పోస్ట్‌లు

జులై 14, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

క్రికెట్ ముగిసింది..క‌ర్నాట‌క మిగిలింది..!

చిత్రం
దేశ రాజ‌కీయాలు ఇపుడు క‌న్న‌డ రాజ‌కీయం చుట్టే తిరుగుతున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ స‌ర్కార్ ఉంటుందా..ఊడిపోతుందో తెలియ‌క క‌న్న‌డిగులు ఉత్కంఠ‌కు లోన‌వుతున్నారు. ఓ వైపు 45 రోజుల పాటు టెన్ష‌న్ కు గురి చేసిన ప్ర‌పంచ క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్ ముగిసింది. ఇక క‌ర్నాట‌క‌లో వేడి మొద‌లైంది. స‌భ‌లో స‌మ‌ర స‌న్నాహాలు జ‌ర‌గ‌నున్నాయి. విశ్వాస ప‌రీక్ష నిర్వ‌హించి తీరాల్సిందేన‌ని య‌డ్యూర‌ప్ప నేతృత్వంలోని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మ‌రో వైపు త‌గినంత బ‌లం లేక పోయినా సీఎం నాట‌కాలు ఆడుతున్నారంటూ ఆరోప‌ణ‌లు చేసింది. మ‌రో వైపు ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరొందిన డీకే శివ‌కుమార్ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు రంగంలోకి దిగారు. ముంబ‌యిలో బ‌స చేసిన కాంగ్రెస్ రెబ‌ల్స్ ను బుజ్జ‌గించే ప‌నిలో ప‌డ్డారు. అయినా ఒక‌రు త‌ప్ప మ‌రికొంద‌రు త‌న లైన్లోకి రాలేదు. విశ్వాస ప‌రీక్ష‌లో త‌మ వైపు ఓటు వేయ‌క పోతే..శాస‌న‌స‌భ స‌భ్య‌త్వాన్ని కోల్పోతారంటూ హెచ్చ‌రించారు. త‌మ రాజీనామాలు త‌క్ష‌ణ‌మే ఆమోదించాల‌ని కోరుతూ రెబ‌ల్ ఎమ్మెల్యేలు స్పీక‌ర్‌ను ఆదేశించాల‌ని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. రాజ్యాంగ‌బ‌ద్ధంగా తాను ఎన్నికైనందున‌, స‌రై...

చెరిగి పోని మ‌ధుర క్ష‌ణాలు..మ‌న‌సు దోచిన మ‌హ‌రాజులు

చిత్రం
45 రోజుల పాటు అల‌రించిన ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్ ఎట్ట‌కేల‌కు ముగిసింది. రోజు రోజుకు టెన్ష‌న్‌ను క‌లుగ‌జేస్తూ..క్రికెట్ ప్రేమికుల‌కు ఎన‌లేని సంతోషాన్ని నింపిన ఈ టోర్నీ వారికి క‌ల‌కాలం గుర్తుండి పోతుంది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎంద‌రో ఆట‌గాళ్లు ఆయా జ‌ట్ల త‌ర‌పున ఆడారు. త‌మ ప్ర‌తిభా పాట‌వాల‌ను ప్ర‌ద‌ర్శించారు. కానీ కొంద‌రు క్రికెట‌ర్లు మాత్రం వెరీ వెరీ స్పెష‌ల్. ఎందుకంటే వారు లేకుండా ఆ జ‌ట్టు గెల‌వ‌లేదు కాబ‌ట్టి. వారంతా ఇపుడు దేశాల త‌ర‌పున హీరోలుగా చెలామ‌ణి అవుతున్నారు. ఫైన‌ల్ పోరులో స్టోక్స్ త‌మ జ‌ట్టుకు విస్మ‌రించ‌లేని విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టి ఆల్ టైం హీరోగా రికార్డుకు ఎక్కాడు. 12వ వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ ఆద్యంత‌మూ ఉత్సాహ భ‌రిత‌..ఉత్కంఠ రేపుతూ జ‌రిగింది. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్, ఇండియా, ఆస్ట్రేలియా జ‌ట్లు హాట్ ఫేవ‌రేట్‌లుగా నిలిచాయి. కానీ ఈ టోర్నీలో మాత్రం అనామ‌క జ‌ట్టుగా ప‌రిగ‌ణించిన బంగ్లా దేశ్ ఆట‌గాళ్లు మిగ‌తా జ‌ట్ల‌కు చుక్క‌లు చూపించారు. ఒకానొక స‌మ‌యంలో షాక్ ఇచ్చారు. అటు బౌలింగ్‌లోను..ఇటు బ్యాటింగ్‌లోను త‌మ స‌త్తా చాటారు. ఇక టోర్నీలో ఆయా జ‌ట్ల నుంచి ప‌లువురు ఆట‌గాళ్లు స్టార్స్ రేటింగ్ పొ...

