పోస్ట్‌లు

ఆగస్టు 21, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

అంత‌టా ప‌వ‌నిజం..అదే అత‌డి డైన‌మిజం

చిత్రం
  పార్టీ న‌డ‌పాలంటే పైస‌లు అక్క‌ర్లేదు. కావాల్సంద‌ల్లా ప్ర‌జ‌ల‌ను ప్రేమించ‌డం..ఇంత స్ప‌ష్టంగా చెప్ప‌గ‌లిగిన రాజ‌కీయ నాయ‌కుడు ఎవ‌రైనా ఉన్నారా అంటే ..ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే చెప్పాలి. ఆర‌డుగుల బుల్లెట్ లాగా ఉంటాడు కానీ మాట‌లతో ప్ర‌కంప‌న‌లు సృష్టించ‌గ‌ల‌డు. చూపుల‌తో జ‌నాన్ని మెస్మ‌రైజ్ చేయ‌గ‌ల‌డు. ల‌క్ష‌లాది అడుగుల‌ను త‌న ఆశ‌య సాధ‌న కోసం..స‌మున్న‌త స‌మాజం కోసం న‌డిచేలా చేయ‌గ‌ల‌డు. ఇదీ కొణిదెలకు ఉన్న క్రెడిబిలిటి. వ్య‌క్తిత్వ ప‌రంగా అంత‌ర్ముఖుడైన ఈ ప‌వ‌ర్ స్టార్ గురించే ఇపుడంతా చ‌ర్చ‌. ఏపీలోను ఇటు తెలంగాణ‌లోను ఆయ‌న‌కు ఎన‌లేని అభిమానులున్నారు. త‌మ‌కు తాముగా ఆరాధించే వాళ్లు ఎక్కువున్నారు. ఇదే ఆయ‌న‌కు ఉన్న అతి పెద్ద అస్సెట్. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు ఎవ్వ‌రిపైనా చేయ‌రు. కాక‌పోతే త‌న జోలికి వ‌స్తే మాత్రం ఊరుకోరు. ఎక్కువ‌గా మాట్లాడ‌రు. కానీ మాట్లాడితే అవ‌త‌లి వాళ్లు ఫిదా అయి పోవాల్సిందే. ఇదే రాజ‌కీయ నాయ‌కుడికి ఉండాల్సిన ప్ర‌ధాన ల‌క్ష‌ణం. ఒక్క చూపుతో..ఒకే ఒక్క మాట‌తో శాసించ‌గ‌ల‌రు. న‌డిపించ‌గ‌ల‌రు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల ఆత్మ గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్టే ఏ రాజ‌కీయ పార్టీని, న...

మామూలుగా బతకలేమా ?

చిత్రం
  డబ్బులు పోగేసు కోవడం ..ధనవంతులుగా చెలామణి కావాలని అనుకోవడం మామూలే. సాఫ్ట్ వేర్ రంగం వచ్చాక అవకాశాలు అపారంగా పెరిగాయి . మీసాలు రాణి వాళ్ళు సైతం డాలర్లు సంపాదిస్తున్నారు . లెక్కలేనంత సొమ్ము చేసుకుంటున్నారు . నిత్యం డబ్బు మాయలో పడి కొట్టుకు చేస్తున్నారు . బంగ్లాలు ..భవంతులు ..కార్లు ..షికార్లు ..వస్తువులు ..స్టేటస్ సింబల్ గా మారాయి . ఆధునికత తెచ్చిన తంటా ఇది . వైన్ వాళ్ళు లేరు . చెప్పే వాళ్ళు ఉన్నా వారి గురించి మాట్లాడే సమయం ఉండటం లేదు . స్మార్ట్ ఫోన్లలో బతుకుతున్నారు..కానీ జీవించడం లేదు . ఒకరితో మరొకరు పోల్చుకోవడం తోనే కాలమంతా సరి పోతోంది . ఇక పక్క వాళ్ళతో మాట్లాడే ఓపిక ఎక్కడిది . కోట్లు వెనకేసుకున్నా..తరగని సంపద సమకూరినా కావాల్సింది మానసిక పరమైన సంతృప్తి. ఇదేదీ ఇప్పటి జనాలకు ఉండటం లేదు . అంతటా టెన్షన్ ..అంతులేని వత్తిడి . దీనిని తట్టుకోలేక ఇంకొన్ని వ్యసనాలకు బానిసై పోతున్నారు . బాంధవ్యాలు మరిచి ..వావి వరుసలు లేకుండానే సంబంధాలను కలిపేసుకుంటున్నారు . తల్లిదండ్రులంటే గౌరవం లేదు ..పెద్ద వాళ్ళు చెబితే చెవికెక్కదు . ఎంత సంపాదించినా కాపాడు కోవడం చేత కాదు. పొద్దున్న లేస్తే ..పడుకునే దాకా ...

