పోస్ట్‌లు

అక్టోబర్ 26, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

పంతం నెగ్గించుకున్న దుష్యంత్‌

చిత్రం
ఊహించని రీతిలో కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వానికి కోలుకోలేని రీతిలో ప్రజలు షాక్ ఇచ్చారు. ప్రభుత్వ పనితీరుకు మాహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రెఫరెండంగా ప్రకటించాయి విపక్ష పార్టీలు. బీజేపీకి ఊహించని రివర్స్ గిఫ్ట్ ఇచ్చారు ఓటర్లు. పూర్తి మెజారిటీ వస్తుందని నమ్మకంతో ఉన్న మోదీ, అమిత్ షా లకు మిశ్రమ ఫలితాలు రావడం పునరాలోచనలో పడేశాయి. ఈ రెండు రాష్ట్రాలలో ఇతర పార్టీలపై ఆధారపడి పవర్ లోకి వచ్చేలా చివరకు అమిత్ షా పావులు కదిపారు. హంగ్‌ ఫలితాల అనంతరం హరియాణాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. జన్‌నాయక్‌ జనతా పార్టీ తో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ మొగ్గు చూపడంతో పదవుల పంపిణీలోనూ దాదాపు స్పష్టత వచ్చింది. ముఖ్యమంత్రిగా మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ కొన సాగనుండగా, జేజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దుష్యంత్‌ చౌతాలా  డిప్యూటీ సీఎం పదవి చేపట్టనున్నారు. ఫలితాల్లో అసెంబ్లీ లోని 90 స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 46 స్థానాలను ఏ పార్టీ సాధించ లేక పోయింది. బీజేపీ 40, కాంగ్రెస్‌ 31, జేజేపీ 10 సీట్లు గెల్చాయి. ప్రజా తీర్పును జేజేపీ గౌరవించడం లేదంటూ కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శల...

కొలువుల కల్పనలో కాషాయం విఫలం

చిత్రం
కేంద్రంలో కమలదళం కొలువు తీరాక కొలువుల జాడ లేకుండా పోయింది. కొన్ని శాఖల్లో మాత్రమే ఉద్యోగాలు భర్తీ చేస్తుండగా మిగతా ప్రభుత్వ శాఖల్లో లక్షలాదిగా ఉద్యోగాలు ఉన్నప్పటికీ ప్రస్తుత మోదీ ప్రభుత్వం మాత్రం భర్తీ చేయడం లేదు. స్వచ్ఛ భారత్ అంటూ జపం చేస్తున్న మోదీ కొలువుల భర్తీ ఊసెత్తడం లేదు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రస్తుత ప్రభుత్వం మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తోంది. విపక్షాలు నెత్తి నోరు మొత్తుకున్నా పట్టించు కోవడం లేదు. నోట్ల రద్దు దెబ్బకు అన్ని రంగాలు డీలా పడ్డాయి. కోలుకోలేని స్థితికి చేరుకున్నాయి. ఆర్ధిక మంద గమనం ఏర్పడింది. ప్రజల్లో కొనుగోలు శక్తి నశించింది. ఇదే సమయంలో మరో షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాల కల్పన దారుణంగా పడి పోయింది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పేరోల్ డేటా ప్రకారం గత ఆగస్టులో 13 లక్షల ఉద్యోగ అవకాశాలు రాగా, అంతకు ముందు నెలలో ఈ సంఖ్య 14.49 లక్షలు మాత్రమే నమోదైంది. ఇఎస్ఐసీ, రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్‌వో, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ  నిర్వహించే వివిధ సామాజిక భద్రతా పథకాల్లో చేరిన కొత్త చందాదారుల పేరోల్ డేటా ఆధారంగా ఎన...

స్మార్ట్ ఫోన్స్ అదుర్స్..షావోమి సెన్సేషన్

చిత్రం
ప్రపంచ మార్కెట్ ను ఆర్ధిక మాంద్యం దెబ్బ కొడితే మరో వైపు దానికి భిన్నంగా స్మార్ట్ ఫోన్స్ అమ్మకాలు మాత్రం టాప్ రేంజ్ లో కొనసాగుతున్నాయి. ఊహించని రీతిలో మొబైల్స్ అమ్ముడు పోవడం మిగతా కంపెనీలను, వ్యాపారులను విస్తు పోయేలా చేసింది. ఈ ఏడాది క్యూ3లో రికార్డు స్థాయిలో ఏకంగా 5 కోట్ల స్మార్ట్‌ ఫోన్లు అమ్ముడు పోయాయి.  యాపిల్, శాంసంగ్ దిగ్గజ కంపెనీల ఫోన్లు మాత్రం అంతగా అమ్ముడు పోలేదు. దీంతో ఈ కంపీల సేల్స్ అమాంతం పడిపోయాయి. ఈ అమ్మకాల్లో చైనాకు చెందిన కంపెనీల మొబైల్స్ టాప్ రేంజ్ లో నిలిచాయి. ఇందులో రారాజుగా ఇదే కంట్రీకి చెందిన షావోమి స్మార్ట్ ఫోన్ మొదటి ప్లేస్ లో నిలిచింది. భారీగా ఆఫర్స్, గిఫ్ట్స్ ప్రకటించింది రెడ్ మీ. దసరా, దీపావళి పండుగ సీజన్లో స్మార్ట్ ఫోన్స్ అమ్మకాలు రికార్డు స్థాయిలో అమ్ముడు పోయాయి. ఆఫర్లను ప్రకటించడంతో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ అమ్మకాలు జోరందుకున్నాయి. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తాజా నివేదికలో ఈ విషయం వెల్లడయింది. డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, నో కాస్ట్‌ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, ఆకర్షణీయమైన ప్రమోషన్లు  పండుగ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను పెంచడంతో కీలకంగా నిలిచిందని తెలిప...

