పోస్ట్‌లు

డిసెంబర్ 5, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

యాహూ కొత్తగా గమ్మత్తుగా

చిత్రం
ఒకప్పుడు ఇంటర్నెట్‌ సెర్చి ఇంజిన్‌గా, ఈ మెయిల్‌కు పర్యాయపదంగా వెలిగిన యాహూ ఆ తర్వాత మిగతా సంస్థల నుంచి పోటీ ని తట్టుకోలేక వెనుకబడి పోయింది. అయితే, పూర్వ వైభవాన్ని సంపాదించు కునేందుకు యాహూ మెయిల్‌ తాజాగా ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగా సరికొత్త ఫీచర్స్‌తో పాటు మొబైల్‌ యాప్‌ను రీబ్రాండింగ్‌ చేయడం ద్వారా యూజర్లను ఆకర్షించేందుకు కసరత్తు చేస్తోంది. పోటీ సంస్థలు గూగుల్‌కి చెందిన జీమెయిల్, మైక్రోసాఫ్ట్‌ అవుట్‌లుక్‌ వంటివి తమ యాప్స్‌ను ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లు, సర్వీసులతో రీ బ్రాండ్‌ చేసుకుంటూనే ఉన్న నేపథ్యంలో యాహూ తాజా ప్రయత్నాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  యాహూ మెయిల్‌కు ప్రపంచ వ్యాప్తంగా 22.76 మిలియన్ల మంది నెలవారీ యూజర్లు ఉన్నారు. మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్లెట్‌ పీసీలు, కంప్యూటర్స్‌ మొదలైన వివిధ డివైజ్‌ల ద్వారా వీరిలో చాలా మంది ఈమెయిల్‌ సర్వీసులు ఉపయోగించు కుంటున్నారు. మొత్తం యూజర్లలో ప్రతి నెలా 7.5 కోట్ల మంది యూజర్లు కేవలం తమ మొబైల్స్, ట్యాబ్లెట్స్‌ ద్వారానే యాహూ మెయిల్‌ను ఉపయోగిస్తున్నారు. యాహూ మెయిల్‌ వినియోగదారుల్లో 60 శాతం మంది అమెరికాయేతర దేశాల వారే. ప్రస్తుతం ఉన్న యూజర...

హువావే వాచ్ హవా

చిత్రం
టెక్నాలజీలో చోటు చేసుకున్న మార్పులు ఎన్నో నూతన ఆవిష్కారణలకు కేంద్ర బిందువుగా మారుతోంది. అయితే దిగ్గజ కంపెనీలు అమెరికా, సౌత్ కొరియాకు చెందినవే అయినా, వాటి హవాకు చెక్ పెడుతున్నాయి చైనాకు చెందిన కంపెనీలు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మొబైల్స్ ను తయారు చేస్తున్నాయి. తాజాగా చైనా మొబైల్స్ తయారీదారు హువావే  కొత్త స్మార్ట్‌ వాచ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. జీటీ 2 స్మార్ట్‌వాచ్ పేరుతో దీన్ని అందు బాటులోకి తీసుకొచ్చింది. జీటీ 2 వాచ్‌ 42 ఎంఎం వేరియంట్ లభ్యత వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కాగా 46 ఎంఎం వేరియంట్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇతర రిటైల్ దుకాణాలతో సహా ఇ-కామర్స్ వెబ్‌ సైట్లలో అందుబాటులో ఉంచింది హువావే కంపెనీ. అయితే జీటీ2 స్మార్ట్‌వాచ్  ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి.1.2 ఇంచుల అమోలెడ్ టచ్ డిస్‌ప్లే, రౌండ్‌ డయల్‌, హువావే కిరిన్ ఎ1 చిప్, 3డీ గ్లాస్‌, బ్లూటూత్ 5.1 వాటర్ రెసిస్టెన్స్, జీపీఎస్, ఇంటిగ్రేడ్ మైక్రోఫోన్ అండ్ స్పీకర్, బ్లూటూత్ కాలింగ్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, 15 వర్కవుట్ మోడ్స్ ఇందులో పొందు పరిచారు. ధర పరంగా చూస్తే 46 ఎంఎం స్పోర్ట్ ధర15,990 రూపాయలు ఉండగా, లెదర...