నిన్నటి పోలేపల్లి ..నేటి నిజామాబాద్ కు ప్రేరణ

చిత్రం
  మట్టి ఎక్కడైనా మట్టే. కాకపోతే దానికి అందమైన ముసుగులు. ప్రత్యేక ఆర్ధిక మండళ్లు అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ పేరుతో రైతుల నుండి తక్కువకు భూములు లాగేసుకోవడం . తిరిగి వాటిని ప్రభుత్వమే వేలానికి పెట్టడం . మార్కెట్లో బహిరంగంగా అమ్మేయడం . ఇక్కడ పాలకులకు ఎవరైతే దగ్గరగా ఉంటారో ..ఎవ్వరైతే పెట్టుబడులతో పాటు తాయిలాలు అందిస్తారో వారికే విలువైన భూములు దక్కుతాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం . ఈ దేశంలో జన్మించిన ప్రతి ఒక్కరికి బతికే హక్కుతో పాటు భూమిని పొందటం కూడా ఓ హక్కే. కానీ రాను రాను భూమి కనిపించడం లేదు . కంపెనీలు ..ప్రమాదకరమైన పరిశ్రమలు ..వాటి చుట్టూ బడా బాబులు ..పాలకులు ..అధికారులు కాపలాగా ఉంటారు . పరిశ్రమలు ఏర్పాటు చేసే పెట్టుబడిదారులకు ప్రభుత్వాలు రెడ్ కార్పెట్లు పరుస్తున్నాయి . లెక్కలేనన్ని వనరులు సమకూర్చి పెడుతున్నాయి . నీళ్లు, కరెంట్ ..అనుమతి ..అవసరమీయతే రాయితీలు ఇస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నాయి . తమకు కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు వద్దంటూ అప్పట్లో పాలమూరు జిల్లా పోలేపల్లి గ్రామస్థులు అలుపెరుగని పోరాటం చేశారు . తమ నిరసనను ప్రకటించారు . దాదాపు తమ భూములు కోల్పోయిన భాదితులు 48 దాకా ప్రాణాలు...

అంతటా శ్రీమన్నారాయణ ..స్వామి కృప కోసం నిరీక్షణ

చిత్రం
  ఏపీలో ఏమో కానీ తెలంగాణ రాష్ట్రంలో వింత పరిస్థితి నెలకొంది . ఉద్యోగులు ..నిరుద్యోగులు తీవ్ర వత్తిళ్లకు లోనవుతున్నారు . భారీ ఎత్తున వేతనాలు ఉన్నా ఎక్కువగా అక్రమాలకు పాల్పడటం ..అవినీతి నిరోధక శాఖకు పట్టుబడటం ..అందులో రెవెన్యూ శాఖకే చెందిన ఉద్యోగులు ఉండడంతో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ శాఖాను ప్రక్షాళన చేస్తానని ప్రకటించారు . ఈ విషయాన్ని లోక్ సభ ఎన్నికల సందర్బంగా తెలంగాణాలో జరిగిన సమావేశాల్లో స్పష్టం చేశారు . రెండు నెలలు ఓపిక పట్టండి ..నన్ను నమ్మండి ..అందరికి ఆమోదయోగ్యమైన కొత్తగా రెవెన్యూ చట్టాన్ని తీసుకు వస్తున్నామని వెల్లడించారు . ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూములకు సంబంధించిన అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు గాను ధరణిని రూపొందిస్తున్నామని చెప్పారు . ఎన్నికల సభ సందర్బంగా ఓ రైతు తాను ఎలా రెవెన్యూ అధికారుల నుండి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో సీఎం కు ఫిర్యాదు చేశారు . ఈ విషయంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు . తాము లేకపోతే ప్రభుత్వం నడవదని..పరిపాలన అంతా తమ చేతుల్లో ఉంటుందని ..నిన్నటి దాకా అటు పాలకులకు ..ఇటు ప్రజలకు చుక్కలు చూపించిన రెవెన్యూ శాఖకు కోలుకోలేని షాక్ ఇచ్చారు కేసీఆర్ ....

అవినీతికి అంతం ఎప్పుడు ..?