యాంకర్ రవి హాట్ కామెంట్స్

చిత్రం
స్టార్ మా టీవీలో జనాదరణ పొందిన బిగ్ బాస్ పై ప్రముఖ బుల్లితెర యాంకర్ రవి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఫైనల్ లో ఎవరు గెలుస్తారో తనకు తెలుసు అని, అయితే ఆ పేరు మాత్రం తాను వెల్లడించ దల్చు కోలేదని రవి స్పష్టం చేశారు. కాగా బిగ్ బాస్ రియాల్టీ షోకు త్వరలోనే శుభం కార్డు పడనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్‌ మాత్రమే ఉండగా, వారి తరపున బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీరు ఒక్కసారిగా సెలబ్రెటీలుగా మారి పోయారు. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు. వీరు గెలవాలని కోరుతూ ఏకంగా సోషల్ మీడియాలో వైరల్ గా మార్చే పనిలో పడ్డారు. ఈ ప్రచారంలో భాగంగా ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్దమే నడుస్తోంది. మేము గొప్ప అంటే మేమే గొప్ప అంటూ ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. సెలబ్రీటీలు సైతం అభిమానులతో పాలు పంచుకుంటున్నారు. తమకు నచ్చిన కంటెస్టెంట్‌కు సపోర్టు చేయాలంటూ అభిమానులను కోరుతున్నారు. ఇప్పటికే శ్రీముఖికి జబర్దస్త్‌ యాంకర్‌ రష్మీ, రాంప్రసాద్‌ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా యాంకర్‌ రవి కూడా తన బెస్ట్‌ ప్రెండ్‌ అలీ రేజాకి మద్దతు తెలిపాడు. తన స్నేహితున్ని గెలిపించాలని కోరుతూ ఫేస్‌బుక్‌ లో లైవ్‌ చే...

మోదీకి మహిళా ప్లేయర్ల వందనం

చిత్రం
భారత ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీకి అన్ని వైపుల నుంచి ప్రసంశలు లభిస్తున్నాయి. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఎందరినో ప్రభావితం చేస్తున్నాయి. అమెరికాలో ఇటీవల పర్యటించిన మోదీకి ఘన స్వాగతం లభించింది. అంత కంటే ఎక్కువగా అమెరికన్లతో పాటు ప్రవాస భారతీయుల మనసు దోచుకున్నారు. దీంతో మోదీ గ్రాఫ్ మరింత పెరిగింది. దేశంలో ఏది జరిగినా వెంటనే స్పందించడం అలవాటుగా మార్చుకున్నారు మోదీ. అంతే కాకుండా ఎక్కువగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం పై దృష్టి పెట్టారు. ఎక్కడ చెత్త వేసినా దానిని తీసి వేయాలని ప్రజలకు పిలుపు ఇస్తున్నారు. క్రీడల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఆటగాళ్లకు నజరానాలు, బహుమతులు ప్రకటిస్తున్నారు. తాజాగా నరేంద్ర మోదీజీ భారత్‌ లక్ష్మీ పేరుతో కొత్త కార్యక్రమం ప్రకటించారు. ఈ పిలుపు పలువురు స్టార్‌ మహిళా క్రీడాకారిణుల మనసును తాకింది. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు, బాక్సర్లు మేరీకోమ్, నిఖత్‌ జరీన్, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి మని కా బాత్రా, రెజ్లర్‌ పూజ ట్విట్టర్‌ వేదికగా ‘భారత్‌ లక్ష్మీ’ కార్యక్రమానికి తమ మద్దతును ప్రకటించ...

