పోస్ట్‌లు

మార్చి 28, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

సినీ కార్మికుల కోసం భారీ సాయం

చిత్రం
క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు తెలుగు సినిమా రంగం తీవ్ర ఒడిదుడుల‌కు లోనైంది. ఎక్కువ మంది కార్మికులు ఈ ప‌రిశ్ర‌మ‌నే న‌మ్మ‌కున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడ‌ని కార్మికులు వేలాది మంది ఉన్నారు. తెర‌పై కొంద‌రు మాత్ర‌మే హీరోలుగా చెలామ‌ణి అవుతుండ‌గా మిగ‌తా కార్మికులంతా తెర వెన‌కే ఉండి పోతున్నారు. వీరి సంక్షేమం కోసం గ‌తంలో దివంగ‌త న‌టుడు, ద‌ర్శ‌కుడు ప్ర‌భాక‌ర్ రెడ్డి ఎంత‌గానో కృషి చేశారు. ప్ర‌స్తుతం మా మూవీస్ అసోసియేష‌న్ ప‌ని చేస్తోంది. దీనికి ప్ర‌ముఖ న‌టుడు చిరంజీవి గౌర‌వ అధ్య‌క్షుడిగా ఉన్నారు. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా న‌టుడు న‌రేష్ కొన‌సాగుతున్నారు. తాజాగా క‌రోనా ఎఫెక్ట్ భారీగా ఉండ‌డంతో ఉన్న ప‌ళంగా సినిమా షూటింగ్స్ ల‌ను బంద్ చేశారు. దీంతో కార్మికులు రోడ్డున ప‌డ్డారు. ఏడాది పొడ‌వునా ఏదో ఒక సినిమా న‌డుస్తూ ఉండ‌డంతో దీనినే న‌మ్ముకుని బ‌తుకులీడుస్తున్న వారంతా దిక్కు తోచ‌ని స్థితిలోకి నెట్ట‌బ‌డ్డారు. క‌రోనా వైర‌స్ మ‌హమ్మారి నుంచి దేశాన్ని కాపాడాలంటూ భార‌త‌దేశ ప్ర‌ధాన‌మంత్రి మోదీజీ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఈ ఆప‌త్కాల స‌మ‌యంలో కోట్లాది మందికి వైద్య ప‌రీక్ష‌లు చేయ‌డం, మందులు స‌ర‌ఫ‌రా, ప్రాథ...

స‌మున్న‌త భార‌తావ‌నికి స‌లాం

చిత్రం
ప్ర‌పంచం క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు విల‌విల‌లాడుతోంది. అందుకు ఇండియా మిన‌హాయింపు ఏమీ కాదు. కాబోదు కూడా. ఎందుకంటే అదే లోకంలో మ‌నం కూడా భాగ‌స్తుల‌మే. కాద‌న‌లేం. ప్ర‌స్తుత సంద‌ర్భం ఏమిటంటే నిన్న‌టి దాకా ఈ దేశంలో ఉండి..ఇక్క‌డి గాలి పీల్చి..ఇక్క‌డి వ‌న‌రుల‌ను వాడుకుని..ఉద్యోగం పేరుతో..సంపాదించే నెపంతో ఇత‌ర దేశాల‌కు వెళ్లిన వాళ్లు ఇపుడు త‌ల‌దించు కోవాల్సిన దుస్థితి. కాలం మార‌దు..అది కొన్ని త‌రాలుగా, ద‌శాబ్ధాలుగా త‌న దారిన వెళుతూనే ఉన్న‌ది. అందులో భాగమే ఈ సంచారం..ప్ర‌కృతి ప్ర‌కోపం. జీవ‌న విధ్వంసం జ‌రుగుతూనే ఉన్న‌ది. కోట్లాది మంది ప్ర‌జ‌లు ఆక‌లి కేక‌ల‌తో అల్లాడుతున్నారు. టెక్నాల‌జీ పేరుతో స‌రిహ‌ద్దులు దాటి అదే ప్ర‌పంచం అనుకుని విర్ర‌వీగుతూ..త‌మ కంటే గొప్ప వాళ్లు ఎవ‌రూ లేర‌ని భ్ర‌మ‌ల్లో బ‌తుకుతున్న ప్ర‌వాస భార‌తీయులు ఇపుడు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. ఈ ప్ర‌పంచాన్ని తన క‌నుస‌న్న‌ల‌లో ఉంచుకుని శాసిస్తూ వ‌చ్చిన అగ్ర‌రాజ్యం అమెరికా ఇపుడు క‌రోనా వైర‌స్ అనే కంటికి క‌నిపించ‌ని దానిని ఎలా ఎదుర్కోవాలో తెలియ‌క త‌ల్ల‌డిల్లుతోంది. ఒక ర‌కంగా తాను చెప్పిందే వేదం..తాను గీసిందే శాస‌నం అంటూ బీరాలు ప‌లికిన ఈ దేశం ...