దిశ సరే..నిర్భయ మాటేమిటి

చిత్రం
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్త మవుతున్నాయి. దిశ అత్యాచార ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్త మవడంతో కేసు విచారణలో పోలీసులు ప్రత్యేక దృష్టిని సారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా దిశ మృతదేహాన్ని కాల్చిన చటాన్‌పల్లి అండర్‌పాస్‌ ప్రాంతంలో క్రైమ్‌ సీన్‌ను రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా పారి పోయేందుకు ప్రయత్నించారు. దీంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. తాజా ఘటనపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు. దిశకు న్యాయం జరిగింది. కానీ నిర్భయ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దిశ చనిపోయిన ఎనిమిది రోజుల్లోనే పోలీసులు న్యాయం చేశారు. కానీ నా బిడ్డ చని పోయి ఏడేళ్లు అవుతోంది. అయినా కనీస న్యాయం జరగలేదు. ఏడేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఉరిశిక్ష పడింది కానీ అది ఇంత వరకు అమలు కాలేదు. శిక్ష అమలు జరిగే వరకు పోరాడుతూనే ఉంటా. దిశ కేసులో పోలీసుల తీరును స్వాగతిస్తున్నా. ఎన్‌కౌంటర్‌ జరిపిన పోలీసులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకోవద్దు. ఆమె ఆత్మకు ఎట్టకేలకు శాంతి జరిగింది అని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్‌ 15న నిర్భయపై ...

దేశమంతటా సజ్జనార్

చిత్రం
ఈ దేశాన్ని ప్రియాంకా రెడ్డి అలియాస్ దిశ కేసు ఊపేసింది. తెలంగాణ పోలీసుల పనితీరుపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ సమయంలో దారుణం జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు ఘటనకు పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చట్టానికి లోబడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉంచిన నిందితులపై ప్రజాగ్రహం వ్యక్తమైంది. కోట్లాది మంది దిశకు న్యాయం చేయాలని, నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. మరో వైపు తెలంగాణ ప్రభుత్వంపై పలువురు తీవ్ర విమర్శలు గుప్పించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం నేరం. దీంతో ఈ ఘటనపై అంతటా చర్చనీయాంశం కావడం కూడా పోలీసులపై వత్తిళ్లు పెరిగాయి. సీఎం కేసీఆర్ కు ప్రజలు విన్నవించారు. దారుణాలు జరగకుండా, మహిళలు, బాలికలు, యువతులు, చిన్నారులకు భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆందోళన వ్యక్తమైంది. ఇప్పటి వరకు ఎన్నో నేరాలు, అక్రమాలకు పాల్పడిన వారికి ఇంకా శిక్షలు ఖరారు కాలేదు. చట్టాల్లో ఉన్న లొసుగులు ఆసరాగా చేసుకుని నేరగాళ్లు తప్పించు కుంటున్నారు. దీంతో ప్రియాంకా రెడ్డి కేసు కూడా ఇలాగే అవుతుందని అనుకున్నారు. ఇదే సమయంలో కేసు విచారణకు ...