చివరి అంకానికి బిగ్ బాస్

చిత్రం
తెలుగు బుల్లి తెర మీద సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకెళుతున్న బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకుంది. గత పద్నాలుగు వారాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న ‘బిగ్‌బాస్‌’ మరో వారం రోజుల్లో ముగియనుంది. 15 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ రియాలిటీ షోలో ప్రస్తుతం ఆరుగురు మాత్రమే మిగిలారు. ఇక ఈ వారం అలీ రెజా, శివ జ్యోతి, వరుణ్‌, శ్రీముఖి నామినేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎపి సోడ్‌లో ఒకరు లేదా ఇద్దరు సేవ్‌ అయ్యే అవకాశం ఉందని హోస్ట్‌ నాగార్జున చెప్పాడు. ఎవరెవరు సేవ్‌ అవుతారో తెలుసు కోవడానికి దీపావళీ సందర్భంగా..వారి పేర్లు రాసి ఉన్న పార్టీ పూపర్స్‌ గన్‌ తలా ఒకటి ఇచ్చి పేల్చమని చెప్పాడు. ఎవరి గన్‌ నుంచి రంగు రంగుల కాగితాలు బయటికి వస్తాయో..వారు సేవ్‌ అవుతారని తెలిపాడు. మిగిలిన వారు నామినేషన్‌లోనే ఉంటారని చెప్పాడు. ముందుగా వరుణ్‌, తర్వాత అలీ గన్‌ పేల్చగా..వాటిల్లో ఎలాంటి రంగులు రాలేదు. దీంతో వారిద్దరూ సేవ్‌ కాలేదని హోస్ట్ నాగార్జున తెలిపాడు. ఇక శివజ్యోతి, శ్రీముఖి వారి చేతుల్లో ఉన్న గన్‌లను పేల్చలేక పోయారు. రెండో ప్రయత్నంలో భాగంగా శ్రీముఖి గన్‌ పేల్చగా..దాట్లోంచి రంగుల కాగితాలు వచ్చాయి. ...

నువ్వా నేనా..పీఠం కోసం పట్టు

చిత్రం
మహారాష్ట్ర లో రాజకీయాలు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మరాఠా రాజకీయం వేడెక్కుతోంది. సంకీర్ణంలో పదవుల పంపకంపై శివసేన పట్టు వీడడం లేదు. మరో వైపు కమలం బెట్టు దిగడం లేదు. ముఖ్యమంత్రి పదవి ఆదిత్య ఠాక్రేకు ఇవ్వడంతో పాటు మంత్రి పదవుల్లో సమాన వాటా కల్పిస్తామని లిఖిత పూర్వక హామీ ఇవ్వాలంటూ బీజేపీపై ఒత్తిడి తెస్తోంది. గెలిచిన ఎమ్మెల్యేలతో తన నివాసం మాతోశ్రీలో శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే భేటీ అయ్యారు. సమావేశం అనంతరం శివసేన ఎమ్మెల్యే ప్రతాప్‌ సర్నాయక్‌ తో కలిసి మాట్లాడారు. మా పార్టీ ఎమ్మెల్యేలంతా రెండున్నర ఏళ్ళు ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రి పదవుల్లో సమాన వాటా ఇవ్వాలని కోరారని చెప్పారు. అంతే కాకుండా ఆదిత్య ఠాక్రే కు సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో బీజేపీ హామీ ఇచ్చే దాకా ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సమాన వాటా ఇస్తామంటూ లోక్‌సభ ఎన్నికల సమయంలో ఉద్ధవ్‌ ఠాక్రేకు ఇచ్చిన హామీని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా నెర వేర్చాల్సిందేనని పట్టు బట్టారన్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి పీఠం తమ పార్టీ దేనని బీజేపీ మహారాష్ట్ర ఇన్‌చార్జి సరోజ్‌ పాండే స...

ఆన్ లైన్ లో బిగిల్ .. చిత్ర యూనిట్ కు షాక్

చిత్రం
ప్రముఖ తమిళ్ సినిమా దర్శకుడు అట్లి దర్శకత్వంలో తీసిన బిగిల్ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే ఎప్పటి లాగే పైరసీ భూతం బిగిల్ ను వదలలేదు. విడుదలైన కొన్ని గంటల్లోనే అనధికారికంగా ఆన్‌లైన్‌లో పూర్తి సినిమా హల్‌ చల్‌ చేసింది. చిత్ర వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. విజయ్‌ , నయనతార కలిసి నటించిన చిత్రం బిగిల్‌. అట్లీ దర్శకత్వంలో ఏజీఎస్‌ సంస్థ నిర్మించింది. విడుదలకు ముందు నుంచే మొదలైన బిగిల్‌ చిత్ర రచ్చ ఆ తరువాత కూడా కొనసాగుతోంది. ఈ చిత్రంతో పాటు కార్తీ హీరోగా లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్, వివేకానంద స్టూడియోస్‌ సంస్థలు కలిసి నిర్మించిన ఖైదీ చిత్రం ఒకే సారి విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలకు పైరసీ దెబ్బ తగిలింది. బిగిల్‌ చిత్రం విడుదలైన కొన్ని గంటలకే అనధికారికంగా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయితే కొంచెం ఆలస్యంగా ఖైదీ చిత్రం ఆన్‌లైన్‌లో హల్‌ చల్‌ చేసింది. అనధికారకంగా, అక్రమంగా ఆన్‌ లైన్‌లో ప్రచారం చేయొద్దని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను భేఖాతరు చేస్తూ తమిళ్‌ రాకర్స్‌ అనే వెబ్‌ సైట్‌ పైరసీకి పాల్పడడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పైరసీని అరి...

