పోస్ట్‌లు

అక్టోబర్ 23, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

టీఅర్ఎస్ కే జీ హుజూర్..కాంగ్రెస్ కు షాక్

చిత్రం
నువ్వా నేనా అన్న రీతిలో సాగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీ తన సీటును కోల్పోయింది. అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ ఎన్నిక కాంగ్రెస్, టీఅర్ఎస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. 43 వేలకు పై చిలుకు మెజారిటీతో గులాబీ అభ్యర్థి శైనంపూడి సైదిరెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా హుజూర్‌నగర్‌ ఉంది. ఇప్పుడు ఇక్కడ గులాబీ జెండా ఎగిరింది. దీంతో గులాబీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ భవన్‌లో సంబరాలు జరిగాయి. తెలంగాణ అంతా హుజూర్ నగర్ వైపు చూసింది. ప్రజాస్వామ్యానికి, కేసీఆర్ నిరంకుశత్వానికి జరిగిన పోటీగా ఈ ఉప ఎన్నికను చూపించే ప్రయత్నం చేశారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసి గెలుపొందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. మరోసారి గెలుపు ఖాయమన్న ధీమాతో ఉత్తమ్‌..తన సతీమణి పద్మావతిని బరిలోకి దింపారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడి పోయిన సైదిరెడ్డిని మరోసారి టీఆర్‌ఎస్‌ బరిలోకి దింపింది. బీజేపీ, టీడీపీ పార్టీలు బరిలో నిలిచినా..పెద్దగా ప్రభావం చూప...

నిబంధనలు సరళతరం..మార్గం సుగమం

చిత్రం
ఇండియాలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలంటే చాలా నిబంధనలు ఉన్నాయి. దీంతో డబ్బులున్నా బంకులు  ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొని ఉన్నది. దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కఠినతరమైన నిబంధనలను సడలించింది. దీంతో వ్యాపారస్తులకు ఇది శుభసూచకమని చెప్పక తప్పదు. దేశమంతటా ప్రతి రోజు వేలాది వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ప్రతి వాహనానికి పెట్రోల్ లేదా డీజిల్ అత్యవసరం. దేశీ ఇంధన రిటైలింగ్‌ రంగంలో భారీ సంస్కరణలకు ప్రభుత్వం తెర తీసింది. చమురు యేతర సంస్థలు కూడా పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేసేలా, వెసులు బాటు కల్పిస్తూ నిబంధనలను మార్చేసింది. అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఇంధనాల మార్కెట్లోకి ప్రవేశించేందుకు పలు ప్రైవేట్, విదేశీ సంస్థలకు తోడ్పాటు లభించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఆర్థిక వ్యవహారాల కేంద్ర క్యాబినెట్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయాలన్న లక్ష్య సాధనకు, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ కొత్త పాలసీ తోడ్పడనుంది. ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పనకు ఇది ఉపయోగ పడుతుంది. రిటైల్‌ అవుట్‌ లెట్స్‌ రాకతో పోటీ పెరిగి, వినియో...

బజాజ్ కు భారీ లాభం

చిత్రం
ఆటోమొబైల్ సెక్టార్ లో బజాజ్ కంపెనీకి భారీ డిమాండ్ ఉంటోంది. ద్విచక్ర వాహనాలతో పాటు బజాజ్ ఆటు అమ్మకాల్లో ఇదే కంపెనీ టాప్ గా ఉంటూ వస్తోంది. ఓ వైపు ఆర్ధిక మాంద్యం ఎఫెక్ట్ పడుతున్నా బజాజ్ అమ్మకాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. పైపెచ్చు అత్యధికంగా వాహనాలు అమ్ముడు పోయాయి. దీంతో మిగతా కంపెనీలను దాటుకుని బజాజ్ ఆదాయం పరంగా నంబర్ వన్ పొజిషన్ కు చేరుకుంది. తాజాగా బజాజ్‌ ఆటో కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 1,523 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం 1,257 కోట్లుతో పోల్చితే 21 శాతం వృద్ధి సాధించామని బజాజ్‌ ఆటో తెలిపింది. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు ప్రయోజనం కారణంగా 182 కోట్ల పన్ను ఆదా కావడం కూడా కలసి వచ్చిందని కంపెనీ వెల్లడించింది. మొత్తం ఆదాయం 8,036 కోట్ల నుంచి 4 శాతం తగ్గి  7,707 కోట్లకు చేరిందని పేర్కొంది. పన్నులు, డివిడెండ్లు కలిసి మొత్తం 2,072 కోట్ల చెల్లింపులు పోను ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి నగదు, దానికి సమానమైన నిల్వలు 15,986 కోట్లుగా ఉన్నాయని తెలిపింది. అయితే గత క్యూ2లో 13.4 లక్షలుగా ఉన్న మొత్తం వాహన విక్రయాలు ఈ క్య...

