పోస్ట్‌లు

ఏప్రిల్ 9, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

యూట్యూబ్‌ హవా ..జనం ఫిదా ..!

చిత్రం
కోట్లాది జనం తమను తాము యూట్యూబ్‌ లో చూసుకుంటున్నారు . ఏ ముహూర్తంలో దీనిని క్రియేట్ చేశారో కానీ అప్పటి నుండి నేటి దాకా మిస్సైల్ కంటే వేగంగా తన రికార్డ్ ను తానే అధిగమిస్తోంది. వినోదం ..విజ్ఞానం ..ఆధ్యాత్మికం ..వికాసం ..ఆటలు ..ప్రకృతి ..ప్రపంచం ..అడవులు ..జంతువుల విన్యాసాలు ..ఇలా ప్రతిదీ ఇందులోకి చేరిపోతోంది . అవసరమైనప్పుడు తీసుకోవచ్చు .వద్దనుకుంటే అలాగే తమ పేరుతో ఉంచేసుకోవచ్చు . ఇలాంటి సౌలభ్యం ఇందులో ఉండడంతో కోట్లాది జనం దీనికి ఫిదా అవుతున్నారు . ఇంటర్నెట్ అనుసంధానం కావడంతో దీని వినియోగం పదింతలు పెరిగింది . పిల్లలు ..మహిళలు ..పెద్దలు ..ఇలా ప్రతి ఒక్కరు యూట్యూబ్‌ కు అడిక్ట్ అవుతున్నారు . గేమ్స్ వీడియోలకు విపరీతమైన క్రేజ్ ఉంటోంది . దేశీయంగా మొబైల్‌ ఫోన్లలో యూట్యూబ్‌ను వీక్షిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతోంది. గత ఏడాది మొబైల్‌ ఫోన్లలో యూట్యూబ్‌ను యాక్సెస్‌ చేస్తున్న యూజర్లు 73 శాతంగా ఉండగా ఈ ఏడాది అది ఏకంగా 85 శాతానికి పెరిగింది. ఈ ఏడాది జనవరి నాటికి భారత్‌లో యూట్యూబ్‌ నెలవారీ యాక్టివ్‌ యూజర్‌ బేస్‌ 26.5 కోట్లుగా ఉంది. గత ఏడాది ఈ సంఖ్య 22.5 కోట్లుగా ఉంది. పదకొ...

నిన్నటి పోలేపల్లి ..నేటి నిజామాబాద్ కు ప్రేరణ

చిత్రం
మట్టి ఎక్కడైనా మట్టే. కాకపోతే దానికి అందమైన ముసుగులు. ప్రత్యేక ఆర్ధిక మండళ్లు అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ పేరుతో రైతుల నుండి తక్కువకు భూములు లాగేసుకోవడం . తిరిగి వాటిని ప్రభుత్వమే వేలానికి పెట్టడం . మార్కెట్లో బహిరంగంగా అమ్మేయడం . ఇక్కడ పాలకులకు ఎవరైతే దగ్గరగా ఉంటారో ..ఎవ్వరైతే పెట్టుబడులతో పాటు తాయిలాలు అందిస్తారో వారికే విలువైన భూములు దక్కుతాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం . ఈ దేశంలో జన్మించిన ప్రతి ఒక్కరికి బతికే హక్కుతో పాటు భూమిని పొందటం కూడా ఓ హక్కే. కానీ రాను రాను భూమి కనిపించడం లేదు . కంపెనీలు ..ప్రమాదకరమైన పరిశ్రమలు ..వాటి చుట్టూ బడా బాబులు ..పాలకులు ..అధికారులు కాపలాగా ఉంటారు . పరిశ్రమలు ఏర్పాటు చేసే పెట్టుబడిదారులకు ప్రభుత్వాలు రెడ్ కార్పెట్లు పరుస్తున్నాయి . లెక్కలేనన్ని వనరులు సమకూర్చి పెడుతున్నాయి . నీళ్లు, కరెంట్ ..అనుమతి ..అవసరమీయతే రాయితీలు ఇస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నాయి . తమకు కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు వద్దంటూ అప్పట్లో పాలమూరు జిల్లా పోలేపల్లి గ్రామస్థులు అలుపెరుగని పోరాటం చేశారు . తమ నిరసనను ప్రకటించారు . దాదాపు తమ భూములు కోల్పోయిన భాదితులు 48 దాకా ప...

కోలుకుంటున్న బీఎ్‌సఎన్‌ఎల్‌ ..ఉద్యోగులు బేఫికర్ ..!