రాములో రాములా..కాసర్ల సెన్సేషన్

చిత్రం
ఎవరీ కాసర్ల అనుకుంటున్నారా. తెలంగాణకు చెందిన పోరడు. తెలంగాణ యాసలో అద్భుతమైన రీతిలో జనాన్ని మెస్మరైజ్ చేసేలా పాటలు రాయడంలో దిట్ట. ఎన్నో సినిమాలకు కూడా పాటలు రాశాడు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అంటేనే ఈసడింపు, చీదరమిపులు ఉండేవి. ఎప్పుడైతే ఉద్యమం ఊపందుకున్నదో ఇక అప్పటి నుంచి తెలంగాణ పేరు లేకుండా సినిమాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మన వాళ్లకు తెలివి లేదని, వీళ్లకు సంస్కారం రాదని ఆంధ్రాకు చెందిన వాళ్ళు దెప్పి పొడిచే వాళ్ళు. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక సినిమా రంగం మీద తెలంగాణ విస్మరించలేని స్థాయికి చేరుకుంది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వీరిని కొనసాగిస్తున్నారు. మన తెలంగాణకు చెందిన గేయాలు, పాటలు ఇప్పుడు సినిమాల్లోనే కాదు యూట్యూబ్ ను కూడా షేక్ చేస్తున్నాయి. దీంతో ఆంధ్రా అధిపత్యానికి చెక్ పెట్టింది తెలంగాణ. మన ప్రాంతానికి చెందిన వారు డైరెక్టర్లుగా, టెక్నీషియన్స్ గా, గేయ రచయితలుగా లెక్కలేనంత మంది వెలుగులోకి వచ్చారు. వారిలో హరీష్ శంకర్, దిల్ రాజు, విజయ్ దేవర కొండ, పైడిపల్లి వంశీ, నాగ్ అశ్విన్, చంద్ర బోస్, సుద్దాల అశోక్ తేజ, తరుణ్ భాస్కర్, గోరెటి వెంకన్న , తదితరులు దుమ్ము రేపుతున్నారు....

పసిడి విల విల..అమ్మకాలు వెల వెల

చిత్రం
ఎన్నడూ లేని రీతిలో బంగారం ధరలు కొండెక్కడంతో అమ్మకాలు భారీగా తగ్గి పోయాయి. దీంతో జ్యుయెలరీ షాప్స్ కొనుగోలుదారులు లేక వెలవెల బోతున్నాయి. కస్టమర్స్ ను ఆకర్షించేందుకు అన్ని దుకాణదారులు పెద్ద ఎత్తున ఆఫర్స్, బహుమతులు, ఒకటి కొంటే మరొకటి ఉచితం అంటూ ప్రకటించినా జనం ఆ వైపు చూడలేదు. పండుగ వేళ కాసింతైనా పసిడిని కొనాలని ప్రచారం చేసినా మహిళలు వాటి జోలికి వెళ్ళ లేదు. ధంతేరాస్‌గా పిలిచే ధన త్రయోదశికి పసిడి మెరుపులు తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు ఏకంగా 40 శాతం దాకా తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 10 గ్రాముల పసిడి ధర 40 వేలకు అటూ ఇటుగా కదులుతుండటంతో కొనుగోలుదారులు కొనేందుకు ఇష్టపడటం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ధన త్రయోదశికి బంగారం, వెండి, లేదా విలువైన వస్తువులు కొనడం శుభ సూచకమని హిందువులు భావిస్తారు. 2018లో రికార్డు స్థాయి కొనుగోళ్లు జరిగాయి కూడా. హైదరాబాద్‌లోని నగల షాపుల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర  39,900 కాగా.. 22 క్యారెట్ల ధర 36,850 పలికింది. కిలో వెండి 50,600 ఉంది. ఈ సంవత్సరం ధన త్రయోదశికి 2,500 కోట...

సీఎం భారీ నజరానా

చిత్రం
కాంగ్రెస్ కంచు కోటను బద్దలు కొట్టడమే కాకుండా భారీ మెజారిటీని కట్టబెట్టిన హుజూర్ నగర్ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు ప్రకటించారు. వారు అడిగిన దాని కంటే ఎక్కువగా మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో 43 వేలకు పైగా మెజారిటీ కట్టబెట్టారు. ఇక్కడ అధికార పార్టీకి ఈ ఎన్నిక గెలవడం తప్పనిసరిగా మారింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగింది ప్రచారం. పలువురు ఈ ఉపఎన్నికలో పోటీ చేసినా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల అభర్ధుల మధ్యనే నడిచింది. అంతకు ముందు దీనిని అధికార పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఎలాగైనా సరే గెలవాలన్న పట్టుదలతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇక్కడ మోహరించారు. విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రి జగదీశ్వర్ రెడ్డి లు దగ్గరుండి పర్యవేక్షించారు. ఇదే సమయంలో ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కూడా రాడ్ షో లో పాల్గొన్నారు. ఉత్తమ్ భార్యను గెలిపిస్తే వాళ్ళు మాత్రమే బాగు పడతారని, కానీ తమ పార్టీకి చెందిన సైదిరెడ్డి గెలిస్తే నియోజక వర్గం మొత్తం బాగుపడుతుందని చెప్పారు. ఇదే ఎన్నికల నినాదంగా మారింది. బడా నేతలు ఇక్కడ ప్రచారం చేశారు. అయినా కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలై...

