పోస్ట్‌లు

ఏప్రిల్ 15, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

విమానాలు ఎగిరేనా..జెట్ కుదురుకునేనా..!

చిత్రం
భార‌తీయ విమాన‌యాన రంగంలో రెండో అతిపెద్ద ఎయిర్‌వేస్ సంస్థ‌గా పేరున్న జెట్ ఎయిర్‌వేస్ ఇపుడు గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. ముంబ‌యి కేంద్రంగా ఈ సంస్థ త‌న కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హిస్తోంది. దాదాపు 20 వేల మందికి పైగా ఈ సంస్థ‌నే న‌మ్ముకుని ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. ఉన్న‌ట్టుండి విమాన స‌ర్వీసుల‌ను నిలిపి వేయ‌డంతో ప్ర‌యాణికుల‌తో పాటు సిబ్బంది ఆందోళ‌న‌కు గుర‌య్యారు. అస‌లు సంస్థ‌ను గ‌ట్టెక్కించేందుకు యాజ‌మాన్యం ఎలాంటి ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదంటూ బాధితులు ల‌బోదిబోమంటున్నారు. జెట్ స్పీడ్‌తో స్టార్టింగ్‌లో ప్రారంభ‌మైన జెట్ ఎయిర్ వేస్ ఇపుడు ఎగ‌ర‌లేక చతికిల‌ప‌డింది. అత్య‌వ‌స‌రంగా నిధులు ఇవ్వ‌గ‌లిగితే కొంత‌లో కొంతైనా సంస్థ గ‌ట్టెక్క‌గ‌ల‌దంటూ విమాన‌యాన రంగానికి చెందిన వారు భావించారు. కానీ సంస్థ క‌థ మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. ప్ర‌స్తుతం జీతాలు ఇచ్చుకోలేని స్థితికి దిగ‌జారిన జెట్ ఎయిర్ వేస్ అంత‌ర్జాతీయ స‌ర్వీసుల‌ను నిలిపి వేసింది. కంపెనీ బోర్డు రుణ‌దాత‌ల నుండి సానుకూల స్పంద‌న ల‌భిస్తుంద‌ని ఆశించిన వారికి పాజిటివ్ సిగ్న‌ల్ రాలేదు. దీంతో సంస్థ మ‌నుగ‌డపై నీలి నీడ‌లు న‌మ్ముకున్నాయి. క...

సుప్రీం ధ‌ర్మాస‌నం సీరియ‌స్ - వీళ్లు ప్ర‌జాప్ర‌తినిధులేనా - ఈసీకి ఝ‌ల‌క్

చిత్రం
కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం ఝ‌ల‌క్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఆయా పార్టీల‌కు చెందిన నేత‌ల వ్య‌వ‌హార శైలిపై ఇంత‌వ‌ర‌కు ఎందుకు నాన్చుడు ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తున్నారంటూ ప్ర‌శ్నించింది. అంతేకాకుండా మాట‌ల‌తో మంట‌లు రేపి ప్ర‌జ‌ల మ‌ధ్య విద్వేషాలు రెచ్చ‌గొట్టి ..ఓట్లు కొల్లగొట్టాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్న స‌ద‌రు పార్టీ నేత‌లు, అధిప‌తుల‌పై చ‌ర్య‌లు ఎందుకు చేప‌ట్ట‌లేదంటూ నిల‌దీసింది. అస‌లు ఎన్నిక‌ల సంఘం త‌న బాధ్య‌త‌ల‌ను విస్మ‌రించ‌డం వ‌ల్ల‌నే ఇలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృత‌మ‌వుతున్నాయ‌ని..ప్ర‌తి దానికి న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించ‌డం అల‌వాటై పోయింద‌ని ఘాటైన వ్యాఖ్య‌లు చేసింది. కేంద్రంలో, రాష్ట్రంలో పాల‌న సాగిస్తున్న ప్ర‌భుత్వాలు చూసీ చూడ‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం, ఎన్నిక‌లు నిర్వ‌హించే బాధ్య‌త‌ను భుజాన వేసుకున్న ఈసీ నిమ్మ‌కుండి పోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. విద్వేష పూరిత‌మైన ప్ర‌సంగాలు చేస్తుంటే ఎలా ఊరుకున్నార‌ని మండిప‌డింది. ఎన్నిక‌ల సంఘానికి ఎలాంటి హ‌క్కులు ఉన్నాయో తెలుసా అని ప్ర‌శ్నించింది. వీలైతే మ‌రోసారి రాజ్యాంగాన్ని చ‌ద‌వాల‌ని సూచించింది. ...

