పోస్ట్‌లు

ఏప్రిల్ 18, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

రిలీజ్ కాకుండానే రికార్డులు బ్రేక్

చిత్రం
త‌న స్టార్ డ‌మ్‌ను కోల్పోకుండా బ్యాలెన్స్‌గా మెయింటెనెన్స్ చేసుకుంటూ వ‌స్తున్న అతికొద్దిమంది న‌టుల్లో తెలుగు సినిమా రంగంలో ప్రిన్స్ మ‌హేష్ బాబు ఒక్క‌రే. ఆయ‌న‌కు రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు కోలివుడ్, టాలీవుడ్ , త‌మిళ‌నాడు సినిమా ప‌రిశ్ర‌మ‌ల‌లో మ‌హేష్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇండియాతో పాటు ఓవ‌ర్సీస్‌లో భారీగా ప్రిన్స్ సినిమాల‌కు డిమాండ్ ఉంటోంది. స్టార్ డ‌మ్‌తో పాటు లో ప్రొఫైల్ మెయింటెనెన్స్ చేయ‌డం ఆయ‌న‌కే చెల్లింది. పూజా హెగ్డే ప్ర‌ధాన హీరోయిన్‌గా న‌టిస్తున్న మ‌హ‌ర్షి సినిమా షూటింగ్ 90 శాతం పూర్త‌యింది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాపై అభిమానులు గంపెడాశ‌లు పెట్టుకున్నారు. యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన మ‌హ‌ర్షి టీజ‌ర్‌కు ఊహించ‌ని రీతిలో రేటింగ్ ల‌భించింది. కేవ‌లం 24 గంట‌ల్లో కోటి మందికి పైగా ఈ టీజ‌ర్ ను వీక్షించారు. ఇది మ‌హేష్ కు ఉన్న స్టామినా ఏమిటో తెలుస్తుంది. ఈ మూవీ పట్ల రోజు రోజుకు వ్యూవ‌ర్‌షిప్ పెరుగుతూ వ‌స్తోంది. మ‌హ‌ర్షి సినిమా ప‌ట్ల భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇండియ‌న్ సినిమా మార్కెట్‌తో పాటు ఓవ‌ర్సీస్ మార్కెట్‌లో విప‌రీత‌మైన క్రేజ్ నెల‌కొంది. ప...

కేంద్రంలో కొలువుతీరేదెవ్వ‌రో..అంత‌టా హంగ్ వైపే

చిత్రం
నిన్న‌టి దాకా మోదీ మార్క్ ప్ర‌భంజ‌నం సృష్టిస్తే..ఇపుడు క‌మ‌ల‌నాథులు మెల మెల్ల‌గా ఆశ‌లు స‌న్న‌గిల్లుతున్నాయి. ఈసారి జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ రాద‌ని జాతీయ స్థాయిలోని ప‌లు స‌ర్వేలు తేట‌తెల్లం చేస్తున్నాయి. దీంతో ప్రాంతీయ పార్టీల‌తో పాటు త‌ట‌స్థుల‌కు విప‌రీత‌మైన డిమాండ్ పెర‌గ‌నుంది. ప్ర‌భుత్వ ఏర్పాటులో వీరే కీల‌కం కానున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈసారి నువ్వా నేనా అన్న రీతిలో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఎన్డీయే ..యూపీఏ మ‌ధ్య తేడా అన్న‌ది స్వ‌ల్పంగా ఉండ‌బోతోంది. ఇదే అదనుగా భావించిన ప్రాంతీయ పార్టీలు చ‌క్రం తిప్పేందుకు ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతున్నారు. ఎన్ని కోట్లు వ‌స్తాయో ఊహ‌ల్లో తేలి యాడుతున్నారు. బిగ్ పార్టీస్ వైపు మొగ్గు కంటే ..తామే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎలా వుంటుందోన‌నే దిశ‌గా మంత‌నాలు సాగిస్తున్నారు. ప‌వ‌ర్ చేతిలో వుంటే క‌రెన్సీ అదంత‌కు అదే వ‌స్తుంద‌ని నేత‌లు న‌మ్ముతున్నారు. ఇప్ప‌టి నుంచే దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు, అధినేత‌లు బ‌రిలో ఉన్న త‌మ అభ్య‌ర్థుల‌ను కాపాడుకునే ప‌నిలో ప‌డ్డారు. బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య తే...

