పోస్ట్‌లు

సెప్టెంబర్ 11, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

సోషల్ మీడియాలో మోదీ ప్రభంజనం..కొనసాగుతున్న హవా..!

చిత్రం
భారత దేశాన్ని తన గుప్పిట్లో ఉంచుకుని ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదరదాస్ మోదీ పాలనలో తనదైన ముద్రతో దూసుకు వెళుతున్నారు. మోదీ అండ్ అమిత్ షా టీమ్ ఇప్పుడు ఏది చెబితే అదే వేదం ..అదే చట్టం ..అదే శాసనం ..అదే రాజ్యాంగం కూడా. రెండవ సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ భారతీయ జనతా పార్టీ లో భిన్నంగా అడుగులు వేస్తున్నారు. ఈ దేశంలో మోదీకి ఉన్నంత ఫాలోయింగ్ ఇంకే నాయకుడికి లేదంటే అతిశయోక్తి కాదేమో. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మోదీ వాడుకున్నంతగా ఇంకే నాయకుడు, నాయకురాలు వాడు కోవడం లేదు ఇప్పుడు ఇండియాలో. మొదటి సారి అయన ప్రచారం మొత్తం సామాజిక మాధ్యమాలలో ఎక్కువగా సాగింది.  ఇందుకు తనకంటూ నమ్మకమైన టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారు మోదీ . నమో మోదీ అంటూ ప్రపంచం తన వైపు చూసుకునేలా చేసుకున్నారు ఈ పీఎం. ఒకప్పుడు రైల్వే స్టేషన్ లో టీ అమ్మిన మోదీ ఇప్పుడు 130 కోట్ల జనాభా కలిగిన అఖండ భారత దేశానికి దిశా నిర్దేశనం చేసే స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు ఆయన హవా నడుస్తోంది. ఎక్కడికి తాను వెళితే అక్కడ జనం పోగవుతున్నారు. ఓ వైపు అమెరికా ప్రెసిడెంట్ ఇలాగే సోషల్ మీడియాను ఓ సాధ...

వీడియో స్ట్రీమింగ్ సెక్టార్లో నువ్వా నేనా..!

చిత్రం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం కొత్త పుంతలు తొక్కుతూ రోజు రోజుకు ట్రెండ్స్ సృష్టిస్తూ ప్రపంచాన్ని విస్తు పోయేలా చేస్తోంది. డిజిటల్ రంగం కంపెనీలకు కాసులు కురిపిస్తోంది. దీంతో వ్యాపార రంగాలలో ఉన్న ఐటి సెక్టార్ తో ఎలాంటి సంబంధం లేని కంపెనీలు సైతం డిజిటల్ సెక్టార్ వైపు చూస్తున్నాయి. కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అంటున్నాయి. ఇదే రంగంలో స్టార్ట్ అప్ లకు, ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న వాటిని చేజిక్కించుకునేందుకు కంపెనీలు తహతహ లాడుతున్నాయి. స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ లోకి వచ్చాక గూగుల్ దిగ్గజ కంపెనీ తన హవాను కొనసాగిస్తున్నది. ఎప్పుడైతే ఈ దిగ్గజ కంపెనీ యూట్యూబ్ ను దక్కించుకుందో ఇక అప్పటి నుంచి ప్రపంచం చిన్న బోయేలా చేసింది. ప్రతి రోజుకు కోట్లాది వీడియోలు అప్ లోడ్ అవుతున్నాయి. ఏది కావాలనుకున్నా క్షణాల్లో చూసే వెసులుబాటును గూగుల్ తీర్చి దిద్దింది. ఇందు కోసం మరిన్ని సేవలు అందించేలా ఎప్పటికప్పుడు సాంకేతికతను జోడిస్తోంది. ఈ ఒక్క యూట్యూబ్ ద్వారా ప్రతి రోజు ట్రిలియన్ డాలర్లను కొల్లగొడుతోంది గూగుల్ . దీనికి పోటీగా నెట్ ఫ్లిక్స్  , అమెజాన్, వ్యూ , అమెజాన్ ప్రైమ్ వీడియో , లాంటివి అం...

తెప్పరిల్లిన తెలంగాణ .. హరీష్ గట్టెక్కించేనా..?