చిత్రం
  ఐటీ రంగంలో దేశంలోనే టాప్ రేంజ్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇపుడు ఆన‌కొండ‌లా పేరుకు పోయిన అవినీతిని నిర్మూలించ‌లేక పోతోంది. ఏ శాఖ‌కు వెళ్లినా ఉద్యోగులు లంచాలు ఇవ్వ‌నిదే ..చేతులు త‌డ‌ప‌నిదే ప‌నులు చేయ‌డం లేదు. ఓ వైపు ఉద్యోగుల‌కు భారీ ఎత్తున వేత‌నాలు అంద‌జేస్తున్నా ..లంచావ‌తారాలు మాత్రం మార‌డం లేదు. పూర్తి స్థాయిలో అవినీతి నిరోధ‌క శాఖ దాడులు చేస్తున్నా , నేరుగా టోల్ ఫ్రీ నెంబ‌ర్ ఏర్పాటు చేసినా ఆయా శాఖ‌ల సిబ్బందిలో ఎలాంటి బెదురు క‌నిపించ‌డం లేదు. ఆఫీసుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ..క‌ట్ చేసి మ‌ళ్లీ బాజాప్తాగా డ‌బ్బులు ఇవ్వాల్సందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి అధికారంలోకి వ‌చ్చాక ఎవ‌రైనా త‌మ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భించ‌క పోతే నేరుగా ఫోన్ చేయొచ్చంటూ ఓ నెంబ‌ర్ ఇచ్చారు. ఆయా ప్రాంతాల నుండి లెక్క‌కు మించి ఫోన్లు వెళ్లాయి. ఎక్కువ‌గా రెవిన్యూ, మున్సిప‌ల్ , ఎక్సైజ్ , త‌దిత‌ర శాఖ‌ల‌పైనే బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏకంగా అవినీతికి కేరాఫ్ గా మారి పోయిన రెవిన్యూ శాఖ‌ను పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేస్తే కానీ దారికి రార‌న్న సంగ...

డాల‌ర్లు కురిపిస్తున్న డైలాగ్స్ – పంచ్‌లు ప్రాస‌ల్లో త్రివిక్రం టాప్

చిత్రం
  టెక్నాల‌జీ మారినా ..అభిరుచులలో మార్పులు చోటు చేసుకున్నా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ మాత్రం ఎలాంటి ఒడిదుడుకుల‌కు లోనుకాకుండా లాభాల బాట‌ల్లో ప‌య‌నిస్తోంది. పేరుకే చిన్న సినిమాలు అయిన‌ప్ప‌టికీ భారీ విజ‌యాల‌ను న‌మోదు చేసుకుంటున్నాయి. క్రియేటివిటీకి ప‌దును పెడుతూ సినిమాల‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. మాట‌ల‌తో గుండెల్ని పిండేస్తున్నారు. మొద‌ట్లో డైలాగ్ రైట‌ర్స్ గా ప్రారంభించిన వాళ్లల్లో ఎక్కువ‌గా డైరెక్ట‌ర్లుగా మారిపోతున్నారు. స్క్రీన్ ప్లే..మాట‌లు..డైరెక్ష‌న్ అంతా వాళ్లే చూసుకుంటున్నారు. వారిలో త్రివిక్రం శ్రీ‌నివాస్ మొద‌టి వ‌రుస‌లో నిలుస్తారు. చాలా సినిమాల‌ను ఆయ‌న పోయెటిక్‌గా ..అద్భుతంగా తీస్తారు. ప్ర‌తి కేరెక్ట‌ర్ కు ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిత్వం వుంటుంది. అలా వుండేలా చేస్తారు త్రివిక్రం. కేవ‌లం ఆయ‌న రాసే మాట‌ల కోసం సినిమాలు చూసే వారున్నారంటే న‌మ్మ‌గ‌ల‌మా. అవును..వాస్త‌వం కూడా. మాట‌ల్లో ప‌వ‌ర్ వుంటుంది. మ‌న చుట్టూ ఉన్న మ‌నుషులు, ప్రాంతాలే వాటికి ప్రేర‌ణ ఇస్తుంటాయంటారు ఓ సంద‌ర్భంలో ఈ డైరెక్ట‌ర్. సంపాదించ‌డం చేత కాని వాడికి ..కూర్చుని ఖ‌ర్చు పెట్టే అర్హ‌త లేదంటారు..తండ్రి పాత్ర‌లో చంద్ర‌మోహ‌...

అవును..త‌గ్గితే త‌ప్పేంటి..?

