పోస్ట్‌లు

ఏప్రిల్ 26, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

అవెంజ‌ర్స్ అదుర్స్ - రికార్డు స్థాయిలో భారీ వ‌సూళ్లు

చిత్రం
ప్ర‌పంచ వ్యాప్తంగా విప‌రీత‌మైన హైప్ క్రియేట్ చేస్తూ విడుద‌లైన అవెంజ‌ర్స్ ..ఊహించ‌ని దానికంటే ఎక్కువ‌గా భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. విడుద‌లైన మొద‌టి రోజే రికార్డు స్థాయిలో 1500 కోట్ల‌ను రాబ‌ట్టింది. ఇదివ‌ర‌కు ఉన్న వ‌సూళ్ల రికార్డుల‌ను అధిగ‌మిస్తోంది. ఇప్ప‌టికే కోట్ల రూపాయ‌ల‌ను దాటేసిన ఈ మూవీ ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి. విడుద‌లైన ప్ర‌తి చోటా ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. వ‌ర‌ల్డ వైడ్‌గా చూస్తే 21.66 కోట్ల డాల‌ర్లు వ‌సూల‌య్యాయి. అంటే ఇండియ‌న్ రూపీస్‌లోకి చూసుకుంటే... 1512 కోట్ల‌కు పై మాటే. ఇది కూడా ఒక రికార్డే. ఒక్క‌రోజులో ఇన్ని డ‌బ్బులు పోగేసు కోవ‌డం ఈ సినిమాకే చెల్లింది. ఇదంతా అవెంజ‌ర్స్ డైరెక్ట‌ర్ సాధించిన స‌క్సెస్. ఒక్క చైనాలోనే ప్రివ్యూలు ప్ర‌ద‌ర్శించ‌గా వ‌చ్చిన డ‌బ్బులు చూస్తే..క‌ళ్లు బైర్లు క‌మ్మాల్సిందే. వ‌సూలైన మొత్తం డ‌బ్బులు 750 కోట్లు సాధించింద‌ని ఫోర్బ్స్ ప‌త్రిక వెల్ల‌డించింది. ఇక ఇండియా విష‌యానికి వ‌స్తే ..బాహుబ‌లి సినిమా వ‌సూళ్ల‌ను అవెంజ‌ర్స్ దాటేస్తుంద‌ని సినీ పండితుల విశ్లేషిణ‌. ఉత్త‌ర అమెరికాలో విడుద‌ల కావ‌డంతో అక్క‌డ 28 కోట్ల...

స్టార్ట‌ప్ సిటీస్‌లో సిటీనే టాప్

చిత్రం
మ‌హాన‌గ‌రంగా వినుతికెక్కిన తెలంగాణ రాష్ట్ర కేపిట‌ల్ సిటీ ..భాగ్య‌న‌గ‌రం స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు అత్యుత్త‌మైన వేదిక‌గా ఎంపికైంది. న‌గ‌రం కీర్తి సిగ‌లో మ‌రో క‌లికితురాయిగా పేర్కొన‌వ‌చ్చు. ప్ర‌పంచ స్టార్ట‌ప్ న‌గ‌రాల జాబితాల ఎంపిక‌లో హైద‌రాబాద్ 75వ స్థానంలో నిలిచింది. అపార‌మైన వ‌న‌రులు, అవ‌కాశాలతో పాటు ప్ర‌భుత్వ సానుకూల దృక్ప‌థం కూడా ఇందుకు దోహ‌ద ప‌డింద‌నే చెప్పాలి. చారిత్ర‌క హైద‌రాబాద్..అధునాత‌న అభివృద్ధి ..ఐటీ కేంద్రంగానే కాకుండా స‌రికొత్త డిస్క‌వ‌రీస్‌కు కేంద్రంగా ప్ర‌పంచ స్థాయి న‌గ‌రాల‌ను ఆక‌ర్చింది..స‌త్తా చాటింది. స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన స్టార్ట‌ప్ బ్లింక్ అనే స్వ‌యం నియంత్ర‌ణ అనే సంస్థ ప్ర‌తి ఏటా ప్ర‌పంచ వ్యాప్తంగా స్టార్ట‌ప్‌ల‌ను ప్రోత్స‌హించే న‌గ‌రాల‌ను ఎంపిక చేస్తూ వ‌స్తుంది. అందులో భాగంగా ఈసారి ప్ర‌క‌టించిన న‌గ‌రాల జాబితాలో ఏకంగా ప్ర‌ధాన న‌గ‌రాల‌ను తోసిరాజంటూ హైద‌రాబాద్ మెరుగైన స్థానాన్ని చేజిక్కించుకుంది. ప్ర‌తి న‌గ‌రానికి వ‌చ్చిన పాయింట్ల ఆధారంగా సిటీస్‌ను ఎంపిక చేస్తుంది సంస్థ‌. 8.541 పాయింట్ల‌తో హైద‌రాబాద్ జాబితాలోకి చేరింది. చెన్నై 74వ స్థాన‌లో నిచింది. 262...