భాగ్య‌న‌గ‌రానికి మ‌రో మ‌ణిహారం

చిత్రం
ఐటీ పుణ్య‌మా అని హైద‌రాబాద్ అన్ని రంగాల్లో దూసుకెళుతోంది. వ్యాపార, వాణిజ్య‌, ఐటీ రంగాల‌లో త‌న‌కంటూ ఓ స్పేస్ ఏర్పాటు చేసుకుంది ఈ న‌గ‌రం. దేశ‌, విదేశాల నుండి వ‌చ్చే వారంతా ఈ నగ‌రాన్నే ఎన్నుకుంటున్నారు. ప‌ర్యాట‌క ప‌రంగా కూడా తెలంగాణ ఇపుడు టాప్ పొజిష‌న్‌లో ఉంటోంది. ఇక్క‌డ కొలువుతీరిన కొత్త ప్ర‌భుత్వం విస్తృత‌మైన ఏర్పాట్లు చేస్తోంది. ఏ ఒక్క‌రికి ఇబ్బంది లేకుండా చూస్తోంది. ఇప్ప‌టికే ల‌క్షలాది జ‌నాభా పెరిగి పోతుండ‌డం..వ‌స‌తుల క‌ల్ప‌న‌లో కొంత ఇబ్బంది ఏర్ప‌డ‌డంతో స‌ర్కార్ ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషిస్తోంది. పారిశ్రామ‌క వేత్త‌ల‌కు పెట్టుబ‌డులు పెట్టేందుకు ..కొత్త కంపెనీలు ఏర్పాటు చేసేందుకు వినూత్న‌మైన రీతిలో స్పెష‌ల్‌గా ఇండ‌స్ట్రియ‌ల్ పాల‌సీని తీసుకు వ‌చ్చింది. ఎవ్వ‌రైనా స‌రే ఉపాధి క‌ల్పించేలా కంపెనీలు ఏర్పాటు చేస్తామంటే .ద‌ర‌ఖాస్తు చేసుకున్న ఏడు రోజుల్లోనే ప‌ర్మిష‌న్స్ ఇస్తారు. ఒక‌వేళ ఇవ్వ‌క పోతే ..ఇచ్చిన‌ట్టే అనుకోవాల్సి ఉంటుంద‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. భారీ ట్రాఫిక్ ఏర్ప‌డ‌డం..జ‌నం పెర‌గ‌డం..ఉపాధి కోసం గ్రామాల నుండి హైద‌రాబాద్‌కు వ‌ల‌స రావ‌డంతో స్పేస్ స‌రిపోవ‌డం లేదు.ఒక...

రెవిన్యూ స‌రే ..విద్యా శాఖ మాటేమిటి..?

చిత్రం
దేశంలోనే సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రో సెన్సేష‌న‌ల్ నిర్ణ‌యాల‌కు తెర తీశారు. దీంతో ఆయా శాఖ‌ల్లోని ఉద్యోగులు..సిబ్బందికి కంటి మీద కునుకే లేకుండా పోయింది. సీఎం ఎప్పుడు ..ఎవ‌రి మీద ప‌డ‌తారో తెలియ‌క ల‌బోదిబోమంటున్నారు. పైకి బ‌య‌ట ప‌డ‌క పోయినా..ఆయా ఉద్యోగాల సంఘాల నేత‌లు గులాబీ బాస్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాంటేనే జడుసుకుంటున్నారు. ద‌స్త్రానికో ధ‌ర నిర్ణ‌యిస్తూ..ప్ర‌జ‌ల‌ను భూముల పేరుతో జ‌ల‌గ‌ల్లా ఇప్ప‌టి దాకా పీడించుకుతిన్న రెవిన్యూ శాఖ ఉద్యోగుల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చారు సీఎం. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల స‌భ‌ల్లో ఏకంగా ప్ర‌జ‌ల సాక్షిగా ఆయ‌న ఆ శాఖ ప‌నితీరు బాగా లేద‌ని..ఐదేళ్ల ప‌రిపాల‌న‌లో వేలాది మంది బాధితులు త‌మ‌కు ఫిర్యాదు చేశార‌ని ..దీంతో చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ హెచ్చ‌రించారు. అంతేకాకుండా భూములకు సంబంధించిన అన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల్సిన ఉద్యోగులు, సిబ్బంది ఇలా వ‌సూళ్ల‌కు, లంచాల‌కు తెగ‌బ‌డ‌టం ఒకింత ఆశ్చ‌ర్య పోయేలా చేసింది. 80 శాతానికి పైగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారే కావ‌డంతో..ప్ర‌త్యేకంగా స‌ర్వే చేయించి మ‌రీ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. అవినీతి ఆక్...