ఆతిథ్య జ‌ట్టే జ‌గ‌జ్జేత - ఇంగ్గండ్ విశ్వ విజేత - ఆద్యంత‌మూ ఉత్కంఠ భ‌రితం

చిత్రం
క్రికెట్ లెజెండ్స్ అంచ‌నాలు త‌ప్పు కాలేదు. అతిర‌థ మ‌హా జ‌ట్ల‌ను మ‌ట్టి క‌రిపించి క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ ను ఆతిథ్య జ‌ట్టు ఇంగ్లండ్ స‌గ‌ర్వంగా ముద్దాడింది. అనూహ్య‌మైన ప‌రిణామాలు..ఉత్కంఠ భ‌రిత‌మైన క్ష‌ణాలు..వెర‌సి మ్యాచ్ తో పాటూ సూప‌ర్ ఓవ‌ర్ కూడా టై కావ‌డంతో ఏం జ‌రుగుతుందో తెలియ‌క ఫ్యాన్స్ గుండెల్ని బిగ‌ప‌ట్టుకుని వీక్షించారు. అంతా అనుకున్న‌ట్టే జ‌రిగింది. టోర్న‌మెంట్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఇంగ్లండ్ జ‌ట్టే హాట్ ఫెవ‌రేట్ జ‌ట్టుగా నీరాజ‌నాలు అందుకుంది. అంతకంటే ఎక్కువ‌గా బెట్టింగ్ రాయుళ్లు కూడా ఆ జ‌ట్టు మీదే కోట్లు పాడారు. ఇంగ్లండ్, కీవీస్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన ఈ ఫైన‌ల్ మ్యాచ్ క్రికెట్ ప్రేమికుల‌కు ఎన‌లేని ఎంజాయ్‌ని క‌లుగ చేసింది. ఇదీ క్రికెట్ అంటే. అందుకే దీనికి అంత‌టి క్రేజు..ఆపై తీర‌ని మోజు కూడా. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఫైన‌ల్ పోరులో ఇంగ్లాండ్‌ను గెలుపు తీరాల‌కు తీసుకు వెళ్లింది మాత్రం స్టోక్స్ ఒక్క‌డే. ఇపుడు ఆ జ‌ట్టు త‌ర‌పున అత‌డే రియ‌ల్ హీరో. ఆతిథ్య దేశ‌మే అయిన‌ప్ప‌టికీ ..క్రికెట్ పుట్టినిల్లు మాత్రం ఆంగ్లేయుల‌దే. ఇన్నేళ్లుగా ప్ర‌పంచ క‌ప్ జ‌రుగుతూనే ఉన్నా..ఏ ఒక్క‌సారి...

టీమిండియా తీరుపై యువీ అస‌హ‌నం

చిత్రం
ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్‌లో హాట్ ఫెవ‌రేట్‌గా బ‌రిలోకి దిగిన టీమిండియా జ‌ట్టు నాకౌట్ ద‌శ‌లో న్యూజిలాండ్ టీంతో ఓడిపోవ‌డాన్ని కోట్లాది అభిమానుల‌తో పాటు మాజీ క్రికెట‌ర్లు జీర్ణించు కోలేక పోతున్నారు. నాలుగో స్థానంలో బ‌ల‌మైన ఆట‌గాళ్ల‌ను ఆడించ‌క పోవ‌డం వ‌ల్ల‌నే అప‌జ‌యం ద‌క్కింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక రాయుడి ప‌ట్ల బీసీసీఐ అనుస‌రించిన ధోర‌ణిపై మాజీ క్రికెట‌ర్, తాజాగా రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన యువ‌రాజ్ సింగ్ తీవ్రంగా స్పందించాడు. అంత‌కు ముందు మాజీ కెప్టెన్ ధోనీ కావాల‌నే ఆడ‌లేదంటూ యువీ తండ్రి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. అంత అనుభ‌వం క‌లిగి ఉన్న ధోనీ జ‌డేజాపై భారం మోపడం భావ్యం కాదన్నారు. టీమిండియా యాజమాన్యం ఇపుడు ఏం స‌మాధానం చెబుతుంద‌ని యువీ నిల‌దీశాడు. ప్ర‌పంచ క్రికెట్ టోర్నీ కంటే ముందు నాలుగో స్థానం విష‌యంలో ఎవ‌రు స‌రిపోతార‌ని ..బీసీసీఐ , మేనేజ్ మెంట్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎంత‌మంది ఆ స్థానంలో ఆడినా ఏ ఒక్క క్రికెట‌ర్ కుదురుకోలేద‌ని, ఒక్క అంబ‌టి రాయుడు కొంత మేర‌కు ఆ స్థానానికి న్యాయం చేశాడ‌ని అన్నారు. ఇక ఇదే ప్లేస్‌లో విజ‌య‌శంక‌ర్, కేఎల్ రాహుల్‌లు ప్రపంచ క‌ప్ కు ఎంపిక‌య్యారు...