పోస్ట్‌లు

జులై 24, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

వారెవ్వా..క్యా క‌మాల్ హై..!

చిత్రం
దేశంలో త‌న‌కు ఎదురే లేకుండా చేసుకోవాల‌ని కేంద్రంలో కొలువు తీరిన క‌మ‌ల స‌ర్కార్‌కు, మోదీ, షా టీంకు కోలుకోలేని షాక్ ఇచ్చారు మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి క‌మ‌ల్‌నాథ్‌. భవిష్య‌త్‌లో కాంగ్రెస్ పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలని ప‌క్కా ప్లాన్‌తో బీజేపీ ముందుకెళుతోంది. అందులో భాగంగానే ఆయా రాష్ట్రాల‌లో కొలువు తీరిన ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన ప్ర‌భుత్వాల‌ను కూల‌దోసే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. అయితే దారికి తెచ్చు కోవ‌డం లేదా ఏదో ర‌కంగా ప‌వ‌ర్‌లోకి రావ‌డం. తాజాగా క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ స‌ర్కార్ ప‌డిపోయేందుకు ఎంత చేయాలో అంత చేసింది. షా క‌ర్నాట‌క‌లోకి ఎంట‌ర్ కావ‌డం..యెడ్డీ ప‌క్కా ప్లాన్ చేయ‌డంతో..మొత్తం స్కిప్టు పండింది. అత్యంత నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య విధాన‌స‌భ‌లో సంకీర్ణ స‌ర్కార్ విశ్వాస ప‌రీక్ష‌లో త‌న బ‌లాన్ని నిరూపించుకోలేక పోయింది. బీజేపీ ఆడిన చ‌ద‌రంగంలో ప్ర‌భుత్వం కూలి పోయింది. ఇదే స్ట్రాట‌జీని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో అమ‌లు చేయాల‌ని క‌మ‌లం భావించింది. ఆమేర‌కు అక్క‌డి సీఎం క‌మ‌ల్‌నాథ్‌కు చెక్ పెట్టాల‌ని చూసింది.  రాజ‌కీయంగా ఎంతో అనుభ‌వం క‌లిగి ఉన్న క‌మ‌ల్‌నాథ్ వీరి ప్లాన్‌ను , వ్యూహాల...

ఇండియాపై క‌న్నేసిన దిగ్గ‌జ కంపెనీ

చిత్రం
టెక్నాల‌జీ అంత‌కంత‌కూ పెర‌గ‌డం, క‌నెక్టివిటీకి ఇబ్బంది లేకుండా పోవ‌డంతో ఆయా దిగ్గ‌జ కంపెనీల‌న్నీ ఇపుడు ఇండియాపై దృష్టి పెడుతున్నాయి. ప్ర‌పంచంలోనే రెండో అతి పెద్ద జ‌నాభా క‌లిగిన దేశంగా వినుతి కెక్కిన భార‌త్‌లోకి ఎంట‌ర్ కావాల‌న్నది ప్ర‌పంచ మార్కెట్‌ను వివిధ రంగాల‌ను శాసిస్తున్న అన్ని కంపెనీలు ఆలోచ‌న‌. ఎక్క‌డ‌లేనంతటి మార్కెట్ ఇక్క‌డ ఉంద‌నేది వారి న‌మ్మ‌కం. చైనాలో ఎంట‌ర్ కావాలంటే, ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే ఆ దేశంలో ఎక్క‌డ‌లేన‌న్ని నియ‌మ నిబంధ‌న‌లు. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని న‌ష్టాలు పొందడం కంటే అన్నింటికి అనుమ‌తులు త్వ‌ర‌గా ఇచ్చే ..ఫ్రీ మార్కెట్ ఎకాన‌మీకి బార్లా తెరిచిన భార‌త్‌లోనే త‌మ కార్య‌క‌లాపాలు విస్త‌రించేందుకు ఉత్సుక‌త చూపిస్తున్నాయి. జియో రిల‌య‌న్స్ పుణ్య‌మా అని దేశ వ్యాప్తంగా మొబైల్ డేటా వినియోగం గ‌ణ‌నీయంగా పెరిగింది. ఇది ఎంత‌లా అంటే చెప్ప‌లేనంత‌గా. ఆక్టోప‌స్‌లా విస్త‌రించింది. చాప కింద నీరులా చేరి పోయింది.  దీంతో దిగ్గ‌జ టెలికాం కంపెనీల‌న్నీ డేటాను మ‌రింత చేరువ చేసేందుకు భారీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. త‌మ వ్యాపారాన్ని మ‌రింత పెంచుకునేందుకు ప్లాన్లు వేస్తున్నాయి. అయి...

