పోస్ట్‌లు

జూన్ 6, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

అంపైర్ నిర్ణ‌యం - రేగిన దుమారం

చిత్రం
ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో విండీస్ దిగ్గ‌జ ఆట‌గాడు క్రిస్ గేల్ అవుట్ పై ఇచ్చిన అంపైర్ నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ డిసిష‌న్ ప‌లు అంశాల‌ను లేవ‌నెత్తింది. కోట్లాది క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా, ఉత్సుక‌త‌తో, ఉత్కంఠ‌తతో ఎదురు చూస్తూ వుంటారు. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది  రూపాయ‌ల బెట్టింగ్ జ‌రుగుతోంది. దీనిని నియంత్రించే వ్య‌వ‌స్థ లేక పోవ‌డంతో అది చాప‌కింద నీరులా విస్త‌రించింది. క్రికెట్ ఒక్క ఇండియానే కాదు ఆసియా, ఆఫ్రికా, యుఎస్, త‌దిత‌ర దేశాల‌కు పాకింది. 24 మంది పిచ్చివాళ్లు ఆడుతుంటే..మ‌రికొంది తిక్కోళ్లు చూసి ..కాలాన్ని వేస్ట్ చేస్తారంటూ అప్ప‌ట్లో కొంద‌రు కామెంట్స్ చేసినా..ఇపుడు అదే జాతికి జీవ‌గ‌ర్ర‌గా మారింది. అంతలా ప్ర‌తి కంట్రీని ఊపేస్తోంది.  బంతికి బ్యాట్‌కు మ‌ధ్య జ‌రిగే ఆస‌క్తిక‌ర‌మైన పోరులో ఎవ‌రు గెలుస్తార‌నేది చివ‌రి వ‌ర‌కు న‌రాలు తెగేంత టెన్ష‌న్ నెల‌కొని ఉంటుంది ఈ క్రికెట్ మ్యాచ్‌ల్లో. 50 ఓవ‌ర్ల ప‌రిమిత మ్యాచ్ అయినా లేదా 20 ఓవ‌ర్ల మ్యాచ్ అయినా దేనిక‌దే ఉత్కంఠ‌. మ్యాచ్‌ల...

ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో పేటిఎందే హ‌వా -350 మిలియ‌న్ల స‌బ్ స్క్రైబ‌ర్స్

చిత్రం
రాకెట్ కంటే వేగంగా దూసుకెళుతోంది పేటిఎం. ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారో కానీ ల‌క్ష‌లాది మంది ఇందులో స‌భ్యుల‌య్యారు. క్ష‌ణాల్లో కేవ‌లం స్మార్ట్ ఫోన్ల ద్వారా ఒక చోటు నుంచి మ‌రో చోటుకు డ‌బ్బుల‌ను పంపించే సౌక‌ర్యం ఉండ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు దీనినే ప్రిఫ‌ర్ చేస్తున్నారు. పేటిఎంకే ప్ర‌యారిటీ ఇస్తున్నారు. 350 మిలియ‌న్ల మంది పేటిఎం బ్యాంక్‌లో రిజిష్ట‌ర్ చేసుకున్నారు. ఇది ఇండియ‌న్ ఆన్‌లైన్ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లో ఓ రికార్డ్‌. 12 బిలియ‌న్ల లావాదేవీలు ఈ బ్యాంక్ ద్వారా జ‌ర‌గ‌డం ఓ చ‌రిత్ర‌. 2019-2020 సంవ‌త్స‌రానికి భారీ ఎత్తున ఇందులో స‌భ్య‌త్వం తీసుకున్నారు. 2018-2019 సంవ‌త్స‌రంలో 5.5 బిలియ‌న్ల ట్రాన్సాక్ష‌న్ జ‌రిగితే..ఈ ఆర్థిక సంవ‌త్స‌రానికి మ‌రింత పెరిగింది.  డిజిట‌ల్ పేమెంట్ సిస్టంలో పేటీఎం వ‌చ్చాక రూపురేఖ‌లు పూర్తిగా మారి పోయాయి. ప్ర‌తి ప‌ది మందిలో 9 మంది పేటీఎంను వాడుతున్నారు. 5.5 నుంచి 12 బిలియ‌న్ల లావాదేవీలు జ‌ర‌గ‌డం మామూలు విష‌యం కాదు. 2017 -2018 సంవ‌త్స‌రంలో కేవ‌లం 2.5 బిలియ‌న్లు ఉండ‌గా ..ఇండియ‌న్ ప్రైమ్ మినిష్ట‌ర్ మోదీ నోట్ల ర‌ద్దు పుణ్య‌మా అంటూ..పే టీఎం ఇండియా వ్యాప్తంగా త‌న హ‌వాను కొన‌...

షానే కింగ్ మేక‌ర్ - మోదీ త‌ర్వాత‌నే అత‌నే..!