ద‌మ్మున్న మ‌గాడు కేసీఆర్ - వ‌ర్మ బ‌యోపిక్

చిత్రం
ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ఓ స్పేస్‌ను క్రియేట్ చేసుకున్న సంచ‌నాలకు నెల‌వైన డైన‌మిక్ డైరెక్ట‌ర్ రాం గోపాల్ వ‌ర్మ మ‌రో సెన్సేష‌న‌ల్ క్రియేట్ చేశారు. కోట్లాది అభిమానుల‌ను ఆయ‌న షాక్‌కు గురి చేస్తూ ట్విట్ట‌ర్ లో ద‌మ్మున్న మ‌గాడు..ఒకే ఒక్క‌డు..తెలంగాణ రాష్ట్ర సాధ‌కుడు..ప్ర‌స్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖ‌ర్ రావు జీవితాన్ని ఓ చ‌రిత్ర‌గా బ‌యో పిక్ తీస్తున్నానంటూ ట్వీట్ చేశాడు. ఇది దావాన‌లంలా వ్యాపించింది..ఈ వార్తే దేశ‌మంత‌టా వైర‌ల్ అయ్యింది. కేసీఆర్ అంటేనే ఓ మెరుపు..ఓ కుదుపు కూడా. ఆయ‌న ఏది మాట్లాడినా మంట‌లే. మాట‌ల‌తో ర‌గిలిస్తాడు..ఆలోచించేలా చేస్తాడు..ల‌క్ష‌లాది మందిని త‌న మాట‌ల చాతుర్యంతో అలాగే కూర్బోబెట్ట‌గ‌ల‌రు కూడా. కేసీఆర్ ఆ మూడు అక్ష‌రాలు ఇపుడు ఇండియాలో సెన్సేష‌న్. లోతైన విశేష ప‌రిజ్ఞానం..అన్ని అంశాల ప‌ట్ల‌..స‌మస్య‌ల ప‌ట్ల అవ‌గాహ‌న‌. ప‌లు భాష‌ల్లో పాండిత్యం..అద్భుత‌మైన రీతిలో ..స‌మ‌యోచితంగా ప్ర‌సంగించ‌డం కేసీఆర్‌కు ఒక్క‌డికే చెల్లింది. అవ‌స‌ర‌మైతే నేర్చుకోగ‌ల‌రు..లేదంటే తానే టీచ‌ర్ అవ‌తారం ఎత్త‌గ‌ల‌రు. బ‌క్క ప‌ల్చ‌గా వుండే ఈ నాయ‌కుడు ..ఇండి...

పాండ్యా పంచ్..చాహ‌ర్ అదుర్స్ - వారెవ్వా ముంబై

చిత్రం
ఇదీ బౌలింగ్ అంటే. ఎలా వుంటుందంటే ..ఏం చెప్పాలి..మాట‌లు చాల‌వు..కేవ‌లం చూడాల్సిందే. చూస్తే చిన్నోడు చాహ‌ర్ అత్య‌ద్భుత‌మైన రీతిలో బంతుల‌తో మెస్మ‌రైజ్ చేయ‌డంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టును మ‌ట్టి క‌రిపించింది ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు. ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ టోర్న‌మెంట్ లో జీవితకాలం గుర్తుంచు కోద‌గిన స‌న్నివేశాలు క‌ళ్ల ముందు క‌ద‌లాడుతున్నాయి. చాకుల్లాంటి కుర్రాలు ..మెరిక‌ల్లాంటి బంతులు వేస్తుంటే..ఇంకో వైపు రిష‌బ్ పంత్..సంజూ శాంస‌న్..లాంటి యువ కెర‌టాలు త‌మ దైన శైలితో ఆట‌తీరును ప్ర‌ద‌ర్శిస్తున్నారు. బ‌లౌర్ల‌లో కొంద‌రు..బ్యాటింగ్‌లో మ‌రికొంద‌రు ఇలా ఒక‌రికొక‌రు ప్ర‌తిభాణ్వేష‌న‌లో పోటీ ప‌డుతున్నారు. మొత్తంగా కోట్లాది క్రికెట్ అభిమానుల‌కు ప‌సందైన ఆట‌తీరుతో ఆక‌ట్టుకుంటున్నారు. క్రికెట్ ఆట‌లో ఉన్న గ‌మ్మ‌త్త‌యిన మ‌జాను ఆస్వాదించేలా చేస్తున్నారు. ముంబ‌యి ఇండియ‌న్స్ విజ‌యంతో మురిసి పోయింది. ఈ జ‌ట్టులోని ఆట‌గాళ్లంతా స‌మిష్టి కృషితో రాణించారు. ఆల్ రౌండ్ స‌త్తా చాటారు. ఐపీఎల్ -12 లో ప్లే ఆఫ్ దిశ‌గా మ‌రో అడుగు ముందుకేసింది. హ‌ర్దీక్ పాండ్యా మెరుపులు మెరిపిస్తే..యువ స్పిన్న‌ర్ రాహుల్ చాహ‌ర్ ...