బిగిల్ మూవీకి తప్పని తిప్పలు

చిత్రం
అట్లి దర్శకత్వంలో రైజింగ్ స్టార్ విజయ్ నటించిన బిగిల్ సినిమాకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దేశ మంతటా ఈ సినిమా గురించిన చర్చ నడుస్తోంది. 187 కోట్లు పెట్టి బిగిల్ సినిమాను తీశాడు అట్లి. తీసింది కేవలం మూడు సినిమాలే అయినా మనోడు ఇప్పుడు తమిళ్ లో టాప్ డైరెక్టర్. ప్రముఖ దర్శకుడు శంకర్ కు అట్లి ప్రియ శిష్యుడు. టేకింగ్ లోను, సినిమా తీయడంలోనూ అట్లి వెరీ డిఫరెంట్. దీపావళి రోజున బిగిల్ ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. సినిమాకు ముందు నటుడు విజయ్ కొన్ని కామెంట్స్ చేశాడు. దీంతో పెద్ద దుమారం చెలరేగింది. కాగా వర్షం వస్తున్నా అక్కడ ఫ్యాన్స్ మాత్రం భారీగా అడ్వాన్స్ బుకింగ్ కోసం ఎగబడుతున్నారు. తలైవా, కత్తి, తుపాకీ చిత్రాల నుంచి ఆ మధ్య తెరపైకి వచ్చిన మెర్శల్, సర్కార్‌ చిత్రాల వరకూ కథల తస్కరణ ఆరోపణలు, కోర్టులు, కేసులు, ప్రభుత్వ ఆంక్షలు అంటూ రచ్చ జరుగుతూనే ఉంది. ఆ రచ్చ నుంచి విజయ్‌ నటించిన తాజా చిత్రం బిగిల్‌ కూడా తప్పించు కోలేక పోయింది. చిత్ర ఆడియో విడుదల సమయంలోనే వివాదాలను ఎదుర్కొంది. విజయ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దీంత...

అదే ఊపు..అదే జోరు..డీకేనా మజాకా

చిత్రం
మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలుకు వెళ్లి, తిరిగి బెయిల్ పై విడుదలైన కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ లీడర్, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ అదే ఊపు..అదే జోరు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కన్నడ నాట డీకే పెద్ద దిక్కుగా ఉన్నారు. కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రధాని మోడీ, అమిత్ షా లపై నిప్పులు చెరిగారు. వారిపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే కర్ణాటక లో అన్ని పార్టీల నేతలతో శివకుమార్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. సంకీర్ణ సర్కార్ కూలి పోయాక, ఈడీ, ఐటీ అధికారులు డీకేను టార్గెట్ చేశారు. ఆయనను మనీ లాండరింగ్ లో ఇరికించారు. తీహార్ జైలుకు తరలించారు. ఇదే సమయంలో మరో సీనియర్ లీడర్ చిదంబరం కూడా ఇదే జైలులో ఊచలు లెక్క బెడుతున్నారు. శివకుమార్ ను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అంబికా సోనీతో కలిసి డీకేను కలిసి పరామర్శించారు. భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో ఢిల్లీ హైకోర్టు శివకుమార్ కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి డీకే విడులయ్యారు. ఆయనకు కర్ణాటకలో భారీ ఎత్తున అభిమానులు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా డీకే శివకుమార్ మాట్లాడారు. కష్ట కాలంలో తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప...

