పోస్ట్‌లు

నవంబర్ 9, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

అబ్బా..మిర్చి దెబ్బ

చిత్రం
మిర్చి ధర ఘాటెక్కిస్తోంది. నిత్యం కూరల్లో కారం లేకుండా వంట చేయడం అసాధ్యం. దీంతో మన మిర్చికి ఎక్కడా లేనంతటి డిమాండు ఉంటోంది. అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉన్న తేజ రకం మిర్చి క్వింటాలుకు 20  వేల రూపాయల రికార్డు స్థాయి ధర పలుకుతోంది. ఇతర రకాలకు సైతం 16  వేలకు తగ్గకుండా ధరలు వస్తున్నాయి. గిడ్డంగుల్లో నిల్వలు తక్కువగా ఉండటం, ఇతర దేశాలకు ఎగుమతుల ఆర్డర్లు ఉండటంతో మార్కెట్లో మిర్చి ధరలు ఉహించని విధంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు. నందిగామ, జగ్గయ్యపేట, కంచికచర్ల ఏఎంసీల పరిధిలో 15కు పైగా శీతల గిడ్డంగులు ఉండగా, కేవలం లక్షన్నర టిక్కీల మిర్చి మాత్రమే నిల్వ ఉంది. రాష్ట్రంలో మొత్తం శీతల గిడ్డంగుల్లో 10  లక్షల టన్నుల మిర్చి నిల్వ ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఊహించని విధంగా ధరలు వస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట చేతి కొచ్చిన సమయంలో గరిష్ఠంగా తేజ రకానికి  8  వేలు, లావు రకాలకు 7  వేలు, 4884 రకానికి 6  వేల వంతున ధర లభించటమే గగనమైంది. నాలుగు నెలల క్రితం నుంచే మార్కెట్లో మిర్చి ధరల్లో మార్పు మొదలైంది. అప్పట్లో తేజ రకానికి  12- 14  వేల ...

ఫైనాన్షియల్ క్రైసిస్..మారుతీకి షాక్

చిత్రం
ఇండియన్ వాహనాల అమ్మకాలు మరింతగా క్షీణించాయి. వాహన శ్రేణిలో టాప్ రేంజ్ లో ఉన్న మారుతీ కంపెనీ వాహనాల అమ్మకాలు గణనీయంగా తగ్గి పోయాయి. డిమాండ్‌ క్షీణత దేశీయ అతి పెద్ద వాహన తయారీదారు మారుతి సుజుకిని పట్టి పీడిస్తోంది. తాజాగా దేశీయంగా పాసింజర్‌ వాహనాలకు డిమాండ్ లేక పోవడం వల్ల మారుతి తన ఉత్పత్తిని వరుసగా 8 వ నెలలో తగ్గించు కోవలసి వచ్చింది. ఇటీవల వాహనాల అమ్మకాలు తగ్గి  పడి పోవడంతో ఆటో కంపెనీలన్నీ  ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో మారుతి, అశోక్‌ లేలాండ్‌ లాంటి కంపెనీలు ఉత్పత్తిలో కోత పెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వరుసగా ఎనిమిదవ నెలలో కూడా మారుతి ఉత్పత్తి కోతను ప్రకటించింది. గత నెలలో కంపెనీ మొత్తం వాహనాల ఉత్పత్తి 1,19,337 యూనిట్లు కాగా, గత ఏడాది అక్టోబర్‌లో 1,50,497 గా ఉంది. ప్రయాణీకుల వాహనాలు 148,318 నుండి 117,383 యూనిట్లు తగ్గాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మారుతి కంపెనీ తెలిపింది.  గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు సగానికి సగం పడి పోయాయి. 2018 అక్టోబర్‌లో 13,817 యూనిట్లను  ఉత్పత్తి చేయగా, గత నెలలో 7,661గా ఉంది. మినీ సెగ్మెంట్లో ఆల్టో, ఎస్-ప్రెస్సో, ఓల్డ్ వా...