అవును..త‌గ్గితే త‌ప్పేంటి..?

చిత్రం
ఏముంది గురూ..మ‌హా అయితే విజ‌యం ఎంతో మందితో చ‌ప్ప‌ట్లు కొట్టించేలా చేస్తుందేమో కానీ..ఓట‌మి ఇచ్చినంత మ‌జా..అనుభ‌వం ఇంకేదైనా ఇస్తుందా..అనుకుంటాం ..కానీ ..కాలం ఎన్ని ప‌రీక్ష‌ల‌కు గురి చేస్తుంద‌ని..తెలియ‌కుండానే దాని మాయ‌లో ప‌డిపోతాం. పొద్దు పొడిచిన‌ప్ప‌టి నుండి పొద్దు గూకే దాకా..ఉరుకులు ప‌రుగులు..ఎక్క‌డికి వెళుతున్నామో..దేని కోసం వెదుకుతున్నామో..ఎందు కోసం బ‌తుకుతున్నామో తెలియ‌కుండానే ప్ర‌యాణం చేస్తూనే ఉన్నాం..నిన్న‌టి నుంచి నేటి దాకా. మ‌జిలీ అనుకున్న ‌ది మ‌ళ్లీ మొద‌ల‌వుతుంది. భిన్న‌మైన భావాలు..విరుద్ధ‌మైన ఆలోచ‌న‌లు..ప‌ర‌స్ప‌రం ఒక్క‌ట‌వుతున్న‌ట్టు అనిపించినా ఎక్క‌డో ఓ మూల‌న కించిత్ అహం. నాకేమీ అన్న ధీమా..మొహ‌మాటం..ఇవ్వ‌న్నీ మ‌న‌ల్ని ఒక ప‌ట్టాన ఉండ‌నీయ‌వు. మ‌న కేర‌క్ట‌ర్‌ను..మ‌న న‌డ‌త‌ను ..మ‌న ఆలోచ‌నల్ని అవే నియంత్రిస్తాయి..నిర్దేశించే స్థాయికి చేరుకుంటాయి. ఇక్క‌డే ఆగిపోవాల‌ని అనిపిస్తూ వుంటుంది..కానీ ఉండ‌లేం. ఈ లైఫ్ దేనిని ఓ ప‌ట్టాన అలా ఒకే చోట ఉండ‌నీయ‌దు. అందుకే దానికంత‌టి ప్ర‌త్యేక‌త‌..ప్ర‌తి ఒక్క‌రు అందులోకి రావాల‌ని త‌పిస్తారు. కానీ వ‌చ్చాక ..ఎందుకు దీనిని భ‌రిస్తున్నామో అంటూ ల...