చిత్రం
తెలంగాణ ఉద్యమ రథానికి ఆయన ఇరుసుగా ఉన్నారు. మామ కేసీఆర్ కు నమ్మిన బంటుగా, కష్ట కాలంలో అండగా ఉంటూనే తనకంటూ ఓ ఇమేజ్ ను స్వంతం చేసుకున్నారు. అంతేకాకుండా ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వచ్చినా దానిని అధిగమించేలా ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఒకానొక దశలో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో నెంబర్ టూ గా ఉన్నారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పేరు తెచ్చుకున్న హరీష్ రావు కు మరో పేరుంది అదే ట్రబుల్ షూటర్. పార్టీ మొదటి నుంచి ఉన్న హరీష్ రావు మొదటి సారి మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. ఎంతో ప్రాధాన్యం కలిగిన నీటి పారుదల శాఖను చేపట్టారు. అక్కడ కూడా సక్సెస్ అయ్యారు. ఆయనకు ఏ పని అప్పగించినా దానిని విజయవంతం చేశారు. అదే సమయంలో రెండో సారి ఎన్నికల్లో అధికార పార్టీ మళ్ళీ పవర్ లోకి వచ్చింది. కానీ కొలువుతీరిన కేబినెట్లో పార్టీ అధినేత, మామ కేసీఆర్ అల్లుడు తన్నీరు కు చోటు కల్పించలేదు. అదే సమయంలో కొడుకు కేటీఆర్ కు పార్టీ కార్యనిర్వాహక పదవిని కట్టబెట్టారు. దీనిపై పార్టీలో , బయట అల్లుడిని కావాలనే పక్కన పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీనిని గమనించిన సీఎం హరీష్ కు కొత్తగా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో చోటిచ్చ...

ఎస్.బి.ఐ నిర్వాకం ఖాతాదారుల ఆగ్రహం..!

చిత్రం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీజి దెబ్బకు భారతీయ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. ప్రాధాన్యతా రంగాలు ఎప్పుడూ లేనంతగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. నోట్ల రద్దు తో దేశంలో సేవలు అందిస్తూ వస్తున్న ప్రభుత్వరంగ బ్యాంకులన్నీ దివాళా తీసేందుకు రెడీగా ఉన్నాయి. దీనికి తోడు జీఎస్టీ ఏర్పాటు చేయడంతో కోట్లాది మంది వ్యాపారస్తులు లబోదిబోమంటున్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తి గణనీయంగా పడి పోయింది. ఒకే ఒక్క నిర్ణయం కారణంగా మొత్తం ఆర్ధిక రంగమంతా ఇప్పుడు బేల చూపులు చూస్తోంది. మోదీ డెషిషన్ తో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లో భద్రంగా దాచుకున్న కోట్లాది రూపాయలను ఖాతాదారులు తీసేసుకున్నారు. డిజిటలైజేషన్ అంటూ గొప్పలు పోయిన కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ ఇచ్చారు జనం. అన్ని వ్యాపార సంస్థలు ఇప్పుడు ఆర్ధిక లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందోనని ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన మరింత నిరాశను కలుగ జేసింది. ఎన్నడూ లేనంతగా దేశ ఆర్ధిక వృద్ధి రేటు పడి పోయిందని, అందుకే ఉద్దీపన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆ ఒక్క ప్రకటనతో భారత షేర్ మ...

ఆధిపత్యం కోసం ఆరాటం - ఎందుకీ రాద్ధాంతం

చిత్రం
ప్రపంచంలోనే ఎనలేని ఇమేజ్  స్వంతం చేసుకున్న ఇండియన్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కు ఇప్పుడు కొత్త తలనొప్పులు చోటు చేసుకున్నాయి. సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కె ప్రసాద్ తీసుకున్న నిర్ణయాలపై మాజీ సారధి సునీల్ గవాస్కర్ తప్పు పట్టారు. దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. గవాస్కర్ చేసిన విమర్శలపై క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ సందర్బంగా ఎంపిక చేసిన టీమిండియా జట్టుపై వ్యతిరేకత రాలేదు. అయితే టోర్నీలో ఇండియా జట్టు టైటిల్ ఫెవరెట్ గా ఉన్నది. మన ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయక పోవడంతో సెమీ  ఫైనల్ లో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయింది.  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ప్రసాద్ తో పాటు ఎంపిక చేసిన వారిపై దేశమంతటా నిరసనలు మిన్నంటాయి. జట్టు కెప్టెన్ కోహ్లీ తో పాటు జట్టు కోచ్ గా ఉన్న రవిశాస్త్రి ని తప్పించాలని డిమాండ్ చేశారు. జట్టులో ఎంపిక చేసిన ఆటగాళ్లు సరైన వారు కాదని, పేలవమైన ప్రదర్శన చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు టోర్నమెంట్ సమయం లోనే సారధి కోహ్లీ , వైస్ కెప్టేన్ రోహిత్ శర్మ ల మధ్య ఆధిపత్య పోరు నడిచిందని అందుకే టీమిండియా లో ఇర...