మోదీపై చిదంబరం ఆగ్రహం

చిత్రం
మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కుని, తీహార్ జైలు పాలై ఇటీవలే బెయిల్ పై విడుదలైన మాజీ కేంద్ర మంత్రి చిదంబరం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఆర్థిక విధానాలపై మండిపడ్డారు. పలు కీలక విషయాలను ప్రస్తావించారు. మోదీ ఆర్థిక వ్యవస్థ మందగమనం గురించి మౌనం వహించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వానికి అవగాహన, ముందు చూపు లేకుండా పోయిందన్నారు. యూపీఏ హయాంలో 14 కోట్ల దేశ ప్రజలను పేదరికం నుంచి సాంత్వన కలిగిస్తే, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ పాలనలో లక్షల మంది పేదరికంలో మగ్గుతున్నారని ధ్వజమెత్తారు. వృద్ధి రేటును ఆర్బీఐ ఏడు శాతంగా అంచనా వేస్తే అది నాలుగు శాతానికే పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోనే దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని ఆభిప్రాయ పడ్డారు. ఆర్థిక వ్యవస్థ పతనానికి నోట్ల రద్దు, జీఎస్‌టీని సరియైన పద్దతిలో అమలు చేయక పోవడం, విపరీతమైన పన్నులు, పీఎంవో ఆఫీసు కేంద్రీకృత నిర్ణయాలు ప్రధాన కారణాలని ఆయన ఆరోపించారు. కాగా, జైలు నుంచి విడుదలైన తర్వాత తనకు మొదట గుర్తొచ్చింది కశ్మీర్‌ ప్రజలేనని చిదంబర...

రిషబ్ కు కోహ్లీ భరోసా

చిత్రం
ఫామ్‌లో లేక వరుస వైఫల్యాలతో అన్ని వైపులా విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా యువ సంచలనం రిషభ్‌ పంత్‌కు సారథి విరాట్‌ కోహ్లి బాసటగా నిలిచాడు. పంత్‌పై విమర్శలపై స్పందించాడు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు పంత్‌పై పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందని తేల్చి చెప్పాడు. మ్యాచ్‌లో పంత్‌ విఫలమైన ప్రతీసారి స్టేడియంలోని ప్రేక్షకులు ధోని అంటూ అరుస్తున్నారని, ముందుగా అలా అరవటం మానుకోవాలని సూచించాడు. పంత్ సామర్థ్యంపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. అతడు మ్యాచ్‌ విన్నర్‌. అయితే అతడు విఫలమైన సందర్భంలో మనం అండగా నిలవాల్సి ఉంది.   దేశం కోసం ఆడే ప్రతీ క్రికెటర్‌ ఎంతో నిబద్దత, క్రమశిక్షణతో ఆడతాడు. ఎప్పుడూ మంచిగా ఆడాలి, దేశానికి విజయాలు అందించాలని ఆలోచిస్తూనే ఉంటాడు. ఏ ఒక్క ఆటగాడు కావాలని అలాంటి పరిస్థితి తెచ్చుకోడు. ఇలాంటి సందర్భంలో అతడికి మద్దతుగా నిలవాలి. రోహిత్‌ శర్మ చెప్పినట్టు అతడిని స్వేచ్చగా వదిలేయండి.ఇ​క పంత్‌ ఓపెనర్‌గా పంపిస్తారా అనే ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ప్రస్తుతం జట్టులోని బ్యాట్స్‌మన్‌ ఏ స్థానంలోనైనా ఆడగలరు. ఉదాహరణకు వృద్దిమాన్‌ సాహాను తీసుకుంటే.. ఐపీఎల్‌లో అన్ని స్థానాల్లో బ్యాటింగ్...

సర్కారు బడిలో హీరోయిన్

చిత్రం
ప్రభుత్వ బడులంటే చాలా మందికి చులకన. అన్ని సమస్యలకు ఇంగ్లిష్ భాష ఒక్కటే పరిష్కారమంటూ రెండు తెలుగు రాష్ట్రాల అధిపతులు జపం చేస్తున్నారు. ఇప్పటికే స్టూడెంట్స్ లేరనే నెపంతో బడులను మూసి వేసేందుకు తెలంగాణ సర్కార్ రెడీ అవుతోంది. ఇలాంటి సమయంలో తెలుగు సినిమా రంగంలో పాపులర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నిధి అగర్వాల్ ఉన్నతాధికారులు, పొలిటికల్ లీడర్లు, మంత్రులు, పాఠాలు చెప్పకుండా రాజకీయాలు, వ్యాపారాలు చేస్తున్న టీచర్లు తలదించు కునేలా చేశారు. ఈ టాలీవుడ్ నటి పంతుల్లమగా మారి పోయారు. ఎక్కడో కార్పొరేట్ బడి అనుకుంటే పొరపాటు పడినట్లే. విద్యార్థులకు ఇంగ్లిష్‌ పాఠాలు చెప్పి మెప్పించింది. సర్కారు బడుల్లో విద్యార్థులకు ఆంగ్ల పాఠాలు చెప్పేందుకు, వారిలో ఆంగ్ల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పెగా టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ స్వచ్ఛంద సంస్థ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌ రోడ్‌ నెం-12లోని ఎన్‌బీటీనగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించింది. మూడో తరగతి విద్యార్థులకు గంట సమయం పాటు ఇంగ్లిష్‌ పాఠాలు బోధించారు. వారితో ఇంగ్లిష్‌లో మాట్లాడించారు. అనంతరం విద్యార్థులతో సెల్ఫీలు దిగి వారిని మరిం...