ఆర్బీఐకి ఝ‌ల‌క్ ఇచ్చిన సుప్రీంకోర్టు - స‌మాచారం ఇవ్వాల్సిందే

చిత్రం
దొంగ‌లెవ‌రో తేల్చండి. ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డిన వారి వివ‌రాలు వెల్ల‌డించడంలో మీరెందుకు వెన‌క్కి త‌గ్గారు. దీని వెనుక ఏమైనా మ‌త‌ల‌బు దాగి ఉన్న‌దా. బ్యాంకులు స‌మాజంలో భాగం కావా. ప్ర‌జ‌లు క‌ష్ట‌ప‌డి డ‌బ్బులు బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. వాటిని నియంత్రించే అధికారం రిజ‌ర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు ఉంది. కాద‌న‌లేం. కానీ ఎవ‌రు రుణాలు తీసుకున్నారు..ఎవ‌రు రుణాలు చెల్లించ‌డం లేదో ..ఆ వివ‌రాల‌ను ఎందుకు వెల్లించ‌డం లేదు. ఏ వ్య‌వ‌స్థ అయినా స‌మాచార హ‌క్కు చ‌ట్ట ప‌రిధిలోకి వ‌స్తుంద‌న్న విష‌యం గుర్తుంచు కోవాల‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. త‌మ‌కు సంబంధం లేదంటూ పేర్కొంటే..తీవ్రంగా ప‌రిగ‌ణించాల్సి వస్తుంద‌ని హెచ్చ‌రించింది. ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు, బ్యాంకుల‌కు క‌స్టోడియ‌న్‌గా ఉన్న ఆర్బీఐ స్వతంత్ర వ్య‌వ‌స్థ‌లో లేద‌ని తెలిపింది. ఆర్టీఐ కింద బ్యాంకుల వార్షిక త‌నిఖీల నివేదిక‌కు సంబంధించిన స‌మాచారాన్ని వెల్ల‌డి చేయాల్సిందేనంటూ మ‌రోసారి హెచ్చ‌రించింది. ఇందుకు సంబంధించిన ఆర్బీఐ త‌న విధి విధానాల‌ను పునః స‌మీక్షించు కోవాల‌ని జ‌స్టిస్ నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది. చ‌ట్ట ప్ర‌కారం ఆ వివ‌రాల‌ను...

