పోస్ట్‌లు

జులై 13, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

దిగ్గ‌జ కంపెనీల నోట‌..దేశీ బాట

చిత్రం
ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ కామ‌ర్స్ రంగంలో పేరొందిన దిగ్గ‌జ కంపెనీల‌న్నీ స్వ‌దేశీ జ‌పం చేస్తున్నాయి. ఎందుకంటే త‌మ దేశపు సంస్కృతి, సాంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబించే ఉత్ప‌త్తుల కంటే లోక‌ల్‌గా త‌యార‌య్యే వాటిపైనే మ‌నోళ్లు మ‌క్కువ క‌న‌బ‌రుస్తుండ‌డంతో దిగి రాక త‌ప్పడం లేదు. ఏకంగా ఈ -కామ‌ర్స్ @ మేడిన్‌ ఇండియా అన్న రీతిలో పాపుల‌ర్ అయి పోయాయి. దేశీయంగానే త‌యారీపై దృష్టి పెడుతున్నాయి. దీంతో స్థానికంగా ఉన్న నిరుద్యోగుల‌కు కొంత మేర ఉపాధి ల‌భించ‌నుంది. ఇప్ప‌టికే ఇండియాలో నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్ కోసం బ‌రిలో ఉన్న ఈ కామ‌ర్స్ కంపెనీలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు దేశీయ జ‌పం చేస్తున్నాయి. క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు నానా పాట్లు ప‌డుతున్నాయి. లాజిష్టిక్ రంగంతో పాటు టెక్నాల‌జీతో అనుసంధానం కావ‌డం, డిజిట‌ల్ టెక్నాల‌జీని అడాప్ట్ చేసుకోవ‌డం జ‌రుగుతోంది. దీంతో ఇంట‌ర్న‌ల్‌గా కొన్ని వేల మంది ఈ రెండు కంపెనీలలో చేరిపోతున్నారు. మ‌రో వైపు భారీగా దిగుమ‌తి సుంకాల బెడ‌ద నుంచి త‌ప్పించుకునేందుకు ..కేంద్ర బీజేపీ స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ పెట్టిన మేకిన్ ఇండియా నినాద ప్ర‌యోజ‌నాల‌ను పొందేందుకు ఈ కామ‌ర్స్ దిగ్గ‌జ కంపెన...

అరుదైన అవ‌కాశం..పృథ్వీకి ద‌క్కిన గౌర‌వం - ఎస్వీబీసీ ఛాన‌ల్ ఛైర్మ‌న్ గా బాల్ రెడ్డి

చిత్రం
జీవితంలో ఒక్క‌సారైనా తిరుమ‌ల‌ను ద‌ర్శించు కోవాల‌ని అనుకుంటారు కోట్లాది మంది ప్ర‌జ‌లు. కొండ‌పై వెల‌సిన ఆ శ్రీ వేంక‌టేశ్వ‌రుడిని పావ‌నం చేసుకుంటే జ‌న్మ ధ‌న్య‌మైన‌ట్టేన‌ని భావించే వారిలో కోటాను కోట్లున్నారు. దీనికంత‌టి ఆ శ్రీ‌నివాసుడి మ‌హిమ‌నే త‌ప్ప మ‌రోటి కాదు. ఆ కొండ‌పై సేవ చేసే భాగ్యం ల‌భిస్తే చాల‌ని అనుకునే భ‌క్తులు ఎంద‌రో. అదృష్టం వుంటే త‌ప్ప రాదంటారు విన‌మ్రంగా కొంద‌రు. స్వామి వారి స‌న్నిధిలో అత్యున్న‌త‌మైన ప‌ద‌వి ల‌భిస్తే ..ఇంక అంత‌కంటే భాగ్యం ఇంకొక‌టి ఉంటుందంటారా చెప్పండి. ఆ స్వామి, అమ్మ వార్ల గురించి, తిరుమ‌ల దేవాల‌యం గురించి ప్ర‌తి రోజూ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలోని శ్రీ వేంక‌ట్వేశ‌ర భ‌క్తి ఛాన‌ల్ నిరంత‌రాయంగా ప్ర‌సారాలను అంద‌జేస్తోంది. ఈ ఒక్క ఛాన‌ల్‌ను రోజుకు కోటి మందికి పైగా చూస్తున్నారు. దాని రేటింగే వేరు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా భ‌క్తులు అంద‌జేస్తున్న విరాళాలతో కొన్నేళ్లుగా న‌డుస్తూనే వుంది. ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాలు, స్వామి వారికి స‌మ‌ర్పించే కైంక‌ర్యాలు, విశిష్ట పూజ‌లతో పాటు రోజూ విడ‌త‌ల వారీగా జ‌రిగే కార్య‌క్ర‌మాల గురించి టెలికాస్ట్ చేస్తోంది ఈ ఛాన...

బిఎస్ఎన్ఎల్‌కు క‌ష్ట కాలం..గ‌ట్టెక్కించేనా కేంద్ర ప్ర‌భుత్వం

చిత్రం
దేశానికి విశిష్ట సేవ‌లందించిన అతి కొద్ది కంపెనీల‌లో భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ టెలికాం కంపెనీ ఒక‌టి. భారీ ఉద్యోగుల క‌ష్టంతో దేశ వ్యాప్తంగా బిగ్గెస్ట్ నెట్ వ‌ర్క్ క‌లిగిన బిఎస్ఎన్ఎల్ ఇపుడు నేల చూపులు చూస్తోంది. పాల‌కుల నిర్ల‌క్ష్యం..యాజ‌మాన్యం బాధ్య‌తా రాహిత్యం లాభాల బాట‌లో న‌డిచిన ఈ కంపెనీ ఇపుడు ఎవ‌రు ఆదుకుంటారోన‌ని ఎదురు చూస్తోంది. వేత‌నాల భారం అంత‌కంత‌కూ ఎక్కువ కావ‌డం, నిర్వ‌హ‌ణ సామ‌ర్థ్యం లేక పోవ‌డం, టెండ‌ర్లు ప్రారంభించిన స్థాయిలోనే ఉండ‌టంతో పాటు కేంద్ర స‌ర్కార్ నుంచి ఎలాంటి స్పంద‌న క‌నిపించ‌క పోవ‌డం కూడా మ‌రో కార‌ణం. దివాళా అంచున బిఎస్ఎన్ఎల్‌తో పాటు ఎంటీఎన్ ఎల్ కూడా చేరింది. వీటిని గ‌ట్టెక్కించేందుకు బీజేపీ స‌ర్కార్ నానా తంటాలు ప‌డుతోంది. ఇప్ప‌టికిప్పుడు ఈ రెండింటికి ప్రాణం పోయాలంటే ..కాయ‌క‌ల్ప చికిత్స చేయాలంటే 74 వేల కోట్ల‌కు పైగా బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వాల‌ని ప్ర‌తిపాద‌న‌లు పంపించాయి స‌ద‌రు కంపెనీల యాజ‌మాన్యాలు. సాధ్యాసాధ్యాల‌ను కేంద్రం నిశితంగా ప‌రిశీలిస్తోంది. వ‌చ్చిన నిధుల‌తో ఉద్యోగుల‌కు ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్యాకేజీని అమ‌లు చేస్తారు. ఎక్కువ మంది స్వ‌చ్చంధ ప‌ద‌వీ విర‌మ‌ణ చేస...