చర్చలు విఫలం..సమ్మె యథాతథం

చిత్రం
ప్రభుత్వం తన మంకు పట్టు వీడడం లేదన్న సంగతి మరోసారి రుజువైంది. రాష్ట్ర హైకోర్టు ఆర్టీసీ సమ్మెపై సీరియస్ అయ్యింది. వారితో బేషరతుగా చర్చలు జరపాలని ఆదేశింది. అంతే కాకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మానవతా దృక్పథంతో పరిశీలించి సమస్యను పరిష్కరించేందుకు సర్కారు చొరవ చూపాలని ధర్మాసనం పేర్కొంది. ఇదే సమయంలో ప్రజాగ్రహం వెల్లువెత్తితే తట్టు కోవడం కష్టమని, ఫిలిప్పైన్స్ లో రూఢీ అయ్యిందని స్పష్టం చేసింది. అంతే కాకుండా సమ్మె చేయడం కార్మికుల ప్రాథమిక హక్కు అని గుర్తు చేసింది కోర్టు. ఇదే సమయంలో కార్మిక సంఘాలు పండుగ వేళ సమ్మెకు దిగడం భావ్యం కాదన్నది. వెంటనే చర్చలు జరిపి తీరాల్సిందేనంటూ కోర్టు పేర్కొంది. విలీనం చేయాలనీ, మిగతా డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె మరింత ఉధృతంగా మారింది. ఈ మేరకు అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు ఓ మెట్టు దిగాయి. సంఘాల నాయకులతో యాజమాన్యం చర్చలు జరిపింది. అవి పూర్తిగా అర్ధాంతరంగా ముగిశాయి. మొత్తం డిమాండ్ల పరిష్కారానికి కార్మిక సంఘాల నేతలు పట్టుబట్టడంతో చర్చలు చివరి వరకు కొనసాగలేదు. ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందడంతో ఆర్టీసీ కార్మిక స...

అంతటా ఉత్కంఠ..ఎవ్వరో విజేత

చిత్రం
తొంబై రోజులుగా బుల్లి తెరపై సంచలనం రేపిన బిగ్ బాస్ రియాల్టీ షోకు కొద్దీ రోజుల్లో శుభం కార్డు పడనుంది. అత్యధిక టీఆర్పీలతో ప్రారంభ మైనప్పటికీ తర్వాత ఆ హవాను కొనసాగించ లేక పోయింది. వైల్డ్‌ కార్డులు, రీ ఎంట్రీలు ప్రవేశ పెట్టినప్పటికీ ప్రేక్షకుల మనసు గెలవలేక పోయింది. బిగ్‌బాస్‌ మొదటి నుంచి ఇస్తూ వచ్చిన టాస్క్‌లు. అష్టా చెమ్మా ఆటల కన్నా అధ్వాన్నంగా ఉన్నాయని నెటిజన్స్ విమర్శించారు. బిగ్‌ బాస్‌ షో క్లైమాక్స్‌ చేరు కోవడంతో, ఇప్పటి కైనా ఆసక్తికర టాస్క్‌లు ఇస్తారే మోనని ఎదురు చూశారు. కానీ అదీ నెర వేరలేదు. కొంత మందికి కాస్త కఠినంగా మరికొంత మందికి సులువైన టాస్క్‌లు ఇచ్చారని తిట్టి పోస్తున్నారు. ఇక ఎంటర్‌టైన్‌మెంట్‌ పూర్తిగా పక్కన పడేసి, కేవలం ప్రమోషన్స్‌కు మాత్రం బిగ్‌బాస్‌ను భీభత్సంగా వాడుకున్నారన్న వాదన లేక పోలేదు. మొదటి నుంచి ఈ కార్యక్రమంపై వెల్లు వెత్తిన ఆరోపణలకు లెక్కే లేదు. ఈ సీజన్‌లో హౌస్‌మేట్స్‌ గొడవలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొద్దో గొప్పో రాహుల్‌.. పునర్నవిల లవ్‌ట్రాక్‌ కాస్త పర్వాలేదని పించింది. మన్మథుడి హోస్టింగ్‌తో నెట్టుకొద్దామని చూసినప్పటికీ, బిగ్‌బాస్‌ షోలో అసలైన మజా లోప...

