పోస్ట్‌లు

సెప్టెంబర్ 17, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

26 ఏళ్లలో 11 రూపాయల పెట్టుబడి 54 వేల రాబడి - వన్నె తగ్గని ఎంఆర్ఎఫ్..!

చిత్రం
డబ్బులు ఊరికే రావు. ఇటీవల తెలుగు వారి లోగిళ్ళలో బాగా పాపులర్ అయిన యాడ్. మార్కెట్ లో లెక్కలేనన్ని రూపాయలు ఉన్నాయి. కాకపోతే వాటిని ఎలా పొందాలో, ఎలా మన జేబుల్లోకి రావాలో ప్రయత్నం చేయాలి. కష్టపడాలి. సాధించాలి. చాలా మందికి స్టాక్ మార్కెట్ అంటే భయం. అపోహ కూడా. కానీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ ఆధారంగా తోచినంత డబ్బులను షేర్స్ రూపంలో పెట్టుబడిగా పెట్టుకుంటూ పోతే కొన్నేళ్లలో మీరు లక్షాధికారి కావొచ్చు. ఏ రంగం లోనైనా పర్ఫెక్ట్ గా సక్సెస్ కావాలంటే ఒకే రంగం మీద దృష్టి సారించాలి. బతకాలంటే మనీ ఉండాలిగా. అందుకే రూపీస్ కు , డాలర్లకు అంత డిమాండ్. ప్రతి ఒక్కరు దాని వెంట పరుగులు తీయడమే. ఇదే స్టాక్ మార్కెట్ ను నమ్ముకున్న వాళ్ళు కరోడ్ పతులయ్యారు. కోట్లాది మంది బికారులుగా మారినసందర్భాలు కోకొల్లలు. కళ్ల ముందు జరిగిన వాస్తవం ఏమిటంటే ఐటీ రంగంలో సత్యం కంప్యూటర్స్ అనతి కాలంలోనే ప్రపంచంలోనే టాప్ ఐటీ కంపెనీగా పేరు తెచ్చుకుంది. ఇదే సమయంలో దాని చైర్మన్ రామలింగ రాజు చేసిన తప్పిదాలకు అరెస్ట్ కావడంతో వేళల్లో ఉన్న షేర్స్ ఒక్క సరిగా పడి పోయాయి. అదే సమయంలో దానిని టేకోవర్ చేసుకునేందుకు ఏ కంపెనీ ముందుకు రాలేదు. కా...

ఇక ఆర్ఐఎల్ సస్టెయినబుల్ డ్రెస్సెస్

చిత్రం
ఇండియాలో ఆర్ఐఎల్ ఏది చేపట్టినా అది అదృష్టాన్ని మోసుకు వస్తోంది. ఇప్పటికే బిజినెస్ రంగాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న రిలయన్స్ ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. ఆయిల్, లాజిస్టాక్, ఆయిల్, టెలికాం, జ్యుయెలరీ, ఈ కామర్స్, డిజిటల్ మీడియా టెక్నలాజి రంగంలో దుమ్ము రేపుతోంది. తాజాగా జియో ఇండియాలో రికార్డ్ బ్రేక్ చేసింది. ఇప్పటికే 34 కోట్ల కస్టమర్స్ తో చరిత్ర సృష్టించింది. జియో సాధించిన సక్సెస్ ను స్ఫూర్తిగా తీసుకుని ఇతర రంగాలకు ఎంటర్ అవుతోంది. తాజాగా సస్టెయినబుల్ డ్రెస్సెస్ పై దృష్టి పెట్టింది. అందరికి అందుబాటులో ఉండేలా, సామాన్యులు సైతం కొనుగోలు చేసేలా, పర్యావరణాన్ని పరిరక్షించేలా ప్లాన్ చేస్తోంది. ఇటీవల 'సస్టైనబుల్ ఫ్యాషన్'కు  ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ రంగంలో దూసుకు పోవాలని టార్గెట్ గా పెట్టుకుంది. సస్టెయినబుల్ ఫ్యాషన్‌ను కేవలం వ్యాపార కోణంలో చూడటం లేదని. ఇది కూడా ఒక రకమైన కార్పోరేట్ సామాజిక బాధ్యత కిందకే వస్తుందని ఆర్ఐఎల్ సీఎఫ్ఓ వెల్లడించారు. రిలయన్స్ పెట్రో ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ చేయడంలో ప్రపంచం మొత్తంలో తొలి కంపెనీ తమదే అన్నారు. భారతదేశంలో ...