ట్రంప్ గరం..డ్రాగన్ ఆగ్రహం

చిత్రం
ప్రపంచాన్ని ఒంటి చేత్తో శాసించాలని ఉవ్విళూరుతున్న అమెరికా అవకాశం చిక్కితే చాలు మాటలతో దాడులు చేస్తోంది. అదే పనిగా నోరు పారేసు కోవడంలో ఆ దేశ అధినేత ట్రంప్ కు అలవాటే. ఆయన అమెరికా జపం చేస్తున్నారు. తాజాగా డ్రాగన్ చైనాపై వాణిజ్య యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మందగమనం చోటు చేసుకుంది. ఉన్నట్టుండి ట్రంప్ కీలక కామెంట్స్ చేశారు. అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. చైనా ఉత్పత్తులపై సుంకాలు ఎత్తి వేసే దిశగా తమ దేశంతో ఎలాంటి ఒప్పందం కుదర లేదని కుండబద్దలు కొట్టారు. సుంకాల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చైనా కోరినట్లు తెలిసింది. దీనికి సంబంధించి వారు నాతో ఎలాంటి చర్చలు జరప లేదు. ఎందుకంటే నేను దానికి  ఒప్పుకోనని వారికి తెలుసు. అందుకే సుంకాల ఎత్తి వేతను తాను ఖండిస్తున్నా అంటూ ట్రంప్ చెప్పారు. అయినా ఇది ఎప్పటికి జరగని పని అని తేల్చి పారేశారు. ప్రస్తుతం  చైనా ఆర్ధికంగా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోందని, అందుకే ఇటువంటి ఒప్పందాల కొరకు పాకులాడు తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  గత వారం ఇరు దేశాల మధ్య సుంకాలను...

మందిరానికి మార్గం..మసీదుకు స్థలం

చిత్రం
సుదీర్ఘమైన ఉత్కంఠకు తెరపడింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన అత్యున్నత ధర్మాసనం కీలక తీర్పు వెలువరించడంతో మందిర నిర్మాణానికి అడ్డంకులు తొలగి పోయాయి. దీంతోమార్గం సుగమమైంది. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయోధ్య యాక్ట్‌ కింద మందిర నిర్మాణానికి మూడు నెలల్లోగా ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. వివాదాస్పద స్ధలాన్ని రామజన్మ న్యాస్‌కే అప్పగించింది. వివాదాస్పద అయోధ్య కేసులో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెల్లడించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ తీర్పును చదివి వినిపించారు. ఐదుగురు న్యాయమూర్తుల ఏకాభిప్రాయంతో ప్రధాన న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. వివాదాస్పద స్ధలం తమదే నంటూ షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. నిర్మోహి అఖాడా దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం తోసి పుచ్చింది. నిర్మోహి అఖారాకు వారసత్వ హక్కులు క్లెయిమ్‌ చేసే హక్కు లేదని తేల్చి చెప్పింది. చరిత్ర, మత పరమైన, న్యాయ పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరించినట్టు ప్రధాన న్యాయమూర్...

జగన్ ఆదా..జనం ఫిదా

చిత్రం
సందింటి జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎం అయ్యాక పాలనలో తనదైన ముద్ర అగుపించేలా చేస్తున్నారు. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు పరిచే పనిలో పడ్డారు. ఆయన తీసుకుంటున్న వన్నీ జనానికి ఆమోద యోగ్యాంగా ఉన్నాయి. దీంతో ప్రతి దానికీ ప్రజామోదం లభిస్తోంది. తాజాగా సీఎం తీసుకున్న డిసిషన్ ప్రభుత్వానికి మేలు చేకూరేలా జరిగింది.  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ వలంటీర్లు ప్రజలకు సేవలందించేందుకు 4జీ సిమ్‌ కార్డులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమలు చేయడంతో 33.77 కోట్ల ప్రజాధనం ఆదా అయింది. 4జీ సిమ్‌ పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌ ఓపెన్‌ మార్కెట్‌లో నెలకు 199 ఉండగా రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా కేవలం 92.04కే ఇచ్చేందుకు వీలు కలిగింది. అంటే ఒక్క సిమ్‌ కార్డుపై నెలకు దాదాపు 107 ఆదా అయింది. 4జీ సిమ్‌ కార్డులు 2,64,920 కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ ఫైనాన్స్‌ బిడ్‌ను ఓపెన్‌ చేసింది. ఈ టెండర్‌లో 4జీ పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌ మూడేళ్లకు 2,64,920 సిమ్‌లకు 121.54 కోట్లు కోట్‌ చేసిన ఒక సంస్థ ఎల్‌–1గా నిలించింది. దీనిపై ఏపీటీఎస్‌  రివర్స్‌ టెండరిం...