ముందుండి నడిపిస్తా..బిసిసిఐకి పేరు తీసుకువస్తా

చిత్రం
బిసిసిఐకి ప్రెసిడెంట్ గా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన వెంటనే బెంగాల్ దాదా సౌరబ్ గంగూలీ తన మార్క్ ఏమిటో రుచి చూపిస్తున్నాడు. తాను ఏమేం చేయాలనీ అనుకుంటున్నాడో ముందుగానే ప్రకటించాడు. ఈ మేరకు తన ప్లాన్ వివరాలను వెల్లడించాడు దాదా. అదే ఆత్మ విశ్వాసం, తనపై పెట్టుకున్న నమ్మకం, అదే దుందుడుకు ధోరణి ఈ 47 ఏళ్ళ ఆటగాడిలో కనిపించాయి. ఎక్కడా తొట్రుపాటు అంటూ లేకుండా, చాలా స్పష్టంగా గంగూలీ చెప్పాడు. సారధిగా టీమిండియాకు కొత్త దిశను అతను చూపించాడు. ఇప్పుడు అదే తరహాలోనే బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా పని చేస్తానని చెప్పాడు. తనకు తెలిసిన విధానంలోనే ఫలితాలు రాబడతానని వ్యాఖ్యానించాడు. బీసీసీఐకి ఇది కొత్త ఆరంభంగా భావిస్తున్నా. నేను కెప్టెన్‌గా ఎంపికైనప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. సంస్కరణలు తీసుకు రావాలి. రాష్ట్ర సంఘాలకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఇది పెద్ద సవాలే, అయినా మార్పు తీసుకు రాగలనని నమ్ముతున్నా. నాకు తెలిసిన పద్ధతిలో, భారత జట్టును సారధిగా ఎలా నడిపించానో ఇక్కడా అలాగే పని చేస్తా. విశ్వసనీయత దెబ్బ తినకుండా, అవినీతికి తావు లేకుండా వ్యవహరిస్...

కాంగ్రెస్ కు రాహులే దిక్కు

చిత్రం
వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జవసత్వాలు కోల్పోయి అంపశయ్యపై కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు ను కోల్పోయింది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉండగా మరో వైపు బీజేపీ మాత్రం తన హవాను కొనసాగిస్తూనే ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలన్నదే మోడీ అండ్ అమిత్ షా టార్గెట్. ఇందు కోసం ప్రధాన లీడర్స్ అందరిని జైలు పాలు చేస్తున్నారు. మరో వైపు అమెధీలో పోటీ చేసిన రాహుల్ గాంధీ ఓటమి పాలయ్యారు. అయినా ఆయన తన పనితీరును మార్చు కోవడం లేదు. పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేలా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇదే సమయంలో ప్రియాంక గాంధీ పేరు ప్రముఖంగా వినిపించింది. మరోసారి రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే సమాచారం. పార్టీలోని వివిధ వర్గాల నుంచి తీవ్రంగా వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో రాహుల్‌ మరోసారి అధ్యక్ష పదవి చేపట్టనున్నారని చెబుతున్నారు. ప్రియాంక గాంధీని పార్టీ అధ్యక్షురాలిని  చేయాలని పలువురు సీనియర్‌ నేతలు భావిస్తున్నప్పటికీ పార్టీ అధ్యక్షురాలు సోనియ...

తాన్యా అరోరాకు బంపర్ అఫర్

చిత్రం
ఎవరీ తాన్యా అరోరా అనుకుంటున్నారా. ఇంజనీరింగ్ చదువుతోంది ఈ అమ్మాయి. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారు అన్న దానిని ఈ అమ్మాయి నిజం చేసింది. ఏకంగా ఇండియాలో అతి పెద్ద భారీ ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించి చరిత్ర సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, తదితర కంపెనీల్లో హైయ్యెస్ట్ ప్యాకేజీలతో ఎంపికయ్యారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్ లో ఇప్పటీ కే ఇండియన్స్ దుమ్ము రేపుతున్నారు. ప్రపంచాన్ని శాసిస్తున్న పలు దిగ్గజ కంపెనీల్లో మన వాళ్ళే కీలక పదవుల్లో ఉన్నారు. ఆయా కంపెనీలను లాభాల బాటలో నడిపిస్తూ భారత దేశం పేరు నిలబెడుతున్నారు. అలాంటి వారిలో గూగుల్ సీఇఓ సుందర్ పిచ్చెయ్, మైక్రోసాఫ్ట్ సీఇఓ సత్య నాదెళ్ల, షావోమి కంట్రీ హెడ్ గా అను కుమార్ జైన్ , తదితరులు తమ టాలెంట్ తో ఇతర కంపెనీలకు దడ పుట్టిస్తున్నారు. ఇదే సమయంలో ఇండియాలో టాప్ పొజిషన్స్ లలో ఐఐటీలు కొనసాగుతున్నాయి.ఇటీవల ప్రకటించిన రేటింగ్స్ లలో కూడా ఈ కాలేజీలు మొదటి ప్లేస్ దక్కించుకున్నాయి. ఇక్కడ చదువుకున్న వారికి ప్రపంచ వ్యాప్తంగా హెవీ డిమాండ్ ఉంటోంది. తాజాగా ఇండియాకు చెందిన తాన్యా అరోరా హయ్యెస్ట్...

