పోస్ట్‌లు

జూన్ 2, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

భార‌త్‌లో పాపుల‌ర్ అంకురాలు ఇవే

చిత్రం
ఇండియాలో స్టార్ట‌ప్‌లు స‌క్సెస్ బాట ప‌డుతున్నాయి. ప్రారంభం నుండే డిఫరెంట్ ఐడియాస్ బేస్ చేసుకుని కంపెనీలుగా ఎదుగుతున్నాయి. కొత్త‌గా వ్యాపారం ప్రారంభించే వాళ్ల‌కు, అంకురాలకు శ్రీ‌కారం చుట్టాల‌ని ప్ర‌య‌త్నించే వాళ్ల‌కు ఇప్ప‌టికే ఆ రంగంలో స‌క్సెస్ అయిన వాటిని చూస్తే మీరెలా మార్కెట్‌లో నిల‌దొక్కుకోవ‌చ్చో తెలుస్తుంది. స్వ‌యాన అవ‌గ‌త‌మ‌వుతుంది. 2018-2019 సంవ‌త్స‌రానికి గాను 53 స్టార్ట‌ప్‌లు టాప్ పొజిష‌న్‌లో నిలిచాయి. ప‌శ్చిమ బెంగాల్‌లోని కోల్‌క‌తాలో 2008లో ప్రారంభమైన మోమో స్టార్ట‌ప్ లో 470 మిలియ‌న్ల పెట్టుబ‌డి పొందింది. ఢిల్లీ, చెన్నై, కొచ్చి, త‌దిత‌ర ప్రాంతాల్లో ఫుడ్ కోర్టుల‌ను ఏర్పాటు చేసింది మోమో. ఈ స్టార్ట‌ప్ టాప్ వ‌న్ గా నిలిచింది. ఓలా క్యాబ్స్ రెండో స్థానంలో నిలిచింది. దీనిని క‌ర్ణాట‌క‌లోని కోర‌మంగ‌ల‌లో ఏర్పాటు చేశారు. 3.8 మిలియ‌న్ల ఫండింగ్ పొందింది. దీనిని 2010లో ఏర్పాటు చేశారు. బెంగ‌ళూరు కేంద్రంగా 2010లో అడ్ర‌స్ హెల్త్ పేరుతో స్టార్ట‌ప్ ప్రారంభ‌మైంది. హెల్త్ ప‌రంగా త‌క్కువ ఖ‌ర్చుతో వైద్య సేవ‌లు పొందవ‌చ్చు దీని ద్వారా. 1.5 మిలియ‌న్ల ఫండింగ్ పొందింది ఈ స్టార్ట‌ప్. ఇండియా వ...

సుంద‌ర్ పిచ్చెయ్ ఔదార్యం - 405 కోట్లు వ‌దులుకున్న వైనం

చిత్రం
ప్ర‌పంచ సెర్చింగ్ దిగ్గ‌జ కంపెనీకి ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారిగా (సిఇఓ) బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న చెన్నైకి చెందిన సుంద‌ర్ పిచ్చెయ్ అద్భుత నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌పంచంలోని మేధావులు, ఉద్యోగులు, సిఇఓలు, మేనిజింగ్ డైరెక్ట‌ర్లు, ఛైర్మ‌న్లు, బిజినెస్ టైకూన్స్ , టీం లీడ‌ర్లు, మెంటార్స్, ట్రైన‌ర్స్ , క్రీడాకారులు, పొలిటిక‌ల్ లీడ‌ర్లు త‌లొంచుకునేలా మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. ఆయ‌న‌కు గూగుల్ కంపెనీ సంవ‌త్స‌రానికి 270 కోట్ల‌కు పైగా వేత‌న రూపంలో అంద‌జేస్తోంది. అంతేకాకుండా అన్ని సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తోంది. తాజాగా స‌ద‌రు కంపెనీ యాజ‌మాన్యం ..ఇత‌ర సౌక‌ర్యాల కింద సుంద‌ర్ పిచ్చెయ్‌కి 405 కోట్లు ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఈమెయిల్ ద్వారా స‌ద‌రు సిఇఓకు అధికారికంగా ఇంటిమేష‌న్ ఇచ్చింది. దీనిని ప‌రిశీలించిన సుంద‌ర్ ..త‌న‌కు ఆ డ‌బ్బులు వ‌ద్దంటూ తిరిగి రిప్ల‌యి ఇచ్చారు. పిచ్చెయ్ తీసుకున్న ఈ డిసిష‌న్ ను చూసి యాజ‌మాన్యం విస్మ‌యానికి గురైంది. ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. కోటి రూపాయ‌లు ఇస్తామంటే తీసుకునేందుకు కోట్లాది మంది రెడీగా ఉంటారు. కానీ సిఇఓ స్థాయిలో వున్న ఈ టెక్కీ దిగ్గ‌జం మా...