ఆదాయంలో మ‌నోడు టాప్ - ఆట కంటే మ‌నీనే బెట‌ర్

చిత్రం
ఇండియాలో క్రికెట్ ఆట‌కున్నంత క్రేజ్ ఇంకే ఆట‌కు లేదు. ఏదైనా మ్యాచ్ జ‌రుగుతుందంటే చాలు, అన్ని ప‌నులు మానేసి టీవీలు, స్మార్ట్ ఫోన్ల‌లో మునిగి తేలిపోతారు. ఇక క్రికెట‌ర్ల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎందుకంటే వారంతా ఇపుడు యూత్‌కు , క్రికెట్ ఫ్యాన్స్ గాడ్ ఫాద‌ర్స్. ఒక్కోరిది ఒక్కో పిచ్చి. ఎప్పుడైతే 1983లో ఆల్‌రౌండ‌ర్ క‌పిల్‌దేవ్ ఆధ్వ‌ర్యంలో వ‌ర‌ల్డ్ క‌ప్ తీసుకు వ‌చ్చాడో అప్ప‌టి నుంచి ఈ ఆటకు ఎన‌లేని డిమాండ్ ఏర్ప‌డింది. గ‌ల్లీ నుండి ఢిల్లీ దాకా ఎక్క‌డ చూసినా క్రికెట్టే ద‌ర్శ‌న‌మిస్తోంది. తుపాను వ‌చ్చినా, భూకంపం సంభ‌వించినా, సునామీ చుట్టు ముట్టినా..ఊళ్లు మునిగి పోయినా ..వ‌ర‌ద‌లు ముంచెత్తినా స‌రే..క్రికెట్ ను చూడ‌కుండా ఎవ‌రూ ఉండ‌లేక పోతున్నారు. అంత‌లా పాపుల‌ర్ అయిపోయింది ఈ ఆట‌. ఈ దేశంలో తిండి లేక‌పోయినా ప‌ర్వాలేదు కానీ స్మార్ట్ ఫోన్లు లేకుంటే చ‌చ్చేందుకు సైతం రెడీ అంటున్నారు. ఓ వైపు సెల్ఫీలు..మ‌రో వైపు జ‌ల్సాలు..ఇంకో వైపు బెట్టింగులు ..ఇలా చెప్పుకుంటూ పోతే కోట్ల‌ను దాటింది క్రికెట్ వ్యాపారం. ఒక్కో క్రికెట‌ర్ ఆదాయం ఇపుడు బిలియ‌న్ డాల‌ర్ల‌ను దాటేసింది. ఎవ‌రికి వారు ఆట‌ను ఆట‌గా చూడడం...

ఉగ్ర‌వాదులకు అడ్డా నిజ‌మేన‌న్న పాక్ పీఎం

చిత్రం
నిన్న‌టి దాకా చిలుక ప‌లుకులు ప‌లికిన పాకిస్తాన్ ప్ర‌ధాన‌మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఎట్ట‌కేల‌కు నిజాన్ని ఒప్పుకున్నారు. గ‌త కొన్నేళ్లుగా ప‌క్క‌లో బ‌ల్లెంలా త‌యారైన పాక్ ఉగ్ర‌వాదానికి అడ్డాగా మారి పోయింది. వారి క‌నుస‌న్న‌ల‌లోనే పాకిస్తాన్ న‌డుస్తోందంటే ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌నిలేదు. అంత‌ర్జాతీయ వేదిక‌ల మీద ప్ర‌తిసారి భార‌త్ పాకిస్తాన్ చేస్తున్న నీతి మాలిన ప‌నుల గురించి ఎత్తి చూపుతూనే ఉన్న‌ది. యునైటెడ్ నేష‌న్స్ సాక్షిగా ఆధారాల‌ను సైతం ప్ర‌వేశ పెట్టింది. అయినా పాక్ పాల‌కులు ఒప్పుకోలేదు. త‌మ దేశం ప‌విత్ర‌మైన‌దంటూ చెప్పుకొచ్చారు. వాస్త‌వాధీన రేఖ‌ను దాట‌డం, చీటికి మాటికి గిల్లిక‌జ్జాలు పెట్టుకోవ‌డం అక్క‌డి పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌కు ష‌రా మామూలుగా మారి పోయింది. ఆపై ఆరోప‌ణ‌లు కూడా. తాజాగా అమెరికా టూర్‌లో ఉన్న ఆ దేశ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ త‌మ దేశంలో టెర్ర‌రిస్టులు ఉన్నార‌న్న వాస్త‌వాన్ని అంగీక‌రించారు. ఇప్ప‌టికీ ఇంకా 30 వేల నుంచి 40 వేల మంది దాకా ఉన్నారంటూ బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు. గ‌త ప్ర‌భుత్వాలు, ఏలిన వారు క‌ఠిన‌త‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోక పోవ‌డం వ‌ల్ల‌నే వారి కార్య‌క‌లాపాలు పెచ్చ‌రిల్లి పోయాయ‌ని ఆరోపించా...

గురువు గారూ..గురుభ్యోన‌మః ..!