న్యాయాన్ని నిలబెట్టారు..చరిత్రలో నిలిచారు

చిత్రం
ఈ దేశంలో సామరస్యానికి ప్రతీకగా నిలిచారు అయోధ్య వివాదంలో కీలక తీర్పు చెప్పిన న్యాయమూర్తులు. కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో ఎంతో ఉత్కంఠకు తెరతీసిన ఈ సమస్యకు ఐదుగురు ఏక వాక్యంతో ఇచ్చిన తీర్పు ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసింది. ఇంకా న్యాయం బతికే ఉందని చాటి చెప్పారు. మరో వైపు తెలంగాణాలో సుదీర్ఘమైన పోరాటం చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచారు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్. ఇదో కీలక పరిణామం. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ దీనికి సారథ్యం వహించగా, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌ ఈ తీర్పును వెలువరించారు. వ్యవహారాన్ని ఒక స్థల వివాదంలా చూసిన ధర్మాసనం, స్థలం ఎవరికి చెందుతుందనే తీర్పు నిచ్చింది. ఈ ధర్మాసనానికి నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గొగోయ్‌. 1954 నవంబర్‌ 18వ తేదీన జన్మించారు. 1978లో గౌహతి బార్‌ కౌన్సిల్‌లో చేరి గౌహతి హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 2001లో గౌహతి హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2010లో పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తి...

భీష్మ సెన్సేషన్..ఫ్యాన్స్ పరేషాన్

చిత్రం
ఇప్పుడు ఎక్కడా విన్నా, చూసినా యంగ్‌ హీరో నితిన్‌ భీష్మ సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ గురించే చర్చ జరుగుతోంది. ఛలో ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌, రష్మికా హీరో హీరోయిన్లుగా తెర కెక్కుతున్న చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ కుర్రకారును పిచ్చెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ బర్త్‌డే సందర్బంగా భీష్మ మూవీ ఫస్ట్‌ గ్లింప్స్‌ పేరిట టీజర్‌ రిలీజ్‌ చేసింది. ప్రస్తుతం ఈ టీజర్‌ ట్రెండింగ్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉండటంతో పాటు ఇప్పటికే నాలుగు మిలియన్‌ వ్యూస్‌ను రాబట్టింది. నితిన్‌ యాటిట్యూడ్‌కు తోడు రష్మికా క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ యూత్‌ ముఖ్యంగా లవర్స్‌కు తెగ కనెక్ట్‌ చేసేలా చేశాయి. ఇక భీష్మ పస్ట్‌ గ్లింప్స్‌ వస్తున్న ఆధరణతో చిత్ర యూనిట్‌ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా హీరో నితిన్‌ ట్విటర్‌ వేదికగా కృతఙ్ఞతలు తెలిపాడు. కాగా, చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ..మా గురుజీ త్రివిక్రమ్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘భీష్మ’ మూవీ ఫస్ట...

ఎస్పీజీ సేవలకు సోనియా థ్యాంక్స్

చిత్రం
సోనియా గాంధీ తనలోని మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. సుదీర్ఘకాలం పాటు తమకు భద్రత కల్పించినందుకు గానూ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూపు డైరెక్టర్‌ అరుణ్‌ కుమార్ సిన్హాకు కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ ధన్యవాదాలు తెలిపారు. 28 ఏళ్లుగా ప్రతి రోజూ తాము సురక్షితంగా ఉండటంలో ఎస్పీజీ సభ్యులు చేసిన కృషి మరువ లేనిదన్నారు. ఈ మేరకు అరుణ్‌ కుమార్‌కు సోనియా లేఖ రాశారు. ఎస్పీజీ ప్రతిభా వంతమైన దళం. ఇందులోని సభ్యులు ఎంతో ధైర్యవంతులు. వారు చేసే ప్రతి పనిలోనూ దేశభక్తి కన్పిస్తుంది. మా కుటుంబ రక్షణను ఎస్పీజీ చేతుల్లో పెట్టిన నాటి నుంచి సురక్షితంగా ఉంటామనే ధీమా కలిగింది. గత 28 ఏళ్లుగా ఎస్పీజీ సభ్యుల అంకితభావం, విధుల పట్ల వారి నిబద్ధత కారణంగా ప్రతీ రోజు మేము క్షేమంగా ఉన్నాం. ఇన్నేళ్ల పాటు మాకు రక్షణగా నిలిచినందుకు నా తరఫున, నా కుటుంబ సభ్యుల అందరి తరఫున ఎస్పీజీ గ్రూపు సభ్యులకు కృతఙ్ఞతలు తెలుపుతున్నాను. మీ అందరికీ అభినందనలు అని సోనియా లేఖలో పేర్కొన్నారు. కాగా దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ కుటుంబానికి కల్పిస్తున్న ఎస్పీజీ భద్రతను కేంద్ర ప్రభుత్వం తాజాగా తొలగించింది. ...