జగన్ లక్ష్యం..ఆరోగ్యం..మహా భాగ్యం

చిత్రం
ఏపీలో వైసీపీ కొలువు తీరాకా పాలనా పరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి. పాలనలో తనదైన ముద్రను కనబరుస్తున్నారు. పేదలు, సామాన్యులకు ఎలా మేలు చేయాలన్న దిశగా అడుగులు వేస్తున్నారు. వారి కోసం సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆటో వాలాలకు ప్రతి ఏటా 10 వేల రూపాయలు జమ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన ప్రారంభించారు. తనను నమ్ముకున్న వారికి ఉన్నతమైన పదవులు కట్టబెట్టారు. తాజగా ఏపీపీఎస్సి లో ఇద్దరికీ చోటు కల్పించారు. మొత్తం మీద ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుండగా జగన్ మోహన్ రెడ్డి మాత్రం డోంట్ కేర్ అంటూ ముందుకు సాగుతున్నారు. వేలాది ఖాళీలను భర్తీ చేశారు. ఏపీఎస్ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం. ఒక్కసారిగా జగన్ పేరు మారుమ్రోగింది.జగన్  పేరు వైరల్ గా మారింది. ఇక రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంద్ర ప్రదేశ్ గా మార్చేందుకు ఏపీ సీఎం కంకణం కట్టుకున్నారు. మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఆరోగ్య శాఖపై సమీక్ష చేపట్టారు. వైఎస్సార్‌ అమృత...

ఎట్టకేలకు గణేష్ అరెస్ట్

చిత్రం
ప్రముఖ సినీ నిర్మాత, నటుడు, పవన్ కళ్యాణ్ ను పిచ్చిగా అభిమానించే ఫ్యాన్, తెలంగాణ పౌల్ట్రీ అసోసియేషన్ బాధ్యుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు బండ్ల గణేష్ ఎట్టకేలకు అరెస్టు అయ్యాడు. ఓ వ్యాపారి వద్ద డబ్బులు తీసుకుని ఇవ్వక పోవడంతో పాటు ప్రముఖ నిర్మాత వర ప్రసాద్ కు సంబంధించి చెక్ బౌన్స్ కేసు బండ్ల గణేష్ పై ఉన్నది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన గణేష్ పాలమూరు జిల్లా షాద్ నగర్ లో వ్యాపారం, ఇల్లు ఉంది. మెలమెల్లగా నటుడిగా స్టార్ట్ అయి, అనుకోకుండా ప్రొడ్యూసర్ గా అవతారం ఎత్తాడు. ప్రస్తుతం వైసీపీలో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణకు బండ్ల గణేష్ బినామీ గా ఉన్నాడనే ఆరోపణలు అప్పట్లో చాలా వచ్చాయి. స్వతహాగా మాటకారి అయిన ఈ నటుడు కొంత మంది తో గ్యాంగ్ మెంటైన్ చేస్తాడనే విమర్శలున్నాయి. సినీ ఇండస్ట్రీలో తనను కాదనుకున్న వారిని బెదిరిస్తాడనే ఆరోపణలున్నాయి. తాజాగా పోలీసుల కళ్లు గప్పి చట్టం నుంచి తప్పించుకొని తిరుగుతున్న సినీ నిర్మాత బండ్ల గణేష్‌ను ఎన్‌బీడబ్ల్యూ కింద బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ చెక్‌ బౌన్స్‌ కేసులో కడప ప్రత్యేక జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఫస్ట్‌క్లాస్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అఫెన్సెస్...

