పోస్ట్‌లు

జూన్ 17, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

మొబైల్ ఫుడ్ ట్ర‌క్స్ ను ప్రారంభించిన మారియ‌ట్ ఇంట‌ర్నేష‌న‌ల్

చిత్రం
ప్ర‌పంచం నివ్వెర పోయేలా మారియ‌ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ హోట‌ల్స్ సంస్థ ఇండియాలో కొత్త‌గా మొబైల్ ఫుడ్ ట్ర‌క్స్‌ను ప్రారంభించింది. ధ‌న‌వంతులు, ఐటీ దిగ్గ‌జాలు, కంపెనీలు, సంస్థ‌లు, వ్యాపార‌వేత్తలు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే హోట‌ల్స్‌ల‌లో మారియ‌ట్ ఒక‌టి. ఇందులో ఉండ‌డం అంటే అదో స్టేట‌స్ సింబ‌ల్‌గా భావిస్తారు చాలా మంది. జ‌నం అభిరుచులు మారాయి. ఇపుడంతా ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్స్ దే హ‌వా న‌డుస్తోంది. ఓ వైపు రితీష్ అగ‌ర్వాల్ ఓయోతో దిమ్మ తిరిగేలా  వ్యాపారాన్ని నిర్వ‌హిస్తూ..బిగ్ హోట‌ల్స్‌కు ద‌డ పుట్టిస్తుంటే.. మ‌రో వైపు మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు , కుటుంబాలు ఎక్కువ‌గా ఉండే భార‌త‌దేశాన్ని ఎంపిక చేసుకుంది ఈ బిగ్ ఇంట‌ర్నేష‌న‌ల్ హోట‌ల్ యాజ‌మాన్యం. వ్యాపారంలో ఎంతో ఉన్న‌త స్థానంలో ఉన్నా ..అంతిమంగా క‌స్ట‌మ‌ర్లే దేవుళ్లు అనాల్సిందే. వాళ్లు లేక పోతే వ్యాపారమే లేదు. ఏ సంస్థ‌కైనా..ఏ కంపెనీకైనా. మందు బాబులు, ప్రియుల కోసం ఆల్ రెడీ ఎక్క‌డ ప‌డితే అక్క‌డ బార్లు, రెస్టారెంట్లు, మ‌ద్యం దుకాణాలు, ప‌బ్‌లు ఉన్నాయి. రిసార్ట్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. రేవా పార్టీలు, డ్యాన్సులు, బారాత్‌లు, తాగ‌డాలు, ఊగ‌డాలు ఉన్నాయి. జాతీయ ర‌హ‌...

మ‌హిళాభివృద్ధి కోసం ప్ర‌త్యేక ప‌థ‌కాలు

చిత్రం
స‌మాజంలో స‌గభాగం మ‌హిళ‌ల‌దే. వారు లేకుండా ఈ ప్ర‌పంచాన్ని ఊహించుకోలేం. పున‌రుత్ప‌త్తిలో వారే కీల‌కం. కుటుంబం బాగు ప‌డాల‌న్నా..లేదా నాశ‌నం కావాల‌న్నా మ‌హిళ‌లే కీల‌కం. సంపాద‌న ప‌రంగా పురుషుల‌పై భారం వున్న‌ప్ప‌టికీ ఇంటిని చ‌క్క‌దిద్దేది ఆమెనే. ఆ వాస్త‌వం గుర్తిస్తే ఇన్ని ఇబ్బందులంటూ వుండ‌వు. క‌లిసి కాపురం చేసుకుంటే క‌ల‌త‌లు అన్న‌వి మ‌టుమాయ‌మై పోతాయి. అందుకే క‌లిసి వుంటే క‌ల‌దు సుఖం అన్నారు ఎప్పుడో పెద్ద‌లు. సినీ క‌వి అనంద‌మే జీవిత మ‌క‌రందం అని రాయ‌లేదా. గ‌తంలో మ‌హిళ‌లంటే చుల‌క‌న భావం ఉండింది. మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా స‌మాజం మార్పున‌కు లోన‌వుతూ వ‌చ్చింది. వారు కూడా మ‌గ‌వారితో అన్ని రంగాల్లో స‌మాన స్థాయిలో పోటీ ప‌డుతున్నారు. దిగ్గ‌జ కంపెనీల‌ను లాభాల బాట‌లో ప‌య‌నించేలా చేస్తున్నారు. ఛైర్మ‌న్లుగా, మేనేజింగ్ డైరెక్ట‌ర్లుగా, డైరెక్ట‌ర్లుగా, వ్యాపార వేత్త‌లుగా, ఐటీ ఎక్స్‌ప‌ర్ట్స్‌గా, ప్ర‌తి రంగంలో త‌మ‌దైన ముద్ర‌ను క‌న‌బ‌రుస్తూ స్ఫూర్తి దాయ‌కంగా నిలుస్తున్నారు.  కేవ‌లం మ‌హిళ‌ల కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నాయి. అపార‌మైన అ...

ప‌ల్లె నుంచి కేన్స్ ఫెస్టివ‌ల్ దాకా - క‌థ‌కు ద‌క్కిన గౌర‌వం - డొమ్నిక్ సంగ్మాకు స‌లాం

చిత్రం
ప‌దేళ్ల వ‌య‌సున్న‌ప్పుడు ఆ కుర్రాడు మొద‌టి సారిగా క‌ల క‌న్నాడు. అప్పుడే మిణుకు మిణుకుమంటూ టీవీని చూశాడు. అదో అద్భుతంలా అనిపించింది. ఒక రోజు రాత్రంతా మేల్కొన్నాడు. టీవీలో పెట్టిన సినిమాను చూశాడు. ఆ ఊరులో డ‌బ్బున్న‌ది ఒకే కుటుంబానికి . ఆ ఇంట్లోనే టీవీ వుంటుంది. అప్పుడే..ఏదో ఒక రోజు తాను సినిమా తీస్తాన‌ని నిర్ణ‌యించుకున్నాడు. త‌న క‌ల‌ను నిజం చేశాడు. అత‌డే మేఘాల‌య‌లోని గారో హిల్స్‌కు చెందిన డొమ్నిక్ సంగ్మా. ఇపుడు అత‌డు ప్రపంచంలోని పేరెన్నిక‌గ‌న్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో తాను తీసిన సినిమాకు అరుదైన అవార్డును అందుకున్నారు. ఇది క‌ళ్ల ముందు జ‌రిగిన క‌న్నీటి క‌థ‌.  క‌థ‌లు ఎట్లా రాస్తారు అంటూ ఖాద‌ర్ మోహియుద్దీన్ పుస్త‌కం రాసిన‌ప్పుడు క‌లిగిన సందేహం ఇపుడు క‌లుగుతోంది. అవును..క‌థ‌లు ఎట్లా పుడుతాయి. ప్ర‌తి క‌థ‌కు ప్రారంభం ..ముగింపు వుంటాయి. ప్ర‌తి ఒక్క‌రికి ఏదో క‌థ వుండే వుంటుంది.కానీ కొంద‌రు చెప్పుకోరు..ఇంకొంద‌రు చెప్ప‌టానికి ఇష్ట‌ప‌డ‌తారు. తేడా ఏమిటంటే చిన్న పాటి దూర‌మంతే. ఇక్క‌డే క‌ల‌లు వుంటాయి. క‌న్నీళ్లు వుంటాయి. వెచ్చ‌ని క‌బుర్లుంటాయి. కావాల్సింద‌ల్లా ఆ స‌న్నివేశాల‌కు అనుగుణంగా పో...

ఆన్‌లైన్‌లో శిక్ష‌ణ‌..ఎంట్ర‌న్స్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్