చిత్రం
న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీకి న‌మ్మ‌క‌మైన బంటుగా, నెంబ‌ర్ 2గా, ట్ర‌బుల్ షూట‌ర్‌గా, బీజేపీకి వ్యూహ చ‌తురుడిగా, స్ట్రాట‌జిస్టగ్ రెండోసారి క‌మ‌లం విక‌సించేలా చేసిన వ్య‌క్తిగా ..సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కీల‌క పాత్ర పోషించిన నాయ‌కుడిగా అమిత్ షాకు పేరుంది. పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న ఈ నాయ‌కుడికి మోదీ ఎన‌లేని ప్రాధాన్య‌త క‌ల్పిస్తూ వ‌చ్చారు. ఏకంగా కేబినెట్‌లో అత్యంత కీల‌క‌మైన హోం శాఖను అప్ప‌గించారు. ఆయ‌న‌కు స‌హాయ‌కుడిగా గంగాపురం కిష‌న్ రెడ్డికి చోటు క‌ల్పించారు. తాజాగా మోదీ ప్ర‌క‌టించిన కేబినెట్ క‌మిటీల‌లో ఏకంగా అత్య‌ధిక క‌మిటీలో స‌భ్యుడిగా షాను నియ‌మించం ఆయ‌న ప్రాధాన్య‌త‌ను చెప్ప‌క‌నే చెప్పిన‌ట్ల‌యింది. ఇపుడు షా ఏది చెబితే అది త‌క్ష‌ణ‌మే అమ‌ల‌వుతుంది. అంత‌లా ఆయ‌న త‌న ప్రాభ‌వాన్ని పెంచుకుంటూ పోయారు. ఏది ప‌డితే అది బంగారం అన్న‌ట్టుగా షా త‌న హ‌వాను కొన‌సాగిస్తున్నారు. బీజేపీలో అత‌నిప్పుడు నెంబ‌ర్ 2 పొజిష‌న్ ను అనుభ‌విస్తున్నారంటూ మేధావి వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. క‌మలంలో మ‌రో సీనియ‌ర్ నేత‌గా ఉన్న రాజ్ నాథ్ సింగ్ ప్రాభ‌వానికి చెక్ పెట్టారు. కేవ‌లం 2 క‌మిటీల‌కే ప‌రిమితం చేశారు మోదీజి. వ...

విప్రోకు త్వ‌ర‌లో ప్రేమ్‌జీ సెల‌వు..!

చిత్రం
విజ‌యానికి, న‌మ్మ‌కానికి, నాణ్య‌త‌కు కేరాఫ్‌గా మారిన విప్రో సంస్థ ప్ర‌పంచ వ్యాప్తంగా గ‌ణీనీయ‌మైన వృద్ధి క‌లిగిన ఐటీ కంపెనీల‌లో ఒక కంపెనీగా స్థానం ద‌క్కించుకుంది. దీని వెనుక వేలాది మంది ఉద్యోగులు, సిబ్బంది తో పాటు ఆ సంస్థ‌కు ఛైర్మ‌న్‌గా వున్న అజీం ప్రేమ్‌జీ క‌ష్టం వుంద‌ని చెప్పాల్పి వుంటుంది. అంచెలంచెలుగా ఆ సంస్థ‌ను త‌న క‌న్న‌బిడ్డ‌ల‌కంటే ఎక్కువ‌గా చూసుకున్నారు ప్రేమ్‌జీ దంప‌తులు. ఒక‌ప్పుడు వంట నూనెల ఉత్ప‌త్తితో ప్రారంభ‌మైన విప్రో..ఇపుడు అన్ని రంగాల‌కు విస్త‌రించింది. ఇండియ‌న్ ఐటీ దిగ్గ‌జ కంపెనీల స‌ర‌స‌న నిలిచింది. పొరుగు సేవ‌లతో పాటు ఉద్యోగుల‌కు పూర్తి భ‌ద్ర‌త , సౌక‌ర్యాల‌ను క‌ల్పించ‌డంలోను విప్రో అన్ని ఐటీ కంపెనీల కంటే ముందంజ‌లో ఉంటోంది. అందుకే ప్ర‌తి ఒక్క‌రు ఈ కంపెనీని కావాల‌ని కోరుకుంటున్నారు. కంపెనీ ప‌రంగా గ‌డించిన ఆదాయంలో స‌గానికి పైగా డ‌బ్బుల‌ను స‌మాజ సేవ కోసం, విద్య‌, ఉపాధి, సామాజిక రుగ్మ‌త‌ల‌ను రూపు మాప‌డంలో అజీం ప్రేమ్‌జీ ఫౌండేష‌న్ కృషి చేస్తోంది. స‌మాజం నుంచి ఏం తీసుకున్నామో ..ఏదో రూపంలో తిరిగి ఇవ్వ‌డం మ‌న క‌నీస ధ‌ర్మం అంటారు ఓ సంద‌ర్భంలో అజీం ప్రేమ్‌జీ. చిన్న స్...

