్ర‌త లేకుండా పోయింది. ఆర్థిక సంక్షోభం వ‌చ్చినా త‌ట్టుకునే శ‌క్తి రాను రాను న‌శిస్తోంది. పాల‌కులు నేరాల‌కు పాల్ప‌డుతూ..నేర‌స్తుల‌ను ప్రోత్స‌హిస్తూ..మాఫియాల‌కు వ‌త్తాసు ప‌లుకుతూ కోట్లాది రూపాయ‌లు వెన‌కేసుకుంటున్నారు. చ‌ట్టాలు రూపొందించ‌డంలో కీల‌క భూమిక పోషించాల్సిన ప్ర‌జా ప్ర‌తినిధులు త‌మ ఆస్తుల‌ను ఎలా పెంచుకోవాలో దృష్టి సారిస్తున్నారు. ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లను ప‌ట్టించు కోవ‌డం మానేశారు. జ‌నాన్ని ఓటు బ్యాంకుగా చూస్తున్నారు. ఎన్నిక‌ల వేళ డ‌బ్...