చిత్రం
ఇంజ‌నీరింగ్, మెడిసిన్ త‌దిత‌ర ఎంట్ర‌న్స్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ కావాలంటే ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది ఇండియాలో. చ‌దువు కోవ‌డం అంటే ఇప్పుడు మ‌నల్ని మ‌నం అమ్ముకోవ‌డం అన్న స్థాయికి చేరుకుంది. కేజీ నుండి పీజీ చ‌ద‌వాలంటే లెక్క‌లేనంత ఖ‌ర్చు. గ‌వ‌ర్న‌మెంట్ ఫీజులు మోయ‌లేని భారంగా త‌యారైతే..ప్రైవేట్ విద్యా సంస్థ‌ల ఫీజులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఐటీ సెక్టార్ పుణ్య‌మా అంటూ ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన‌లేని క్రేజ్ ఉండ‌డంతో ..ఆ రంగానికి సంబంధించిన కోర్సుల‌కు విప‌రీత‌మైన డిమాండ్ ఏర్ప‌డింది. క‌నీసం ఏడాదికి మినిమం 10 ల‌క్ష‌ల నుండి 20 ల‌క్ష‌ల దాకా ఖ‌ర్చ‌వుతోంది.  వీరి ఇబ్బందుల‌ను గ‌మ‌నించారు ముగ్గురు ఐఐటియ‌న్స్  పులికిత్ జైన్, వంశీ క్రిష్ణ‌, ఆనంద్ ప్ర‌కాశ్. లైవ్‌ ట్యూట‌ర్ పేరుతో వేదాంతు అంకుర సంస్థ‌ను ఏర్పాటు చేశారు. అంతా ఆన్‌లైన్‌లోనే ఉచితంగా బోధ‌న వుంటుంది. అక్క‌డిక‌క్క‌డే ఎక్స్‌ప‌ర్ట్స్‌తో మీ సందేహాలకు స‌మాధానం దొరుకుతుంది. దీంతో టైం సేవ్ అవుతుంది. ఖ‌ర్చు బెడ‌ద త‌ప్పుతుంది. వేదాంత ప్ర‌త్య‌క్ష శిక్ష‌ణ ద్వారా మొద‌ట‌గా 30 మంది స్టూడెంట్స్‌తో ప్రారంభ‌మైన ఈ సంస్థ ఇపుడు 15 వేల...

జెట్ ఇంజ‌న్స్ కోసం..ఇండిగో 20 బిలియ‌న్ల డీల్

చిత్రం
భార‌తీయ విమాన‌యాన రంగంలో ఇండిగో మెల మెల్ల‌గా త‌న వ్యాపారాన్ని విస్త‌రించుకుంటూ వెళుతోంది. త‌క్కువ ధ‌ర‌కే విహంగ వీక్ష‌ణం క‌లిగించేలా..ప్ర‌యాణికుల మ‌న‌సు దోచుకునేలా ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తోంది. ఇటీవ‌లే స‌మ్మ‌ర్ సేల్స్ పేరుతో భారీ ప్ర‌క‌ట‌న‌లు గుప్పించింది. ఇత‌ర విమాన‌యాన సంస్థ‌ల నుండి పోటీని త‌ట్టుకునేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు త‌న వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది ఆప‌రేష‌న్స్ టీం. దేశీయంగా త‌క్కువ ఫేర్స్‌ను ఈ సంస్థ నిర్ణ‌యించింది. మార్కెట్‌లో స్టేబుల్‌గా ఉండేలా చూసుకుంటోంది. స్లోగా మూవ్ అవుతూ..మ‌రింత బ‌ల‌ప‌డేందుకు చ‌ర్య‌లు చేప‌డుతోంది. దేశీయంగా చూస్తే కొత్త విమానాశ్ర‌యాలు ఏర్పాట‌య్యాయి.  ఆయా ప్రాంతాల‌కు వ్యాపార ప‌రంగా , ఇత‌ర ప‌నుల నిమిత్తం వేలాది మంది ఇండియాలోని స్టేట్స్‌తో పాటు ఇత‌ర దేశాల‌కు ప్ర‌యాణం చేస్తూనే వుంటారు. ప్ర‌యాణికుల అవ‌స‌రాలు, అభిరుచుల‌కు అనుగుణంగా ఆయా దేశీయ‌, విదేశీ ఎయిర్‌లైన్స్‌లు విమానాలు న‌డుపుతుంటాయి. ఫ్ల‌యిట్స్‌ను నిర్వ‌హించ‌డం, ప్ర‌యాణికుల‌ను చేర‌వేయ‌డం చాలా రిస్క్ తో కూడుకున్న ప‌ని. ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో వీటి నిర్వ‌హ‌ణ క‌...