చిత్రం
  ఏముంది గురూ..మ‌హా అయితే విజ‌యం ఎంతో మందితో చ‌ప్ప‌ట్లు కొట్టించేలా చేస్తుందేమో కానీ..ఓట‌మి ఇచ్చినంత మ‌జా..అనుభ‌వం ఇంకేదైనా ఇస్తుందా..అనుకుంటాం ..కానీ ..కాలం ఎన్ని ప‌రీక్ష‌ల‌కు గురి చేస్తుంద‌ని..తెలియ‌కుండానే దాని మాయ‌లో ప‌డిపోతాం. పొద్దు పొడిచిన‌ప్ప‌టి నుండి పొద్దు గూకే దాకా..ఉరుకులు ప‌రుగులు..ఎక్క‌డికి వెళుతున్నామో..దేని కోసం వెదుకుతున్నామో..ఎందు కోసం బ‌తుకుతున్నామో తెలియ‌కుండానే ప్ర‌యాణం చేస్తూనే ఉన్నాం..నిన్న‌టి నుంచి నేటి దాకా. మ‌జిలీ అనుకున్న ‌ది మ‌ళ్లీ మొద‌ల‌వుతుంది. భిన్న‌మైన భావాలు..విరుద్ధ‌మైన ఆలోచ‌న‌లు..ప‌ర‌స్ప‌రం ఒక్క‌ట‌వుతున్న‌ట్టు అనిపించినా ఎక్క‌డో ఓ మూల‌న కించిత్ అహం. నాకేమీ అన్న ధీమా..మొహ‌మాటం..ఇవ్వ‌న్నీ మ‌న‌ల్ని ఒక ప‌ట్టాన ఉండ‌నీయ‌వు. మ‌న కేర‌క్ట‌ర్‌ను..మ‌న న‌డ‌త‌ను ..మ‌న ఆలోచ‌నల్ని అవే నియంత్రిస్తాయి..నిర్దేశించే స్థాయికి చేరుకుంటాయి. ఇక్క‌డే ఆగిపోవాల‌ని అనిపిస్తూ వుంటుంది..కానీ ఉండ‌లేం. ఈ లైఫ్ దేనిని ఓ ప‌ట్టాన అలా ఒకే చోట ఉండ‌నీయ‌దు. అందుకే దానికంత‌టి ప్ర‌త్యేక‌త‌..ప్ర‌తి ఒక్క‌రు అందులోకి రావాల‌ని త‌పిస్తారు. కానీ వ‌చ్చాక ..ఎందుకు దీనిని భ‌రిస్తున్నామో అంటూ లోల...

మార‌ణ‌హోమాన్ని ఆప‌లేమా ..?

చిత్రం
  మాన‌వ‌త్వం త‌ల్ల‌డిల్లిన స‌మ‌యం ఇది. స‌భ్య స‌మాజం త‌లొంచు కోవాల్సిన ప‌రిస్థితి. అత్యంత దారుణ‌మైన సంఘ‌ట‌న ఇది. క‌న్నీళ్లు ఉబికి వస్తున్న వేళ‌..ఎన్ని శాంతి ప్ర‌వ‌చ‌నాలు ప‌లికినా జ‌ర‌గాల్సిన దారుణం జ‌రిగి పోయింది. ఘోర‌మే మిగిలింది. ఉగ్ర‌వాదం పెచ్చ‌రిల్లి పోయినా..ఆయా దేశాల మ‌ధ్య స‌రిహ‌ద్దులు చెరిగి పోయినా ఇంకా ఉగ్ర మూకలు త‌మ దాడులు ఆప‌డం లేదు. ఇది ముమ్మాటికి ఏలిన వారు..ప్ర‌స్తుత పాల‌కులే బాధ్య‌త వ‌హించాలి. ఇంటెలిజెన్స్ వైఫ‌ల్యం అని అనుకోవ‌డానికి వీలు లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉగ్ర మూక‌లు ప్ర‌తి చోటా త‌మ స్థావ‌రాల‌ను ఏర్పాటు చేసుకున్నారు. వారిని గుర్తించ‌డం అన్న‌ది క‌ష్టంగా మారింది. కోట్లాది రూపాయ‌లు శాంతి భ‌ద్ర‌త‌ల కోసం ఖ‌ర్చు చేస్తున్నాయి ఆయా దేశాలు . అయినా ఉగ్ర‌వాదం స‌మ‌సి పోవ‌డం లేదు. ఎక్క‌డ చూసినా ఏదో రూపకంగా దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. వీటిని క‌ట్ట‌డి చేసేందుకు నానా తంటాలు ప‌డుతున్నాయి ఆయా దేశాల పోలీసులు. ఓ వైపు బాంబుల మోత‌..ఇంకో వైపు రాకెట్ల దాడులు..ఇంకో వైపు అణుబాంబుల ప్ర‌యోగాలు..ఇలా ఎక్క‌డిక‌క్క‌డ ఆధిప‌త్యం కోసం అంత‌ర్యుద్ధాలు మొద‌ల‌య్యాయి. కోట్లాది ప్ర‌జ‌లు స‌గానికి పైగా తిండి...