చిత్రం
భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో మెరుగైన సేవలు అందిస్తూ వచ్చిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ టెలికాం కంపెనీ మెలమెల్లగా కోలుకుంటోంది. నిన్నటి దాకా అటుఇటు ఊగిసలాడిన ఈ కంపెనీ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది . నష్టాలు వస్తున్నాయంటూ 54, 000 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని ..లేదా స్వచ్చంద పదవీ విరమణ ఇవ్వాలని బీఎ్‌సఎన్‌ఎల్‌ యాజమాన్యం నిర్ణయించింది . దీనిని ఆ సంస్థను నమ్ముకుని బతుకుతున్న వేలాది మంది ఉద్యోగులు నిరసించారు. భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు . అయినా ఆ సంస్థ యాజమాన్యం కానీ ఇటు సేవలు పొందుతున్న కేంద్ర సర్కార్ కానీ ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపేందుకు ఉత్సుకత చూపించలేదు . ఇండియాలో విశిష్టమైన సేవలు అందిస్తూ ప్రభుత్వానికి ..ఇటు ప్రజలకు చేదోడుగా ఉన్న ఈ సంస్థను నిట్ట నిలువునా ముంచారు . ఒక రకంగా ఆయా పాలక వర్గాలు దీనిని పనిగట్టుకుని పక్కన పెట్టేశారు. దేశ వ్యాప్తంగా అపరిమితమైన నెట్ వర్క్ తో పాటు కోట్లాది వినియోగదారులను ఈ సంస్థ కలిగి ఉన్నది . ఇంటర్నెట్ వినియోగంలో ..బ్రాండ్ విడ్త్ కలిగి ఉన్న టెలికం కంపెనీల్లో దీని తర్వాతే ఏదైనా . రిలయన్స్ సంస్థ టెలికం రంగంలోకి అడుగు పెట్టాక రూపు రేఖలు ఒక్కసారి...

శత్రువుతో స్నేహం..అధికారమే ముఖ్యం - రూట్ మార్చిన కమలం..!

చిత్రం
ఢిల్లీలో మళ్ళీ బీజేపీ జెండా ఎగుర వేసేందుకు కమలనాథులు నానా తంటాలు పడుతున్నారు . దేశ వ్యాప్తంగా మోడీ ప్రభంజనం తగ్గింది . జీఎస్టీ మోత ..నోట్ల రద్దు ..వెక్కిరిస్తున్న ఖాళీలు ..ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడం ..జన్ ధన్ ఖాతాల్లో డబ్బులు వేస్తానని వేయక పోవడం ..జనం నెత్తిన అధిక పన్నుల మోత మోగించడం తో ప్రస్తుతం 16 వ సారి జరుగుతున్న లోకసభ ఎన్నికల్లో బీజేపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎవ్వరి పొత్తు లేకుండానే మళ్ళీ అధికారంలోకి వస్తామని కలలు కన్న బీజేపీకి సింగిల్ డిజిట్ ఫిగర్ రాదనీ తేలి పోయింది . దీంతో పవర్ లోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ..బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ కోసం ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరమవుతుంది . దీంతో నిన్నటి దాకా తానే అంతా అయి ..ఒకే ఒక్కడిగా చక్రం తిప్పిన నరేంద్ర మోడీ ఇప్పుడు శత్రువు అయినా సరే చెలిమి చేసేందుకు సిద్దమే నంటూ ప్రకటించారు. సీన్ రివర్స్ కావడంతో ..ఓటమిని త్వరగా ఒప్పుకోని మోడీజీ ఇప్పుడు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు . ఒక్కరైనా పర్వాలేదు ..వాళ్ళు శత్రువైనా సరే తాము అధికారం చేపట్టేందుకు సాదర స్వాగతం పలుకుతామంటూ మోడీ స్పష్టం చేశారు. నిన్నటి దాకా కింగ్ మేక...

