పోస్ట్‌లు

జులై 26, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఓయో బంప‌ర్ ఆఫ‌ర్..హోట‌ల్ ఓన‌ర్స్‌కు ల‌క్కీ ఛాన్స్

చిత్రం
రితేష్ అగ‌ర్వాల్ పేరు విన్నారా. అతడు సృష్టించిన సునామీకి ప్రపంచాన్ని హోట‌ల్ రంగంలో శాసిస్తున్న దిగ్గ‌జ కంపెనీల‌న్నీ జ‌డుసుకుంటున్నాయి. ఓ ఐడియా జీవితాన్ని మార్చేస్తుంద‌న‌డానికి రితేష్ ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. ఎక్క‌డ ఢిల్లీ..ఎక్క‌డ ఇండియా..ఎక్క‌డ వ‌ర‌ల్డ్..ఓహ్..అత‌డు సాధించిన అపూర్వ‌మైన విజ‌యం కోట్లాది మందికి స్ఫూర్తి దాయ‌కంగా నిలుస్తోంది. త‌క్కువ పెట్టుబ‌డితో స్టార్ట్ చేసిన ఓయో ఇపుడు సంచ‌ల‌నాల‌కు తెర తీసింది. ఇండియాలో ఏ మూల‌కు వెళ్లినా..ఏ హోట‌ల్ ను సంద‌ర్శించినా ఓయో బోర్డు క‌నిపిస్తుంది. ప్ర‌తి హోట‌ల్ య‌జ‌మానికి ఓయో వెన్ను ద‌న్నుగా నిలుస్తోంది. 2013లో ఢిల్లీలో ఓయో అంకుర సంస్థ‌ను ప్రారంభించాడు రితేష్ అగ‌ర్వాల్. ఆయా హొట‌ల్స్ ఓన‌ర్స్‌తో ఓయో ఎంఓయు చేసుకుంటుంది. ఎవ‌రైనా ప్ర‌యాణికులు లేదా క‌స్ట‌మ‌ర్లు అక్క‌డికి వెళ్లినా ముందుగానే స‌మాచారాన్ని ఆయా హోట‌ల్స్‌కు స‌మాచారం చేరుతుందిక క్ష‌ణాల్లో. అందివ‌చ్చిన టెక్నాల‌జీని ఉప‌యోగించుకుని మొత్తం ప్ర‌పంచ‌లోని ప్ర‌తి హోట‌ల్‌తో అనుసంధానం అయ్యేలా చేశాడు రితీష్. అత‌డి దెబ్బ‌కు ఇపుడు త్రీ, ఫోర్, ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌న్నీ ఓయో స‌క్సెస్‌ను చూసి షాక్‌కు గుర‌వు...

బాల్‌రెడ్డి సాధించిన విజ‌యం..అన్న‌దాత‌ల‌కు ఆద‌ర్శం..!

చిత్రం
ఎవ‌ర‌న్నారు వ్య‌వ‌సాయం దండుగ అని..అది పండుగ అంటూ చేసి చూపించాడు..బాల్‌రెడ్డి. పొలం నుంచి పంట‌ల్ని వంట గ‌దిలోకి వ‌చ్చేలా చేశాడు. తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌కు త‌న వ్యాపారాన్ని విస్త‌రించేలా చేశాడు. క‌ళ్ల ముందు జ‌రిగిన స‌క్సెస్ స్టోరీ. ఈ ఏడాది నెలాఖ‌రు నాటికి ప్రాసెసింగ్ యూనిట్ల‌ను ఏర్పాటు చేయాల‌న్నది అత‌డి టార్గెట్. రైతులు ఆరుగాలం క‌ష్ట‌ప‌డి పండించే పంట‌ల ఉత్ప‌త్తుల‌ను నేరుగా వినియోగ‌దారుల‌కు చేర్చాలంటే ఎన్నో ఇబ్బందులు. మ‌రెన్నో క‌ష్టాలు. చూస్తే పెద్ద త‌తంగం మిళిత‌మై ఉంటుంది. ఇక్క‌డంతా మ‌ధ్య‌ద‌ళారీ వ్య‌వ‌స్థ బ‌లంగా వేళ్లూనుకుని పోయింది. పంట చేతిలోకి రావాలంటే మిల్ల‌ర్ల ద‌గ్గ‌ర‌కు, డిస్ట్రిబ్యూట‌ర్లు, రిటైల‌ర్లు ..ఇలా మూడంచెల వ్య‌వ‌స్థ‌ను దాటుకుని రావాల్సి ఉంటుంది. అంతా చేరుకున్నాక‌..క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర ల‌భిస్తుందో తెలియ‌దు. చేసిన అప్పులు భార‌మై పోతాయి. ఉన్న ధాన్యాన్ని త‌క్కువ ధ‌ర‌కే అమ్ము కోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. దీంతో రైతులు గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. వ్య‌వ‌సాయ కుటుంబం నుంచి వ‌చ్చిన బాల్ రెడ్డి త‌ను కూడా ఫీల్ అయ్య...