చిత్రం
గురువు గారూ..గురుభ్యోన‌మః ..! కండ్ల‌కుంట్ల శ్రీ‌నివాసాచార్యులు అంటే ఎవ‌రికీ తెలియ‌క పోవ‌చ్చు. కానీ కె.శ్రీ‌నివాస్ అంటే తెలంగాణ‌లో ఎవ‌రైనా ఇట్టే గుర్తు ప‌డ‌తారు. అపార‌మైన విజ్ఞానం, అంతులేని మేధోత‌నం, అద్భుత‌మైన ర‌చ‌నా విన్యాసం, వ్య‌క్తిత్వంలోను ..ఉప‌న్యాసం ఇవ్వ‌డంలోను...ఏ విష‌యంపైన నైనా సులువుగా అర్థ‌మ‌య్యేలా చెప్ప‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. సాహితీ పిపాస‌కుడిగా, పాఠ‌కుడిగా, అధ్య‌య‌న‌శీలిగా, సంపాద‌కుడిగా, విశ్లేష‌కుడిగా, విమ‌ర్శ‌కుడిగా, ఇలా ప్ర‌తి ఫార్మాట్‌లో కుండ బ‌ద్ద‌లుకొట్టిన‌ట్టు మాట్లాడ‌ట‌మే కాక‌..సూటిగా ..తూటాలు గుండెల్ని చీల్చిన‌ట్లు ఆయ‌న అక్ష‌రాలు మ‌న‌ల్ని క‌దిలింప చేస్తాయి. మ‌ళ్లీ మ‌ళ్లీ ఆలోచించేలా చేస్తాయి. అంతేనా ప‌డుకున్నా స‌రే వెంటాడుతాయి. మ‌నం ఎక్క‌డున్నామో..గుర్తు చేస్తాయి. మ‌నుషుల ప‌ట్ల‌..స‌మ‌స్త ప్ర‌పంచం ప‌ట్ల‌..స‌మాజం పోక‌డ‌, జీవిత ప్ర‌యాణం, కాల‌పు ప్ర‌వాహ‌న్ని ఎలా ఒడిసి ప‌ట్టుకోవాలో అల‌వోక‌గా ..అంటుక‌ట్టిన‌ట్టు మ‌న‌కందిస్తారు ఆయ‌న‌. స‌రిగ్గా గురువు గారితో అనుబంధం ఆబిడ్స్ లో మొద‌లైంది. ఇపుడున్నంత అవ‌కాశాలు, చ‌దువుకునే వీలు, ప‌నిచేసే మార్గాలు లేవు. బిక్కుబిక్కు...

ఫార్చ్యూన్ గ్లోబ‌ల్ లిస్ట్ డిక్లేర్ - 7 ఇండియ‌న్ కంపెనీల‌కు చోటు - నెంబ‌ర్ 1 వాల్‌మార్ట్

చిత్రం
ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తి ఏటా గ‌ణ‌నీయంగా ఆదాయం క‌లిగిన కంపెనీల జాబితాను ప్ర‌క‌టించే ఫార్చ్యూన్ గ్లోబ‌ల్ ఈ ఏడాది త‌న లిస్టును డిక్లేర్ చేసింది. ఈ జాబితాలో 7 భార‌తీయ కంప‌నీల‌కు చోటు ద‌క్కింది. ఫార్చ్యూన్ గ్లోబ‌ల్ 500 లిస్టులో రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్ ) త‌న ర్యాంకింగ్‌ను మరింత మెరుగు ప‌ర్చుకుంది. ఏకంగా 42 స్థానాలు దాటి 106వ స్థానం ద‌క్కించుకుంది. గ‌త కొంత కాలంగా ఇండియ‌న్ కంపెనీల‌కంటే మెరుగైన ఫెసిలిటీస్, ప్రాఫిట్‌తో టాప్ రేంజ్‌లో ఉంటూ వ‌చ్చిన భార‌త ప్ర‌భుత్వ రంగం సంస్థ ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ ఈసారి వెన‌క్కి వెళ్ల‌డం మార్కెట్ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య పోయేలా చేసింది. ఈసారి 117వ స్థానంలో నిలిచింది. దీనిని అధిగ‌మించింది రిల‌య‌న్స్ కంపెనీ. ఫార్చ్యూన్  ప‌త్రిక ప్ర‌తి సంవ‌త్స‌రం స‌ర్వే చేప‌డుతుంది. ఆదాయంలో, విస్త‌ర‌ణ‌లో డిఫ‌రెంట్ వే తో వెళ్లే కంపెనీల‌ను ప్ర‌త్యేకంగా గుర్తిస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా రేటింగ్‌ల‌ను వెల్ల‌డించింది. ఈ మ్యాగ‌జైన్ జాబితాలో చోటు ద‌క్క‌డం త‌మ ప‌నితీరుకు ద‌క్కిన గౌర‌వంగా..ఇంట‌ర్నేష‌న‌ల్ రిక‌గ్నిష‌న్ కు గుర్తుగా కంపెనీలు భావిస్తాయి. ప్ర‌తి ఏటా ప...