ముంబై భ‌ళా..చెన్నై విల విల

చిత్రం
ఐపీఎల్ -12 టోర్న‌మెంట్ ఛాంపియ‌న్‌గా భావిస్తున్న చెన్నై క్రికెట్ జ‌ట్టు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ముంబై ఇండియ‌న్స్ క్రికెట్ జ‌ట్టు దెబ్బ‌కు విల‌విల లాడి పోయింది. అద్భుత‌మైన ప‌ర్‌ఫార్మెన్స్‌తో వ‌రుస విజ‌యాలు న‌మోదు చేసుకుంటూ దుమ్ము రేపుతున్న చెన్నైకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ముంబై బౌల‌ర్ల తాకిడికి ప‌రుగులు చేసేందుకు నానా ఇబ్బందులు ప‌డ్డారు. స్వంత గ‌డ్డ‌పై తొలి సారిగా ఓట‌మి పాలైంది చెన్నై. ముందు బ్యాటింగ్ చేసిన ముంబై ఆశించినంత మేర ప‌రుగులు చేయ‌లేక పోయినా..ఆ జ‌ట్టు బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. చెన్నైని క‌ట్ట‌డి చేసింది. వీరంతా స‌మిష్టిగా రాణించ‌డంతో విజ‌యం సాధించ‌డం సుల‌భ‌మైంది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చేసిన ప్ర‌ద‌ర్శ‌న‌కు తోడు జ‌ట్టు ఆట‌గాళ్లు అండ‌గా నిలిచారు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో చెన్నై ప‌రుగుల ప‌రంగా రెండో అతి పెద్ద అప‌జ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. 46 ప‌రుగుల తేడాతో ఓడించింది. ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 155 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. రోహిత్ 48 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, మూడు సిక్స‌ర్ల‌తో 67 ప‌రుగులు చేశాడు. ఈ సీజ‌న్‌లో తొలిసారిగా అర్ధ స...

హ‌క్కుల క‌మిష‌న్ ఆగ్ర‌హం - టీఎస్ స‌ర్కార్‌పై సీరియ‌స్

చిత్రం
బాధ్య‌త క‌లిగిన ప్ర‌భుత్వం, ఉన్న‌తాధికారులు ప్ర‌జ‌ల సొమ్ముతో సౌక‌ర్యాల‌ను అనుభవిస్తూ ..పిల్ల‌లు పిట్ట‌ల్లా రాలిపోతుంటే క‌నీస స్పంద‌న అంటూ ఉండ‌దా అని జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. తెలంగాణ స‌ర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇంత మంది ఇంట‌ర్ విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతుంటే మీకు క‌ళ్లు లేవా అని ప్ర‌శ్నించింది. అస‌లు ప్ర‌భుత్వం ఉందా ఈ రాష్ట్రంలో అని అనుమానం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు త‌క్ష‌ణ‌మే చోటు చేసుకున్న ప‌రిణామాలు, సంఘ‌ట‌న‌ల‌పై త‌క్ష‌ణ‌మే నివేదిక స‌మ‌ర్పించాల‌ని స‌ర్కార్‌ను ఆదేశించింది. ఆ వార్త‌లు వాస్త‌వ‌మైతే అధికారులు బాధ్యులేనంటూ వ్యాఖ్యానించింది. ఎలాంటి అనుభ‌వం లేని గ్లోబ‌రినా సంస్థ‌కు ఇంత పెద్ద స్థాయిలో జ‌రిగే ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌ను ఏ ర‌కంగా అప్ప‌గిస్తారంటూ నిల‌దీసింది. మ‌రో వైపు పునః మూల్యాంక‌నం చేసేందుకు ఇంట‌ర్ బోర్డును ఆదేశించాల‌ని కోరుతూ హైకోర్టులో మ‌రో పిటిష‌న్ దాఖ‌లైంది. తెలంగాణ‌లో ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థులు ఒక్క‌రొక్క‌రుగా సూసైడ్ చేసుకోవ‌డంపై జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ ( ఎన్‌హెచ్ఆర్‌సీ) స్పందించింది. మూ...

