పోస్ట్‌లు

ఆగస్టు 17, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

అక్బరుద్దీన్ దౌత్యం..పాక్ కు పరాభవం..నిను చూసి గర్విస్తోంది దేశం..!

చిత్రం
నిన్నటి దాకా చిలుక పలుకులు పలుకుతూ, భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్న దాయాది పాకిస్థాన్ కు అంతర్జాతీయ వేదికపైన పరాభవం తప్ప లేదు. తాను నమ్ముకున్న అమెరికా మౌనం వహిస్తే, ఒక్క చైనా తప్ప ఏ ఒక్క కంట్రీ పాక్ కు మద్దతు పలకలేదు. ఇస్స్యూ సీరియస్ కావడంతో ..అంతర్జాతీయ భద్రత సంస్థలో చర్చకు వచ్చింది. పాకిస్థాన్ ను ఒంటరి ప్రపంచలో ఒంటరి చేయడంలోనూ, దౌత్య పరంగా సక్సెస్ చేయడంలో ఒకే ఒక్కడు కీలక పాత్ర పోషించారు. అతడెవరో కాదు సయ్యద్ అక్బరుద్దీన్ . ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ లో శాశ్వత ప్రతినిధి గా , భారత రాయబారిగా ఉన్నారు. కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ తో పాటు దానికి వంత పాడిన చైనాకు పరాభవం జరిగేలా చేసాడు. ఇది తమ స్వంత వ్యవహారమని, వేరెవ్వరు ఇందులో జోక్యం చేసుకోలేరని స్పష్టం చేశారు సయ్యద్. దీనిపై ప్రపంచాన్ని తప్పు దోవ పట్టించే ప్రయత్నాలు మాను కోవాలని పాక్ ను హెచ్చరించింది. అంతర్జాతీయ వేదికపై తన గొంతును గట్టిగా, మరింత బలంగా వినిపించారు. ఆయన ప్రదర్శించిన దౌత్యం , దూకుడు భారతీయుల మనసు గెలుచుకుంది. టెర్రరిజాన్ని రూపు మాపేందుకు ప్రతి దేశం, దానిని పాలిస్తున్న పాలకులు కృషి చేయాలనీ పిలుపునిచ్చ...

డ్రోన్ కలకలం ..బాబు ఆగ్రహం

చిత్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసినా అధికార, విపక్షాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి విపక్ష నేతలు, నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగి పోయాయి . దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసే దాకా వెళ్ళింది. అయినా ఫలితం లేక పోగా,  కరకట్ట దగ్గర బాబు నివాసాన్ని కూల్చేందుకు జగన్ డిసైడ్ అయ్యారు. ఇటీవల భారీగా కురుస్తున్న వర్షాలకు చంద్రబాబు నివాసం దగ్గరి వరకు నీళ్లు వచ్చాయి. ఆయన కుటుంబం అప్పటికే హైదరాబాద్ కు మార్చేసింది. ఈ విషయం వైరల్ గా మారింది. మరో వైపు ప్రభుత్వం ఉన్నఫలంగా బాబుకు ఉన్న జెడ్ కేటగిరి భద్రతను కుదించింది. ఈ విషయంపై తెలుగు తమ్ములు కొందరు కోర్టుకు ఎక్కారు. దీనిపై విచారించిన ధర్మాసనం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరి కాదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే తొంబై మందితో కూడిన భద్రతను పునరుద్దరించాలని ఆదేశించింది. ఇప్పటికే ఆశా వర్కర్స్ రోడ్డెక్కరు. కాంట్రాక్ట్ సిబ్బంది తమను తొలగించ వద్దంటూ ఆందోళన బాట పట్టారు. పాలనపై కంటే ప్రతిపక్షాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాని టైం వెస్ట్ చేస్తున్నారంటూ టీడీపీ సీనియర్ నేతలు వ్యాఖ...

అధిపతి ఆగ్రహం..యాదాద్రి మరో తిరుపతి కావాల్సిందే..!