25 కోట్లుంటే..బ‌ఫెట్ తో భోజ‌నం - బిగ్గెస్ట్ ఆఫ‌ర్ ..!

చిత్రం
ఎవ‌రి పిచ్చి వారికి ఆనందం. వారెన్ బ‌ఫెట్..ఈ పేరు ప్ర‌పంచాన్ని నిరంత‌రం విస్మ‌య ప‌రుస్తూనే వుంటుంది. వ‌ర‌ల్డ్ మార్కెట్‌ను ఈ బిజినెస్ దిగ్గ‌జం ప్ర‌భావితం చేసినంత‌గా ఇంకెవ్వ‌రూ ఇప్ప‌టి దాకా చేయ‌లేదంటే న‌మ్మ‌గ‌ల‌మా. ఇది ముమ్మాటికీ నిజం. ఈ లోకంలోనే అత్యంత సుసంప‌న్న‌మైన‌, ధ‌న‌వంతుడు ఎవ‌రంటే ఠ‌క్కున స‌మాధానం వ‌చ్చే పేరు బ‌ఫెట్. ఆయ‌న లెక్క‌లేనంత ఆస్తుల‌ను పోగు చేసుకున్నాడు. త‌రాల‌కు స‌రిప‌డా డాల‌ర్లు సంపాదించాడు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్క‌డ చూసినా ఆయ‌నకు చెందిన ఆస్తులే కొలువై వున్నాయి. నోట్ల క‌ట్ట‌లు, భ‌వంతులు, స్థ‌లాలు, విల్లాలు, అపార్ట్‌మెంట్స్, ఫ్లాట్స్, లెక్క‌లేన‌న్ని కంపెనీలు, వ్యాపారాలు, ఆయిల్, మైన్స్, బంగారం, వెండి, వ‌జ్రాలు, లాజిస్టిక్, మొబైల్స్, ఆటోమొబైల్స్ ఇలా స‌మాజంలోని ప్ర‌తి రంగంలో వారెన్ బ‌ఫెట్ పెట్టుబడి పెట్టుకుంటూ పోయారు. స్టాక్ మార్కెట్లో ఆయ‌న‌దే హ‌వా. ఇంత‌గా పాపుల‌ర్ అయిన ఈ వ్యాపార దిగ్గ‌జంతో ఒక్క‌సారైనా క‌ల‌వాల‌ని అనుకోవ‌డం వింత కోరిక‌గా అనిపిస్తుంది క‌దూ. ప్ర‌పంచాన్ని మెస్మ‌రైజ్ చేస్తూ కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న బ‌ఫెట్ తో కేవ‌లం భోజ‌నం చేయాలని క‌ల‌లు ...

రికార్డుల‌కెక్కిన నిజామాబాద్ రైత‌న్న‌లు

చిత్రం
తాజాగా దేశ వ్యాప్తంగా జ‌రిగిన 17వ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా రైతులు ప్ర‌పంచ రికార్డును సృష్టించారు. ఇది ఒక‌ర‌కంగా భార‌తీయ ఎన్నిక‌ల చ‌రిత్ర‌లో మ‌రిచి పోలేని స‌న్నివేశంగా అభివ‌ర్ణించ‌వ‌చ్చు. దేశ‌మంత‌టా ఐపీఎల్ ఫీవ‌ర్ ఉన్నా..మ‌రో వైపు న‌రేంద్ర దామోద‌ర దాస్ ఛ‌రిష్మా ప‌నిచేస్తున్నా ..విప‌క్షాలు గ‌గ్గోలు పెట్టినా..రాష్ట్ర స్థాయిలోని ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార‌, సామాజిక మాధ్య‌మాలు ప‌ట్టించుకోక పోయినా జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో ఈ ప్రాంతానికి చెందిన రైతుల గురించి అనేక‌ర‌క‌మైన ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నాలు వెల్లువ‌లా వ‌చ్చి ప‌డ్డాయి. రైతులు తీసుకున్న ఈ అసాధార‌ణ‌మైన నిర్ణ‌యానికి జాతి యావ‌త్తు జేజేలు ప‌లికింది.  తాము కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకం కాద‌ని, త‌మ న్యాయ‌ప‌ర‌మైన డిమాండ్ల‌ను సాధించుకునేందుకు, తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను పాల‌కుల దృష్టికి తీసుకు వెళ్లేందుకు మాత్ర‌మే ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వాల్సి వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేశారు. అన్నం పండించే తాము అర్ధాక‌లితో అల‌మ‌టిస్తున్నామ‌ని, పండించిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర రావ‌డం లేద‌ని, ఆసియా ఖండంలోనే అత...