జనం ఆశలపై నీళ్లు చల్లిన బీజేపీ

చిత్రం
మరోసారి బీజేపీ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది . 2014 లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతి ఖాతాలో 15 లక్షలు వేస్తానని హామీ ఇచ్చారు . పీఎం చేసిన ఈ ప్రకటన అప్పట్లో సంచలనం రేపింది . కోట్లాది ప్రజలు మోడీ మాటలు నమ్మారు . కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు . బీజేపీకి అనూహ్యమైన విజయాన్ని అందించారు . ఆ తర్వాత జనం నెత్తిన మోడీ పన్నులు విధించడం . నోట్లను రద్దు చేయడం . ఒంటెత్తు పోకడలు పోయారు . తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని మోడీ టార్గెట్ చేశారు . కేసులు నమోదు చేసేలా .. ఐటీ దాడులు జరిగేలా చేస్తూ పోయారు . దీంతో ఆయా రాష్ట్రాల్లో పరిపాలన సాగిస్తున్న విపక్షాలు బీజేపీపై నిప్పులు చెరిగాయి . ఏకంగా అత్యున్నత ధర్మాసనం సుప్రీం కోర్ట్ కు ఫిర్యాదు చేశాయి . అయినా మోదీజీలో మార్పు రాలేదు . ఏపీలో తెలుగుదేశం పార్టీతో నాలుగేళ్లపాటు చెలిమి చేసిన బీజేపీ ఆఖరులో కటీఫ్ చేసింది . ఒకరిపై మరొకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు . ఎన్నికల్లో ఐటి దాడులు జరగడం ..ఈసీని మార్చడం చేస్తూ పోయారు . అయినా ఏపీ సీఎం చంద్ర బాబు ఎక్కడా రాజీ పడలేదు . ఒక్కడే ఒంటరి పోరాటం చేశారు . మోడీ ..అమిత షా ఆగడాలను ఎక్కి ...

చెన్నై షాన్ దార్ ..కోల్‌కతా బేకార్

చిత్రం
ఐపీఎల్ టోర్నీలో ఎమ్మెస్ ధోనీ సారధ్యం లోని చెన్నై జట్టు తన హవాను కొనసాగిస్తూనే ఉన్నది . అంచనాలకు మించి అన్ని ఫార్మాట్ లలోను అద్భుతమైన రీతిలో ప్రదర్శనను కనబరుస్తోంది. అటు బౌలింగ్ లోను ఇటు బ్యాట్టింగ్ లోను రాణిస్తూ గెలుపు బాటలో పయనిస్తోంది . కోల్‌కతా పై అతి కష్టం మీద విజయం సాధించింది . విన్నింగ్ కోసం రెండు జట్లు హోరాహోరీగా పోరాడాయి . కానీ చివరకు ఉత్కంఠ పోరులో సక్సెస్ చెన్నైని వరించింది . దీపక్ పవర్ దెబ్బకు కోల్‌కతా తలవంచక తప్పలేదు. పరుగు పరుగుకూ కష్టపడ్డాయి. ఎంత కొట్టినా బంతి మొరాయించడంతో బౌండరీలు గగనమయ్యాయి. ఐతే బౌలర్ల హవా సాగిన పోరులో చెన్నై జట్టే పైచేయి సాధించింది. స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రమించిన ఆ జట్టు ఐపీఎల్‌-12లో ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుని, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. పేసర్‌ దీపక్‌ చాహర్‌ , స్పిన్నర్లు విజృంభించడంతో గెలుపు సాధ్యమైంది. చాహర్‌తో పాటు హర్భజన్‌ , జడేజా , తాహిర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో మొదట కోల్‌కతా పరుగుల కోసం తీవ్రంగా కష్టపడింది. 9 వికెట్లకు 108 పరుగులే చేయగలిగింది. రస్సెల్ మరోసారి మెరుపులు కురిపించాడు . 5 ఫోర్లు ఆరు సిక్సర్...

ముగిసిన ప్రచారం - చరిత్ర సృష్టించిన రైతాంగం

చిత్రం
తెలంగాణాలో ..ఏపీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. కేసీఆర్ , రాహుల్ , చంద్ర బాబు , పవన్ , జగన్ , మోడీ , అమిత్ షా , రాజ్ నాథ్ సింగ్ ఇలా పేరొందిన నాయకులు ప్రచారం చేశారు. ఏపీలో 25 - తెలంగాణాలో 17 లోకసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి . దేశ వ్యాప్తంగా 543 సీట్లకు ఎన్నికల పోలింగ్ కొనసాగనుంది. ఎంపీ సీట్లతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగనున్నాయి. ఏపీలో 175 అసెంబ్లీ నియోజక వర్గాలలో ప్రచారం ముగిసింది . టిడిపి ..వైసిపి , జనసేన పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేశాయి. దేశం లోనే మొదటి సారిగా ౧౮౫ మంది అభ్యర్థులు నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ పడుతున్నారు. ఇది దేశ ఎన్నికల చరిత్రలో ఓ రికార్డ్. అక్కడ అధికార పార్టీకి చెందిన ..సిట్టింగ్ ఎంపీ కవిత కు వ్యతిరేకంగా 178 మంది రైతులు ఎన్నికల బరిలో నిలిచారు . ఈ ఎన్నిక కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ సవాల్ గా మారింది. పసుపు , చక్కర , కందుల పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ..పసుపు బోర్డు ఏర్పాటు చేయడంలో కవిత విఫలమైందని రైతులు నిప్పులు చెరిగారు . ఆందోళనలు ..పోరాటాలు చేశారు . దేశంలోని ప్రసార సాధనాలు నిజామాబాద్ వైపు చూసేలా చేశారు . రైతు సంఘాలు . ప్ర...

