పోస్ట్‌లు

మే 25, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్క‌ని వైనం - ప్ర‌మాదంలో పార్టీ భ‌విత‌వ్యం

చిత్రం
వందేళ్ల చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీకి 17వ సార్వ‌త్రిక ఎన్నిక‌లు శాపంగా మారాయి. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదాను ద‌క్కించుకోలేక పూర్తిగా చ‌తికిల ప‌డి పోయింది. దేశాభివృద్ధిలో కీల‌క భూమిక పోషించిన ఆ పార్టీ ఇపుడు త‌న అస్తిత్వాన్ని కోల్పోయే ప‌రిస్థితిని కొని తెచ్చుకుంది. త్యాగాలు, బ‌లిదానాలు చేసుకున్న గాంధీ కుటుంబం ఇవాళ పున‌రాలోచ‌న‌లో ప‌డింది. మోదీ వ్యూహాల‌ను ఎదుర్కోలేని స్థితిలోకి రావ‌డం బాధాక‌రం. గ్రామ స్థాయి నుండి దేశ స్థాయి దాకా బ‌ల‌మైన కేడ‌ర్ క‌లిగిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు బేల చూపులు చూస్తోంది. కాంగ్రెస్ తో పాటు మిత్ర‌ప‌క్షాలు సైతం అదే బాట ప‌ట్టాయి. 2014లో మోదీ మామూలుగా ఎంట‌ర్ అయ్యాడు. తాను ఛాయ్‌వాలా నంటూ..ఒక్క‌సారి ఛాన్స్ ఇవ్వ‌మంటూ వేడుకున్నాడు. ఆ త‌ర్వాత ఏకు మేక‌య్యాడు. ఏక‌శ్చ‌త్రాధిప‌త్యం దిశ‌గా దేశాన్ని అన్నీ తానై న‌డిపించాడు. ప్ర‌తిప‌క్షాల నోళ్లు మూయించాడు. ఎన్నో ప్ర‌తికూల‌త‌ల మ‌ధ్య బీజేపీకి తిరిగి పూర్వ వైభ‌వాన్ని తీసుకు వ‌చ్చాడు. ఎప్ప‌టిక‌ప్పుడు వ్యూహాలను మార్చుకుంటూనే త‌న‌కంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నాడు. సోష‌ల్ మీడియాను వాడుకున్నాడు. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌క...

స్వామే మా సీఎం - స్ప‌ష్టం చేసిన మంత్రివ‌ర్గం

చిత్రం
బీజేపీ అధినేత‌, ఇండియ‌న్ ప్రైమ్ మినిష్ట‌ర్ మిష్ట‌ర్ న‌రేంద్ర మోదీ సృష్టించిన విజ‌యోత్స‌వ సునామీ దెబ్బ‌కు ప్ర‌తిప‌క్షాలు విల‌విల‌లాడి పోతున్నాయి. ఏం చేయాలో తెలియ‌క మిన్న‌కుండి పోయాయి. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా దేశ వ్యాప్తంగా జ‌రిగిన 17వ సార్వ‌త్రిక ఎన్నికల్లో స్ప‌ష్ట‌మైన మెజారిటీని సాధించింది బీజేపీ. ఈ క్రెడిట్ అంతా మోదీ, షాల‌దే. 12 రాష్ట్రాల‌లో కాంగ్రెస్ పార్టీ అడ్ర‌స్ లేకుండా పోయింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రంగంలోకి దిగినా మోదీ ప్ర‌భంజ‌నాన్ని ఆప‌లేక పోయారు. క‌ర్ణాట‌క‌లో కొలువు తీరిన కాంగ్రెస్, జేడీఎస్ ల జోడి ల‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది ఈ ఎన్నిక‌ల్లో. కేవ‌లం 2 సీట్ల‌కే ప‌రిమిత‌మై పోయాయి ఈ రెండు పార్టీలు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌స్తుత సంకీర్ణ ప్ర‌భుత్వానికి ఓ ర‌కంగా హెచ్చ‌రిక‌ను జారీ చేసిన‌ట్లు భావిస్తున్నారు.  అనూహ్యంగా ప‌వ‌ర్ ను పొంద‌లేని బీజేపీ ఈసారి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. మాజీ ప్ర‌ధాని దేవెగౌడ కుమారుడు కుమార‌స్వామి ముఖ్య‌మంత్రిగా తాను కొన‌సాగ‌లేన‌ని..ఓట‌మికి నైతిక బాధ్య‌త వ‌హిస్తూ తాను త‌ప్పుకుంటాన‌ని మంత్రివ‌ర్గంతో జ‌రిగిన స‌మా...

జ‌నంలోనే జ‌న‌సేన..!

చిత్రం
రాజ‌కీయాలు వేరు..సినిమా రంగం వేరు. రెండు భిన్న‌మైన రంగాలు. పార్టీని న‌డ‌పాలంటే చాలా వ్యూహాలు ప‌న్నాల్సి ఉంటుంది. ఎంద‌రినో భ‌రించ‌ల్సి వ‌స్తుంది. చాలా ఓపిక కావాలి. జ‌నాన్ని మెస్మ‌రైజ్ చేసి .అర‌చేతిలో వైకుంఠం చూపించే స్థాయికి చేరుకోవాలి. అప్పుడు కాని ప‌వ‌ర్‌లోకి వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌దు. తెలుగుసినిమా రంగంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ వెప‌న్. ఏపీ పాలిటిక్స్‌లో ప్ర‌త్య‌క్షంగా రంగంలోకి దిగాడు. జ‌నసేన పార్టీని స్థాపించి దానికి దిశా నిర్దేశ‌నం చేశారు. అన్నీ తానై ద‌గ్గ‌రుండి న‌డిపించారు. ఎన్నిక‌ల్లో వామ‌ప‌క్షాల‌తో క‌లిసి 138 సీట్ల‌లో జ‌న‌సేన అభ్య‌ర్థ‌/ల‌ఉ బ‌రిలో ఉన్నారు. రెండు చోట్ల పోటీ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓట‌మి పాల‌య్యారు. వైసీపీ అభ్య‌ర్థ‌/ల చేతుల్లో అప‌జ‌యం చ‌వి చూశారు. ఆయ‌నను ఆరాధించే అభిమానులు సైతం ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. ప‌వ‌న్ క‌ళ్యాన్ ఓడిపోవ‌డం త‌మ‌ను బాధ క‌లిగించింద‌న్నారు. అసెంబ్లీలో 175 సీట్లు ఉంటే ఒకే ఒక్క సీటును గెలుచుకోగ‌లిగింది జ‌న‌సేన‌. ఒక్క రాజోలులోనే ఈ విజ‌యం ద‌క్కింది. ఎన్నిక‌ల సంఘం జ‌నసేన పార్టీకి గాజు గ్లాసు కేటాయించింది. ఇపుడు అది పూర్త‌గా ప‌గిలి పోయింది. 25 ...