దిశ హంతకుల కాల్చివేత

చిత్రం
సభ్య సమాజం తలొంచుకునేలా దేశమంతటా సంచలనం కలిగించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి అలియాస్ దిశ అత్యాచారం చేసి, కాల్చి చంపిన కేసులో నిందితులైన ఆరిఫ్, చిన్న కేశవులు, శివ, నవీన్ లను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. కోట్లాది మంది ముక్త కంఠంతో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరు ఈ దారుణానికి పాల్పడిన వారిని వెంటనే కాల్చి చంపాలని కోరారు. అయితే ఈ ఎన్ కౌంటర్ ను బాధితురాలి తల్లిదండ్రులు దీనిని స్వాగతించారు. మా పాప ఆత్మకు శాంతి జరిగిందని భావిస్తున్నామని చెప్పారు. ఎక్కడైతే ప్రియాంకా రెడ్డి తన ప్రాణం కోల్పోయారో అక్కడే నిందితులు పారిపోతుండగా ఖాకీలు కాల్చి వేశారు. ఈ సంఘటన ఇండియా అంతటా సంచలనం కలిగించింది. లోక్ సభ, రాజ్య సభల్లో పార్లమెంట్ సభ్యులు, మేధావులు, కవులు, కళాకారులు, సినీ లోకం, వివిధ రాజకీయ నాయకులు, క్రీడాలోకం..ఇలా ప్రతి ఒక్కరు దిశకు న్యాయం చేయాలని ఒకే స్వరం వినిపించారు. ఇండియాలో ఈ ఎన్ కౌంటర్ జరిగిన కొద్ది నిమిషాల్లోపే వైరల్ అయ్యింది. సత్వర న్యాయం జరగాలన్న వాయిస్ వ్యక్తమైంది. ఇదిలా ఉండగా గత నెల 27 అర్ధరాత్రి దిశను అత్యాచారం చేశారు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్...

ప్రభుత్వం సహకారం..పెట్టుబడులకు స్వాగతం

చిత్రం
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి తమ ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తుందని స్పష్టం చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి. పెట్టుబడులకు ఈ రాష్ట్రం ఎంతో అనువైన ప్రాంతమని, తమ ప్రభుత్వం చొరవ తీసుకుని క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. అనంతపురం జిల్లా  ఎర్రమంచిలో నిర్వహించిన గ్రాండ్‌ ఓపెనింగ్‌ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఏటా 3 లక్షల కార్ల తయారీ సామర్థ్యం, 13,500 కోట్ల పెట్టుబడితో కియా కార్ల తయారీ ప్లాంటు ఏర్పాటైంది. కియా సంస్థ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని జగన్‌ ఆకాంక్షించారు. ప్రస్తుతం కియా ద్వారా నేరుగా 3 వేల మందికి, అనుబంధ కంపెనీల ద్వారా 3,500 మందికి ఉపాధి లభిస్తోందన్నారు. ఏటా కార్ల ఉత్పత్తి సామర్థ్యం 70 వేల నుంచి 3 లక్షలకు చేరడం వల్ల ప్రత్యక్షంగా 11 వేల మందికి, పరోక్షంగా 7 వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ఏపీలో కియా సంస్థ పెట్టుబడులు పెట్టడం దేశానికే గర్వకారణమని, అన్ని విభాగాల్లో పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. ఇందుకోసం కృషి చేసిన కియా సిబ్బందికి సీఎం అభినందనలు తెలిపారు. ప్లాంటులో కార్ల తయ...