ఈ వెహికిల్స్ - ఐడియా సక్సెస్..!

చిత్రం
ఇండియాలో స్టార్టప్‌లు దుమ్ము రేపుతున్నాయి. ఒకరి దగ్గర పని చేయడం కాకుండా తామే పది మందికి ఉద్యోగాలు ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు చాలా మంది. ఎక్కువగా అంకురాలు ఏర్పాటు కావడానికి ప్రధాన కారణం ఇటీవల ఆ కాన్సెప్ట్ తో ఊహించని రీతిలో ఎక్కువ సక్సెస్ రేట్ నమోదు కావడమే. ప్రపంచాన్ని చమురు డామినేట్ చేస్తోంది. ప్రతి రోజంతా పెట్రోల్, డీజిల్ వాడకుండా ఉండని పరిస్థితి. దీంతో కోట్లాది వాహనాలు ప్రతి రోజు రోడ్లపై ప్రయాణం చేస్తున్నాయి. ఆకాశంలో ఎగరాలన్నా ఇంధనం కావాల్సిందే. లేకపోతే ఉన్న చోటనే వుండి పోతాం. చమురు నిక్షేపాలు ఎక్కువగా కొన్ని దేశాలలోనే లభ్య మవుతున్నాయి. దీంతో ఎక్కువగా 70 శాతానికి మించి దేశాలు ఉత్పత్తి చేసే కంట్రీస్ మీదే ఆధార పడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఆయిల్ ధరలు అమాంతం పెరుగుతూ పోతున్నాయి. తాజాగా సౌదీ పై దాడులు పెరిగాయి. దీంతో ప్రత్యామ్నాయం చూసు కోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇందులో భాగంగానే ఎలాంటి ఆయిల్ వాడకుండానే బయో డీజిల్ తో పాటు ఎలక్ట్రిసిటీ తో వాహనాలు తయారు చేసి పనిలో పడ్డాయి పలు కంపెనీలు. దీని వల్ల తక్కువ ఖర్చు, ఎక్కువ మిగులు, టైం సేవ్ కావడం జరుగుతోంది. విద్యుత్ వాహనాలు ఇ...

భారీ ఆఫర్లు.. బిగ్ డిస్కౌంట్స్..బయ్యర్స్ కు పండగే పండుగ..!

చిత్రం
ఎవరినైనా దెబ్బ కొట్టాలన్నా, వార్ లోనైనా, ఆధిపత్యం లోనైనా లేక వ్యాపారమైనా లేదా ఈ కామర్స్ రంగం లోనైనా అమెరికా తర్వాతే ఎవ్వరైనా..ఏ దేశమైనా. యుఎస్ కు చెందిన వాల్ మార్ట్ ఫ్లిప్ కార్ట్ ను టేకోవర్ చేసుకున్నాక దాని స్వరూపమే మారి పోయింది. బిగ్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్స్ కు తెర తీస్తూ తోటి కంపెనీలకు భారీ సవాల్ విసురుతోంది. ఇప్పటికే ఇదే అమెరికా కంపెనీ అమెజాన్ తన ప్లేస్ ను కాపాడుకుంటూ వస్తోంది. ఇటీవల సిబ్బంది సమ్మె చేసినా అది రోబోలను, న్యూ టెక్నాలజీని వాడుతూ తనకు ఎదురే లేకుండా చేసుకుంటోంది. దేశీయ, విదేశీ ఈ కామర్స్ కంపెనీలన్నీ ఇప్పుడు ఇండియా జపం చేస్తున్నాయి. ఇక్కడున్నంత మార్కెట్ ఇంకెక్కడా లేక పోవడమే ఇందుకు ప్రధాన కారణం. కొన్ని రోజుల్లో దసరా పండగ రాబోతోంది. దీనిని టార్గెట్ గా పెట్టుకుని భారీ డిస్కౌంట్స్ ను ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. అంతకు ముందే అమెజాన్ , స్నాప్ డీల్ తో పాటు ఇతర కంపెనీలు బయ్యర్స్ కు బంపర్ ఛాన్స్ ఇస్తున్నాయి. దీంతో ఏవి కొనుగోలు చేయాలో తెలియక తల్లడిల్లి పోతున్నారు. ఎక్కువగా గృహోపకరణాలు, దుస్తులు, షూస్, గాడ్జెస్, మొబైల్స్ వాటికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇక ఎప్పుడూ లేనంతగా ఫ్ల...

