దిశ సరే..నిర్భయ మాటేమిటి
దిశ నిందితుల ఎన్కౌంటర్పై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్త మవుతున్నాయి. దిశ అత్యాచార ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్త మవడంతో కేసు విచారణలో పోలీసులు ప్రత్యేక దృష్టిని సారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా దిశ మృతదేహాన్ని కాల్చిన చటాన్పల్లి అండర్పాస్ ప్రాంతంలో క్రైమ్ సీన్ను రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా పారి పోయేందుకు ప్రయత్నించారు. దీంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. తాజా ఘటనపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు. దిశకు న్యాయం జరిగింది. కానీ నిర్భయ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
దిశ చనిపోయిన ఎనిమిది రోజుల్లోనే పోలీసులు న్యాయం చేశారు. కానీ నా బిడ్డ చని పోయి ఏడేళ్లు అవుతోంది. అయినా కనీస న్యాయం జరగలేదు. ఏడేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఉరిశిక్ష పడింది కానీ అది ఇంత వరకు అమలు కాలేదు. శిక్ష అమలు జరిగే వరకు పోరాడుతూనే ఉంటా. దిశ కేసులో పోలీసుల తీరును స్వాగతిస్తున్నా. ఎన్కౌంటర్ జరిపిన పోలీసులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకోవద్దు. ఆమె ఆత్మకు ఎట్టకేలకు శాంతి జరిగింది అని అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్ 15న నిర్భయపై ఆరుగురు వ్యక్తులు అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. అనంతరం చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధించగా, నిందితుల్లో ఒకరైన రామ్సింగ్ జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఒక్క కాల్చివేత సంఘటనపై సీపీ సజ్జనార్ పై ప్రసంశలు లభిస్తున్నాయి. అంతిమ తీర్పు కరెక్టేనన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి