పోస్ట్‌లు

జులై 3, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఇండియ‌న్ మార్కెట్‌ను శాసిస్తున్న చైనా - టీవీల అమ్మ‌కాల్లో కోట్ల ఆదాయం

చిత్రం
భార‌తీయ మార్కెట్ ను చైనా ఉత్ప‌త్తులు శాసిస్తున్నాయి. ఇంట్లో వాడే ప్ర‌తి వ‌స్తువుల‌న్నీ ఇపుడు చైనాలో త‌యారైన‌వే కావ‌డం విశేషం. అవ‌న్నీ త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తుండ‌డంతో భార‌తీయులు ఎగ‌బ‌డి కొనుగోలు చేస్తున్నారు. అటు ఆన్ లైన్‌లో ఇటు ఆఫ్ లైన్‌లో ఇబ్బ‌డి ముబ్బ‌డిగా కొంటున్నారు. ఈ ఏడాదిలో 7 వేల 224 కోట్ల విలువ చేసే టెలివిజ‌న్ల‌ను ఇండియ‌న్స్ కొనుగోలు చేశారు. ఇందులో స‌గానికి పైగా చైనా నుంచి త‌యారై, దిగుమ‌తి చేసుకున్న‌వే కావ‌డం గ‌మ‌నార్హం. ఓ వైపు స్మార్ట్ ఫోన్లు ఇంకో వైపు టీవీలు లేకుండా ఉండ‌లేని ప‌రిస్థితికి వ‌చ్చారు ఇండియ‌న్స్. ఆధునిక ప్ర‌ప‌చంలో టీవీ లేని ఇల్లు ఉండ‌దంటే న‌మ్మ‌లేం. కేబుల్ ఆప‌రేట‌ర్లు వ‌చ్చాక టీవీలు ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యాయి. ఈ మేర‌కు 2018-2019 ఆర్థిక సంవ‌త్స‌రంలో 7 వేల 224 కోట్ల విలువైన టెలివిజ‌న్ల‌ను భార‌త్ దిగుమ‌తి చేసుకుంద‌ని ప్ర‌భుత్వ అధికారిక గ‌ణాంకాల్లో వెల్ల‌డైంది. ఇంకా లెక్క‌కు రాని టీవీ సెట్లు ఎన్నో. ముఖ్యంగా దిగుమ‌తి చేసుకున్న వాటిలో చైనాలో త‌యారై మ‌న దేశానికి వ‌చ్చిన ఉత్ప‌త్తుల్లో టీవీలు టాప్. దిగుమ‌తుల్లో స‌గానికి పైగా చైనా నుంచి తీసుకున్న‌వే . 3 వేల 807 కోట్...

రాయుడు రిటైర్మెంట్ ..అంత‌ర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై

చిత్రం
క‌ష్ట కాలంలో ఉన్న‌ప్పుడు క్రికెట్ జ‌ట్టుకు అడ్డు గోడ‌లా నిలిచి ..ఒడ్డుకు చేర్చే అరుదైన ఆట‌గాళ్ల‌లో ఒక‌డిగా పేరు తెచ్చుకున్న తెలుగు వాడైన అంబ‌టి రాయుడు అనూహ్యంగా , ప్ర‌పంచ క‌ప్ టోర్నీ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇక నేనాడ‌లేనంటూ రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. అంత‌ర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెపుతున్న‌ట్లు వెల్ల‌డించారు. వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో త‌న‌కు ఛాన్స్ ఇవ్వ‌క పోవ‌డంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో అన్ని ఫార్మాట్‌ల నుండి వైదొలుగుతున్న‌ట్లు తెలిపారు. మ్యాచ్ లు జ‌రిగేట‌ప్పుటు ఏ జ‌ట్టుకైనా కీల‌కం నాలుగో స్థానానిదే. ఆ ప్లేస్‌లో వ‌చ్చే ఆట‌గాళ్లు కీల‌క‌మైన క్రికెట‌ర్స్‌గా పేర్కొంటారు. జ‌ట్టును ఆదుకోవాల‌న్నా, నిల‌దొక్కుకునేలా చేయాల‌న్నా, స్కోరును నెమ్మ‌దిగా ప‌రుగులు పెట్టించాల‌న్నా ఈ ప్లేస్‌లో వ‌చ్చే ఆట‌గాళ్లే కీల‌కంగా ఉంటారు. అదే స్థానంలో గ‌త కొన్నేళ్లుగా అంబ‌టి ఆడుతూ వ‌స్తున్నారు. గ‌త ప‌దేళ్ల‌లో యువ‌రాజ్ సింగ్, సురేష్ రైనాలు ఇదే ప్లేస్‌లో ఆడుతూ టీమిండియాకు గెలుపుల్లో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌చ్చారు. వీరిద్ద‌రూ దూర‌మ‌య్యాక వారి స్థానంలో ఎంత మంది ఆట‌గాళ్లు వ‌చ్చినా నిల‌దొక్కుకోలేక పోయా...