గంగూలీ సింప్లిసిటీ నచ్చింది

చిత్రం
సౌరబ్ గంగూలీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనతో కొన్నేళ్లుగా ఆట పరంగా, స్నేహ పరంగా బంధం కొనసాగుతూ వస్తోంది. నా ఒక్కరిలోనే కాదు చాలా మంది క్రికెటర్లు కూడా ఇలాంటి అనుభవాన్ని పొందుతున్నారని భావిస్తున్నా. ఎందుకంటే గంగూలీకి ఏ సమయంలో దాదా అని పేరు పెట్టారో నాకిప్పుడు అర్థమయింది. వృత్తి పరంగా ఎంతో దృఢమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు. అదే స్ఫూర్తి ఆయనలో ఇప్పటికీ అలాగే ఉన్నది. ఇది నన్ను విస్తు పోయేలా చేసింది. ప్రస్తుతం గంగూలీ బిసిసిఐకి ప్రెసిడెంట్ అయ్యారు. అది అత్యంత కీలకమైన పదవి. క్రికెట్ ఆటను నిర్దేశించి, శాసించే సమయం ఒక్క ప్రెసిడెంట్ కే ఉంటుంది. దీంతో పాటు క్రికెట్ సెలెక్షన్ కమిటీ ఎంపిక కూడా చాలా క్లిష్టమైన పదవి. ఇప్పుడు దాదా కొలువు తీరాడు. ఆయన సారధ్యంలో భారత క్రికెట్ కు మంచి రోజులు వచ్చాయని భావిస్తున్నాని చెప్పారు మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్. బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా ఎంపికైన సౌరవ్‌ గంగూలీని క్రికెట్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ సన్మానించింది. ఇదే కార్యక్రమానికి లక్ష్మణ్‌ హాజరయ్యారు. తన గత అనుభవాల్ని నెమరు వేసుకున్నాడు. 2014లో క్యాబ్‌ జాయింట్‌ సెక్రటరీగా గంగూలీ పని చేస్తున్న సమయంలో ...

విలీనం చేస్తే సంఘాలంటూ వుండవు

చిత్రం
ఆర్టీసీని కనుక ప్రభుత్వం విలీనం చేస్తే.. కార్మిక సంఘాలను పూర్తిగా రద్దు చేసుకుంటామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఆర్టీసీ ఖేల్‌ ఖతం అంటూ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు కార్మికుల మనోభావాలను దెబ్బ తీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థాయిని మరిచి మాట్లాడటం సీఎంకు తగదని, బెదిరింపులతో కార్మికులను లొంగ తీసుకునే ప్రయత్నం మంచి పద్ధతి కాదన్నారు. సంఘాలు అనేవి కార్మికుల హక్కుల కోసం పోరాడతాయి. కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె చేస్తున్నారు. వారిని సమ్మె విరమించి, విధులకు హాజరవ్వాలని కేసీఆర్‌ కోరినా.. ఇప్పటి వరకు ఎవరూ విధుల్లో చేరలేదు. ఆర్టీసీకి పల్లె వెలుగు, నగరాల్లో తిప్పే బస్సుల తోనే నష్టాలు వస్తున్నాయి. ప్రైవేటు బస్సులను కూడా గ్రామీణ ప్రాంతాల్లో తిప్పితే, ఆ విషయం తెలుస్తుంది. 26 డిమాండ్లలో కార్మిక సంఘాల నేతల స్వార్థం ఏ మాత్రం లేదు. ఒక వేళ ఉందని నిరూపిస్తే, సమ్మెను ఇప్పటికిప్పుడే విరమిస్తామని అశ్వత్థామ రెడ్డి   స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పాత్రలను సమర్పిస్తామని చెప్పారు. అంతే కాకుండా కార్మికుల సమర భేరి సభ తప్పక జరిగి తీరుతుందన్నారు. సమ్మెకు ప...

జనసందోహం డీకే ఆనందం

చిత్రం
కాంగ్రెస్ సీనియర్ లీడర్, ట్రబుల్ షూటర్, కన్నడ రాజకీయాల్లో విస్మరించలేని నాయకుడిగా పేరున్న డేకి శివకుమార్ తొలిసారిగా తన మాతృభూమిపై కాలు మోపారు. మనీ ల్యాండరింగ్ కేసులో తీహార్ జైలులో గడిపారు. ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై సీబీఐ, ఈడీ సుప్రీం కోర్టులో నామినేషన్ దాఖలు చేసింది. ఇదే సమయంలో కర్ణాటకలో బలమైన నాయకుడిగా డీకే శివకుమార్ కు పేరుంది. చాలా మంది నాయకులు కేంద్రంలోని బీజేపీ పట్ల మౌనంగా ఉండగా, డీకే మాత్రం తాను ఏ మాత్రం తగ్గలేదు. కన్నడ నాట కొలువు తీరిన కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం పడిపోకుండా కాపాడేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేశాడు. అయినా ఫలితం లేక పోయింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఇదే సమయంలో బీజేపీ కింగ్ మేకర్ అమిత్ షా కన్ను డీకేపై పడింది. ఎలాగైనా సరే డీకేను జైలుకు పంపించాలని డిసైడ్ అయ్యాడు. ఇంకేం సీబీఐ, ఈడీ రంగంలోకి దిగింది. డీకేను అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపించింది. దీంతో అధికార పార్టీకి చెందిన బీజేపీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప సైతం ఆవేదన వ్యక్తం చేశారు. డీకే తనకు వ్యక్తిగతంగా మంచ...