ఇండియ‌న్ టెలికాం సెక్టార్‌లో జియోనే టాప్

చిత్రం
భార‌త దేశంలోని టెలికాం రంగంలో రిల‌య‌న్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు చెందిన జియో రిల‌య‌న్స్ కంపెనీ టెలికాం ఆప‌రేట‌ర్ల‌ను తోసిరాజ‌ని నెంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరుకుని చ‌రిత్ర సృష్టించింది. ముఖేష్ అంబానీకి చెందిన 4జీ సేవ‌ల కంపెనీ రిల‌య‌న్స్ జియో..ఇండియాలో అతి పెద్ద టెలికాం కంపెనీగా అవ‌త‌రించింది. గ‌త నెల చివ‌రి నాటికి స‌ద‌రు కంపెనీ వినియోగ‌దారుల సంఖ్య ఏకంగా 33 కోట్ల 13 ల‌క్ష‌ల‌కు చేరుకుంది. ఇప్ప‌టి దాకా టాప్ రేంజ్‌లో కొన‌సాగుతూ వ‌చ్చిన వొడాఫోన్, ఐడియా క‌స్ట‌మ‌ర్లు 32 కోట్ల‌కు త‌గ్గారు. దీంతో జియో టాప్ రేంజ్‌లోకి చేరుకుంది. ప్ర‌తి రోజూ కొత్త క‌ష్ట‌మ‌ర్ల‌తో పాటు ఇత‌ర టెలికాం ఆప‌రేట‌ర్ల నుంచి వినియోగ‌దారులు జియో కంపెనీని ఎంచుకుంటున్నారు. 4జీ సేవ‌ల్లో భాగంగా డేటా, వీడియో కాల్స్, అప‌రిమిత‌మైన సేవ‌లు అందించ‌డం, దేశ వ్యాప్తంగా విస్తృత‌మైన నెట్ వ‌ర్క్ క‌లిగి ఉండ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు జియోను ఎంపిక చేసుకుంటున్నారు.  మొద‌ట్లో లైట్‌గా తీసుకున్న ఇత‌ర టెలికాం కంపెనీలు ఇపుడు చింతిస్తున్నాయి. ఎటూ పాలుపోక ప‌క్క చూపులు చూస్తున్నాయి. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటూ వ‌చ్చిన ట్యాగ్ లైన్ ..ఐడియా కంపెనీది...

ఐఏఎస్ టాపర్..నాలుగుసార్లు ఫెయిల్

చిత్రం
ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు యుపీఎస్సీ ప‌రీక్ష త‌ప్పాడు ఆ యువ‌కుడు. కానీ అంద‌రిలాగా నిరాశ‌కు గురి కాలేదు. ప‌ట్టుద‌లని విక్ర‌మార్కుడిలా క‌ష్ట‌ప‌డ్డాడు. అనుకున్న‌ది సాధించాడు. ఏకంగా ఇండియాలో టాప‌ర్‌గా నిలిచి అంద‌రినీ ఆశ్చ‌ర్య పోయేలా చేశాడు. అత‌డెవ‌రో కాదు కొత్త‌గా ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన కుర్రాడు..దురిశెట్టి అనుదీప్. జాతీయ స్థాయిలో నిర్వ‌హించే ప‌రీక్ష‌కు వేలాది మంది పోటీ ప‌డ‌తారు. ఈ కాంపిటిష‌న్‌ను త‌ట్టుకుని ప‌రీక్ష పాస్ కావ‌డం చాలా క‌ష్టం. ప్ర‌తి ఒక్క‌రి క‌ల అమెరికా డాల‌ర్లు సంపాదించ‌డం ఒక ఎత్తైతే..ఇండియాలో గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్ర‌తి యువ‌తీ యువ‌కుల క‌ల ఒక్క‌టే ఐఏఎస్‌కు ఎంపిక కావ‌డం. అయిదు సార్లు మాత్ర‌మే రాసేందుకు అవ‌కాశం ఉంటుంది. ఏ మాత్రం త‌ప్పినా ఇక మ‌రోసారి ఎగ్జామ్ రాసేందుకు అర్హులు కారు. కానీ మ‌నోడు నాలుగు పర్యాయాలు త‌ప్పాడు..చివ‌ర‌కు ఐదో సారికి ఎంపిక‌య్యాడు. ఏకంగా ఇండియాలో టాప్‌లో నిలిచాడు అనుదీప్.  సాధించాల‌న్న క‌సి, ప‌ట్టుద‌ల ఉంటే చాలు ఎంత‌టి క‌ష్ట‌మైనా ఈజీ అవుతుంద‌ని, విజ‌యం త‌ప్ప‌కుండా వ‌రిస్తుంద‌ని అంటున్నారు ఈ యువ‌కుడు. జాతీయ స్థాయిలో టాప...

క్రికెట్ లెజెండ్‌కే టీమిండియా కోచ్ ఎంపిక అప్ప‌గింత‌

చిత్రం
ప్ర‌పంచ క‌ప్ క‌థ ముగిసింది. విండీస్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ఛైర్మ‌న్ ఎం.ఎస్.కె. ప్ర‌సాద్ ఇప్ప‌టికే మూడు ఫార్మాట్‌ల‌లో ఆడే టీమిండియా క్రికెట్ జ‌ట్టు స‌భ్యుల‌ను, కెప్టెన్‌ను ప్ర‌క‌టించారు. ఈ ఎంపిక కార్య‌క్ర‌మం తీవ్ర విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల మ‌ధ్య ఎంపిక చేశారు. అస‌లైన జ‌ట్టును ఎంపిక చేయ‌లేద‌ని, కెప్టెన్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ల మ‌ధ్య విభేదాలు పొడ సూపాయ‌ని, అందుకే ఇండియా పేల‌వ‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించింద‌ని క్రికెట్ ఫ్యాన్స్ మండిప‌డ్డారు. క‌మాన్ ఇండియా అంటూ వ‌ర‌ల్డ్ క‌ప్ ను తీసుకు రావాల‌ని కోరిన కోట్లాది అభిమానుల‌కు తీర‌ని నిరాశ మిగిల్చారు క్రికెట‌ర్స్. కోట్లు ఎలా సంపాదించాలి, ఏయే కంపెనీల‌తో టై అప్ చేసుకోవాలో అనే దానిపై ఉన్నంత శ్ర‌ద్ధ క్రికెట్‌ను శ్వాస‌గా మ‌ల్చుకుని , గెలవాల‌న్న కసి లేకుండా పోయింది. అంతులేని రాజ‌కీయాలు చోటు చేసుకోవ‌డం, ఆధిప‌త్య పోరుకు తెర తీయ‌డం బీసీసీఐ పాలిట శాపంగా మారింది. భార‌త ప్ర‌భుత్వం కూడా ఏమీ చేయ‌లేని స్థితికి చేరుకుందంటే అర్థం చేసుకోవ‌చ్చు ..దీని వెనుక ఎన్ని కార్పొరేట్ , దిగ్గ‌జ కంపెనీలు ప‌నిచేస్తున్నాయో..బ‌డా బాబుల హ‌స...

ఏపీలో కొలువుల పండుగ..నిరుద్యోగుల‌కు చ‌ల్ల‌ని క‌బురు..!

చిత్రం
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రెండ‌వ ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వైఎస్ఆర్‌సీపీ అధినేత  సందింటి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ల‌క్షా 20 వేల‌కు పైగా వివిధ కేట‌గిరీల‌లో ఖాళీగా వున్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు ఇటీవ‌ల‌. తాజాగా ఆ రాష్ట్ర స‌ర్కార్ ఈ మేర‌కు త‌క్ష‌ణ‌మే భ‌ర్తీ చేసేందుకు గాను నియామ‌ప‌క ప్ర‌క్రియ‌కు సంబంధించి నోటిఫికేష‌న్ల‌ను జారీ చేసింది. ఇక ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూసిన ఆ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు, నిరుద్యోగులు, యువ‌తీ యువ‌కులు, వ‌య‌స్సు మ‌ళ్లిన వారికి జ‌గ‌న్ తీపి క‌బురు అందించారు. దీంతో ఆయా ప్రాంతాల‌లో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంట‌ర్ల‌కు విప‌రీత‌మైన గిరాకీ ఏర్ప‌డింది. అయితే, ముందుగానే అసెంబ్లీ సాక్షిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. క‌ష్ట‌ప‌డిన వారికే ఉద్యోగులు వస్తాయ‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లోను మ‌ధ్య‌వ‌ర్తుల‌ను ఆశ్ర‌యించ‌వ‌ద్ద‌ని, ఎవ్వ‌రికీ డ‌బ్బులు ఇవ్వ‌కండ‌ని కోరారు. గ‌త హ‌యాంలో ఏర్పాటైన చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం కేవ‌లం మాట‌ల వ‌ర‌కే ప‌రిమిత‌మైంద‌ని, కానీ ఎన్...

ద‌ర్బార్ అదుర్స్..త‌లైవా పోస్ట‌ర్ సూప‌ర్బ్..!

చిత్రం
కోట్లాది అభిమానులను సంపాదించుకున్న త‌మిళ సూప‌ర్‌స్టార్ రజ‌నీకాంత్ డిఫ‌రెంట్ మూడ్‌తో దుమ్ము రేపిన పోస్ట‌ర్‌తో ప్ర‌పంచాన్ని షేక్ చేసేశారు. కోట్లాది మంది ఆ పోస్ట‌ర్‌ను చూసి నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు. ఇండియ‌న్ మోస్ట వాంటెడ్ డైరెక్ట‌ర్‌గా పేరొందిన ఏ.ఆర్. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో త‌లైవా కొత్త సినిమా చేస్తున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ ప్రారంభ‌మైంది. జ‌యాప‌జయాల‌ను ప‌ట్టించు కోకుండా త‌న ప‌నేదో తాను చేసుకుంటూ వెళ్లే ఈ డైరెక్ట‌ర్ ఏది చేసినా అది ఓ సంచ‌ల‌న‌మే. క్రియేటివిటీతో పాటు సామాజిక ప‌ర‌మైన మార్పుల‌ను కోరుకునే అంశాలతో పాటు స‌మ‌స్య‌ల‌ను ఎత్తి చూప‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. ర‌జ‌నీకాంత్ తో సినిమా తీయాలంటే ద‌మ్ముండాలి. ఆయ‌న మేన‌రిజంతో పాటు ఆయ‌నుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను అంచ‌నా వేయాలి. అంతే కాదు ఏ మాత్రం తేడా వ‌చ్చినా ఇక ఆ టెక్నిషియ‌న్ కెరీర్ ముగిసి పోయిన‌ట్టే. తీవ్ర‌మైన వ‌త్తిళ్ల మ‌ధ్య త‌లైవాతో సినిమా తీయాల్సి ఉంటుంది. బ‌డ్జెట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అది ఏనాడో 100 కోట్ల‌ను దాటి పోయింది. అంచ‌నాలు భారీగా ఉంటాయి.  త‌లైవా అంటేనే ఇండియాలో ఓ బ్రాండ్. ఆకాశ‌మంత ఎత్తుకు ఎదిగిన ఈ సూప‌ర్ స్టార్ గుర...

రుచి సోయ‌గం..ప‌తంజ‌లి ప‌రం..!

చిత్రం
ప్ర‌పంచ మార్కెట్ నివ్వెర పోయేలా రాందేవ్ బాబా సార‌థ్యంలోని ప‌తంజ‌లి గ్రూప్ ఆఫ్ కంపెనీస్..సోయా ప్రొడ‌క్ట్స్‌లో రారాజుగా వెలుగొందుతున్న రుచి సోయా కంపెనీని చేజిక్కించుకుంది. ఇప్ప‌టికే దిగ్గ‌జ కంపెనీలకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూ ఇండియ‌న్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది పతంజ‌లి. ఏ ముహూర్తాన బాబా ప్రారంభించాడో కానీ కార్పొరేట్ కంపెనీలు తెల్ల‌మొహం వేశాయి. త‌క్కువ ఖ‌ర్చుతో పాటు నాణ్య‌వంత‌మైన అన్ని వ‌స్తువులు, తినేందుకు కావాల్సిన ఐట‌మ్స్‌ను పతంజ‌లి అంద‌జేస్తోంది. భార‌త‌దేశంలోని ప్ర‌తి గ్రామానికి ప‌తంజ‌లి విస్త‌రించింది. ఏ ఊరుకు వెళ్లినా..ఏ కిరాణకొట్టు ద‌గ్గ‌ర‌కు వెళ్లినా..ప‌తంజ‌లి బోర్డు ..రాందేవ్ బాబా న‌వ్వుతూ ఉన్న ఫోటో ద‌ర్శ‌న‌మిస్తుంది. ఒక దేశీయ కంపెనీకి ఇంత పెద్ద ఎత్తున మార్కెట్ ఉంటుంద‌ని ఏ విదేశీ కంపెనీ ఊహించ‌లేదు. ప‌తంజ‌లి కొట్టిన దెబ్బ‌కు ఆయా కంపెనీలు చేష్ట‌లుడిగి పోయాయి. తినే తిండి, క‌ట్టుకునే బ‌ట్ట‌లు, రోజూ వాడే వ‌స్తువులు, ప్ర‌తి ఒక్క‌టి ప్ర‌తి చోటా ల‌భిస్తున్నాయి. క్వాంటిటి, క్వాలిటీతో పాటు చౌక ధ‌ర‌ల్లో, సామాన్యులు, మ‌ధ్య‌త‌ర‌గతి ప్ర‌జ‌ల‌కు అందుబాటు ధ‌రల‌లో అన్నీ అందుబాటులో ఉంటు...

క‌న్న‌డ నాట క‌మ‌ల స‌ర్కార్ - సీఎంగా యెడ్డీ ప్ర‌మాణ స్వీకారం

చిత్రం
ఎంతో ఉత్కంఠ‌కు తెర‌తీసిన క‌న్న‌డనాట రాజ‌కీయం స‌ద్దు మ‌ణిగింది. నాల్గ‌వ సారి బీజేపికి చెందిన బూక‌న‌కేరే సిద్ధిలింగ‌ప్ప యెడ్యూర‌ప్ప క‌ర్నాట‌క రాష్ట ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అశేష జ‌న‌వాహిని, అనుచ‌ర‌, అభిమానుల సందోహం మ‌ధ్య ఆయ‌న కొలువుతీరారు. గవ‌ర్న‌ర్ వాజూభాయి వాలా యెడ్డీతో సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయించారు. అనంత‌రం ఆయ‌న‌ను ప్ర‌త్యేకంగా గ‌వ‌ర్న‌ర్ అభినందించారు. ఈ ప్ర‌మాణ స్వీకార మ‌హోత్స‌వానికి మాజీ ముఖ్య‌మంత్రి ఎస్.ఎం.కృష్ణ‌, బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముర‌ళీధ‌ర్ రావుతో పాటు ఇత‌ర సీనియ‌ర్లు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ స‌ర్వార్‌పై ప్ర‌యోగించిన బ‌ల‌పీర‌క్ష‌లో త‌న బ‌లాన్ని నిరూపించుకోక పోవ‌డంతో ..అత్య‌ధిక సీట్లను క‌లిగి ఉన్న బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని అంతా భావించారు. నాట‌కీయ ప‌రిణామాల నేఫ‌థ్యంలో కొంత సందిగ్థ‌త నెల‌కొంది. త‌ద‌నంత‌రం ప‌రిణామాలు అనూహ్యంగా మారి పోయాయి. ప్ర‌భుత్వం ఏర్పాటుకు త‌మ‌ను ఆహ్వానించాల‌ని కోరుతూ య‌డ్యూర‌ప్ప , త‌న అనుచ‌రుల‌తో క‌లిసి గ‌వ‌ర్న‌ర్ వాజూబాయి వాలాను క‌లిసి విన్న‌వించారు. ఆయ‌న చేసిన విన‌తిని స్వీక‌రించిన ...