లోక‌ల్ వార్‌కు రంగం సిద్ధం - ఇక పంచాయ‌తీ షురూ - మంత్రులే కింగ్ మేక‌ర్లు

చిత్రం
ప‌క్కా ప్ర‌ణాళిక‌తో తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత‌..ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు పార్టీ శ్రేణుల‌ను దిశా నిర్దేశ‌నం చేస్తున్నారు. ప‌రిపాల‌న‌ను ప‌రుగులు పెట్టిస్తూనే ..కింది స్థాయి నుంచి పై స్థాయి వ‌ర‌కు ఉన్న పార్టీ కేడ‌ర్ లో జోష్ నింపుతున్నారు. ఇప్ప‌టికే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య బావుటా ఎగుర‌వేసిన ఎమ్మెల్యేల‌ను ఆయ‌న ప్ర‌త్యేకంగా అభినందిస్తూనే ..పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి పార్టీ స‌త్తా ఏమిటో చూపించాల‌ని ఆదేశించారు. ఆ మేర‌కు కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు , మంత్రులు అంతా ఒక్క‌టై ఆయా పార్ల‌మెంట‌రీ స్థానాల్లో బ‌రిలోకి దిగిన ఎంపీ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ధ‌తుగా ప్ర‌చారం చేశారు. దీంతో అంత‌ర్గ‌త నివేదిక‌లు తెప్పించుకున్న కేసీఆర్ మొత్తం 17 పార్ల‌మెంట్ స్థానాల్లో మిత్ర‌ప‌క్షంగా ఉన్న ఎంఐఎంకు త‌ప్ప మిగ‌తా 16 సీట్ల‌లో గులాబీ జెండా రెప‌రెప‌లాడాల‌ని ఆదేశించారు. పోలింగ్ రోజున కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినా ఆ త‌ర్వాత అంతా స‌ర్దుకుంది. ఎన్నిక‌లు ప్రశాంతంగా ముగిశాయి. ఫ‌లితాలు వెల్ల‌డి అయ్యేందుకు కొన్ని రోజులు ఉండ‌డంతో పార్టీ ప‌రంగా విస్తృత స‌మావేశం ఏర్పాటు చేశా...

అబ్బా మ‌ళింగ దెబ్బ‌..బెంగ‌ళూరుకు షాకిచ్చిన ముంబై

చిత్రం
ఇండియ‌న్ క్రికెట్ జ‌ట్టు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విరాట్ కొహ్లి క‌థ మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. వ‌రుస‌గా అప‌జ‌యాల‌ను మూట‌గ‌ట్టుకుని కేవ‌లం ఒక్క మ్యాచ్ విన్నింగ్‌తో ఊపిరి పీల్చుకున్న బెంగ‌ళూరు జ‌ట్టుకు మ‌ళ్లీ దెబ్బ ప‌డింది.ముంబై జ‌ట్టుతో జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బోల్తా ప‌డింది. ప్రారంభంలోనే డికాక్..ఆఖ‌రులో హార్దిక్ పాండ్యా..అద్భుతంగా ఆడ‌డంతో ఆ జ‌ట్టు సునాయ‌సంగా గెలుపొందింది. రాయ‌ల్ ఛాలంజ‌ర్స్ బెంగ‌ళూరు బౌల‌ర్లు మొద‌ట్లో ఆశ‌లు పెంచినా..చివ‌ర్లో చ‌తికిల‌ప‌డ్డారు. ఈ టోర్నీలో ముచ్చ‌ట‌గా ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే..ఒక్క మ్యాచ్ విజ‌యంతో స‌రిపెట్టుకుంది కోహ్లి సేన‌. దీంతో ప్లే ఆఫ్ ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. 26 బంతులు మాత్ర‌మే ఆడిన డికాక్ 5 ఫోర్లు రెండు భారీ సిక్స‌ర్ల‌తో 40 ప‌రుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా మ‌రోసారి త‌న బ్యాటింగ్ ప‌వ‌ర్ ఏమిటో ఫ్యాన్స్ కు చూపించాడు. కేవ‌లం 16 బంతులు మాత్ర‌మే ఆడిన పాండ్యా 5 ఫోర్లు ..2 సిక్స‌ర్ల‌తో 37 ప‌రుగులు చేసి ముప్పు తిప్ప‌లు పెట్టాడు. ముందుగా బ్యాటింగ్‌కు చెందిన బెంగ‌ళూరు జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 171 ప‌రుగులు చేసింది. డివిలియ‌ర్స్ 51 బం...