మోదీ పాల‌న‌లో ఉద్యోగాలు మ‌టాష్

చిత్రం
స్వ‌చ్ఛ్ భార‌త్ అంటూ జ‌నాన్ని బురిడీ కొట్టించి ..కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన న‌రేంద్ర మోదీ దెబ్బ‌కు జ‌నం అబ్బా అంటున్నారు. ఏ ముహూర్తాన నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం తీసుకున్నారో ఆరోజు నుండి నేటి దాకా ఆర్థిక వ్య‌వ‌స్థ గాడిన ప‌డ‌లేదు. ఈ విష‌యాన్ని దేశంలో విద్యాబోధ‌న‌లో పేరుగాంచిన అజీం ప్రేమ్ జీ యూనివ‌ర్శిటీ తో పాటు సెంట‌ర్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియ‌న్ ఎకాన‌మీ సంస్థ‌లు చేప‌ట్టిన స‌ర్వేలో వెల్ల‌డించింది. జాతి యావ‌త్తు నివ్వెర పోయేలా వాస్త‌వాల‌ను వెలుగులోకి తీసుకు వ‌చ్చాయి. ఎన్నిక‌ల వేళ బీజేపీ స‌ర్కార్‌కు ఇదో అతి పెద్ద దెబ్బ‌. ఏకంగా మోదీ ఏక‌ప‌క్ష నిర్ణ‌యం వ‌ల్ల‌..దాదాపు 50 ల‌క్ష‌ల మంది ఉద్యోగాలు కోల్పోయార‌ని పేర్కొన్నాయి. 2016 న‌వంబ‌ర్ 8..రాత్రి 10 గంట‌లు..ఉరుములు ..ప‌డుతున్న‌ట్టు..రాకెట్లు దూసుకు వ‌చ్చిన‌ట్టు మోదీ నోట్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. కోట్లాది ప్ర‌జ‌లు ఆ రోజు రాత్రంతా నిద్ర‌పోలేదు..జాగ‌ర‌ణ చేశారు. కంటి మీద కునుకే లేకుండా పోయింది వాళ్ల‌కు. ఇళ్ల‌ల్లో ఉన్న ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి వ‌చ్చారు. సామాజిక సేవ‌లో పేరుగాంచిన ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు, బ్యాంకులు దివాళా తీసినంత ప‌నిచేశాయి....

ఆఫీస్ స్పేస్‌ల ఏర్పాటులో మ‌న వైపే మొగ్గు

చిత్రం
దేశంలో ఎక్క‌డికి వెళ్లినా ..కొత్త‌గా లేదా ఉన్న‌దానిని విస్త‌రించాల‌న్నా స్థ‌లం దొర‌క‌డం చాలా క‌ష్టం. లక్ష‌లు..ఒక్కోసారి కోట్లాది రూపాయ‌లు వెచ్చించాల్సి వ‌స్తోంది. అగ్రిమెంట్ ద‌గ్గ‌రి నుండి నిర్వ‌హ‌ణ దాకా అంతా భారంతో కూడుకున్న‌దే. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగ‌ళూరు, త‌దిత‌ర న‌గ‌రాల‌న్నీ వ్యాపార‌, వాణిజ్య‌, ఐటీ కంపెనీలు కొలువుతీరి వున్నాయి. ఉద్యోగుల‌ను తీసుకోవ‌డం, సిబ్బందిని నియ‌మించు కోవ‌డం, వారికి సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేయ‌డం ఇవ‌న్నీ చేయాలంటే సెంట‌ర్లో స్పేస్ కావాలి. ఇపుడు వ్యాపార‌వేత్త‌ల‌కు, స్టార్ట‌ప్‌లు, ఆంట్ర‌ప్రెన్యూర్స్, కంపెనీ దిగ్గ‌జాలు, సంస్థ‌లు, వ్య‌క్తుల‌కు ..ఇన్నోవేట‌ర్స్ కు , యాజ‌మాన్యాల‌కు ఇబ్బందిక‌రంగా మారింది. దీంతో త‌మ వ్యాపారాల‌ను విస్త‌రించాలంటే స‌రైన చోటు కోసం కోట్లు ఖ‌ర్చు చేసేందుకు వెనుకాడ‌డం లేదు. ఔత్సాహిక పారిశ్రామికవేత్త‌లు త‌మ ఆలోచ‌న‌ల‌ను రాకెట్ కంటే వేగంగా ఇంప్లిమెంట్ చేయాల‌ని త‌పిస్తున్నారు. అందుకోసం డిఫ‌రెంట్ మోడ‌ల్స్, డిజైన్స్‌తో అటు ఉద్యోగుల‌ను..ఇటు క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ..త‌మ వ్యాపారాల‌ను విస్త‌రించుకునేందుకు స్పేస్‌ను చేజిక్కించు కోవ...