అధికారుల నిర్వాకం - పిల్ల‌ల ప్రాణసంక‌టం

చిత్రం
పిల్ల‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నా తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు తీరు మార‌డం లేదు. ఉన్న‌తాధికారుల బాధ్య‌తా రాహిత్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఒక‌రి వెంట మ‌రొక‌రు వీరి దెబ్బ‌కు ప్రాణాలు కోల్పోతున్నా క‌నీసం స్పందించ‌డం లేదు. అడుగ‌డుగునా బాధ్య‌తా రాహిత్యం, నిర్ల‌క్ష్యం ప్ర‌స్ఫుటంగా క‌నిపించినా ప్ర‌భుత్వం , సంబ‌ధిత విద్యాశాఖ మంత్రి ఈ రోజు వ‌ర‌కు స్ప‌ష్ట‌మైన హామీ ఇవ్వ‌లేక పోయారు. ఇంత మంది చ‌నిపోతే ..ఏ ఒక్క కుటుంబానికి ఎక్స్ గ్రేషియా కూడా ప్ర‌క‌టించ‌లేదు. తెలంగాణ ఏర్ప‌డి ఆరేళ్లయినా గోస ఆగ‌డం లేదు. పేప‌ర్లు దిద్ద‌డం మొద‌లుకుని ..రిజ‌ల్ట్స్ ప్ర‌క‌టించేంత దాకా తీరు మార‌లేదు. ఒక్క అడుగు ముందుకు వెళ్ల‌లేదు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ మొద‌లుకొని ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యేంత దాకా గ్లోబ‌రినా సంస్థ‌కు అప్ప‌గించిన బోర్డు, స‌ర్కార్ చేతులెత్తేసింది. ఈ విష‌యంపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. విద్యా శాఖ మంత్రి కాకుండా కేటీఆర్ సంఘ‌ట‌న జ‌రిగిన తీరుపై స్పందించ‌డంపై విప‌క్షాలు మండిప‌డ్డాయి. విద్యార్థి సంఘాలు, పిల్ల‌ల త‌ల్లిదండ్రులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాజాగా ప్ర‌క‌టించిన రీ వెరిఫ...

సౌతాఫ్రికాకు ఝ‌ల‌కిచ్చిన బంగ్లాదేశ్

చిత్రం
వ‌ర‌ల్డ్ క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్‌లో అద్భుత‌మైన పెర్‌ఫార్మెన్స్ ను ప్ర‌ద‌ర్శించింది బంగ్లాదేశ్ క్రికెట్ జ‌ట్టు. ఇప్ప‌టి దాకా చ‌ప్ప‌గా సాగిన మ్యాచ్‌ల కంటే ఈసారి సౌతాఫ్రికా, బంగ్లాల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ‌ను రేపింది. క్రికెట్ ప్రేమికుల‌కు మంచి మ‌జాను మిగిల్చింది. మెగా టోర్నీ తొలి వారంలోనే అతి సంచ‌ల‌నం న‌మోదైంది. పేరుకు చిన్న జ‌ట్టే అయినా ..ఎంతో అనుభ‌వం క‌లిగిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుకు చుక్క‌లు చూపించింది. ర‌బాడ‌, ఎంగిడి, క్వాయో, మోరిస్, తాహిర్ అంద‌రూ వ‌ర‌ల్డ్ క్లాస్ బౌల‌ర్లే..అలాంటి జ‌ట్టును మ‌ట్టిక‌రిపించింది. బంగ్లా జ‌ట్టులో వెంట‌ర‌న్ ప్లేయ‌ర్లు షకీబుల్ హ‌స‌న్, ముష్పిక‌ర్ ర‌హీం ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌ను ఓ ఆటాడుకున్నారు. తామేం త‌క్కువ అన్న‌ట్టు సౌమ్య స‌ర్కార్, మ‌హ్మ‌దుల్లా దూకుడు పెంచారు. దీంతో త‌మ జ‌ట్టు త‌ర‌పున ప్ర‌పంచ క‌ప్‌లో అత్య‌ధిక స్కోరు చేసింది ఆ జ‌ట్టు.  తిరుగులేని బంగ్లా బౌలింగ్‌తో అద్భుత‌మైన బోణీ కొట్టింది. మిగ‌తా జ‌ట్ల‌కు వార్నింగ్ ఇచ్చింది. సౌతాఫ్రికాకు ఈ టోర్నీలో వ‌రుస‌గా రెండో ఓట‌మి. ఓపెనింగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన ఆ జ‌ట్టు ..బంగ్లాను త‌...