పాల ఉత్ప‌త్తుల‌తో 15 వంద‌ల కోట్ల వ్యాపారం..ఓ మ‌హిళ సాధించిన అపూర్వ విజ‌యం

చిత్రం
పాల వ్యాపారం అంటేనే మ‌నం చుల‌క‌న‌గా చూస్తాం. మ‌నం పెరిగిన వాతావ‌ర‌ణం..మ‌న తీరే అంత‌. కానీ అదే పాల ఉత్ప‌త్తుల‌తో ఏకంగా 1500 కోట్ల ట‌ర్నోవ‌ర్ సాధించింది ఓ మ‌హిళే అంటే న‌మ్మ‌గ‌ల‌మా. కానీ న‌మ్మాలి. ఇది ఓ మ‌హిళ సాధించిన వ్యాపార విజ‌య గాథ‌. అక్షాలీ షా ఈ పేరు ప్ర‌పంచ దిగ్గ‌జాల‌ను ఆశ్చ‌ర్య పోయేలా చేసింది. ఇది ప్ర‌తి ఒక్క‌రు తెలుసు కోవాల్సిన ప్ర‌త్యేక క‌థ‌. త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌ను అడ‌గ‌టం మామూలే..మీరు పెద్దాయ్యాక ఏమ‌వుతార‌ని..అలాగే షాను కూడా ఆమె తండ్రి అలాగే అడిగాడు. కానీ ఆమె నుండి ఊహించ‌ని స‌మాధానం వ‌చ్చింది. అదేమిటంటే ఏదో ఒక‌రోజు కోట్లాది రూపాయ‌లు సంపాదించి పెడ‌తా. నీకు మంచి పేరు తీసుకు వ‌స్తానంది షా. చెప్ప‌ట‌మే కాదు చేసి చూపించింది ఈ 26 ఏళ్ల అమ్మాయి. కాస్తంత డ‌బ్బులు స‌మ‌కూరితే ..జేబుల్లోకి వ‌స్తే స్మార్ట్ ఫోన్ల‌లో కాలాన్ని..లైఫ్‌ను కోల్పోతున్న నేటి త‌రం ఈ అమ్మాయి సాధించిన స‌క్సెస్ ను చూసి స్ఫూర్తి పొందాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. కేవ‌లం పాల‌తో త‌యారు చేసిన ఉత్ప‌త్తుల‌ను అమ్మ‌డం ఆమె తండ్రి ప్ర‌ధాన వ్యాపారం. ప‌ర‌గ్ మిల్క్ ఫుడ్స్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. భార‌తీయ మార్కెట్‌లో ...

ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీకి టీం ఇండియా డిక్లేర్

చిత్రం
భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు రాబోయే ప్ర‌పంచ క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్‌లో పాల్గొనే ఇండియ‌న్ క్రికెట్ జ‌ట్టును ఎట్ట‌కేల‌కు ఉత్కంఠ కు తెర తీస్తూ ప్ర‌క‌టించింది. ముంబైలోని బీసీసీఐ క్రికెట్ సెంట‌ర్‌లో ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో బీసీసీఐ చీఫ్ సెల‌క్ట‌ర్ ఎంఎస్కే ప్ర‌సాద్ , టీం జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు కోచ్ ర‌విశాస్త్రి , ప‌లువురు ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. మొత్తం స‌మావేశం వాడి వేడిగా కొన‌సాగింది. ఎవ‌రిని ఉంచాలి..ఎవ‌రిని తీసి వేయాలి..ఎవ‌రికి అవ‌కాశం ఇవ్వాలి..ఏ ఫార్మాట్‌లో ఎవ‌రెవ‌రు ప‌నికి వ‌స్తారు అనే అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు. ఇప్ప‌టికే ఇండియ‌న్ సీనియ‌ర్ క్రికెట‌ర్స్ త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డిస్తూ వ‌చ్చారు. ఈసారి ఎలాగైనా ఇండియా వ‌ర‌ల్డ్ క్రికెట్ క‌ప్ ను ఎగ‌రేసుకు రావాల‌ని..భార‌తీయ జెండాను ప్ర‌పంచంలో ఎగుర వేసేలా చేయాల‌న్న‌దే బీసీసీఐ ల‌క్ష్యంగా పెట్టుకుంది. జ‌ట్టును ఎంపిక చేసేందుకు తీవ్ర వ‌త్తిళ్ల‌ను ఎదుర్కొన్నారు. మ‌రో వైపు కోహ్లి ..ర‌విశాస్త్రి ల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు. కోట్లాది క్రికెట్ అభిమానులు త‌మ క‌ల‌ల జ‌ట్ట...

లోకాన్ని ఆవిష్క‌రిస్తున్న ఐ స్టాక్ ఫోటో

చిత్రం
ప్ర‌పంచాన్ని ప‌రిచ‌యం చేయాలంటే చాలా స‌మ‌యంతో పాటు అప‌రిమిత‌మైన శ‌క్తి ..వ‌న‌రులు కావాలి. కానీ టెక్నాల‌జీ పుణ్య‌మా అంటూ అన్నీ మ‌న ముంగిట్లోనే వాలి పోతున్నాయి. మ‌న గుండెల్లో నిక్షిప్త‌మై పోయేలా ..మ‌న‌ల్ని వెంటాడేలా చేసేవి ..అంద‌మైన జీవితాన్ని ఆవిష్క‌రించే స‌న్నివేశాలు కేవ‌లం ఫోటలలో ప్ర‌తిఫ‌లిస్తాయి. దీనికంత‌టికి కెమెరాలు కావాలి. వాటిని తీసే నైపుణ్యం మ‌న‌కు ఉండాలి. ఒక్కో ఫోటోకు ఒక్కో క‌థ వుంటుంది. ప్ర‌తి దృశ్యం మ‌నల్ని నిద్ర‌లో సైతం ప‌ల‌క‌రిస్తాయి. అంత‌లా అవి మ‌న‌లో భాగ‌మై పోతాయి. గూగుల్, ఫేస్ బుక్, టంబ్ల‌ర్, ఇన్ స్టాగ్రాం , ఫ్లిక‌ర్ త‌దిత‌ర సామాజిక మాధ్య‌మాల‌లో రోజుకు మిలియ‌న్ల కొద్దీ ఫోటోలు అప్ లోడ్ అవుతున్నాయి. ప్ర‌తి ఫోటో బాగుండాల‌న్న నిబంధ‌న‌లేవీ లేక పోయిన‌ప్ప‌టికీ ..ప్ర‌తి ఫ్రేం ఒక్కో ఆలోచ‌న‌ను ఆవిష్క‌రించేలా చేస్తుంది. వ‌ర‌ల్డ్ వైడ్ గా జీవితాన్ని..ప్ర‌పంచాన్ని..స‌మాజాన్ని ప్ర‌తిఫ‌లించే ప్ర‌తి స‌న్నివేశాన్ని ఫోటోల‌లో బంధించి ..నిక్షిప్తం చేస్తే ఎలా వుంటుంద‌న్న ఆలోచ‌న‌ల్లోంచి పుట్టిందే ఐ -స్టాక్ . మిలియ‌న్ల కొద్దీ ఫోటోలు ఇందులో నిక్షిప్త‌మై పోయాయి. క్లిప్ ఆర్ట్, వీడియోస్...