క‌మ‌నీయం..క‌ళ్యాణోత్స‌వం - భ‌క్తుల పార‌వ‌శ్యం..ఓల‌లాడిన ఒంటిమిట్ట

చిత్రం
తండోప తండాలుగా భ‌క్తులు త‌రలి రావ‌డంతో క‌డ‌ప జిల్లా ఒంటిమిట్ట‌లోని కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో  శ్రీ సీతారాముల క‌ళ్యాణోత్స‌వం అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రిగింది. ఆల‌య నిర్వాహ‌కులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఏ ఒక్క భ‌క్తుడు..భ‌క్తురాలు ఇబ్బంది ప‌డ‌కుండా ..మ‌హిళ‌లు, త‌ల్లులు, పిల్ల‌లు, వృద్ధుల‌కు ప్ర‌త్యేక సౌక‌ర్యాల‌ను క‌ల్పించారు. ఈ ఆల‌యం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలో పూజాది కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. తిరుమ‌ల‌ను ద‌ర్శించుకునేందుకు వెళ్లే ప్ర‌తి భ‌క్త కుటుంబ‌మంతా త‌ప్ప‌నిస‌రిగా ఈ పుణ్య క్షేత్రాన్ని సంద‌ర్శించుకోవ‌డం గ‌త కొన్నేళ్లుగా ఆన‌వాయితీగా జ‌రుగుతూ వ‌స్తోంది. ఉత్స‌వాల స‌మ‌యంలో ల‌క్ష‌లాది మంది భ‌క్తులు ఏపీ, తెలంగాణ నుంచే కాక మ‌హారాష్ట‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, త‌దిత‌ర రాష్ట్రాల నుండి ఇక్క‌డికి రావ‌డం ప‌రిపాటి. జాతీయ ర‌హ‌దారి ప‌క్క‌నే ఉండ‌డంతో ఎక్కువ మంది భ‌క్తులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతోంది. భార‌తీయ సంస్కృతిని ప్ర‌తిబింబించేలా హిందూ వైభ‌వాన్ని చాటి చెప్పేలా దేశ వ్యాప్తంగా శ్రీ సీతారాముల క‌ళ్యాణాన్ని నిర్వ‌హించ‌డం స‌ర్వ సాధార‌ణం. శ్రీ‌రాముడు, ఆంజ‌నేయ...

ఎట్ట‌కేల‌కు తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల

చిత్రం
గ‌త కొన్ని రోజులుగా ఎంతో ఉత్కంఠ‌కు లోన‌వుతున్న తెలంగాణ రాష్ట్రంలోని ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు శాఖ ఉన్న‌తాధికారులు డాక్ట‌ర్ అశోక్, కార్య‌ద‌ర్శి జ‌నార్ద‌న్ రెడ్డిలు ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్, సెకండ్ ఇయ‌ర్ ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించారు. మేడ్చెల్ ప్ర‌థ‌మ స్థానంలో నిలువ‌గా ..మెద‌క్ జిల్లా ఆఖ‌రు స్థానంలో నిలిచింది. ఇంట‌ర్ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రానికి సంబంధించిన ఫ‌లితాల్లో 59.8 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌గా..ద్వితీయ సంవ‌త్స‌రంలో 65 శాతంగా న‌మోదైంది. ఈ ఫ‌లితాల్లో బాలిక‌లే పై చేయి సాధించారు. బాలురు వెన‌క్కి త‌గ్గారు. గ‌త ఏడాదితో పోలిస్తే ఈసారి పాస్ ఉత్తీర్ణ‌త శాతం త‌గ్గ‌డం గ‌మ‌నార్హం. 2018లో జ‌రిగిన ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల్లో ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం ఇంట‌ర్ లో 62.73 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు కాగా..ఈ డాది 60.5 శాతం మాత్ర‌మే రావ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. గ‌తేడాది ద్వితీయ సంవ‌త్స‌రం ఇంట‌ర్ లో 67.06 ఉత్తీర్ణ‌త శాతం న‌మోదు కాగాఉ..ఈ ఏడాది ప్ర‌క‌టించిన ఫ‌లితాల్లో కేవ‌లం 64.8 శాతం మాత్ర‌మే ఉత్తీర్ణ‌త సాధించారు. తేడా 3 శాతంగా ఉన్న‌ది. వెల్ల‌డైన ఫ‌లితాల్లో ఉత్తీ...