జనం కోసం జనసేనాని

చిత్రం
నా శరీరం ఈ భూమి మీద ఉన్నంత దాకా, నా ఒంట్లో శక్తి ఉన్నంత కాలం సమస్యలపై పోరాడుతూనే ఉంటా. జనాన్ని జాగృతం చేస్తూనే ఉంటా. ఊపిరి ఉన్నంత వరకు జనసేన పార్టీని నడిపిస్తా. గెలిచినా లేదా ఓడినా నా ప్రయాణం ప్రజల బాగు కోసం, సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉంటానని జనసేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్బంగా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. జగన్ మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారంటూ మండి పడ్డారు. మంత్రులు ఏం చేస్తున్నారో జనానికి, ఇతర నేతలకు అర్థం కావడం లేదన్నారు. పార్టీలను దృష్టిలో పెట్టుకోకుండా ప్రతి ఒక్క జనసేన కార్యకర్త, నాయకులు అంతా జనం ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఆరోపణలు, విమర్శలు చేయడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదన్నారు. పార్టీ పదికాలాల పాటు ఉంటుంది. ప్రాణం ఉన్నత దాకా దానిని కాపాడుతా. జనం కోసమే అది పుట్టింది. అధికారం మన లక్ష్యం కాదు. ప్రజా సంక్షేమమే మన గమ్యం..గమనం కూడా. ఆ దిశగా మనందరం పాటుపడదామని పవన్ అ...

విజిల్ మహిళల కోసం

చిత్రం
తమిళ్ సినిమా రంగంలో కేవలం మూడే మూడు సినిమాలు మాత్రమే తీసిన అట్లి అంటే, అక్కడ ఎక్కడ లేనంతటి క్రేజ్. కథ రాసు కోవడం, దానిని జనరంజకం చేయడం, పబ్లిక్ పల్స్ పట్టు కోవడం అట్లికి వెన్నతో పెట్టిన విద్య. ప్రతి సినిమా సమాజాన్ని, జనాన్ని దృష్టిలో పెట్టుకుని తీశాడు. ఇంకేం బాక్సులు బద్దలయ్యాయి. కోట్లు కురిశాయి. దీంతో ఒక్క రోజులోనే స్టార్ డైరెక్టర్ల సరసన అట్లి చేరి పోయాడు. ఇటీవల నటి ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తాజాగా మహిళా నేపథ్యం కలిగిన కథాంశంతో విజిల్ అనే పేరుతో సినిమా తీశాడు. అది దేశమంతటా దీపావళి పండుగ రోజున రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూరయ్యాయి. దీనిని 187 కోట్లు పెట్టి తీశాడు. ట్రైలర్ దుమ్ము రేపింది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా మొత్తంలో ప్రముఖ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించాడు. తన ఇమేజ్ మరింత పెంచేలా అట్లి విజయ్ ను వాడుకున్నాడు. అంతే కాకుండా విజిల్ యూట్యూబ్ ను షేక్ చేసేస్తోంది. రిలీజ్ చేసిన కొద్దీ సేపట్లో కోట్లాది మంది దానిని వీక్షించారు. ఇప్పటికే ఇది కూడా ఓ రికార్డ్ గా నమోదు అయ్యింది. ఇదిలా ఉండగా సామాజిక బాధ్యతగా అట్లి అసాధారణమైన డిసిషన్ తీసుకున్నాడు...

త్వరలో క్లోజ్ కానున్న సీఓఏ

చిత్రం
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అంటేనే వరల్డ్ వైడ్ గా హెవీ క్రేజ్. ఎందుకంటే అది ఒక్క ఇండియన్ క్రికెట్ నే కాదు అన్ని ఆటల్ని, ఆటగాళ్లతో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ను సైతం శాసిస్తోంది. ఇండియా కంట్రీకి ప్రధాన మంత్రి కావడం చాలా సులభం, కానీ బిసిసిఐకి ప్రెసిడెంట్ కావడం అంటే మాటలా. చాలా రాజకీయాలను తట్టుకుని నిలబడాలి. అదే ఇప్పుడు జరిగింది. డేరింగ్, డైనమిక్ సారధిగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న బెంగాలీ బాబు బిసిసిఐ చీఫ్ గా అంటే ప్రెసిడెంట్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. దీంతో సదరు బోర్డులో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పటికే అమిత్ షా దీనిపై కన్నేశాడు. తన కొడుకుకు బీసీసీఐలో కీలక పదవి ఇప్పించుకున్నాడు. అంతే కాకుండా సౌత్ ఇండియా అధిపత్యానికి చెక్ పెట్టాడు. శ్రీనివాసన్ బలపర్చిన బ్రిజేష్ పటేల్ కు చెక్ పెట్టాడు. గంగూలీ ఎన్నికయ్యేలా మార్గం సుగమం చేశాడు. ఇప్పుడు ఇండియాలో అమిత్ షా అడుగు పెట్టాడంటే ఇక పని ఫినిష్ కావాల్సిందే. లేదంటే జైలుకే కాదంటే కష్టాలే. ఇదిలా ఉండగా బీసీసీఐ కొత్త టీమ్ ఏర్పడిన వెంటనే వినోద్ రాయ్ నేతృత్వంలోని సీఓఏ పూర్తిగా తన బాధ్యతల నుంచి తప్పుకుంటుంది. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు స్పష్టం ...