కార్ల అమ్మ‌కాలు స్లో..సెకండ్స్ కే హై ప్ర‌యారిటీ

చిత్రం
రాను రాను కార్ల అమ్మ‌కాలు త‌గ్గి పోతున్నాయి. అభిరుచుల్లో మార్పు రావ‌డం ..ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉండ‌డంతో వీటిపై అంత‌గా దృష్టి సారించ‌డం లేదు. ఇండియాలో దేశ‌, విదేశీ కంప‌నీల‌కు చెందిన కార్లు షికార్లు చేస్తున్నాయి. న‌గ‌రంలోని రోడ్ల మీద..జాతీయ ర‌హ‌దారుల‌పై ..ఎక్క‌డ చూసినా కార్లే కార్లు. డిఫ‌రెంట్ మోడ‌ల్స్, ఎక్కువ ఫెసిలిటీస్‌తో పాటు పూర్తి భ‌ద్ర‌త ఉండే వాహ‌నాల‌కు సై అంటున్నారు. ధ‌ర‌లు ఆకాశానికి అంట‌డంతో సామాన్య , మ‌ధ్య‌త‌ర‌గ‌తి జ‌నం వీటి పై పెద్ద‌గా ఆస‌క్తిని క‌న‌బ‌ర్చ‌డం లేదు. కార్లు స్టేట‌స్ సింబ‌ల్‌గా మార‌డంతో ప్ర‌తి ఒక్క‌రు త‌మకంటూ ఓ వెహికిల్ ఉండాల‌ని ప‌రిత‌పించారు. మారుతీ సుజుకీ, హ్యూందాయి, టాటా మోటార్స్, జ‌న‌ర‌ల్ మోటార్స్, మ‌హీంద్ర‌, వోక్స్ వ్యాగ‌న్, త‌దిత‌ర బ్రాండ్స్ క‌లిగిన కార్ల‌కు విప‌రీత‌మైన డిమాండ్ ఉండేది. ఇపుడు సీన్ మారింది. జీవ‌న ప్ర‌మాణాలు పెర‌గ‌క పోవ‌డం, జీతాలు పెరిగినా వాటి వైపు చూడ‌క పోవ‌డంతో అమ్మ‌కాలపై ప్ర‌భావం చూపించాయి. ఉద్యోగ‌స్తులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల వారంతా ప్లాట్లు, బంగారం కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు.మోదీ స‌ర్కార్ తీసుకున్న నోట్ల ర‌ద్దుతో బ...

కేటాయింపులు కోట్ల‌ల్లో ..మంజూరు వేల‌ల్లో - తీరు మార‌ని బ్యాంక‌ర్లు

చిత్రం
రైతులంటేనే బ్యాంక‌ర్ల‌కు చుల‌క‌న. ఎందుకంటే ఎలాంటి లాభ‌దాయ‌క‌మైన వృత్తి కాదు. నైపుణ్యం క‌లిగిన వారు, ఉద్యోగులు, స్వ‌చ్ఛంధంగా సంపాదించే వారికి, వ్యాపారులు, కార్పొరేట్ కంపెనీలు, సంస్థ‌ల‌కు అప్ప‌నంగా రుణాలు మంజూరు చేస్తున్నారు. ఇది గ‌త కొన్నేళ్లుగా ఆన‌వాయితీగా కొన‌సాగుతోంది. బ్యాంక‌ర్లు అనుస‌రిస్తున్న విధానాల‌పై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మండిప‌డుతున్నాయి. ఎంత ఆగ్ర‌హం వ్య‌క్తం చేసినా..ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా ఉంటోంది వీరి ప‌నితీరు. ప్ర‌తి ఏటా ఆయా బ్యాంక‌ర్లు వార్షిక రుణ ప్ర‌ణాళిక‌ల‌ను త‌యారు చేయ‌డం, వాటిని వెల్ల‌డి చేయ‌డం తీరా చూస్తే రైతుల నోట్లో మ‌ట్టి కొట్ట‌డం ష‌రా మామూలుగా మారింది. తెలంగాణ స‌ర్కార్ రైతుల‌కు మొద‌టి ప్రాధాన్య‌త ఇస్తోంది. ఆ దిశ‌గా వ్య‌వసాయంతో పాటు దాని అనుబంధ రంగాల‌కు పెద్ద పీట వేసింది. రైతు బంధు ప‌థ‌కంను ప్ర‌వేశ పెట్టింది. రైతుల‌కు వెన్నుద‌న్నుగా ఉండేలా త‌యారు చేసిన ఈ ప‌థ‌కం దేశ వ్యాప్తంగా అమ‌ల‌య్యేలా స్ఫూర్తిగా నిలిచింది. ఈ స్కీంను ఇత‌ర దేశాలు సైతం ప్ర‌శంసించాయి. తాజాగా కేంద్రంలో కొలువు తీరిన క‌మ‌ల స‌ర్కార్ రైతుల‌కు జై కొట్టింది. ప్ర‌తి ఏ...