పోస్ట్‌లు

ఫిబ్రవరి 11, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

పూజాకు బిగ్ ఛాన్స్

చిత్రం
టాలీవుడ్‌లో ఉన్న‌ట్టుండి టాప్ పొజిష‌న్‌లోకి దూసుకు వ‌చ్చిన న‌టి పూజా హెగ్డేకు అరుదైన ఛాన్స్ ద‌క్కింది. ఇప్ప‌టికే ప‌లు చిత్రాలు భారీ విజ‌యాల‌ను అందుకున్నాయి. తెలుగు సినిమా రంగంలో పేరున్న న‌టులు మ‌హేష్ బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్ , త‌దిత‌రుల‌తో ఆమె న‌టించారు. అర‌వింద స‌మేత‌, మ‌హ‌ర్షి, అల వైకుంఠ‌పురంలో సినిమాలు ఊహించ‌ని రీతిలో సక్సెస్ అయ్యాయి. దీంతో ఆమె గ్రాప్ ఒక్క‌సారిగా పెరిగాయి. దీంతో ఆమెకు మ‌రింత డిమాండ్ పెరిగింది. భారీ ఎత్తున అవ‌కాశాలు వ‌చ్చినా ఆమె చాలా జాగ్ర‌త్త‌గా సినిమాల‌ను ఎంపిక చేసుకుంటున్నారు. అంతేకాకుండా త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకుంటున్నారు. మ‌రో వైపు అద్భుతంగా తెలుగులో పాట‌లు కూడా పాడ‌టం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో మంచి జోరు మీదుకున్న పూజా హెగ్డే కు బాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో ఉన్న స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని చేజిక్కించుకుంది ఈ అమ్మ‌డు. మ‌రో వైపు ఇటీవల ఆమె నటించిన ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బాస్టర్‌గా నిలవడంతో  ఈ ముద్దుగుమ్మకు వరుస పెట్టి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే స్టార్‌ హీరోలందరితో నటిస్తూ మోస్ట్‌ బిజ...

ఆప్‌కే ప‌ట్టం.. సామాన్యుడిదే రాజ్యం

చిత్రం
న‌రేంద్ర మోదీ మంత్రం ఫ‌లించ‌లేదు. ట్ర‌బుల్ షూట‌ర్ పాచిక‌లు పార‌లేదు. కేవ‌లం అభివృద్ధి మంత్రం మాత్ర‌మే జ‌పించిన ఒకే ఒక్క‌డు ..ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ మ‌రోసారి ఢిల్లీ పీఠంపై కూర్చోనున్నారు. ముచ్చ‌ట‌గా ఇది మూడోసారి. అనుకోని రీతిలో రాజ‌కీయాల్లోకి ఎంట‌రైన ఈ పరిపాల‌కుడు మ‌రోసారి తానేమిటో నిరూపించుకున్నాడు. ఇది నిజంగా విస్మ‌రించ‌లేని చరిత్ర అనే చెప్పుకోవాలి. కేంద్రంలో కొలువుతీరిన బీజేపీ ప్ర‌భుత్వం ఎలాగైనా స‌రే ఆప్ ను తుడిచి పెట్టాల‌ని శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నాలు చేసింది. అయినా ఆప్ దెబ్బ‌కు బీజేపీ సింగిల్ డిజిట్ కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. ఇక ఒంటిచేత్తో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్‌ను ధీటుగా ఎదుర్కొని కనీవినీ ఎరుగని రీతిలో మరోసారి బంపర్‌ విక్టరీ సాధించిన అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి బంపర్‌ మెజార్టీ రావడం, నేటితో అసెంబ్లీ కాలపరిమితి ముగియడంతో ఢిల్లీ శాసనసభను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ రద్దు చేశారు. త్వరలోనే కేజ్రీవాల్‌ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరను...