హువావే వాచ్ హవా

టెక్నాలజీలో చోటు చేసుకున్న మార్పులు ఎన్నో నూతన ఆవిష్కారణలకు కేంద్ర బిందువుగా మారుతోంది. అయితే దిగ్గజ కంపెనీలు అమెరికా, సౌత్ కొరియాకు చెందినవే అయినా, వాటి హవాకు చెక్ పెడుతున్నాయి చైనాకు చెందిన కంపెనీలు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మొబైల్స్ ను తయారు చేస్తున్నాయి. తాజాగా చైనా మొబైల్స్ తయారీదారు హువావే  కొత్త స్మార్ట్‌ వాచ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. జీటీ 2 స్మార్ట్‌వాచ్ పేరుతో దీన్ని అందు బాటులోకి తీసుకొచ్చింది. జీటీ 2 వాచ్‌ 42 ఎంఎం వేరియంట్ లభ్యత వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కాగా 46 ఎంఎం వేరియంట్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇతర రిటైల్ దుకాణాలతో సహా ఇ-కామర్స్ వెబ్‌ సైట్లలో అందుబాటులో ఉంచింది హువావే కంపెనీ.

అయితే జీటీ2 స్మార్ట్‌వాచ్  ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి.1.2 ఇంచుల అమోలెడ్ టచ్ డిస్‌ప్లే, రౌండ్‌ డయల్‌, హువావే కిరిన్ ఎ1 చిప్, 3డీ గ్లాస్‌, బ్లూటూత్ 5.1 వాటర్ రెసిస్టెన్స్, జీపీఎస్, ఇంటిగ్రేడ్ మైక్రోఫోన్ అండ్ స్పీకర్, బ్లూటూత్ కాలింగ్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, 15 వర్కవుట్ మోడ్స్ ఇందులో పొందు పరిచారు. ధర పరంగా చూస్తే 46 ఎంఎం స్పోర్ట్ ధర15,990 రూపాయలు ఉండగా, లెదర్ స్ట్రాప్ మోడల్  17,990, మెటల్ స్ట్రాప్ 21,990 ఉంది. 42 ఎంఎం వేరియంట్‌ ప్రారంభ ధర 14,990 రూపాయలకు లభిస్తోంది. అయితే వీటిని వినియోగదారులు ముందుగానే బుక్ చేసు కోవచ్చు. ముందస్తు బుకింగ్‌లో మొత్తం నగదు చెల్లించిన వారికి 6999 రూపాయల విలువైన హువావే ఫ్రీలేస్ ఉచితంగా అందిస్తామని కంపెనీ తెలిపింది.

దీంతో పాటు నో-కాస్ట్  ఈఎంఐ ఆప్షన్‌ కూడా అందజేస్తోంది. ఈ నెలాఖరు దాకా మొదటి  సేల్‌కు అందుబాటులో వుంటుంది. హువావే మిని స్పీకర్ గెలుచుకునే అవకాశం కూడా వుంది. 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వుంటుందని కంపెనీ తెలిపింది. అంతే కాదు తమ స్మార్ట్‌ వాచ్‌  వినియోగదారుని హార్ట్‌ బీట్‌ను మానిటర్‌ చేస్తుందని, హృదయ స్పందన రేటు 100 బిపిఎమ్ కంటే ఎక్కువ లేదా 50 బిపిఎమ్ కంటే తక్కువ 10 నిమిషాలకు మించి ఉంటే వినియోగదారుడిని అలర్ట్‌ చేస్తుందని వెల్లడించింది. స్విమ్మింగ్‌ చేస్తున్నపుడు కూడా ఈ వాచ్‌ పని చేస్తుందని హువావే వెల్లడించింది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!