జయహో బుమ్రా..మందాన

చిత్రం
ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమమైన పురస్కారం ఏమిటంటే అది విజ్డన్‌ మాత్రమే. క్రికెట్ ఆటలో అత్యుత్తమమైన ప్రతిభను ప్రదర్శించిన ఆటగాళ్లకు ఈ అవార్డు ను ప్రకటిస్తారు. గతంలో మన టీమిండియాకు చెందిన ఆటగాళ్లకు విజ్డన్‌ అవార్డు వరించింది. తాజాగా భారత స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, బ్యాట్స్‌ వుమన్‌ స్మృతి మంధానాలకు ప్రతిష్ఠాత్మక మైన విజ్డన్‌ పురస్కారాలకు ఎంపికయ్యారు. విజ్డన్‌ ఇండియా అల్మ నాక్‌ ‘క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు’ను బుమ్రా, స్మృతి గెలుచుకున్నారు. ఈ అవార్డు కోసం  ప్రకటించిన ఐదుగురు ఆసియా విజేతల్లో ఇద్దరు మనోళ్లే ఉండడం విశేషం. మిగతా ముగ్గురు పాకిస్థాన్‌ క్రికెటర్‌ ఫఖర్‌ జమాన్‌, శ్రీలంకకు చెందిన దిముత్‌ కరుణ రత్నె, అఫ్ఘానిస్థాన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ లు చోటు దక్కించుకున్నారు. ఈ ఆటగాళ్లు ఆయా జట్లకు కీలకంగా ఉన్నారు. విజయాల్లో ప్రధాన పాత్ర పోషించారు.  కాగా.. భారత యువ క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ పేరు కూడా విజ్డెన్‌ పత్రికలో చోటు దక్కింది. 2019, 2020కి గాను ఏడో ఎడిషన్‌ వార్షిక క్రికెట్‌ సంచికల్లో మయాంక్‌ అగర్వాల్‌కు సంబంధించి ప్రత్యేక కథనం ముద్రించారు. దక్షిణాఫ్రికాతో ఇటీవలే ము...

దాదా చేతిలో సెలెక్షన్ ఫ్యూచర్

చిత్రం
బిసిసిఐ ప్రెసిడెంట్ గా దాదా కొలువు తీరడంతో మార్పులు శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే బిసిసిఐ లో ఏం జరుగుతుందో అని గంగూలీ వాకబు మొదలు పెట్టారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే తనదైన మార్క్ ను స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం భారత క్రికెట్ సెలెక్షన్ కమిటీ భవితవ్యం ఇప్పుడు దాదా చేతుల్లోకి వెళ్లి పోయింది. గతంలో ఆటగాడిగా, టీమిండియా సారధిగా దుందుడుకు ప్రదర్శించారు దాదా. జట్టును కొత్త పుంతలు తొక్కించాడు. దూకుడైన నాయకత్వంతో ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ను తిరుగులేని జట్టుగా నిలిపాడు. యువ ఆటగాళ్లను వెన్ను తట్టి వారు తమ ప్రతిభను వంద శాతం ప్రదర్శించేలా ప్రోత్సహించాడు. గంగూలీ ఇప్పుడు బీసీసీఐ బాస్‌గా కొత్త పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యాడు. పరిపాలకుడిగా దాదా  తీసుకొనే తొలి నిర్ణయం జాతీయ సెలెక్షన్‌ కమిటీపైనే కానుంది. లోధా సంస్కరణల నేపథ్యంలో బీసీసీఐకి కొత్త రాజ్యాంగం ఏర్పడింది. దానిపై బోర్డు కార్యవర్గంతో పాటు అనుబంధ సంఘాలూ పూర్తిగా అవగాహనకు రావాల్సి ఉంది. అధ్యక్షుడిగా సౌరవ్‌ తీసుకొనే మొట్ట మొదటి ప్రధాన నిర్ణయం జాతీయ సెలెక్షన్‌ కమిటీపైనే. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని టీమిండియా సెలెక్షన్‌ కమిటీ భవి...

