పోస్ట్‌లు

జూన్ 3, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

సంకీర్ణ స‌ర్కార్ సేఫ్ - ఫ‌లించిన దేవ‌గౌడ మంత్రాంగం

చిత్రం
క‌ర్ణాట‌క రాజ‌కీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా త‌గ్గి పోయేలా చేశారు..అప‌ర చాణుక్యుడిగా పేరొందిన మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌. గ‌త నాలుగు నెల‌లుగా ఏ క్ష‌ణంలోనైనా కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్ర‌భుత్వం కూలి పోవ‌చ్చ‌నే ఊహాగానాలు బ‌లంగా వినిపించాయి. ఆ దిశ‌గా మోదీ, షాలు ఆప‌రేష‌న్ కూడా స్టార్ట్ చేశారు. కేంద్రంలో థంబింగ్ మెజారిటీ రావ‌డంతో ఎట్టి ప‌రిస్థితుల్లోను బీజేపీ పావులు క‌దిపి..ప‌వ‌ర్ లోకి రావాల‌ని ప్ర‌య‌త్నాలు చేసింది. ఎందుక‌నో ఉన్న‌ట్టుండి ఆ ప్ర‌య‌త్నాల‌కు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. దీని వెనుక మాజీ ప్ర‌ధాని జేడీఎస్ అధినేత దేవెగౌడ చేసిన మంత్రాంగం కార‌ణంగానే మోదీ త‌న ఆప‌రేష‌న్ కు పుల్ స్టాప్ పెట్టార‌న్న వార్త‌లు గుప్పుమ‌న్నాయి. క‌ర్ణాట‌క స్టేట్‌లో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.37 స్థానాలు జేడీఎస్ స‌భ్యులుండ‌గా, 80 స్థానాలు క‌లిగిన కాంగ్రెస్ తో పాటు ఆరుగురు ఇండిపెండ్ల‌తో క‌లుపుకుని సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. దేవెగౌడ కుమారుడు కుమార స్వామి ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్నారు. ఆయ‌న చాలా సార్లు ఈ వ‌త్తిళ్ల‌ను భ‌రించ‌లేనంటూ..త‌న‌కు ఈ ప‌ద‌వి వ‌ద్దంట...

కేంద్ర స‌ర్కార్ నిర్ణ‌యంపై రాష్ట్రాలు గ‌రం గ‌రం

చిత్రం
ఇప్ప‌టికే ఇంగ్లీషు భాష మోజులో ప‌డిపోయిన భార‌తీయులు త‌ప్ప‌నిస‌రిగా హిందీని నేర్చుకోవాల‌న్న నిబంధ‌నను కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ నిర్ణ‌యంపై తీవ్ర వ్య‌తిరేకత వ్య‌క్త‌మ‌వుతోంది. త‌క్ష‌ణ‌మే ఈ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని కోరుతూ వివిధ రాష్ట్రాల్లో నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు ప్రారంభ‌మ‌య్యాయి. త‌మిళ‌నాడులో డిఎంకే అధినేత స్టాలిన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పీఎం మోదీకి. ఎట్టి ప‌రిస్థితుల్లోను తాము ఒప్పుకోబోమంటూ స్ప‌ష్టం చేశారు. త‌మ భాష త‌ర్వాతే ఏ భాష అయినా, మీరెవ్వ‌రు ..మీ పెత్త‌నం మా మీద ఏమిటంటూ ఆయ‌న నిప్పులు చెరిగారు. అంతేకాదు త‌మ భాష అస్తిత్వానికి భంగం క‌లిగించే రీతిలో నిర్ణ‌యాలు తీసుకుంటే రాబోయే రోజుల‌లో తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. హిందేయేత‌ర రాష్ట్రాల్లో హిందీ భాషా బోధ‌న త‌ప్ప‌నిస‌రి చేయాల‌న్న క‌స్తూరి రంగ‌న్ క‌మిటీ సిఫార‌సుల‌ను వివిధ రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది. చాలా చోట్ల మోదీకి వ్య‌తిరేకంగా త‌మిళులు ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల‌లో భాషాభిమానులు సైతం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికే మాతృభాష‌ను మ‌రిచి...

స‌మాజ హిత‌మే ల‌క్ష్యం..జ‌న‌రంజ‌క పాల‌నే ముఖ్యం

చిత్రం
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల చ‌రిత్ర‌లో ఊహించ‌ని రీతిలో అపూర్వ‌మైన జ‌నాద‌ర‌ణ పొంద‌ట‌మే కాకుండా థంబింగ్ మెజారిటీని సాధించి ప‌వ‌ర్‌లోకి వ‌చ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌న‌రంజ‌క పాల‌న వైపు అడుగులు వేస్తున్నారు. అప‌ర చాణుక్యుడిగా, జ‌గ‌మెరిగిన నేత‌గా , జాతీయ స్థాయిలో పేరొందిన చంద్ర‌బాబునాయుడుకు జీవితంలో కోలుకోలేని షాక్ ఇచ్చారు వైసీపీ అధినేత‌. ఎన్నో అవ‌మానాలు, దూష‌ణ‌లు ఎదుర్కొని..జైలు పాలైన జ‌గ‌న్‌..ఫీనిక్స్ ప‌క్షి లాగా తిరిగి త‌న ప‌వ‌ర్ ఏమిటో రుచి చూపించారు. త‌న తండ్రి నుంచి వార‌స‌త్వాన్ని..త‌న తాత రాజారెడ్డి నుంచి వ‌చ్చిన ధైర్యాన్ని పుణికి పుచ్చుకున్న ఈ యువ నాయ‌కుడు ఎన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కొన్నారు. అవ‌మానాల‌ను భ‌రించారు. ప్ర‌జా పోరాట యాత్ర‌ను చేప‌ట్టారు. ప్ర‌భుత్వం ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌కు పాల్ప‌డుతోందంటూ నిప్పులు చెరిగారు. ఆయ‌న జ‌నం మ‌ధ్య‌లోనే ఉన్నారు. అసెంబ్లీలో కంటే ఎక్కువ‌గా ప్ర‌జ‌ల‌తో క‌లిసి పోయారు. త‌న వ్యూహాల‌కు ప‌దును పెట్టారు. త‌న‌కంటూ ఓ న‌మ్మ‌క‌మైన టీంను ఏర్పాటు చేసుకున్నారు.  ట్ర‌బుల్ షూట‌ర్‌గా, ప‌క్కా స్ట్రాట‌జిస్ట్ గా..ప్లాన‌ర్‌గా పేరొందిన ప్ర‌శాంత్ కిషోర్ ఇచ్చిన సూచ‌న...