ఐపీవో వైపు స్టార్టప్‌ల చూపు..!

చిత్రం
ఇండియాలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరాక అంకుర సంస్థలకు ఎక్కడలేని ఊపు వచ్చింది. కొత్త ఐడియాలతో సరికొత్త ట్రెండ్స్ తో  స్టార్టప్‌ సంస్థలు వేలాదిగా ఏర్పాటు అయ్యాయి. భారత దేశంలో మొదటి సారిగా టెలికాం రంగానికి ఆద్యుడు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ. ఆయన హయాం లోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూపు దిద్దుకున్నది. మోడీ ఎప్పుడైతే పగ్గాలు చేపట్టారో సోషల్, డిజిటల్ మీడియా రంగాలకు ఎక్కడలేని ప్రాధాన్యతను కల్పించారు. దీంతో దేశ వ్యాప్తంగా  స్టార్టప్‌ లు లెక్కలేనన్ని పుట్టుకు వచ్చాయి. ఇందులో ఎక్కువ శాతం సక్సెస్ కాలేక పోయినప్పటికినీ, ఓ 30 శాతం సక్సెస్ బాటలో నడుస్తున్నాయి. అందులో మొదటగా చెప్పు కోవాల్సింది రితీష్ అగార్వల్ స్థాపించిన ఓయో స్టార్టప్‌ . ఒక మామూలు గదిలో ప్రారంభమైన ఈ  స్టార్టప్‌ ఇప్పుడు కంపెనీగా ఎదిగి ప్రపంచాన్ని ఏలుతోంది. హాస్పిటాలిటీ రంగంలో బడా హోటల్స్ యాజమాన్యాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అలాగే జొమాటో, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, స్విగ్గి, ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది అంకురాలు దుమ్ము రేపుతున్నాయి. కేంద్ర సర్కార్ మాత్రం  స్టార్టప్‌ లను ప్రోత్సహించేందుకు ఏకంగా ప...

దిగ్గజ కంపెనీల మధ్య వార్..!

చిత్రం
టెక్నాలజీ మారుతోంది. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతోంది. ఒక్కో కంపెనీ ఒక్కో స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తూ ఇతర కంపెనీలతో పోటీ పడేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో టెక్నీకల్ ఎక్స్ పర్ట్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఇప్పటికే యాపిల్, శ్యాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. వీటి ఆధిపత్యానికి చైనా కంపెనీలు గండి కొడుతున్నాయి. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్ ఉండేలా మొబైల్స్ తయారు చేయడంతో కొనుగోలుదారులు వీటిపైనే మక్కువ చూపిస్తున్నారు. దీంతో ఆసియాలోనే బిగ్గెస్ట్ మార్కెట్ వాటా కలిగిన ఇండియాలో ఇప్పుడు చైనా మొబైల్స్ షేక్ చేస్తున్నాయి. వీటి దెబ్బకు బడా కంపెనీలు అబ్బా అంటున్నాయి. తాజా అంచనాల ప్రకారం షావోమి మొబైల్స్ భారీ ఎత్తున అమ్ముడు పోయాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఇండియన్ కు చెందిన మనోజ్ కుమార్ జైన్ ఇండియా హెడ్ గా బాధ్యతలు చేపట్టాక మొత్తం స్ట్రాటజీని మార్చేశాడు. గ్రామాలకు సైతం మొబైల్స్, యాక్ససరీస్ అందుబాటులో ఉండేలా చేశాడు. దీంతో సామాన్యులు ఈ కంపెనీ మొబైల్స్ కు కనెక్ట్ అయ్యారు. మార్కెట్లో నిలబడాలంటే ధరల్లో మార్పులు, గిఫ్ట్స్ ఇవ్వడం, మరిన్ని అదనపు సౌకర్యాలు కల్పించడం చేస్తున్నాయి మ...