లాభాల బాటలో ఎస్‌బీఐ

చిత్రం
భారత దేశంలో అతిపెద్ద బ్యాంకు గా పేరొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభాల బాట పట్టింది. ఇప్పటికే మోదీ సంస్కరణలు ప్రజల పాలిట, బ్యాంకుల పాలిట శాపంగా మారాయి. గత కొంత కాలంగా ఖాతాదారులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఇటీవల కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి ఎస్‌బీఐలో. దీని వల్ల కొంత మేర సానుకూల ఫలితాలు రావడం మొదలు పెట్టాయి. అంతకు ముందు దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకుల సిబ్బంది, ఉద్యోగులు సమ్మె చేపట్టారు. తాజాగా ద్వితీయ త్రైమాసికానికి కళ్లు చెదిరే ఆర్థిక ఫలితాలను ఎస్‌బీఐ సాధించింది. బ్యాంకు కన్సాలిడేటెడ్‌ నికర లాభం దాదాపు ఆరు రెట్లు పెరిగి 3,375.40 కోట్లకు చేరుకుంది. కిందటి ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు  576.46 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సమీక్షా కాలంలో మొత్తం ఎస్‌బీఐ గ్రూప్‌ ఆదాయం 79,302.72 కోట్ల నుంచి 89,347.91 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం 17 శాతం పెరిగి 24,600 కోట్లకు చేరుకుంది. ఇది అంచనాలకు మించి ఉండటం విశేషం. మిగతా బ్యాంకులకు ఒక రకంగా షాక్. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వ్యాపారంలో వాటాను విక్రయించడం వల్ల బ్యాంకు లాభాలు పెరిగే అవకాశం ఏర్పడింది. అనుబంధ సం...

మార్చుకున్న వ్యూహం..యెడ్డీకి అనుకూలం

చిత్రం
నిన్నటి దాకా మోడీ, అమిత్ షా ఏది చెబితే అది వేదంగా, చట్టంగా అమలవుతూ వచ్చింది. అంతకంటే ఎక్కువగా అమిత్ షా సౌత్ ఇండియాపై కన్నేసి ఉంచాడు. కన్నడ నాట కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ సర్కారు ను పడగొట్టి యెడ్యూరప్ప నేతృత్వంలో కమలానికి అధికారాన్ని కట్టబెట్టారు. ఇదే సమయంలో యెడ్డీకి..హైకమాండ్ కు మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. దీంతో ఎడ్డీ కూడా మౌనంగా వుండి పోయారు. తాను అధికారంలో ఉన్నప్పటికీ ఏ ఒక్క పనికీ ఆమోదం లభించలేదు. దీంతో కొంత గుర్రుగా ఉన్నారు. ఇదే సమయంలో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో బీజేపీకి అనుకున్నంతగా ఓటు బ్యాంక్ రాలేదు. దాదాపు 21 శాతానికి పైగా పడి పోయింది. ఒకవేళ ఇక్కడ గనుక మెరుగైన రిజల్ట్స్ వచ్చి ఉంటే యెడ్డీకి ఇంకా కష్టాలు మొదలయ్యేవి. మరో వైపు బీజేపీ అధిష్ఠానం కూడా తన వ్యూహం మార్చుకుంది. మధ్యంతర పోరు ద్వారా యడ్డీకి చెక్‌ పెట్టి, రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న యోచన మానుకొని, ఉప సమరం పైనే పెట్టడంతో యడ్యూరప్పకు కాస్త ఉపశమనం కలిగింది. అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన యెడ్డీకి అధిష్ఠానం మద్దతు అరకొరే అని చెప్పాలి. సీనియర్‌ నేత అని కుర్చీ అప్ప జెప్పిందే కానీ, ఏ మాత్రం ప్రాధ...

రాములమ్మ లుక్స్ అదుర్స్

చిత్రం
తెలుగు సినీ రంగంలో రాములమ్మగా పేరొందిన విజయశాంతికి ఓ స్పెషాలిటీ ఉంది. ఆమె కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ప్రధాన పాత్రలో విజయశాంతి నటిస్తున్నారు. దీంతో మహేష్, రాములమ్మల కాంబినేషన్ ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ ప్రిన్స్ ఫ్యాన్స్ లో నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా డైరెక్టర్ అనిల్ విజయశాంతి న్యూ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. బ్రేక్‌ ఇచ్చింది సినిమాలకు మాత్రమే కానీ తనలోని నటనకు, అభినయానికి కాదని ఒకే ఒక్క స్టిల్‌తో అందరికి సమాధానం ఇచ్చారు. రాములమ్మగా, లేడీ అమితాబ్ గా ఆమెను పిలవడం పరిపాటి. ఇటీవల మహేష్ బాబుతో నటించడం తనను ఎంతో సంతోషానికి గురి చేస్తోందన్నారు. దాదాపు దశాబ్ద కాలం పాటు సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన ఈ లేడీ సూపర్‌స్టార్‌.. మహేష్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ తో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో విజయశాంతి పాత్రపై అందరిలోనూ ఆసక్తి, అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీపావళి కానుకగా ‘సరిలేరు నీకెవ్వరూ’ టీం ఈ చిత్రంలో విజయశాంతి ఫస్ట్‌ ల...