జ్ఞానపు వెలుగులు..లోకానికి దిక్సూచీలు ..పుస్త‌కాలు

చిత్రం
  ప్ర‌పంచాన్ని మార్చే శ‌క్తి పుస్త‌కాల‌లో ఉంది. ఆహారం లేకుండా నేనుండ‌గ‌ల‌ను. కానీ పుస్త‌కాలు చ‌ద‌వ‌కుండా..రాయ‌కుండా నేనుండ‌లేనంటూ వాపోయాడు..దాస్ కేపిట‌ల్ సృష్టిక‌ర్త కార్ల్ మార్క్స్ మ‌హాశ‌యుడు. ఆయ‌న అష్ట క‌ష్టాలు ప‌డ్డాడు. ఏంగిల్స్ అనే స్నేహితుడు లేక పోతే పెట్టుబ‌డి పూర్త‌య్యేది కాదేమో. జీవితాంతం క‌న్నీళ్ల‌తోనే ఆయ‌న స‌హ‌వాసం చేశాడు. కానీ రాయ‌కుండా ఉండ‌లేక పోయాడు. వేలాది పుస్త‌కాల‌ను అమూలాగ్రం చ‌దివాడు. ఇవాళ పుస్త‌క దినోత్స‌వం. రోజు రోజుకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టెక్నాల‌జీ ప‌రంగా ఎన్నో మార్పులు వ‌చ్చాయి. కానీ పుస్త‌కాలు అంత‌కంత‌కూ ప్ర‌చురితం అవుతూనే ఉన్నాయి. ఫిక్ష‌న్..నాన్ ఫిక్ష‌న్ ..ఇలా ప్ర‌తి విభాగంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ల‌క్ష‌లాది పుస్త‌కాలు ప్రింటింగ్‌కు నోచుకుంటున్నాయి. క‌విత్వం, సాహిత్యం, నాట‌కం, క‌ళ‌లు, వ్య‌క్తిగ‌త జీవిత చ‌రిత్ర‌లు, స్వ‌గ‌తాలు, అనువాదాలు, న‌వ‌ల‌లు, నాటిక‌లు, గ‌ల్పిక‌లు, చ‌రిత్ర‌, సామాజిక శాస్త్రాలు ఇలా ప్ర‌తి రంగానికి చెందిన పుస్త‌కాలు విరివిగా దొరుకుతున్నాయి. లెక్క‌కు మించి చిన్నారులు, పెద్ద‌లు , మ‌హిళ‌లు , ఇత‌ర రంగాల‌కు చెందిన వారంతా చ‌ద‌వ‌డం హాబీగా ...

ప్రేమా క‌వ్వించ‌నీ..మ‌న‌సా ర‌వ‌ళించ‌నీ

చిత్రం
  తెర మీద పాత్ర‌లు మార్చినంత ఈజీగా ప్రేమికులు మారిపోతున్నారు. ప్రేమంటే రెండు గుండెల చ‌ప్పుడు. రెండు మ‌న‌సుల మౌనం. ఒక‌రి క‌ళ్ల‌ళ్ల‌లోకి ఇంకొక‌రు చూసుకుంటూ ..లోకానికి ఆవ‌ల హృద‌యాల‌తో మాట్లాడుకోవ‌డం. ప్రేమంటే ఏమిటంటే ..ప్రేమించాక తెలిసే అంటూ సినీ క‌వి రాసినా..ప్రేమ ఒక మధుర‌మైన భావ‌న‌. అనిత‌ర సాధ్య‌మైన ఆలోచ‌న‌. అదొక్క‌టే మ‌న‌లోకి చేరిపోతే..జీవితం కొత్త‌గా అనిపిస్తుంది. గుండెల్లో ఏదో కెలుతున్న‌ట్లు..గాల్లో తేలిపోతున్న‌ట్లు..మ‌న‌సంతా దూది పింజెల్లా మారిపోతున్న‌ట్లు..ప‌క్షుల్లా గాల్లో ఎగురుతున్న‌ట్లు అనిపిస్తుంటంది. ఇది స‌హ‌జాతి స‌హ‌జం కూడా. సామాన్యుల నుండి కోట్లున్న సంప‌న్నుల దాకా అంద‌రూ జీవితంలో ఎప్పుడో ఒక‌ప్పుడు ప్రేమ‌లో ప‌డ్డ వారే..ప‌డిపోయిన వారే. ప్రేమ‌కున్న శ‌క్తి అలాంటిది. ప్రేమ అన్న‌ది ఓ దీపం లాంటిది. దానికి ఎప్ప‌టిక‌ప్పుడు ఆత్మీయ‌త అనే నూనె పోస్తూనే ఉండాలి. అది వెలుగుతూనే ఉంటుంది. లోకంలో జ‌న్మించిన ప్ర‌తి ఒక్క‌రికి కొన్ని ఫాంట‌సీస్ వుంటాయి. అవ‌న్నీ జ‌ర‌గాల‌ని లేదు. కొన్నిసార్లు ఈ ఆలోచ‌న‌లు ఇలాగే వుండిపోతే బావుండున‌ని అనిపిస్తుంటుంది. ఏం చేస్తాం. ఇవాళ ప్రేమంటే వ్యాపారం అయి పోయింద...

ఆంజ‌నేయ అభ‌య‌ప్ర‌దాత – పంచ‌ముఖి స్వ‌ర్ణ‌ముఖి ..!

