పోస్ట్‌లు

మే 17, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

మ‌హ‌ర్షి స‌రే..తెలంగాణ రైతుల మాటేమిటి..?

చిత్రం
భార‌త దేశం అంటేనే వ్య‌వ‌సాయం. రైతుల‌కు ఎలా పండించాలో..ఎప్పుడు ఏ కాలంలో ఎలాంటి ప‌ద్ధ‌తులు పాటించాలో..ఏయే పంట‌లు సాగు చేయ‌వ‌చ్చో వాళ్ల‌కు తెలిసినంత‌గా ఇంకెవ్వ‌రికీ తెలియ‌దు. సినిమా చూసి నేర్చుకునేంత స్థితికి తెలంగాణ రైతాంగం దిగ‌జార‌లేదు. ఆ విష‌యాన్ని నిర్మాత దిల్ రాజు, ద‌ర్శ‌కుడు వంశీ, న‌టుడు మ‌హేష్ బాబు గుర్తిస్తే చాలు. సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా వ్య‌వ‌సాయం పాట ప‌డుతున్నారు. రైతుల‌కు కావాల్సింది సినిమాలు కాదు. పండించేందుకు భ‌రోసా కావాలి. ప్ర‌తి ఒక్క రైతుకు..మ‌ట్టి బిడ్డ‌ల‌కు నెల‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌నీసం 10 వేల రూపాయ‌ల చొప్పున పెన్ష‌న్ సౌక‌ర్యం క‌ల్పించాలి. అపుడే వారికి న్యాయం జ‌రుగుతుంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఒట్టి పోయింది. దోపిడీకి గురైంది. మోసానికి లోనైంది. 60 ఏండ్ల పాటు ఈ ప్రాంతాన్ని స‌ర్వ‌నాశ‌నం ప‌ట్టించారు. కోలుకోలేకుండా చేశారు. నీళ్లు, నిధులు, నియామ‌కాల విష‌యంలో తెలంగాణ‌కు ఎన‌లేని అన్యాయం జ‌రిగింది. కొన్ని త‌రాలు గ‌డిచినా ఈ ద‌గాను పూడ్చుకునేందుకు స‌మ‌యం స‌రిపోదు.ఇరు రాష్ట్రాల‌లో వ్య‌వ‌సాయం ప్ర‌ధాన‌మైన ఆదాయ వ‌న‌రుగా ఉంది. వేలాది ...

ఏపీలో హీటెక్కిన పాలిట్రిక్స్ - జోరందుకున్న అంచ‌నాలు

చిత్రం
ఏపీలో హీటెక్కిన పాలిట్రిక్స్ - జోరందుకున్న అంచ‌నాలు దేశ రాజ‌కీయాల‌లో అప‌ర చాణుక్యుడిగా పేరు సంపాదించుకున్న టిడిపి జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఎన్న‌డూ లేనంత గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏపీ ఉమ్మ‌డి రాష్ట్రానికి తొమ్మిది సంవ‌త్స‌రాల పాటు సుదీర్ఘ కాలం పాటు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇటు రాష్ట్రంలో అటు జాతీయ స్థాయిలో కీల‌క‌మైన పాత్ర‌ను పోషించారు. జిఎంసీ బాల‌యోగిని పార్ల‌మెంట్ స్పీక‌ర్‌గా చేయ‌డంలో బాబు ఎంతగానో కృషి చేశారు. ఆ త‌ర్వాత అనూహ్య ప‌రిణామాల రీత్యా బాబు అధికారాన్ని కోల్పోయారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉమ్మ‌డి రాష్ట్రానికి సీఎంగా ఎంపిక‌య్యారు. కొన్నేళ్ల పాటు ప‌వ‌ర్‌కు దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభ‌వాన్ని తీసుకు వ‌చ్చారు రెడ్డి. వేల కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేప‌ట్టారు. చంద్ర‌బాబు ఎన్ని అడ్డంకులు క‌ల్పించినా ఆయ‌న ఒక్క‌డే ముందుండి న‌డిచారు..పార్టీని, కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌ను న‌డిపించారు. అనూహ్య‌మైన రీతిలో వైఎస్ ప‌వ‌ర్ లోకి వ‌చ్చారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపించారు. అసెంబ్లీ సాక్షిగా ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. ప‌రిటాల ర‌వ...

