కాసులు కురిపిస్తున్న ఐడియా..!

దునియాలో ఒకప్పుడు బతకాలంటే సవాలక్ష ఇబ్బందులు. ఇప్పుడు అలాంటి కస్టాలు ఏమీ లేవు. ఎందుకంటే టెక్నాలజీ మారింది. ప్రపంచం చిన్నదై పోయింది. లెక్కలేనన్ని అవకాశాలు తలుపు తడుతున్నాయి. రా రమ్మంటూ ఊరిస్తున్నాయి. కావాల్సిందల్లా ఓపికతో వేచి చూడటమే మిగిలి ఉన్నది. సాంకేతిక రంగంలో చోటు చేసుకున్న పెను మార్పుల దెబ్బకు అన్ని రంగాలు అతలాకుతలమై పోయాయి. వేలాది మందికి కొలువులు దక్కుతున్నా, ఆశించినంతగా అందడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో వేలాదిగా స్టార్ట్ అప్ సంస్థలు పుట్టుకు వచ్చాయి. ప్రారంభంలో చిన్న గదుల్లో స్టార్ట్ అయి..నేడు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అయితే కాంపిటీషన్ విపరీతంగా పెరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా చూస్తే రోజు రోజుకు చేంజెస్ చోటు చేసుకుంటున్నాయి. ఐటి, ఈ కామర్స్, డిజిటల్ టెక్నాలజీ, సోషల్ మీడియా , టెలికం, ఆయిల్ , జ్యూయలరీ , ట్రాన్స్ పోర్ట్ తదితర రంగాలలో పని చేస్తున్న వారు అభద్రతకు లోనవుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాలలో కంపెనీల ఏర్పాటు అన్నది భారీ ఖర్చుతో కూడుకున్నది. కోట్లాది రూపాయలతో పాటు ఒక్కోసారి కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో పెట్టుబడి ఎక్కువ కావడం, ఉద్యోగాల ...