చిత్రం
  క‌ర్ణాట‌క‌- తెలంగాణ స‌రిహ‌ద్దులో ఉన్న శ్రీ పంచ‌ముఖి దేవాల‌యం ఘ‌న‌మైన చ‌రిత్ర‌ను స్వంతం చేసుకున్న‌ది. ముఖ్యంగా క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ఏపీ, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర త‌దిత‌ర ప్రాంతాల నుండి ఈ ఆల‌యానికి భ‌క్తులు రావ‌డం ప‌రిపాటిగా మారింది. క‌ర్ణాట‌కలో అత్యంత పేరొందిన దేవాల‌యాల‌లో ఇది ముఖ్య‌మైన‌ది. మఠాల‌లో పేరొందిన మ‌ఠంగా మంత్రాల‌య రాఘ‌వేంద్ర స్వామి మ‌ఠానికి చ‌రిత్ర ఉన్న‌ది. విశిష్ట‌మైన వార‌స‌త్వం ఉన్న‌ది. ప్ర‌స్తుతం సుశీంద్రులు మ‌ఠానికి పీఠాధిప‌తిగా ఉన్నారు. గ‌తంలో పోల్చితే ఎన్న‌డూ లేనంత‌గా తిరుప‌తి పుణ్య‌క్షేత్రానికి ధీటుగా ..స‌క‌ల సౌక‌ర్యాల‌తో ..ఘ‌న‌మైన ఏర్పాట్ల‌ను పూర్తి చేశారు. ఇదంతా ఆల‌య నిర్వాహ‌కుల కృషి వ‌ల్ల‌నే సాధ్య‌మైంది. ఎక్క‌డా ఇబ్బంది అంటూ త‌లెత్త‌కుండా ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఓ వైపు ట్రైన్ సౌక‌ర్యంతో పాటు బ‌స్సులు ఎళ్ల‌వేళ‌లా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంతానికి ఎంతటి చ‌రిత్ర ఉందో ..రాయిచూర్ – మంత్రాల‌యం పీఠం కు వెళ్లే జాతీయ ర‌హ‌దారి మ‌ధ్య‌లో ఎరిగేరి మండ‌ల ప‌రిధిలో పంచ‌ముఖి ఆల‌యం ఉంది. ఇక్క‌డికి భ‌క్తులు తండోప‌తండాలుగా త‌ర‌లి వ‌స్తుంటారు. వేలాది మంది అమ‌వాస్య అయ్యిందంటే చాల...

వ్య‌వ‌సామే బెట‌ర్ అంటున్న ఇంజ‌నీర్

చిత్రం
  ఎవ‌రైనా ప్ర‌భుత్వ కొలువు వ‌దులుకుంటారా..అలా చేస్తే అత‌డిని పిచ్చోడ‌ని మ‌నం కామెంట్స్ చేస్తాం. కానీ హ‌రీష్ ద‌న్ దేవ్ మాత్రం నెల నెలా వ‌చ్చే జీతాన్ని వ‌దులుకున్నాడు కేవ‌లం వ్య‌వ‌సాయం మీదున్న ప్రేమ‌తో. జైస‌ల్మేర్ ప్రాంతానికి చెందిన హ‌రీష్ ..మేధావి. ఇంగ్లీష్ భాష‌పై మంచి ప‌ట్టుంది. ప్ర‌భుత్వ ఇంజ‌నీర్‌గా ప‌నిచేశాడు. కానీ ఎందుక‌నో దాని మీద ఆస‌క్తి త‌గ్గి పోయింది. 2012లో జైపూర్‌లో ఇంజ‌నీరింగ్ కంప్లీట్ చేశాడు. ఢిల్లీలో ఎంబీఏ కోసం అప్ల‌యి చేశాడు. ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ ప‌రీక్ష రాసి ఎంపిక‌య్యాడు. ఆ త‌ర్వాత ఉద్యోగం చేసుకుంటూనే ఎంబీఏ చ‌దివాడు. జూనియ‌ర్ ఇంజ‌నీర్‌గా జైస‌ల్మేర్ మున్సిపాలిటీలో ప‌నిచేశాడు. రెండు నెల‌ల పాటు ప‌నిచేశాక స‌ర్కార్ జాబ్ పై ఆస‌క్తి తగ్గింది. బిక‌నేర్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్శిటీని సంద‌ర్శించాడు హ‌రీష్‌. కందులు, సిరి ధాన్యాల గురించి తెలుసుకున్నారు. వ్య‌వ‌సాయ నిపుణుల‌తో చ‌ర్చించాక ఓ నిర్ణ‌యానికి వ‌చ్చాడు.  అలోవేరా ఫార్మింగ్ చేస్తే బావుంటుంద‌ని సూచించ‌డంతో దానిపై దృష్టి పెట్టారు. మ‌రింత సాగుపై అవ‌గాహ‌న పెంచుకునేందుకు ఢిల్లీకి వెళ్లారు. అక్క‌డ వ్య‌వ‌సాయ రంగంపై ఏర్పాటు చే...

ర‌విప్ర‌కాశ్ ఎందుకిలా..?

చిత్రం
  తెలుగు మీడియా రంగంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను ఆపాదించుకుని..ఓ బ్రాండ్‌గా ఎదిగిన ర‌వి ప్ర‌కాశ్ జ‌ర్న‌లిస్టుగా సుప‌రిచితులే. ప్రింట్ అనే స‌రిక‌ల్లా రామోజీరావు ఎలా గుర్తుండి పోతారో..మీడియా అనే స‌రిక‌ల్లా ర‌వి అలాగే గుర్తుండి పోతారు. చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో బ‌షీర్ బాగ్ సంఘ‌ట‌న అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. రైతుల‌పై కాల్పులు..దానిని ప్ర‌జెంటేష‌న్ చేసిన తీరు తెలుగువారిని ఆశ్చ‌ర్య పోయేలా చేసింది. ఆ త‌ర్వాత ఓ మిస్సైల్‌లా దూసుకు వ‌చ్చాడు. అంత‌కు ముందు సుప్ర‌భాతంలో ప‌నిచేసిన‌ట్టు గుర్తు. వెలిజాల శ్రీ‌నివాస్ రెడ్డి, ర‌విప్ర‌కాశ్ ఇద్ద‌రూ ఒక టేబుల్ ద‌గ్గ‌ర కూర్చుంటే..నేను శైలేష్ రెడ్డి మ‌రో టేబుల్ వైపు కూర్చున్నాం. ఆ స‌మ‌యంలో టీవీ9 ఛాన‌ల్ గురించి చ‌ర్చ జ‌రుగుతోంది. తెలుగు రాష్ట్రంలో అదో సంచ‌ల‌నం. 24 గంట‌ల న్యూస్ ఛాన‌ల్‌ను ఎవ‌రు చూస్తారులే అనుకున్నారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌తో పాటు పాత్రికేయులు, మీడియా ప్ర‌ముఖులు, బ్రాడ్ కాస్ట్ జ‌ర్న‌లిస్టులు, ఫ్రీలాన్స‌ర్స్ కూడా. కానీ అక్క‌డే తానేమిటో రుజువు చేసుకున్నాడు. వ్య‌క్తిగ‌తంగా విభేదించినా ..జ‌ర్న‌లిస్టుగా ర‌వి సాధించిన స‌క్సెస్ చిన్న...

ప‌వ‌ర్ పాలిటిక్స్‌లో శ్ర‌వ‌ణానందం..!

చిత్రం
  తుచ్చు ప‌ట్టిన రాజ‌కీయాల్లో ఆయ‌నో రాకెట్‌లా ముందుకు వ‌చ్చారు. తెలంగాణ ప్రాంతంలో ఎన్న‌ద‌గిన ..ప‌రిణితి చెందిన రాజ‌కీయ వేత్త‌ల‌లో..మేధావుల‌లో..విశ్లేష‌కుల‌లో ప‌ట్టుమ‌ని ప‌ది మందిని ఎంపిక చేస్తే ..అందులో దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ ముందు వ‌రుస‌లో నిలుస్తారు. అంతలా ఆయ‌న వినుతికెక్కారు. కొన్నేళ్లుగా..త‌ర‌త‌రాలుగా మోసానికి..దోపిడీకి గురైన మ‌ట్టిత‌న‌పు ఆన‌వాళ్లు క‌లిగిన ..క‌ర‌వుకు ఆల‌వాల‌మైన న‌ల్ల‌గొండ జిల్లా నుంచి వ‌చ్చారు. విశ్వ‌బ్రాహ్మ‌ణ కులం నుంచి వ‌చ్చిన ఆయ‌న ఎన్నో క‌ష్టాలు అనుభ‌వించారు. కానీ విద్యాధికుడిగా..మేధావిగా..తెలంగాణ ప్రాంతాన్ని .దాని అస్తిత్వాన్ని అర్థం చేసుకున్న నాయ‌కుడిగా అంచెలంచెలుగా ఎదిగారు. ఓ ఐటీ కంపెనీకి బాధ్యులుగా ఉన్నారు. స‌మాజాన్ని ప్ర‌భావితం చేసే ప్ర‌తి అంశం ప‌ట్ల దాసోజు స్పందించారు. స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం జ‌రిగిన పోరాటంలో , ఉద్య‌మంలో నిజాయితీగా పాల్గొన్నారు. నిబ‌ద్ధ‌త క‌లిగిన కార్య‌క‌ర్త‌గా, వ్య‌క్తిగా త‌న వంతు బాధ్య‌త‌ను నిర్వ‌హించారు.తెలంగాణ‌కు జ‌రిగిన అన్యాయం గురించి కేసీఆర్, జ‌య‌శంక‌ర్ లాంటి వాళ్లు జ‌నాన్ని జాగృతం చేస్తే..శ్ర‌వ‌ణ్ అలుప...

పిల్ల‌ల పాలిట దేవుడు ఈ క‌లెక్ట‌ర్

చిత్రం
  మ‌న‌సుంటే మార్గాలు ఎన్నో. కావాల్సింద‌ల్లా సంక‌ల్పం. మ‌నుషుల ప‌ట్ల కాసింత అభిమానం. చాలా మంది క‌లెక్ట‌ర్లు అధికార ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శిస్తారు. ఇంకొంద‌రైతే దైవాంశ సంభూతులుగా భావిస్తారు. కానీ క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చి..జాతీయ స్థాయిలో సివిల్ స‌ర్వీసెస్ కు ఎంపికైన వారిలో ఎలాంటి డాబూ..ద‌ర్పం ఉండ‌దు. సింపుల్ గా వుంటారు..ప్ర‌జ‌ల‌ను ప్రేమిస్తారు. వారి కోసం ఏమైనా చేయాల‌ని త‌ప‌న‌తో ఉంటారు. అలాంటి వారిలో కోవే ఒక‌రు. ఈ క‌లెక్ట‌ర్ ఏకంగా జ‌నంతో క‌లిసి కొన్నేళ్లుగా అప‌రిష్కృతంగా ఉన్న రోడ్డుకు మోక్షం క‌ల్పించారు. ప్ర‌పంచం ఈ క‌లెక్ట‌ర్ చేసిన ప్ర‌య‌త్నాన్ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తింది. కొంద‌రు అధికారులు జ‌నంతో, అధికారుల‌తో మాట్లాడేందుకు సైతం ఇష్ట‌ప‌డరు. కానీ వ‌రంగ‌ల్ జిల్లా అర్భ‌న్ క‌లెక్ట‌ర్ ప్ర‌శాంత్ జీవ‌న్ పాటిల్ భిన్నంగా ఆలోచించారు. కొత్త ఐడియాకు శ్రీ‌కారం చుట్టారు. రాష్ట్రం మొత్తం ఆశ్చ‌ర్య పోయేలా ..మిగ‌తా జిల్లాల క‌లెక్ట‌ర్లు నివ్వెర పోయేలా చేశారు. కార్పొరేట్ కాలేజీలు, స్కూల్స్ పిల్ల‌ల‌తో క‌లెక్ట‌ర్లు ఫోటోలు దిగుతున్నారు. ఎక్క‌డ‌లేని ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఒక ర‌కంగా స‌మాజానికి ఆద‌ర్శంగా ఉండాల్సిన...

భాగ్య‌న‌గ‌రం అద్భుతం..ప్రేమ అజ‌రామ‌రం

చిత్రం
నియాన్ లైట్ల వెలుతురులో నా న‌గ‌రం వెలిగి పోతోంది. గుండె గుండెలో ప్రేమ జ‌ల్లుల‌ను చ‌ల్లుకుంటూ. రంజాన్ వేళ‌ల్లో నిండు చంద‌మామ క‌దులుతూ వుంటే..లాడ్ బ‌జార్ లో గాజుల గ‌ల‌గ‌ల‌లు హృద‌యాల‌పై చెర‌గ‌ని రాగాల‌ను అద్దుతాయి. అప్పుడే పూసిన పూలు..విచ్చుకున్న పెద‌వుల మ‌ధ్య న‌వ్వుల కేరింత‌లు..కుల‌మ‌తాల‌కు అతీతంగా జ‌నం ఒక‌రినొక‌రు చూసుకుంటూ స‌ముద్రంలోని ఇసుక రేణువుల్లా త‌చ్చ‌ట్లాడుతూ వుంటే ..మ‌ళ్లీ ప్రేమ‌త‌న‌పు జ్ఞాప‌కాలు మ‌న‌సులో చిగురిస్తాయి. ప్రేమంటే గుండెల క‌ల‌యిక‌. తాను ప్రేమించిన ..త‌న కోసం జీవితాన్ని అర్పించిన భాగ్‌మ‌తి కోస‌మే క‌దా ఈ న‌గ‌రం రూపు దిద్దుకున్న‌ది. అదే భాగ్య‌న‌గ‌ర‌మై భాసిల్లుతోంది. కోట్లాది ప్ర‌జ‌ల ఆత్మ‌ల‌న్నీ ఒక్క‌టై న‌గ‌రాన్ని అల్లుకు పోయేలా చేస్తోంది. ఈ ప్రాంతంలో అడుగు పెడితే చాలు ప్రేమ ఉప్పొంగుతుంది. వెల్లువ‌లా చుట్టేస్తుంది. అటు చూస్తే చార్మినార్ ..న‌గ‌ర‌పు వాసుల ఉమ్మ‌డి ఆస్తి. ప్ర‌పంచానికే పాఠం నేర్పిన చ‌రిత్ర ఈ న‌గ‌రానిదే. త‌రాలు మారినా వ‌న్నె త‌గ్గ‌లేదు. అప్ర‌హ‌తిహ‌తంగా త‌న ఖ్యాతిని దిగంతాల‌కు వ్యాపించేలా భాగ్య‌న‌గ‌రం త‌న‌ను తాను మ‌లుచుకుంది. ప్రేమ కోసం కోట్లాది రూపాయ‌ల ఆస్తు...