చిత్రం
ఈ దేశంలో ఆధ్యాత్మిక భావన కలిగిన ముఖ్యమంత్రులల్లో తెలంగాణా సీఎం కల్వకుంట్ల  చంద్ర శేఖర్ రావు ప్రథమ స్థానంలో నిలుస్తారు. అదీ ఆయన ప్రత్యేకత. ఎక్కడ గుడి కనిపిస్తే చాలు అక్కడికి తానే స్వయంగా వెళతారు. మొక్కులు తీర్చుకుంటారు. దర్శనం చేసుకుంటారు. మొదటి నుంచీ కేసీఆర్ దంపతులకు దైవం పట్ల నమ్మకం ఎక్కువ. వాసనలు రాక పోయినా, పాలన ప్రజలకు అందుబాటులో ఉండేలా, బంగారు తెలంగాణ దిశగా మార్చేలా, ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా ఆయన యజ్ఞ , యాగాలు చేస్తారు. పండితులను, పామరులను గౌరవిస్తారు. సన్మానిస్తారు. వారికి యెనలేని ప్రాధాన్యత ఇస్తారు. ఈ విషయంపై విపక్షాలు విమర్శలు చేసినా పట్టించు కోలేదు. తాను ఖర్చు చేసే ప్రతి పైసా తాను సంపాదించిన దానిలోంచే ఖర్చు చేస్తున్నానని, మీకెందుకు ఆ బాధ అంటూ సెటైర్స్ విసిరారు. కేసీఆర్ కు ముందు నుంచి యాదగిరిగుట్ట లో వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ్మ స్వామి అంటే యెనలేని అభిమానం. నమ్మకం కూడా. ఆలయానికి యాదాద్రి పేరు పెట్టారు. పూర్తిగా శాస్త్రోక్తంగా, ప్రపంచంలోనే ఏ ఆలయం లేని రీతిలో పునర్ నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. జగత్ గురువు శ్రీ శ్రీ శ్రీ రామానుజ చిన్నజీయర్ స్వామీజీకి కేసీఆర్ అపార...

వేతన జీవుల్లో గోద్రెజ్ సీయివో వివేక్ గంభీర్ టాప్

చిత్రం
భారత దేశంలో అత్యధిక వార్షిక వేతనం పొందుతున్న సీయివో లలో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నారు గోద్రెజ్ కంపెనీలో కన్స్యూమర్స్ సీయివో గా పని చేస్తున్న వివేక్ గంభీర్ కోట్లాది రూపాయల వార్షిక వేతనం తీసుకుంటూ చరిత్ర సృష్టించారు. 2018 - 2019 సంవత్సరానికి గాను ప్రకటించిన వేతనాలు తీసుకుంటున్న వారిలో ఆయనే ముందు వరుసలో నిలిచారు. తన పని తీరుతో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఏడాదికి వేతనంతో పాటు అన్ని వసతులు , సౌకర్యాలు కలుపుకుని 20 కోట్ల 9 లక్షలు తీసుకుంటున్నారు. హెచ్ యు ఎల్ కంపెనీకి చెందిన సీయివో సంజీవ్ మెహతా 18 .88 కోట్ల వేతనంతో రెండో స్థానంలో నిలిచారు. ఆయా కంపెనీలు తమ వార్షిక నివేదికల్లో పేర్కొన్న వివరాల ప్రకారం చూస్తే వీరిద్దరూ ఒకటి రెండో ప్లేస్ లో ఉన్నారు . ఎఫ్ ఎం సీజీ ప్రోడక్ట్స్ విభాగంలో హిందుస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్ , నెస్లే ఇండియా  ఉండగా గోద్రెజ్ కన్స్యూమర్స్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ , డాబర్ , మరికో , ఎమామి ప్రోడక్ట్స్ ను ఇండియాలో విక్రయిస్తోంది. ఈ లెక్కన ఈ ఆర్థిక సంవత్సరంలో గోద్రెజ్ సీయివో గంభీర్ ఏకంగా 20 కోట్ల 9 లక్షల 42 వేల 847 రూపాయలు జీతంగా తీసుకున్నారు . కంపెనీలో పనిచేస్తున్న 332 ...

గూగుల్ సెలెబ్రెటీ సన్నీ లియోన్

చిత్రం
ఇండియాలో మోస్ట్ పేవరబుల్ సెలెబ్రెటీ ఎవరని గూగుల్ లో వెతికితే , ప్రపంచంలో పోర్న్అ స్టార్ గా పేరొందిన సన్నీ లియోన్ టాప్ పొజిషన్ లో ఉండడం నెటిజన్లను విస్తు పోయేలా చేసింది. నెట్ కనెక్టివిటీ పెరగడం, సాంకేతికత అందుబాటు లోకి రావడం, దేనినైనా నిమిషాల్లో తెలుసుకునే వీలు కలగడంతో జనం దీని వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. జియో ఇండియాలో వచ్చాకా డేటా ఇచ్చి పుచ్చు కోవడం అన్నది జీవితంలో ముఖ్యమైంది. దీని నుంచి తప్పించు కోలేని పరిస్థితి నెలకొన్నది. కోట్లాది మంది ప్రతి రోజు సమాచారం కోసమో లేక వృత్తి విభాగాలలో ఇప్పటికే ఉన్నవారు, విద్యార్థులు , ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ , ఇలా ప్రతి ఒక్కరు గూగుల్ మీద ఆధార పడుతున్నారు. కేవలం సెకన్లలో మనకు కావలిసిన సమాచారాన్ని అందజేస్తుంది. స్మార్ట్ ఫోన్స్ వచ్చాక , ఆండ్రాయిడ్ ప్లాట్ ఫార్మ్ మీద అన్ని మొబైల్స్ పని చేస్తుండడం ..డేటా ఈజీగా వాడుకునే సౌలభ్యం కలగడంతో పిల్లల నుండి పెద్దల దాకా ఇందులోనే కాలక్షేపం చేస్తున్నారు. ప్రపంచం గురించి వదిలి వేస్తే, ఇండియాలో ఎక్కువగా యూత్ తో పాటు పెద్దలు కూడా ప్రతి రోజు బూతు ను చూడకుండా ఉండలేక పోతున్నారని ఓ సర్వేలో తేలింది . ఇది అత్యంత ప్రమాద...

ఆపన్నులకు నటుల కొండంత అండ

చిత్రం
దేశవ్యాప్తంగా వర్షాల తాకిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఒడిస్సా, కేరళ , కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , మహారాష్ట్ర , తదితర రాష్ట్రాలను వరదలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, తదితర నదులన్నీ పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి. ప్రమాద స్థాయిని దాటడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కర్ణాటకలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు భాదితులకు నిలువ నీడ లేకుండా పోయింది. దీంతో అక్కడి బీజేపీ సర్కార్ సహాయక చర్యలు చేపట్టింది, మరో వైపు తమిళ నాడులో కూడా వర్షాలు ఆశించినంత మేర పడ్డాయి. భారీ ఎత్తున వరద నీరు చేరడంతో ఎగువన ఉన్న ఆల్మట్టి , నారాయణ్ పూర్ జలాశయాలు నిండు కున్నాయి.  ప్రమాద స్థాయిని దాటడంతో కర్ణాటక నీటి పారుదల శాఖా అధికారులు దిగువన ఉన్న జూరాలకు నీటిని వదిలారు. మరో వైపు కృష్ణమ్మ పొంగి ప్రవహిస్తోంది. తుంగభద్ర కు భారీగా నీరు చేరుతోంది. అన్ని రాష్ట్రాలలో ప్రాజెక్టులు, ఎత్తి పోతల పథకాలు నిండి పోయాయి. కొన్ని నీట మునిగాయి. మరికొన్ని జలాశయాలు నిండడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ కు నీటిని వదులుతున్నారు. గోదారి ఉగ్ర రూపం దాల్చడంతో అక్కడ కూడా ప్రమాద హెచ్చరికలు జారే చేసారు . దిగువన ...

జాక్ పాట్ కొట్టేసిన అర్బన్ క్లాప్

చిత్రం
ఇప్పుడు ఇండియాలో స్టార్తప్ ల హవా కొనసాగుతోంది. వందలాదిగా అంకుర సంస్థలు పుట్టుకు వస్తున్నప్పటికిని, కొన్ని మాత్రమే సక్సెస్ అవుతుండగా మరికొన్ని ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఇంకొన్ని ఫెయిల్ అయ్యాయి. తాజాగా సేవల రంగంలో ఇప్పటికే టాప్ పొజిషన్ లో ఉన్న అర్బన్ క్లాప్ జాక్ పాట్ కొట్టేసింది. భారత దేశంలోని పలు నగరాలతో పాటు దుబాయ్ లో కూడా ఈ అంకుర సంస్థ తన వ్యాపారాన్ని విస్తరించింది. దీంతో పలు కంపెనీలు దీనిలో పెట్టుబడి పేట్టేందుకు ఉత్సుకత చూపిస్తున్నాయి. ఏకంగా 75 మిలియన్ల పెట్టుబడి అందుకుంటోంది ఈ సంస్థ. టైగర్ గ్లోబల్ దీనికి సపోర్ట్ గా నిలుస్తోంది. వైయి కేపిటల్ కూడా అర్బన్ క్లాప్ లో ఇన్వెస్ట్ చేయనుంది. ఇప్పటికే 185 మిళియన్లను సేకరించింది. పని చేసే వారిని ఒకే చోటుకు చేరుస్తుంది ఈ సంస్థ. కాలీనర్స్, మరమత్తు చేసే సిబ్బంది, వృత్తి నైపుణ్యం కలిగిన వారి కోసం ఆయా కంపెనీలు ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. అర్బన్ క్లాప్ లో తమ వివరాలు నమోదు చేసుకుంటే చాలు ఇక ఇబ్బందులు అంటూ వుండవు. బ్యూటీషియన్స్ కూడా వేలాది మంది ఇందులో ఇప్పటికే జాయిన్ ఆయారు. వినియోగదారులు 10 నగరాల్లో ఉన్నారు. మన సిటీసుతో పాటు దుబాయ్, అబుదాబి లో కూ...