పోస్ట్‌లు

ఏప్రిల్ 14, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

విరాళాల్లో బీఎస్పీనే టాప్ - మాయావ‌తా మ‌జాకా

చిత్రం
దేశంలో కార్పొరేట్ కంపెనీల‌న్నీ ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయ‌డం మామూలే. ఏ పార్టీనైనా కేంద్రంలో కానీ లేదా ఆయా రాష్ట్రాల‌లో కొలువుతీరితే..ఆయా సంస్థ‌లు, యాజ‌మాన్యాలు ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆయా పార్టీల‌కు మామూళ్లు లేదా విరాళాల రూపేణా ఇవ్వ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. దీంతో ఆర్థిక నేరాలు ఎక్క‌డ‌లేని విధంగా దేశ వ్యాప్తంగా పెరిగాయి. ఒక రకంగా చెప్పాలంటే నేర‌స్థులు..రాజ‌కీయ నాయ‌కులు..వ్యాపారులు ముగ్గురూ దేశాన్ని నియంత్రించాల‌ని చూస్తున్నారు. ఒక‌ర‌కంగా ప‌వ‌ర్లో ఎవ‌రున్న‌ప్ప‌టికిని వీరు చెప్పిందే శాస‌నంగా మారుతోంది. దీంతో బాబా సాహెబ్ అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం స్ఫూర్తికి విఘాతం క‌లుగుతోంది. ఒక పార్టీ గుర్తుతో పోటీ చేయ‌డం. గెలుపొందాక మ‌రో పార్టీలోకి జంప్ కావ‌డం మామూలై పోయింది. ఆయా పార్టీల‌కు చెందిన అధినేత‌లు, చోటా మోటా నాయ‌కులు వ్యాపార‌స్తుల‌ను , కంపెనీల‌ను టార్గెట్ చేయ‌డం ఇటీవ‌లి కాలంలో ఫ్యాష‌న్ గా మారింది. ఎందుకొచ్చిన తంటా అంటూ వ్యాపార‌స్తులు త‌మ‌కు తోచిన రీతిలో మామూళ్లు నెల‌నెల‌కు ..ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏక మొత్తంలో చెల్లిస్తూ వ‌స్తున్నారు. ఈ విష‌యంపై సుప్రీంకోర్టు తీవ్రంగా ప‌రిగ‌ణించింది. వ్య‌...

రుచిలో టాప్..ఆదాయంలో నెంబ‌ర్ వ‌న్ - కామ‌త్ హోట‌ల్స్ క‌హానీ

చిత్రం
భార‌తీయ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబంలోంచి వ‌చ్చిన కామ‌త్ ఇపుడు ప్ర‌పంచంలోనే గ‌ర్వించ‌ద‌గిన హోట‌ల్స్ య‌జ‌మానిగా చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని స్వంతం చేసుకున్నారు. ఇదో ప్ర‌పంచ రికార్డు. ఒకప్పుడు డ‌బ్బుల కోసం నానా ఇబ్బందులు ప‌డిన కామ‌త్ కుటుంబం ఇపుడు వేలాది మందికి ప్ర‌త్య‌క్షంగా..ప‌రోక్షంగా ఉపాధి చూపిస్తోంది. కోట్లాది రూపాయ‌లు రోజూ హోట‌ల్స్ ద్వారా స‌మ‌కూరుతున్నాయి. కొన్నేళ్లు గ‌డిచినా ఎలాంటి మార్పులు లేవు. క‌ష్ట‌మ‌ర్ల అభిరుచుల‌కు అనుగుణంగా హోట‌ల్స్‌ను ఏర్పాటు చేసుకుంటూ పోయారే త‌ప్పా ..నాణ్య‌త విష‌యంలో..సేవ‌లు అందించ‌డంలో కించిత్ తేడా క‌నిపించకుండా కాపాడుకుంటూ వ‌స్తోంది కామ‌త్ హోట‌ల్స్ యాజ‌మాన్యం. ఒక‌ప్పుడు చిన్న వీధి సందులో ఏర్పాటైన కామ‌త్ హోట‌ల్ ఇపుడు ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రించింది. త‌న బ్రాండ్‌ను కాపాడుకుంటూ వ‌స్తోంది. డ‌బ్బున్న వాళ్లు గొప్ప వాళ్లు అనుకునే స్థాయికి దిగ‌జారిన మ‌న‌కు విఠ‌ల్ కామ‌త్ క‌ళ్లు తెరిపించారు. భార‌తీయుల మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా..సంస్కృతి సాంప్ర‌దాయాల‌ను ప‌రిర‌క్షిస్తూ కామ‌త్ హోట‌ల్స్ న‌డుస్తున్నాయి. ఇది ఒక ర‌కంగా పాఠంగా నేర్చుకోవాల్సిన అవ‌స‌రం వున్న‌ది. ...

దుమ్ము రేపిన ఢిల్లీ..డీలా ప‌డిన హైద‌రాబాద్ ..!

చిత్రం
భారత మాజీ క్రికెట్ దిగ్గ‌జం గంగూలి మెంటార్‌గా ఉన్న ఢిల్లీతో జ‌రిగిన మ్యాచ్‌లో హైద‌రాబాద్ పేల‌వ‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించి అప‌జ‌యాన్ని కొనితెచ్చుకుంది. స‌న్ రైజ‌ర్స్ ముచ్చ‌ట‌గా మూడోసారి ఓట‌మిని మూట‌గ‌ట్టు కోవ‌డం విశేషం. ర‌బాడ‌, పాల్ , మోరిస్ విజృంబించ‌డంతో స‌న్ రైజ‌ర్స్ ఏ కోశాన ధీటుగా బ‌దులు ఇవ్వ‌లేక పోయింది. వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆ జ‌ట్టు ఏకంగా మ‌రో మూడు మ్యాచ్‌ల‌ను కోల్పోయింది. ఓపెన‌ర్లు బెయిర్ స్టో, వార్న‌ర్‌లను న‌మ్ముకున్న ఆ జ‌ట్టు ప్ర‌తిసారి జ‌రిగే మ్యాచ్‌లో చ‌తికిల ప‌డుతోంది. 39 ప‌రుగుల తేడాతో ఢిల్లీ ఘ‌న‌మైన విజ‌యాన్ని న‌మోదు చేసుకుని ..గెలుపుల్లో హ్యాట్రిక్ కొట్టింది. మ‌రోసారి బ్యాటింగ్ వైఫ‌ల్యం స‌న్ రైజ‌ర్స్ ను వెంటాడింది. ఎప్ప‌టిలాగే ఓపెన‌ర్లు డేవిడ్ వార్న‌ర్ కేవ‌లం 47 బంతులు ఆడి 51 ప‌రుగులు చేయ‌గా..ఇందులో మూడు ఫోర్లు, ఒక భారీ సిక్స‌ర్ ఉంది. మ‌రో కీల‌క ఆట‌గాడు జానీ బెయిర్ స్టో 31 బంతులు ఆడి 41 ప‌రుగులు చేసి జ‌ట్టు స్కోర్ పెంచాడు. అయిదు ఫోర్లు ..మ‌రో సిక్స‌ర్ సాయంతో ఈ ప‌రుగులు వ‌చ్చాయి. మొద‌ట బ్యాటింగ్‌కు దిగ‌న ఢిల్లీ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వి...

చెన్నై చంద్రమా ..గెలుపే మంత్రమా

చిత్రం
మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుసగా మరో విజయాన్ని నమోదు చేసింది . కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిని ఐపీఎల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది. మొదట కోల్ కత్తా జట్టు బ్యాట్టింగ్ చేయగా చెన్నై నిర్దేశించిన టార్గెట్ ను ఈజిగా ఛేదించింది . ఇరు జట్లు బలమైనవి కావడం తో మ్యాచ్ మరింత హీట్ పెంచుతుందని అనుకున్న ఫాన్స్ కు ఆట ఏకపక్షంగా సాగింది . దీంతో గెలుపు సునాయాసంగా చెన్నైకి లభించింది. మొత్తం మీద కోల్ కత్తా జట్టుపై రైనా ఆఫ్ సెంచరీ చేయడం ..రవీంద్ర జడేజా తోడుగా నిలవడంతో ఏడో విజయాన్ని నమోదు చేసింది . టార్గెట్ ను ఛేదించే క్రమంలో చెన్నై జ‌ట్టు ఆదిలోనే ఫాంలో వున్న షేన్ వాట్స‌న్, డుప్లిసిస్ , మ‌హేంద్ర సింగ్ ధోనీ , కేదార్ జాద‌వ్ లు త‌క్కువ ప‌రుగుల‌కే పెవీలియ‌న్ దారి ప‌ట్టారు. దీంతో మైదానంలో వున్న సురేష్ రైనా ఒక్క‌డే అద్భుత‌మైన ఫాంను క‌న‌బ‌ర్చి జ‌ట్టును విజ‌యపు అంచుల్లోకి తీసుకు వెళ్లాడు. కేవ‌లం 41 బంతులు ఆడి ఏడు ఫోర్లు, ఒక భారీ సిక్స‌ర్ సాయంతో 57 ప‌రుగులు చేశాడు. కోల్‌క‌త్తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు రైనా. సురేష...