అబ్బో..అమెరికానా..ఆస‌క్తి చూప‌ని యువ‌త

చిత్రం
ప్ర‌పంచ వ్యాప్తంగా అమెరికా దేశానికి ఉన్నంత డిమాండ్ ఇంకే దేశానికి లేదంటే అతిశ‌యోక్తి కాదేమో. ముఖ్యంగా ఇండియ‌న్స్ కు డాల‌ర్ల అంటే విప‌రీత‌మైన క్రేజ్. పండ్లు తోముకునే బ్ర‌ష్‌ల నుండి ప‌డుకునే బెడ్ షీట్ల దాకా అంతా అమెరికాకు చెందిన‌వే. భార‌త్‌కు చెందిన రూపాయ‌ల కంటే యుఎస్ డాల‌ర్లంటే భ‌లే మోజు. ఇంజ‌నీరింగ్ దాకా ఇక్క‌డే చ‌దువుకున్న యువ‌తీ యువ‌కులు..రెక్క‌లొచ్చాక‌..అమెరికాకు రుయ్ మంటూ వెళ్లి పోతున్నారు. చ‌దువు కోవ‌డానికి, ఉద్యోగ అవ‌కాశాల‌కు స్వ‌ర్గ‌ధామంగా పేరుంది యుఎస్‌కు. అక్కడికి వెళ్లి ఉద్యోగం చేసినా చేయ‌క పోయినా స‌రే..ఎగిరి గంతేస్తున్నారు ఇండియ‌న్స్.  బ‌రాక్ ఒబామా అధ్య‌క్షుడిగా వున్న స‌మ‌యంలో ..ఇండియా, యుఎస్ సంబంధాలు మెరుగ్గా వుండేవి. ఎప్పుడైతే ట్రంప్ ప్రెసిడెంట్‌గా ఎన్నిక‌య్యాడో అప్ప‌టి నుంచి ఇత‌ర దేశాల‌కు క‌ష్టాలు ప్రారంభ‌మ‌య్యాయి. అక్క‌డ వుంటున్న ప్ర‌వాస భార‌తీయుల క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. అయినా ..అమెరికాపై వున్న మోజును మాత్రం త‌గ్గించు కోవ‌డం లేదు ఇండియ‌న్స్. చాలా దేశాల‌లోని యువ‌త‌కు యుఎస్ ఓ డ్రీం కంట్రీ. 2018తో పోలిస్తే అమెరికాలోని టెక్ జాబ్స్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారి సంఖ్...

అతి క‌ష్టం మీద గ‌ట్టెక్కిన ఆస్ట్రేలియా

చిత్రం
ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా వెస్టిండీస్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో కంగారూల జ‌ట్టు అతి క‌ష్టం మీద గెలుపొందింది. చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఈ మ్యాచ్‌లో క‌రేబియ‌న్స్ కంగారూల‌కు చుక్క‌లు చూపించారు. ఆఖ‌రు వ‌ర‌కు మ్యాచ్ విండీస్ వైపు ఉన్న‌ట్టు అనిపించినా కౌల్ట‌ర్ నైల్ విజ‌యానికి అడ్డుగోడ‌లా నిలిచాడు. త‌న జ‌ట్టుకు అద్భుత విజ‌యాన్ని అందించాడు. అత‌డు ఆడ‌క పోయివునింటే విండీస్ సునాయ‌సంగా విజ‌యం సాధించి వుండేది. వ‌చ్చిన ఛాన్స్ ను మిస్ చేసుకుంది. అయినా దేనికైనా అదృష్టం క‌లిసి రావాలి. ఆద్యంత‌మూ ఆస‌క్తిక‌రంగా సాగింది ఈ మ్యాచ్. 79 ప‌రుగుల‌కే ఐదు ప్ర‌ధాన వికెట్ల‌ను కోల్పోయిన కంగారూల జ‌ట్టును కౌల్ట‌ర్, స్మిత్ లు క‌లిసి నిల‌బెట్టారు. కుప్ప కూలే ప్ర‌మాదం నుంచి త‌ప్పించారు. ముచ్చ‌ట‌గా రెండో విజ‌యం ద‌క్కించుకుంది ఆస్ట్రేలియా. మొద‌ట బ్యాటింగ్ కు దిగిన కంగారూలు ..49 ఓవ‌ర్ల‌లో 288 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 56 ప‌రుగులిచ్చి కాట్రెల్ 2 వికెట్లు తీయ‌గా, థామ‌స్ 63 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. 41 ప‌రుగులు ఇచ్చి మ‌రో 2 వికెట్లు తీశాడు ర‌సెల్. నాథ‌న్ నైల్ 60 బంతులు ఆడి 8 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 92 ప...