అజింక్యా ర‌హానేకు బంప‌ర్ ఆఫ‌ర్ - ఇంగ్లీష్ కౌంటీకి మ‌నోడు

చిత్రం
భార‌తీయ క్రికెట్ జ‌ట్టులో కీల‌క‌మైన ఆట‌గాడిగా కొన‌సాగుతున్న అజింక్యా ర‌హానేకు బంప‌ర్ ఆఫ‌ర్ ల‌భించింది. ఇంగ్లీష్ క్రికెట్ కౌంటీ మ్యాచ్‌ల్లో ఆడేందుకు ఆహ్వానం అందింది. హాంప్ షైర్ క్రికెట్ జ‌ట్టు త‌ర‌పున రెహానే ఆడ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్ -12 టోర్నీలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. అటు టెస్ట్ క్రికెట‌ర్‌గా, ఇటు వ‌న్డే క్రికెట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఎడ‌మ చేతితో బ్యాటింగ్ చేసే ఈ క్రికెట‌ర్ ఫోర్లు, సిక్స‌ర్ల‌ను అల‌వోక‌గా కొడ‌తాడు. ఏ బౌల‌ర్ అయినా స‌రే..క్రీజులో ఉన్నాడంటే మినిమం గ్యారెంటీ స్కోర్ ఇత‌డి స్వంతం. 6 జూన్ 1988లో పుట్టాడు. మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ గా ఇపుడు ఇండియ‌న్ క్రికెట్ జ‌ట్టులో సేవ‌లందిస్తున్నాడు. టెస్ట్ క్రికెట్ జ‌ట్టుకు వైస్ కెప్టెన్‌గా చేశాడు. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ ను 2007-2008లో ముంబ‌యి జ‌ట్టుతో స్టార్ట్ చేశాడు. 100 ఇన్నింగ్స్‌లు ఆడాడు. రెహానే బ్యాటింగ్ యావ‌రేజ్ 62.04 శాతం. మొద‌టి అయిదు క్రికెట్ సీజ‌న్స్‌లలో వ‌రుస‌గా వెయ్యి ప‌రుగులు సాధించాడు. ఇదో రికార్డు. టీ20 ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో అడుగు పెట్టాడు. మాంచెస్ట‌ర్‌లో...

ఆదాయంలో టాప్ - ఐటీలో ఎంఎస్ బెట‌ర్

చిత్రం
ప్ర‌పంచ ఐటీ దిగ్గ‌జాల స‌ర‌స‌న మైక్రోసాఫ్ట్ కంపెనీ త‌న స్థానాన్ని మ‌రింత ప‌దిలం చేసుకుంది. స‌త్య సార‌థ్యంలోని ఈ కంపెనీ మ‌రో రికార్డును స్వంతం చేసుకుంది. ఈ ఇంట‌ర్నేష‌న‌ల్ కంపెనీ మార్కెట్ విలువ ఒక్క‌సారిగా పెరిగి పోయింది. దీంతో దానిలో భాగ‌స్వాములైన వారి ఆదాయం గ‌ణ‌నీయంగా ..ఉన్న‌ప‌ళంగా పెరిగింది. మొట్ట‌మొద‌టి సారిగా ల‌క్ష కోట్ల డాలర్ల‌ను దాటింది. భార‌తీయ రూపాయ‌ల ప‌రంగా చూస్తే దాని విలువ 70 ల‌క్ష‌ల కోట్లు అన్న‌మాట‌. ఈ ఘ‌న‌త సాధించిన మూడో టెక్నాల‌జీ కంపెనీగా మైక్రోసాఫ్ట్ చ‌రిత్ర న‌మోదు చేసింది. ఈ కంపెనీ ఆర్థిక ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించింది. అమెరికాలోని వాల్ స్ట్రీట్ వ‌ర్గాల‌లో ఉత్సాహం చోటు చేసుకుంది. మ‌రో వైపు స్టాక్ మార్కెట్ ఊపందుకుంది. ప్రారంభంలోనే ట్రేడింగ్‌లో కంపెనీకి చెందిన షేర్లు 5 శాతం పెరిగాయి. ఒక్కో షేరు విలుల 130. 59 డాల‌ర్ల‌కు చేరుకుంది. మిగ‌తా ఐటీ కంపెనీల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేశాయి. ఎంఎస్ తో పాటు మిగ‌తా కంపెనీలు పోటీ ప‌డుతున్నాయి. రోజు రోజుకు టెక్నాల‌జీ మారుతోంది. దానికి అనుగుణంగా కంపెనీలు త‌మ ప‌నులు మ‌రింత సుల‌భ‌త‌రం చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్ కొత్త‌గా టెక్నాల‌జీని రూ...