బాలయ్య లుక్స్ అదుర్స్

చిత్రం
తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ప్రత్యేకతలున్న నటుడు ఎవరైనా ఉన్నారంటే అతను ఒక్కడే బాలయ్య. తన తండ్రి నుంచి నటవారసత్వం కొనసాగిస్తున్న ఈ నటుడు డైలాగ్ డెలివరీ వెరీ వెరీ డిఫరెంట్ గా ఉంటుంది. తాజాగా ఆయన వెరీ యంగ్ గా అగుపిస్తున్నారు. లుక్స్ లో వెరీ స్టైలిష్ గా తన అభిమానులు విస్తు పోయేలా చేస్తున్నారు. కాగా బాలకృష్ణ హీరోగా తెర కెక్కుతున్న తాజా చిత్రం రూలర్. కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌, వేదికలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక​ ఈ సినిమాలో బాలయ్య స్టైలీష్‌ లుక్‌లో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ ఆకట్టు కోగా, దీపావళి సందర్భంగా రిలీజ్‌ అయిన చిత్ర పోస్టర్‌ అభిమానులను అలరిస్తోంది. తాజాగా బాలయ్య అభిమానులను మరోసారి సర్‌ప్రైజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. రూలర్‌లో బాలయ్యకు సంబంధించిన మరో లుక్‌ను విడుదల చేసింది. అంతే కాకుండా టీజర్‌ వెరీ సూన్‌ అంటూ పేర్కొంది. విడుదల చేసిన పోస్టర్‌లో బాలయ్య స్టెప్పు లేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్‌తో పాటు అతడు వేసుకున్న షూస్‌ ట్రెండీగా ఉన్నాయి. దీంతో ఈ సినిమా కోసం బాలయ్య తన రూపం, ఆహార్యం...

చారిత్రాత్మకం సుప్రీం తీర్పు సంచలనం

చిత్రం
దశాబ్దాల కాలం పాటు వివాదాలు, న్యాయస్థానాల మధ్య నలిగిన రామజన్మ భూమి, బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన తీర్పును వెల్లడించింది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామజన్మ భూమి న్యాస్‌కు అప్పగించాలని, అప్పటి వరకు ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని సంచలన తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో అయోధ్య యాక్ట్ కింద ట్రస్ట్ మూడు నెలల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలని సూచించింది. స్థలాన్ని సున్నీ బోర్డుకు ఇవ్వాలని ఆదేశించింది. భూ కేటాయింపునకు కేంద్రం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని తెలిపింది. 1993లో ప్రభుత్వం సేకరించిన స్థలంలో అయినా సున్నీ బోర్డుకు స్థలాన్ని కేటాయించవచ్చని పేర్కొంది. జస్టిస్ గొగోయ్, జస్టిస్ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం భిన్నా భిప్రాయాలకు తావు లేకుండా ఒకే తీర్పు ఇచ్చింది. షియా వక్ఫ్ బోర్డు, అఖాడా వాదనలను న్యాయస్థానం తోసి పుచ్చింది. యాజమాన్య హక్కులు కోరుతూ షియా వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది. వివాదాస్ప...

కదం తొక్కిన కార్మికులు..రెచ్చి పోయిన పోలీసులు

చిత్రం
చలో ట్యాంక్ బండ్ కార్యక్రమం మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. మరో మిలియన్ మార్చ్ ను తలపింప చేసింది.ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులు కదం తొక్కారు. బారికేడ్లను తోసుకుని ట్యాంక్‌ బండ్‌పైకి పరుగులు తీశారు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. భారీ సంఖ్యలో కార్మికులు తరలి రావడంతో వీరిని అడ్డు కోవడం పోలీసుల వల్ల కాలేదు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ప్రభుత్వం తమ కడుపు కొడుతోందంటూ కార్మికులు సర్కారుపై మండిపడ్డారు. మహిళా కార్మికులను అడ్డు కోవడంతో తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పోలీసులు, కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని గోషా మహల్ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు హిమాయత్ నగర్ లిబర్టీ వద్ద నుంచి వెళ్తున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప...