పోస్ట్‌లు

మే 10, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

గుజ‌రాత్ రైతుల క‌హానీ - దిగొచ్చిన దిగ్గ‌జ కంపెనీ

చిత్రం
అమెరికా కార్పొరేట్ డ్రింక్స్ అండ్ ఫుడ్ బేవ‌ర్జీస్ కంపెనీ పెప్సికో గుజ‌రాత్ ఆలుగ‌డ్డ‌ల రైతుల‌పై వేసిన కేసులను ఉప‌సంహ‌రించుకుంది. అంత‌ర్జాతీయంగా, దేశీయంగా విప‌రీత‌మైన ఒత్తిడి రావ‌డం..అది న్యాయ‌స‌మ్మ‌తం కానేకాద‌ని రూఢీ అవ‌డంతో ఈ దిగ్గ‌జ కంపెనీ త‌ల‌వంచ‌క త‌ప్ప‌లేదు. ఒక రకంగా ఇది అన్న‌దాత‌ల నైతిక గెలుపుగా భావించాలి. ఎఫ్‌సీ5 ఆలుగ‌డ్డ‌ల‌ను త‌మ అనుమ‌తి లేకుండా గుజ‌రాత్‌కు చెందిన రైతులు సాగు చేశారంటూ ..వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ యుఎస్ పెప్సికో కంపెనీ కేసు న‌మోదు చేయించింది. దీనిపై పెద్ద దుమారం జ‌రిగింది. మొత్తం తొమ్మిది మంది రైతుల‌పై కేసులు న‌మోదు చేసేలా చేసింది ఈ సంస్థ‌. లేస్ పొటాటో చిప్స్ త‌యారీకి ఇది ఇబ్బందిక‌రంగా ఉంటోందంటూ న‌మోదు చేసిన కేసులో పేర్కొన్నారు. ఈ నెల రెండున న‌మోదు చేసిన కేసుల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది పెప్సికో. ఈ పొటాటో వెరైటీని పండించాల‌న్నా లేదా స‌ర‌ఫ‌రా చేయాల‌న్నా, అమ్మాల‌న్నా త‌మ ప‌ర్మిష‌న్ తీసుకోవాల్సిందేన‌ని..ఈ వంగ‌డంపై త‌మ‌కు పేటెంట్ హ‌క్కు ఉందంటూ పెప్సికో లేస్ కంపెనీ సూట్ వేసింది. ఎఫ్‌సీ5 వంగ‌డాన్ని రైతులు పెద్ద ఎత్తున పండించారు. అ...

ప్ర‌పంచం మెచ్చిన 10 ఎయిర్ పోర్ట్స్ ఇవే

చిత్రం
ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తి రోజు వేలాది విమానాలు ల‌క్ష‌లాది మందిని ఒక చోటు నుంచి మ‌రో చోటుకు చేర‌వేస్తున్నాయి. వేలాది మంది ఉద్యోగులు నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేస్తున్నారు. వ్యాపారాలు, ఉద్యోగాల నిమిత్తం విమానాశ్ర‌యాల‌ను ప్ర‌యాణికులు ఆశ్ర‌యించాల్సిందే. లేక‌పోతే ఎక్క‌డికీ వెళ్ల‌లేం. కొన్ని ప్ర‌భుత్వ ఆధీనంలో ఎయిర్‌లైన్స్ న‌డిస్తే చాలా మ‌టుకు ప్రైవేట్ భాగ‌స్వామ్యంలోని ఎయిర్ లైన్స్‌లు ప్ర‌యాణికుల‌ను చేర‌వేస్తున్నాయి. ఆదాయాన్ని స‌మ‌కూర్చుకుంటున్నాయి. విమాన ప్ర‌యాణం త‌ప్ప‌నిస‌రిగా కావ‌డంతో వ్యాపార‌స్తులు, సంస్థ‌లు, కంపెనీలు కొత్త‌గా ఎయిర్ లైన్స్ ను ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నాయి. ఇంకొన్ని నిర్వ‌హ‌ణ లోపం వ‌ల్ల త‌లుపులు మూసేస్తున్నాయి. ఉద్యోగులు రోడ్డు మీద ప‌డుతున్నారు. ఓ వైపు కొన్ని మూత ప‌డుతుంటే మ‌రికొన్ని కొత్త‌వి పుట్టుకు వ‌స్తూనే ఉన్నాయి. ఎయిర్ పోర్ట్‌ల నిర్మాణం, మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న‌, సౌక‌ర్యాల ఏర్పాటు, ఫ్ల‌యిట్ల కాల ప్ర‌మాణం, త‌దిత‌ర వాటిని ప్రామాణికంగా తీసుకుని అంత‌ర్జాతీయంగా ఎయిర్ పోర్ట్స్ జాబితాను ఎంపిక చేసింది. మొత్తం 10 లార్జెస్ట్ విమానాశ్ర‌యాల‌ను ప్ర‌క‌టించింది. హార్...

దియా మీర్జాకు అరుదైన గౌర‌వం - ఐరాసాకు బ్రాండ్ అంబాసిడ‌ర్

చిత్రం
ప్ర‌ముఖ భార‌తీయ సినీ న‌టిమ‌ణి దియా మీర్జాకు అరుదైన గౌర‌వం ల‌భించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఐక్య‌రాజ్య స‌మితి సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాల ( ఎస్ డి జి) బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా ఆరుగురిని ఎంపిక చేసింది. అందులో ఇండియాకు చెందిన న‌టి దియా కూడా ఒక‌రుగా ఉన్నారు. నైజారియా, చాద్, ద‌క్షిణాఫ్రికా, ఇరాక్, బ్రెజిల్ దేశాల నుంచి ఒక్క‌రొక్క‌రి చొప్పున ఎంపిక చేశారు. కొత్త అంబాసిడ‌ర్ల‌తో క‌లిసి మొత్తం 17 మంది ఉండే ఈ స‌భ్యులు ఆక‌లి, పేద‌రికాని రూపు మాప‌డం, అంద‌రికీ ఆరోగ్య సంర‌క్ష‌ణ క‌ల్పించే దిశ‌గా కృషి చేస్తార‌ని ఐక్య‌రాజ్య స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియా గ‌టెర‌స్ వెల్ల‌డించారు. దియా మీర్జా మొద‌టి నుంచి భిన్నంగా ఆలోచించారు. న‌టీమ‌ణిగా పేరు తెచ్చుకున్నా..సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. దీంతో అరుదైన గౌర‌వం ఈ సంద‌ర్భంగా ఆమెకు ద‌క్కింద‌నే చెప్పాలి. దియా మీర్జా 15 సెప్టెంబ‌ర్ 1980లో జ‌న్మించారు. మోడ‌ల్ గా, న‌టిమ‌ణిగా, నిర్మాత‌గా , అంద‌గ‌త్తెగా పేరు తెచ్చుకున్నారు. మిస్ ఏసియా ప‌సిఫిక్ 2000 టైటిల్‌ను కూడా గెల్చుకున్నారు ఆమె. బాలీవుడ్‌లో న‌టించినా ఆమె సామాజిక సేవ చేయ‌డం మాను...

ర‌స‌వ‌త్త‌ర పోరుకు చెన్నై రెడీ - ముంబై ఇండియ‌న్స్‌తో ఫైన‌ల్

చిత్రం
విశాఖ‌లో ఐపీఎల్ ఫైన‌ల్ కోసం జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ఢిల్లీ కేపిట‌ల్స్‌ను ఓడించింది. అంత‌కు ముందు ముంబై జ‌ట్టు చేతిలో పేల‌వ‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించి అప‌జ‌యం పాలైన ఈ జ‌ట్టు అనూహ్యంగా పుంజుకుంది. అటు బ్యాటింగ్‌లోను ఇటు బౌలింగ్‌లోను అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చింది. హైద‌రాబాద్ లో జ‌రిగే ఫైన‌ల్ పోరాటానికి తాను సిద్ధంగా ఉన్నాన‌ని ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు స‌వాల్ విసిరింది. రెండు మూడు మ్యాచ్‌ల్లో విఫ‌ల‌మైన స్టార్ బ్యాట్స్ మెన్ ..వాట్స‌న్ ఫామ్‌లోకి రాగా ..ఎప్ప‌టిలాగే డుప్లిసిస్ దుమ్ము రేపాడు. చెన్నైకి విజ‌యాన్ని అందించ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. మూడు సార్లు ఐపీఎల్ టోర్నీ ఛాంపియ‌న్‌గా చెన్నై విజ‌యం సాధించింది. మొద‌టిసారిగా ఎలాగైనా స‌రే ఫైన‌ల్‌కు చేరుకోవాల‌న్న క‌సితో ఆడిన ఢిల్లీ కేపిట‌ల్స్ జ‌ట్టు ఆశ‌లు అడియాశ‌లే అయ్యాయి. చెన్నై జ‌ట్టుకు ఇది ఎనిమిదో ఐపీఎల్ ఫైన‌ల్ కావ‌డం విశేషం. ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీపై చెన్నై గెలుపొందింది. దీప‌క్ చాహ‌ర్ బ్రావో, జ‌డేజా, హ‌ర్భ‌జ‌న్ సింగ్‌లు త‌లో రెండు వికెట్ల చొప్పున తీశారు. క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఢిల్లీని ప‌రుగులు చే...

ఫిలిప్స్ ఇన్నోవేష‌న్ సెంట‌ర్ సిఇఓగా క‌ళావ‌తి

చిత్రం
బెంగ‌ళూరు కేంద్రంగా కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క‌మైన బ్రాండ్ నేమ్ క‌లిగిన ఫిలిప్స్ ఇండియా ఇన్నోవేష‌న్ క్యాంప‌స్‌కు క‌ళావ‌తిని ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారిగా ఆ సంస్థ నియ‌మించింది. ఈ కీల‌క‌మైన నిర్ణ‌యాన్ని ఇటీవ‌లే ప్ర‌క‌టించింది. 2019 మే 2వ తేదీ నుండి ఆమె త‌న బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హించ‌డం ప్రారంభిస్తుంద‌ని పేర్కొంది. ఒక మ‌హిళ‌ను అంత‌ర్జాతీయ సంస్థ‌కు ముఖ్య ప‌ద‌వికి ఎంపిక చేయ‌డం ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గ్లోబ‌ల్ క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్, ఆప‌రేష‌న్స్ ఫ‌ర్ ఫిలిప్స్ హెల్త్ కేర్ ఇన్ ఫార్మాటిక్స్ బిజినెస్ కు హెడ్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. గ‌త ఆరు సంవ‌త్స‌రాలుగా పిఐసీకి సిఇఓగా శ్రీ‌నివాస్ ప్ర‌సాద్ స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేశారు. ఫిలిప్స్ ఇన్నోవేష‌న్ క్యాంప‌స్‌ను బెంగ‌ళూరులో 1996 సంవ‌త్స‌రంలో ప్రారంభించారు. ఈ క్యాంప‌స్‌లో సాఫ్ట్ వేర్ రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ యూనిట్ పై కాన్ సెంట్రేష‌న్ చేస్తుంది. ఈ రీసెర్చ్ యూనిట్‌లో 3 వేల 500 మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. హెల్త్ కేర్ రంగంలో సొల్యూష‌న్స్ అండ్ స‌ర్వీసెస్ అంద‌జేస్తోంది పీఐసీ కంపెనీ. ఇదే రంగానికి సంబంధి...