కళ్లన్నీ హైదరాబాద్ వైపే

చిత్రం
అజహరుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కొలువు తీరాక దాని స్వరూపమే మారి పోయింది. పట్టుపట్టి నగరంలో వన్డే మ్యాచ్ జరిగేలా చేశాడు. నిన్నటి దాకా ఎన్నో ఆరోపణలు ఎదుర్కున్న అసోసియేషన్ ఇప్పుడు కొత్త పాలక వర్గంతో నూతన జవసత్వాలను సంతరించుకుంది. ఇప్పటి దాకా భాగ్యనగరం ఎన్నో ఐపీఎల్‌ టి20 మ్యాచ్‌లకు వేదికగా నిలిచింది. కానీ అంతర్జాతీయ మెరుపులే లేవు. వన్డే, టెస్టులకు ఆతిథ్య మిచ్చిన ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఇప్పుడు ఆ లోటునూ తీర్చు కునేందుకు సిద్ధమైంది. ఫామ్‌లో ఉన్న కోహ్లి సేన జోరును ప్రత్యక్షంగా తిలకించేందుకు నగర క్రికెట్‌ ప్రియులు పోటెత్తనున్నారు. సమరానికి సాయి అంటోంది వెస్టిండీస్‌. భారత కుర్రాళ్లను ఇప్పుడు ఐపీఎల్‌ వేలమే కాదు, వచ్చే ఏడాది ఆ్రస్టేలియాలో జరిగే టి20 ప్రపంచకప్‌ కూడా ఊరిస్తోంది. నిలకడైన ప్రదర్శనతో అటు ఫ్రాంచైజీలు, ఇటు సెలక్టర్ల కంట పడేందుకు యువ ఆటగాళ్లకు విండీస్‌తో సిరీస్‌ చక్కని అవకాశం కలిపిస్తోంది. ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరుగుతుంది. ఐపీఎల్‌లో హిట్టయినా... టీమిండియా తరఫున ఫ్లాపవుతున్న ఆటగాళ్లు మనసు పెడితే చోటు ఖాయం చేసుకునే తరుణం కూడా ...

శివ..శివ..కైలాసా

చిత్రం
సోషల్ మీడియాలో వివాదాస్పద స్వామి నిత్యానంద ఏర్పాటు చేసిన కైలాస ఇప్పుడు వైరల్ అయ్యింది. స్వయం ప్రకటిత దేవుడు.. రేప్‌ కేసు నిందితుడు, ప్రస్తుతం పరారీలో ఉన్న నిత్యానంద తన కోసం, తన అమాయక భక్తుల కోసం కైలాస పేరుతో సొంతంగా ఒక ద్వీప దేశాన్నే సృష్టించుకున్న విషయం తెలిసిందే. దానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు కోసం ఆ దేశ న్యాయప్ర తినిధులు ఇప్పటికే సంప్రదింపులు కూడా మొదలుపెట్టారు. ఆ దేశానికి సంబంధించి ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌ కూడా రూపొందించారు. దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ సమీపంలోని ఈ ద్వీపం ఉంది. ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు సమీపంలో ఉండే ఒక ద్వీపాన్ని ఈక్వెడార్‌ నుంచి కొనేసుకున్న నిత్యానంద. ఆ దీవిలో తన సొంత దేశాన్ని ఏర్పాటు చేసి, సొంత జెండా, పాస్‌పోర్టు, జాతీయ చిహ్నం, రాజ్యాంగం.. ఇలా అన్నింటినీ ఏర్పాటు చేశాడు. అయితే దీనిపై దేశ వ్యాప్తంగా సెటైర్లు వస్తున్నాయి. సొంతంగా దేశాన్ని ఏర్పాటు చేయడం ఏంటని ఎవరికి తోచిన విధంగా వాళ్లు నిత్యానందని ఆడేసుకుంటున్నారు. నిత్యానందపై సెటైర్లతో సోషల్‌ మీడియా మోత మోగిపోతోంది.  సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీం ఇండియా స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా నిత...