ట్రబుల్ షూటర్ కు ఊరట

చిత్రం
డీకే శివకుమార్ గుర్తున్నారా. దేశ రాజకీయాల్లోనే కాదు కర్ణాటక పాలిటిక్స్ లో మోస్ట్ పాపులర్ లీడర్ గా ఆయనకు పేరుంది. కాంగ్రెస్ పార్టీకి అతడో ఆయుధంగా, అంది వచ్చిన నాయకుడిగా అనతి కాలంలోనే ఎదిగాడు. అంతే కాకుండా విపక్షాలను ధీటుగా ఎదుర్కోవడంలో డేకి ను మించిన పొలిటికల్ లీడర్లు లేరంటే అతిశయోక్తి కాదు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు శివకుమార్ ఎంటర్ కావడం, సమస్య తలెత్తకుండా పరిష్కరించడం గత కొన్నేళ్లుగా జరుగుతోంది. అయితే కర్ణాటకలో కొలువు తీరిన ఉమ్మడి సంకీర్ణ సర్కార్ ను అడ్డం పెట్టుకుని డీకే కోట్లు వెనకేసుకున్నాడని, అధికార దుర్వినియోగానికి పాలడ్డాడని ఆరోపణలు వచ్చాయి. కన్నడ నాట రాజకీయాల్లో డీకే మోస్ట్ ఫెవరబుల్ లీడర్. దేనినైనా ఢీకొనే మనస్తత్వం కలిగి ఉన్న ఈ లీడర్ మాట్లాడటం లోను, ప్రతిపక్ష పార్టీలను మెస్మరైజ్ చేయడం లోను తనకు తానే సాటి. ఓడలు బళ్లవుతాయి. బళ్ళు ఓడలువుతాయి అన్న నానుడి ఇప్పుడు డీకే విషయంలో నిరూపితమైంది. సంకీర్ణ సర్కార్ కూలి పోకుండా డీకే విశ్వ ప్రయత్నం చేశారు. ముంబైకి వెళ్లారు. అయినా వర్కవుట్ కాలేదు. కుమార స్వామి నేతృత్వంలోని ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడి పోయింది. దీంతో అప్పటి నుంచి డీకేకు ...

బిసిసిఐ చీఫ్ గా దాదా

చిత్రం
భారత జట్టు మాజీ సారథి సౌరబ్ గంగూలీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చీఫ్ గంగూలీ మీడియాతో మాట్లాడారు. తాను ధరించిన బ్లేజర్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ బ్లేజర్‌ను నాకు టీం ఇండియా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన ఈ బ్లేజర్‌ను ఇప్పుడు ధరించాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇది చాలా వదులైంది అంటూ వ్యాఖ్యానించారు. కాగా..బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడాన్ని గౌరవంగా భావిస్తానన్నారు. ప్రస్తుతం భారత జట్టు అద్భుతంగా ఉందన్న గంగూలీ.. విరాట్‌ కోహ్లీకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. భారత క్రికెట్‌ అభివృద్ధికి తాను కష్టపడతానని గంగూలీ స్పష్టం చేశారు. ఇదే సమయంలో మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని గురించి మాట్లాడుతూ అతనో అద్భుతమైన ఆటగాడిగా అభివర్ణించారు. భారత క్రికెట్ చరిత్రలో ధోనీది ప్రత్యేక స్థానమన్నారు. ఇప్పుడే బాధ్యతలు తీసుకున్నా, ఇంకా బీసీసీఐలో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు మార్పులు చేయాలంటే కుదరదు. ఇందు కోసం చాలా కష్టపడాల్సి ఉంటుందని మీకు తెలుసు. దీనిని స్ట్రీమ్ లైన్ చేయాల్సిన...