వాల్‌మార్ట్ సిటిఓగా ఇండియ‌న్

చిత్రం
అమెరికా ఈకామ‌ర్స్ దిగ్గ‌జ కంపెనీగా పేరొందిన వాల్ మార్ట్ కంపెనీకి ఇండియాలోని చెన్నైకి చెందిన ఐఐటియ‌న్ సురేష్ కుమార్ సిటిఓగా ఎంపిక‌య్యారు. ఐఐటి మ‌ద్రాస్‌లో చ‌దివారు. గ‌తంలో గూగుల్ లో వైస్ ప్రెసిడెంట్‌గా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం అమెజాన్ కంపెనీలో ఉద్యోగిగా ఉన్నారు. ఈ కామ‌ర్స్ బిజినెస్‌లో టాప్ వ‌న్ కంపెనీగా వాల్ మార్ట్ కొన‌సాగుతోంది. గూగుల్‌లో ప‌నిచేస్తున్న స‌మ‌యంలో సురేష్ కుమార్ ..జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌గా సేవ‌లందించారు. డిస్ ప్లే, వీడియా, యాప్ అండ్ అన‌లిటిక్స్ ను డెవ‌ల‌ప్ చేశారు. ఐఐటి-మ‌ద్రాస్‌లో ప్ర‌తిభ క‌లిగిన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. గూగుల్ లో చేరాక‌..ఎగ్జిక్యూటివ్‌గా, చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్‌గా , చీఫ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్‌గా స‌మ‌ర్థ‌వంతంగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ఐఐటీలో బీటెక్ పూర్తి చేశాక‌, ప్రిన్‌సెంట‌న్ యూనివ‌ర్శిటీలో పీహెచ్‌డీ పొందారు. వాల్‌మార్ట్‌లో సిటిఓగా సురేష్ కుమార్ చేర‌డం వ‌ల్ల త‌మ కంపెనీకి అద‌న‌పు బ‌లం చేకూరిన‌ట్ల‌యింద‌ని నిర్వాహ‌కులు వెల్ల‌డించారు. ఆయ‌న నేరుగా సిఇఓ డౌగ్ మాక్ మిల్ల‌న్‌కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వ‌చ్చే నెల జూలైలో కాలిఫోర్నియాలోని త‌మ క...

పేద‌ల పాలిట దేవుడు ఈ క‌లెక్ట‌ర్ - జ‌నం చెంత‌కు బైక్ అంబులెన్స్‌లు

చిత్రం
కొంద‌రు క‌లెక్ట‌ర్లు అధికార ద‌ర్పాన్ని చెలాయిస్తుంటే..మ‌రికొంద‌రు ఐఏఎస్‌లు మాత్రం పేదల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. అలాంటి వారిలో చెప్పుకోవాల్సింది ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రంలోని క‌బీర్‌ధాం జిల్లా క‌లెక్ట‌ర్ గా ప‌నిచేస్తున్న అవ‌నీష్ శ‌ర‌న్ గురించి. ఆదివాసీలు, గిరిజ‌నులు అత్య‌ధికంగా ఈ ప్రాంతంలో నివ‌సిస్తున్నారు. వారు అత్యంత పేద‌లు. రెక్కాడితే కానీ డొక్కాడ‌ని ప‌రిస్థితుల్లో బ‌తుకుతున్నారు. వీరిలో అత్య‌ధికంగా రోగ‌పీడిత బాధితులే. ఎక్క‌డికైనా వెళ్లాలంటే చికిత్స కోసం..కొన్ని మైళ్ల దూరం వెళ్లాల్సిందే.  ద‌గ్గ‌ర‌లో ఆస్ప‌త్రులు లేవు. ర‌వాణా సౌక‌ర్యాలు అంతంత మాత్ర‌మే. దీంతో చికిత్స త‌డిసి మోపెడంత అవుతుంది. చూయించు కోవాలంటే అప్పులు చేయాల్సిందే. దీంతో విష‌య తీవ్ర‌త‌ను క‌లెక్ట‌ర్ శ‌ర‌న్ గ‌మ‌నించారు. ఏం చేస్తే వీరికి త‌క్కువ ఖ‌ర్చులో వైద్య సేవ‌లు అందించ‌వ‌చ్చో సీరియ‌స్‌గా ఆలోచించారు. అందులోంచి వ‌చ్చిందే బైక్ అంబులెన్స్ . వంద‌లాది బైక్ అంబులెన్స్‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న ఏర్పాటు చేశారు. ప్రాథ‌మికంగా ఆయా గుడిసెల్లో నివాసం వుంటున్న వారితో పాటు ఇత‌రుల గ‌డ‌ప‌ల వ‌ద్ద‌కే ఈ...