ఏపీలో బుగ్గన సెన్సేషన్

చిత్రం
ఎవరీ బుగ్గన అనుకుంటున్నారా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ఇప్పుడు దమ్మున్న నాయకుడు. ఏపీ ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో కీలకమైన మంత్రిగా కొనసాగుతున్నారు. జగమెరిగిన రాజకీయ నాయకుడు, అపార చాణ్యుక్యుడిగా పేరొందిన, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు రాజేంద్ర నాథ్ రెడ్డి చుక్కలు చూపిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ప్రభుత్వ రైలును నడిపిస్తున్న డ్రైవర్ ఆయన. యువ నాయకుడు, మడమ తిప్పని మనస్తత్వం కలిగిన జగన్ మోహన్ రెడ్డికి ఒక రకంగా అన్నీ బుగ్గననే. విద్యాధికుడిగా, మేధావిగా, తాత్వికుడిగా, అనుభవం కలిగిన పొలిటికల్ లీడర్ గా తనను తాను ఇప్పటికే నిరూపించుకున్నారు. ఒక రకంగా ఆయనను ఏరికోరి మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్. కెప్టెన్ సరిగా ఉంటే జట్టు సభ్యులు కూడా సమర్ధవంతంగా ఉంటారని రాజేంద్రనాథ్ రెడ్డిని చూస్తే అర్థమవుతుంది. మొత్తం సందింటి కేబినెట్ లో అత్యంత కీలకమైన వ్యక్తి బుగ్గన. ఏపీలో ఏది కావాలన్నా, లేదా ఏ కొత్త కార్యక్రమమైనా, సంక్షేమ పథకమైనా సరే సక్సెస్ కావాలంటే బుగ్గన, జగన్ పక్కన ఉండాల్సిందే. రాజకీయ పరంగా, పాలనా పరంగా ఎంతో పరిణితి కలిగిన వ్యక్తిగా ఎదిగారు ఆయన. విపక...

లోకం మెచ్చిన మహానుభావులు

చిత్రం
సామాజిక మాధ్యమాల్లో టాప్ రేంజ్ లో కొనసాగుతున్న లింక్డ్ ఇన్ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు, నాయకులు , దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు, వ్యాపారవేత్తలు, మేధావులను పరిగణలోకి తీసుకుంది ఈ టెక్ దిగ్గజ కంపెనీ. వరల్డ్ వాయిస్ పేరుతో పది మందిని విశిష్టమైన వ్యక్తులుగా ఎంపిక చేసింది. అమెరికా, యుకె, బ్రెజిల్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ దేశాలు కూడా ఇందులో ఉన్నాయి. మొత్తం జాబితాలో మొదటి ప్లేస్ లో కెనడా దేశానికి చెందిన ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న జస్టిన్ ట్రుడేయు నిలిచారు. పరిపాలనలో కొత్త సంస్కరణలు తీసుకు వచ్చారు. ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు కల్పించడంలో దృష్టి సారించారు. జి - 20 సదస్సులో ఆయా దేశాల మధ్య శాంతి నెలకొనాలని పిలుపునిచ్చారు. అత్యున్నతమైన పాలనాదక్షుడిగా జస్టిన్ పేరొందారు. రెండవ స్థానంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టీన్ లేగార్డే నిలిచారు. ఇంటర్ నేషనల్ టాక్సేషన్, వుమెన్ ఎంపవరింగ్ లో కీలక మార్పులు తీసుకు వచ్చారు. ఇంటర్ నేషనల్ మోనిటరీ ఫండ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ లలో ప్రముఖ పాత్ర పోషించారు. ప్రపంచ గతిని పూర్తిగా మార్చే శక్తి అందరికీ లేకపోవొచ్చు కానీ కొంతలో కొం...