దివికేగిన కార్పొరేట్ దిగ్గ‌జం - బికె బిర్లా క‌న్నుమూత

చిత్రం
భార‌తీయ పారిశ్రామిక రంగంలో త‌న‌కంటూ ఓ బ్రాండ్‌ను, ఇమేజ్‌ను స్వంతం చేసుకున్న బిర్లా సంస్థ‌ల అధినేత‌, ఛైర్మ‌న్ బి.కె. బిర్లా ఇక సెల‌వంటూ వెళ్లి పోయారు. పారిశ్రామిక ప‌రంగా, వ్యాపార వేత్త‌గా, విద్య ప‌ట్ల అచంచ‌ల‌మైన ప్రేమ క‌లిగిన విద్యా వేత్త‌గా , దాత‌గా బిర్లా క‌ల‌కాలం గుర్తుండి పోతారు. ఆయ‌న మ‌ర‌ణం దేశానికి, ప్ర‌పంచ పారిశ్రామిక రంగానికి తీర‌ని లోటుగా భావించాలి. దేశ వ్యాప్తంగా బిర్లా పేరుతో ఎన్నో ఆల‌యాల‌ను నిర్మించారు. మ‌రికొన్నింటిని పున‌రుద్ధ‌రించారు. ప్ర‌పంచంలోనే అత్యం గొప్ప‌నైన క‌ళాశాల‌ల‌ను, నాణ్య‌మైన విద్య‌ను, దేశానికి కావాల్సిన అద్భుత‌మైన వ్య‌క్తుల‌ను త‌యారు చేసిన వ్య‌క్తిగా బిర్లా చిరస్మ‌ర‌ణీయుడు. ఇండియాలో పేరెన్నిక‌గ‌న్న విద్యా సంస్థ‌ల్లో ఒక‌టిగా ఆయ‌న స్థాపించిన బిట్స్ పిలానీ ఒక‌టి. ఇండియా అంటేనే మొద‌ట జ్ఞాప‌కానికి వ‌చ్చేది టాటాలు, బిర్లాలే. బిర్లా పూర్తి పేరు బ‌సంత్ కుమార్ బిర్లా. 98 ఏళ్ల వ‌య‌సులో ముంబ‌యిలో క‌న్ను మూశారు. దేశ వ్యాప్తంగా 25 విద్యా సంస్థ‌లు, ఎన్నో కంపెనీల‌ను , దాతృత్వ సంస్థ‌ల‌ను బిర్లా ఏర్పాటు చేశారు. కుటుంబీకుల‌ను శోక సంద్రంలో ముంచెత్తారు. కోల్‌క‌తాలోని...

ఇక సెల‌వు..ప‌ద‌వికి బైబై..రాహుల్ రాం రాం..!

చిత్రం
ఇండియాలో రాజ‌కీయం అంటే ర‌ణరంగాన్ని త‌ల‌పింప చేస్తోంది. ఎత్తుల‌కు పై ఎత్తులు వేయాలి. ప్ర‌త్య‌ర్థుల క‌ద‌లిక‌ల‌ను ఎప్ప‌టికప్పుడు ప‌సిగ‌డుతూ వుండాలి. వీలైతే వారిని డీమోర‌లైజ్ చేసేందుకు కుట్ర‌లు ప‌న్నాలి. వీలైతే తిమ్మిని బొమ్మి చేయాలి. డ‌బ్బులు వెద‌జ‌ల్లాలి. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ ప్ర‌చారం చేస్తూనే ఉండాలి. అంతే కాకుండా మీడియా మేనేజ్‌మెంట్ లో ఆరితేరి ఉండాలి. సెల‌బ్రెటీలు, మోస్ట్ పాపుల‌ర్ పర్సనాలిటీస్ తో పాటు బిజినెస్ టైకూన్స్, కార్పొరేట్ కంపెనీల స‌పోర్ట్ తీసుకోవాలి. వీలైతే అవ‌తలి పార్టీల నేత‌ల‌కు గాలం వేయాలి, కోట్లు కుమ్మ‌రించాలి. ఎవ‌రికీ తెలియ‌కుండా గ‌ల్లీ స్థాయి నుండి ఢిల్లీ దాకా ఎవ‌రికీ తెలియ‌కుండా డ‌బ్బులు చేర‌వేయ‌గ‌ల‌గాలి. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై నిత్యం విషం క‌క్కుతూనే వుండాలి. చివ‌ర‌కు జ‌నాన్ని ప్ర‌భావితం చేసేందుకు మ‌ద్యాన్ని విచ్చ‌ల‌విడిగా స‌ర‌ఫ‌రా చేయాలి. ఇన్ని చేస్తే గెలుపు ద‌క్కుతుందా అంటే అదీ లేదు. అనుమానం క‌లిగితే పోలింగ్ స‌ర‌ళిని మార్చేసే సాంకేతిక నైపుణ్యాన్ని మేనేజ్ చేయ‌గ‌లగాలి. ఇవ‌న్నీ చేయ‌గ‌లిగే పార్టీలే ఇపుడు భార‌త‌దేశంలో ప‌వ‌ర్‌లో కొన‌సాగుతున్నాయి. ఇటీవ‌ల అధిక...