జగన్ పై జేసీ సెటైర్స్

చిత్రం
తన కామెంట్స్ తో అటు రాజకీయాలను ఇటు పొలిటికల్ లీడర్లకు హీటు తెప్పించే నాయకుడిగా జేసీ దివాకర్ రెడ్డికి పేరున్నది. ఆయనకు, తమ్ముడికి ప్రైవేట్ బస్సులున్నాయి. అవి రెండు రాష్ట్రాలలో జేసీ ట్రావెల్స్ పేరుతో తిరుగుతున్నాయి. ఇటీవల కొన్ని బస్సులను రవాణా శాఖాధికారులు సీజ్ చేశారు. ఇదే విషయంపై జేసీ సీరియస్ గా స్పందించారు. ఒక అడుగు ముందుకు వేసి జగన్ మోహన్ రెడ్డి పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ పరిపాలన జనరంజకంగా ఉందన్నారు. 100 మార్కులకు గాను తాను150 మార్కులు వేస్తున్నన్ని చెప్పారు. అయితే జగన్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు తమ అబ్బాయే అన్నారు. పరిపాలనలో కిందామీద పడుతున్నాడని వ్యాఖ్యానించారు. ఎన్నో ట్రావెల్స్ బస్సులుండగా ఆయనకి తమ బస్సులే కనిపిస్తున్నాయని..ఇప్పటి వరకు 31 బస్సులు సీజ్ చేయడం తనకు అర్థం కాలేదన్నారు. ప్రభుత్వ చర్యలపై న్యాయపరంగా పోరాడతామని చెప్పారు. గత 70  ఏళ్ల నుంచి వాహన రంగంలో ఉన్నామని.. చిన్న చిన్న లోటు పాట్లు ఊడడం సహజమేనని, ఆర్టీసీ తో సహా ఏ ట్రావెల్స్‌ కైనా ఇది మామూలేనని జేసీ స్పష్టం చేశారు. తన బస్సులనే భూతద్దంలో చూసి సీజ్ చేశారని.. ఫైన్‌లతో పోయే తప్పిదాలకు సీజ్ చేయటం ఎంతవరకు సబబు...

తల్లి కోసం తనయుడి త్యాగం

చిత్రం
కన్నవారు బరువై పోతున్నారంటూ పొద్దస్తమానం అమెరికా జపం చేస్తూ డాలర్ల వేటలో మునిగి పోయిన కొడుకులకు కనువిప్పు కలిగించే కథ ఇది. పలకరింపే కరువై పోయి ఆసరా కోసం ఎదురు చూస్తూ వృద్దాశ్రమాలల్లో ఉంటున్న వారు ఎందరో. పేరెంట్స్ ను పట్టించుకోని ప్రబుద్ధులు తల దించుకునేలా చేశాడు కర్ణాటక లోని మైసూర్ కు చెందిన దక్షిణామూర్తి కృష్ణ కుమార్. ఆయన తల్లి కోసం ఏకంగా ఉద్యోగమే వదిలేశాడు. కేవలం తల్లి కోరిన చిన్న కోరికను తీర్చేందుకు. ఇది నమ్మశక్యంగా లేదు కదూ. ఇది వాస్తవం కూడా. ఉన్నట్టుండి కృష్ణ కుమార్ ఒకే ఒక్క ట్వీట్ తో నేషనల్ హీరో అయి పోయాడు. ఏకంగా మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మనసును కదిలించింది అతడి జీవిత కథ. కృష్ణ కుమార్ కు అందరి లాగే అమ్మ అంటే ప్రాణం. ఏనాడూ గడప దాటి బయటకు వెళ్లని తల్లిని దేశం మొత్తం తిప్పి చూపించాలని సంకల్పించాడు. మాతృసేవా సంకల్ప్ యాత్ర పేరుతో స్కూటర్‌పై సుమారు 18 రాష్ట్రాలు, మూడు దేశాలు తిప్పి చూపించాడు. తల్లి సాధారణ గృహిణి. తన 70 ఏళ్ల జీవితంలో ఏనాడు బయట ఊరికి వెళ్లింది లేదు. ఒకరోజు మాటల సందర్భంలో ఇదే విషయాన్ని దక్షాణ మూర్తికి చెప్పింది. కనీసం ఇంటికి దగ్గరలో ఉన్న బేలూరు హలిబేడున...