చైనా మొబైళ్ల కళ కళ..ఇతర కంపెనీలు వెల వెల..!

చిత్రం
ప్రపంచ స్మార్ట్ ఫోన్ల తయారీలో చైనా తన హవాను కొనసాగిస్తోంది . యాపిల్ , శాంసంగ్ , నోకియా లకు ధీటుగా ఈ మొబైల్స్ పోటీగా నిలుస్తున్నాయి .ఇండియన్ మార్కెట్ ను స్మార్ట్ మొబైల్స్ ముంచెత్తుతున్నాయి . దేశమంతటా ఒప్పో, వివో, రెడ్ మీ ఫోన్లు ఎక్కువగా అమ్ముడు పోతున్నాయి . ఇప్పటికే 5 కోట్ల మందికి పైగా మొబైల్స్ విరివిగా వాడుతున్నారు . చిన్నారులు , యువతీ యువకులు , పెద్దలు , వృద్దులు అంతా స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు . దేశీయంగా ఇంటెక్స్ , మైక్రో మాక్స్ , కార్బన్ తదితర కంపెనీల మొబైల్స్ కొనుగోలు చేస్తున్నారు . కానీ ఎక్కువగా విదేశీ కంపెనీలకంటే చైనా కంపెనీలకు చెందిన మొబైల్స్ తమ హవాను కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు ఏ మార్కెట్ కు వెళ్లినా ..ఆన్ లైన్ లోను ..అటు ఆఫ్ లైన్ లోను ..బయటి మార్కెట్ లలో చైనా మొబైల్స్ దర్శనమిస్తున్నాయి . బడా కంపెనీల మొబైల్స్కు ధీటుగా చైనా తాయారు చేస్తోంది . పేరొందిన బ్రాండ్లకు చుక్కలు చూపిస్తున్నాయి . దేశీయమార్కెట్లో విదేశీ మొబైల్ కంపెనీలతో పోటీపడే ఒక్కదేశీయ కంపెనీ మచ్చుకైనా కనబడటం లేదు. ఐదేళ్లక్రితం మొబైల్ మార్కెట్‌ ను ముంచెత్తిన ఇండియన్ కంపెనీలు.. ఇప్పుడు స్లీపింగ్ మోడ్‌ల...

మామూలుగా బతకలేమా ?

చిత్రం
డబ్బులు పోగేసు కోవడం ..ధనవంతులుగా చెలామణి కావాలని అనుకోవడం మామూలే. సాఫ్ట్ వేర్ రంగం వచ్చాక అవకాశాలు అపారంగా పెరిగాయి . మీసాలు రాణి వాళ్ళు సైతం డాలర్లు సంపాదిస్తున్నారు . లెక్కలేనంత సొమ్ము చేసుకుంటున్నారు . నిత్యం డబ్బు మాయలో పడి కొట్టుకు చేస్తున్నారు . బంగ్లాలు ..భవంతులు ..కార్లు ..షికార్లు ..వస్తువులు ..స్టేటస్ సింబల్ గా మారాయి . ఆధునికత తెచ్చిన తంటా ఇది . వైన్ వాళ్ళు లేరు . చెప్పే వాళ్ళు ఉన్నా వారి గురించి మాట్లాడే సమయం ఉండటం లేదు . స్మార్ట్ ఫోన్లలో బతుకుతున్నారు..కానీ జీవించడం లేదు . ఒకరితో మరొకరు పోల్చుకోవడం తోనే కాలమంతా సరి పోతోంది . ఇక పక్క వాళ్ళతో మాట్లాడే ఓపిక ఎక్కడిది . కోట్లు వెనకేసుకున్నా..తరగని సంపద సమకూరినా కావాల్సింది మానసిక పరమైన సంతృప్తి. ఇదేదీ ఇప్పటి జనాలకు ఉండటం లేదు . అంతటా టెన్షన్ ..అంతులేని వత్తిడి . దీనిని తట్టుకోలేక ఇంకొన్ని వ్యసనాలకు బానిసై పోతున్నారు . బాంధవ్యాలు మరిచి ..వావి వరుసలు లేకుండానే సంబంధాలను కలిపేసుకుంటున్నారు . తల్లిదండ్రులంటే గౌరవం లేదు ..పెద్ద వాళ్ళు చెబితే చెవికెక్కదు . ఎంత సంపాదించినా కాపాడు కోవడం చేత కాదు. పొద్దున్న లేస్తే ..పడుకున...