స్పెన్స‌ర్ బంప‌ర్ ఆఫ‌ర్ - 300 కోట్ల డీల్

చిత్రం
భార‌తీయ వ్యాపార దిగ్గ‌జం ఆర్.పి. సంజీవ్ గోయెంకా అసాధార‌ణ‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న సార‌థ్యంలోని స్పెన్స‌ర్ రిటైల్ లిమిటెడ్ కంపెనీ లాభాల బాట‌లో ప‌య‌నిస్తోంది. వ్యాపార ప‌రంగా త‌న‌కంటూ మెరుగైన వాటాను స్వంతం చేసుకుని దూసుకెళుతోంది. ఇండియా వ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల‌లో స్పెన్స‌ర్ స్టోర్స్, మాల్స్ వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఎక్కువ ధ‌ర‌ల మోత మోగించ‌కుండానే త‌క్కువ ధ‌ర‌ల‌కే వ‌స్తువుల‌ను విక్ర‌యిస్తూ లో మార్జిన్ తో వినియోగ‌దారుల‌కు సేవ‌లందిస్తున్నాయి. దీంతో మిగ‌తా దిగ్గ‌జ వ్యాపార సంస్థ‌ల‌కు ధీటుగా స్పెన్స‌ర్ కూడా ఎదుగుతోంది. మోర్, మెట్రో, డి-మార్ట్, మెట్రో, బిగ్ బ‌జార్ రిటైల్ సంస్థ‌లతో స్పెన్స‌ర్ పోటీ ప‌డుతూనే మార్కెట్ వాటాను పెంచుకుంటోంది. క‌స్ట‌మ‌ర్ల‌కు ఎక్కువ ప్ర‌యారిటీ ఇస్తూనే అత్య‌ధికంగా ..అంటే మిగ‌తా సంస్థ‌ల‌కంటే అధికంగా డిస్కౌంట్స్, ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తోంది. దీంతో కొనుగోలుదారులు స్పెన్స‌ర్ స్టోర్స్, మాల్స్ వైపు ప‌రుగులు తీస్తున్నారు. ఆయా స్టోర్స్‌ల‌లో క‌స్ట‌మ‌ర్స్ అభిరుచుల‌కు అనుగుణంగా వారికి మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు స్పెన్స‌ర్ సంస్థ చ‌ర్య‌లు చ...

ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్ప‌బోతున్నాయి..?

చిత్రం
ఎవ‌రు గెలుస్తారు..ఏ పార్టీకి ఆధిక్యం రాబోతుంది. ఎవ‌రు సీఎం, పీఎంల పీఠాల‌ను అధిరోహిస్తారు..ప‌వ‌ర్ లోకి ఎవ‌రు వ‌స్తారు ..ఇలా ఎక్క‌డికి వెళ్లినా ఇదే చ‌ర్చ‌. బ‌స్సుల్లో, రైళ్ల‌ల్లో, విమానాల్లో సైతం ఎన్నిక‌లు, పొలింగ్ స‌ర‌ళి, స‌ర్వే సంస్థ‌ల ఫ‌లితాల‌పైనే చ‌ర్చోప చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ల‌క్ష‌ల్లో మొద‌లైన బెట్టింగ్ వ్య‌వ‌హారం తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏకంగా కోట్లు, డాల‌ర్ల‌ను దాటేసింది. ఏ ప్ర‌భుత్వం దీనిని నియంత్రించే ప‌రిస్థితి లేదు. అన్ని వ్య‌వ‌స్థ‌లు నీరుగారి పోయాయి. నీళ్లు న‌ములుతున్నాయి. నేరాలు, ఘోరాలు, దోపిడీలు, ఆర్థిక మోసాలు , ఆత్మ‌హ‌త్య‌లు, ఆక‌లి చావులు, దారుణాలు పెచ్చ‌రిల్లి పోతున్నాయి. వీటిని నియంత్రించేందుకు ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా, ఎన్ని చ‌ట్టాలు చేసినా ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా త‌యారైంది. వ్య‌వ‌స్థ పుచ్చు ప‌ట్టి పోయింది. ప‌చ్చి పుండైతే ప‌ర్వాలేదు..ఏకంగా క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారిలా దేశాన్ని అల్లుకు పోయింది. ఇప్ప‌ట్లో దీనిని నిర్మూలించ‌డం అసాధ్య‌మైన ప‌ని. ఈ ప‌రిస్థితుల్లో దేశానికి స్వేచ్ఛ‌ను ప్ర‌సాదించిన మ‌హాత్మా గాంధీ మ‌ళ్లీ జ‌న్మించినా దీన...